మమ్మల్ని ఎడబాపినోళ్ల భరతం పడతా.. కవిత సంచలన కామెంట్స్

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: మచ్చలేని చంద్రుడైన కెసిఆర్కు మచ్చ తీసుకొచ్చారని తాను చెప్పగానే.. తల్లికి పిల్లను కాకుండా ఆపారని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాలు ఆమె పాల్గొని మాట్లాడారు. చింతమడక ప్రజలు కెసిఆర్ను చంద్రుడు, చంద్రం సార్ అని ప్రేమతో పిలుస్తారన్నారు. అలాంటి మచ్చలేని కెసిఆర్కు కొంతమంది మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ సంవత్సరం తాను ఎంతో బాధతో […]
రూ.15 వేల కోట్ల భూమి సేఫ్

గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగింపు నేతలు, అధికారులు, రియల్టర్ల చెరలోని భూములకు విముక్తి పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మన తెలంగాణ/సిటీ బ్యూరో/జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ పరిధిలో బడా బాబుల కబ్జాలపై హైడ్రా ఆదివారం ఉక్కుపాదం మోపింది. గాజులరామారం రెవెన్యూ పరిధిలోని రూ. 15,000 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారం సర్వే నెం. 307తో పా టు పలు ఇతర […]
Bank of Baroda Recruitment 2025 : మేనేజర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్- పూర్తి వివరాలు..
లక్ష డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకే..

ఇప్పటికే ఆమోదం లభించిన దరఖాస్తులకూ వర్తించదు ప్రస్తుత హెచ్1బి వీసాదారులకు ఈ పెంపుతో సంబంధం లేదు ఆందోళనల నేపథ్యంలో వైట్హౌస్ స్పష్టత వాషింగ్టన్: హెచ్1బి వీసాకోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్ల వీసా రుసుము వర్తిస్తుందని అమెరికా అధికారులు శనివారం నాడు స్పష్టం చేశారు. వీసా ఫీజు పెంపుపై భయాందోళనలు రేకెత్తిస్తూ మీడియా లో కథనాల నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు ఈ వివరణ ఇచ్చారు. భారతదేశంతో సహా అమెరికాలో పని చేసేందుకు […]
భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ వీరవిహారం భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో పాక్ వైఫల్యం దుబాయ్ వేదికగా ఆసియా కప్ మ్యాచ్ అబుదాబి: ఆసియా కప్లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(74), శుభ్మన్ గిల్(47), తిలక్ వర్మ(30), హార్ధిక్ పాండ్య(13)లు రాణించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో […]
డబుల్ బొనాంజా

జిఎస్టి తగ్గడంతో స్వదేశీ వస్తువుల కొనుగోలుపై దృష్టి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు దేవీ నవరాత్రులు, జీఎస్టీ ఉత్సవ్ శుభాకాంక్షలు ఆదాయపన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంపు జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు డబుల్ బొనాంజా 2017లో జీఎస్టీ సంస్కరణలతోనే కొత్త చరిత్రకు శ్రీకారం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణల అమలు నేపథ్యంలో స్వదేశీ వస్తువుల వాడకం వైభవంగా సాగాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమలులోకి రానున్న […]
సోమవారం రాశి ఫలాలు (22-09-2025)

మేషం – ప్రతి విషయం మొదట నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకుంటారు. వృషభం – కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. మిథునం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం, ఆహారం విషయాలలో మెలకువలు పాటించండి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటకం – […]
ప్లాన్ బీ అవసరమే!

ఇంజనీరింగ్ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్కు ట్రంప్ బ్రేక్ తెలుగు రాష్ట్రాల యువత అమెరికా కలలపై తీవ్ర ప్రభావం మనతెలంగాణ/హైదరాబాద్: చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రీమ్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగం పొందేందుకు అనుగుణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలనే లక్షలాది మంది భారతీయుల ఆశలపై, ముఖ్యంగా తెలుగు యువత కలలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లింది. […]
ట్రంప్ రహస్య లేఖ బట్టబయలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు తన రాజకీయ ప్రత్యర్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ, క్రిమినల్ అభియోగాలు మోపాలంటూ అటార్నీ జనరల్ పామ్ బోండిపై ఒత్తిడి పెంచారు. దర్యాప్తులో చర్య లేకపోవడంపై విమార్శనాత్మక ప్రకటనలను తాను సమీక్షించానని శనివారం ఆమె పేరును ప్రస్తావించారు. న్యాయ శాఖ అధికారాన్ని మరింత దూకుడుగా ఉపయోగించాలని బోండికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఆయన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే బోండికి ట్రంప్ వ్యక్తిగతంగా సందేశం […]