హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సిఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో టూరిజం పాలసీ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్కి సిఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న పలువురికి అవార్డులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు.
‘‘గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఎకో, మెడికల్, హెల్త్, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. హైదరాబాద్లో రక్షణ, శాంతి భద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ.. ప్రపంచ సుందరీమణుల పోటీలను విజయవంతంగా నిర్వహించాం’’ అని సిఎం రేవంత్ అన్నారు.
బిసిల నోటికాడి ముద్ద లాగొద్దు: మంత్రి పొన్నం
పారా ఛాంపియన్షిప్లో.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్
గ్వాన్జూ: ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ శీతల్దేవీ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో విజయం సాధించింది. వరల్డ్ నెంబర్ వన్ ఓజ్నుర్ క్యూర్గిర్డీని 146-143 తేడాతో ఓడించి స్వర్ణపతకం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాలోని గ్వాన్జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ ఘనత సాధించింది. దీంతో ఈ ఛాంపియన్షిప్లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్గా ఆమె చరిత్ర సృష్టించింది. 18 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.
అంతకు ముందు.. తోమన్ కుమార్తో కలిసి మిక్స్డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవీ కాంస్యం గెలుచుకుంది. మరోవైపు మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో సరితతో కలిసి ఆమె రజత పతాకంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో టర్కీకి చెందిన పారా ఆర్చర్ల చేతిలో వీళ్లు ఓడిపోయారు. జమ్ము కశ్మీర్కి చెందిన శీతల్ దేవి.. ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల చేతులు లేకుండానే జన్మించింది. అయినా ఆమె కుంగిపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణాలు ప్రయోగించడం నేర్చుకొని భారత్ గర్వపడే ఆర్చర్గా నిలిచింది.
వరల్డ్ చాంపియన్ శీతల్ దేవి
రేవంత్ అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్ఎస్సే: హరీశ్
హైదరాబాద్: పర్యాటకాభివృద్ధి పేరిట కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని బిఆర్ఎస్ నేత హరీశ్రావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించి స్కామ్కు తెరలేపారని మండిపడ్డారు. హరీశ్ ఎక్స్ ఖాతాలో.. నిబంధనలకు విరుద్ధంగా రూ.15 వేల కో్ట్ల పనులు అప్పగించారని అన్నారు. లక్షల కోట్ల విలువైన భూములను ధారదత్తం చేసేందుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. పనులను రహస్యంగా ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలు బయటపెడతామని తెలిపారు. ‘సిఎం రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్ఎస్ సర్కార్’ అని అన్నారు. ఈ దోపిడిలో భాగమైన ఏ ఒక్కరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.
బీసీ సంక్షేమశాఖ నుంచి గుడ్ న్యూస్ – త్వరలోనే ఉచిత ‘సివిల్స్’ కోచింగ్…!
అభిషేక్ అందుకు లైసెన్స్ ఇచ్చేశారు..: జయసూర్య
దుబాయ్: ఆసియాకప్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత్ ఈ టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. విజయ పరంపర కొనసాగిండంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ సందర్భంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా శ్రీలంక కోచ్ జయసూర్య అభిషేక్ ఫియర్లెస్ బ్యాటింగ్ని కొనియాడారు. భారత క్రికెట్ మేనేజ్మెంట్ అభిషేక్కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు.
‘‘అభిషేక్ శఱ్మ సహజసిద్ధమైన ఆట ఆడుతున్నాడు. టీం మేనేజ్మెంట్ అతడిని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఇలా మద్ధతు లభించడం ఎంతో కీలకం. కేవలం వేగంగా ఆడటమే కాదు.. ఎక్కడ తగ్గాలో అతడికి తెలుసు. పవర్ప్లే తర్వాత అభిషేక్ కాస్త నెమ్మదిగా ఆడుతున్నాడు. అందుకే ఎక్కువ సమయం క్రీజ్లో ఉండగలుగుతున్నాడు. అతడు రోజురోజుకీ ఎక్కువ పరుగులు చేస్తూ.. బ్యాటింగ్లో మెరుగవుతున్నాడు’’ అని జయసూర్య అన్నారు. ఇక టీం ఇండియ కోచింగ్ స్టేఫ్ అభిషేక్కు సహజసిద్ధమైన ఆట ఆడేందుకు లైసెన్స్ ఇచ్చారని జయసూర్య పేర్కొన్నారు.
విమానం టాయిలెట్లో ధూమపానం..యువకుడి అరెస్ట్
మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు : హైడ్రా కమిషనర్
హైదరాబాద్: మూసీ పరివాహక ప్రజలకు ఇబ్బందుల్లేకుండా యుద్ధప్రాతికన చర్యలు చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు చేపడతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజిబిఎస్ వరద పోటెత్తిందని, ఎంజిబిఎస్ లో డిఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు. ఎంజిబిఎస్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, మూసీ పరివాహక ప్రాంద ప్రజలు అప్పమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.