నక్సల్స్తో చర్చల ప్రసక్తే లేదు: అమిత్ షా
నవంబరు 23న భారత్కు నీరవ్ మోడీ అప్పగింత ?
ఈ నెల 6 న హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు
‘ఒజి’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. నేహా శెట్టి సాంగ్ విడుదల
హైదరాబాద్: పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలైంది. తొలి ఆట నుంచి ఈ సినిమాకు బ్లాక్బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా నిడివి కారణంగా నేహా శెట్టితో తీసిన ఐటమ్ సాంగ్ని చిత్రం నుంచి తొలగించారు. అయితే ప్రేక్షకుల నుంచి ‘ఒజి’కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్ను మళ్లీ థియేటర్స్లో జత చేశారు. అంతేకాక.. యూట్యూబ్లో కూడా ఈ పాటను విడుదల చేశారు.
‘కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ జో సాహిత్యం అందించారు. సోహా, వాగ్దేవి, మధుబంతి బగ్చి ఈ గానాన్ని ఆలపించారు. అరబిక్ పాట స్టైల్లో ఈ పాటని తమన్ కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్గా నటించగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించింది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
హిట్మ్యాన్ని కెప్టెన్గా తొలగింపు.. సోషల్మీడియాలో ఫ్యాన్స్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటన కోసం శనివారం బిసిసిఐ సెలక్షన్ కమిటీ భారత వన్డే జట్టును ప్రకటించింది. ఇక్కడే ఓ అనూహ్యమైన విషయం జరిగింది. రోహిత్ శర్మను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ.. ఆ బాధ్యతలను శుభ్మాన్ గిల్కి అప్పగించారు సెలక్టర్లు. దీంతో రోహిత్ అభిమానులు సోషల్మీడియా వేదికగా సెలక్టర్లపై విమర్శలు చేస్తున్నారు. రోహిత్ ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడని.. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ అతడు ఆడగలడని పోస్ట్లు పెడుతున్నారు.
రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్.. బిసిసిఐ అతడిని కావాలనే తప్పించిందని ఓ అభిమాని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఎనిమిది నెలల వ్యవధిలోనే రెండు ఐసిసి ట్రోఫీలు అందించిన కెప్టెన్ను ఇలా అవమానిస్తారా అని మరో వ్యక్తి మండిపడ్డాడు. మరికొందరు టీం ఇండియా కెప్టెన్గా రోహిత్ శకం ముగిసిందని.. ఇంతకాలం కెప్టెన్గా భారత్కు ఎన్నో విజయాలు అందించిన రోహిత్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి సోషల్మీడియాలో రోహిత్ శర్మ పేరు వైరల్ అవుతోంది.
ఇక కెప్టెన్గా రోహిత్ భారత్కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. రెండు ఐసిసి టైటిల్స్ పోరులో కూడా జట్టును గెలిపించాడు. 2024 టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జట్టును ముందుండి నడిపించి టైటిల్ని అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా ఓవరాల్గా 56 వన్డే మ్యాచులు ఆడగా.. 42 మ్యాచుల్లో విజయం సాధించింది. 12 మ్యాచులు ఓడిపోయింది. 1 ఫలితం తేలలేదు, ఒకటి డ్రాగా ముగిసింది. దీంతో కెప్టెన్గా రోహిత్ విజయశాతం 76గా ఉంది.
ఓట్ చోరీ గురించి ప్రజలకు వివరించాలి: మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: దేశంలో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మహేశ్కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. టిపిసిసిలోని ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ బిజెపికి అనుబంధ సంఘంగా పని చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో ఓట్ చోరీలను బయటపెట్టారని పేర్కొన్నారు. ఆధారాలు చూపించినా ఇసి నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఆలస్యమైందని మహేశ్కుమార్ గౌడ్ వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా సంతకాల సేకరణ ప్రారంభించలేదని అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని నేతలను ఆదేశించారు. గ్రామంలో కనీసం వంద మందితో సంతకాలు చేయించాలని తెలిపారు. బిజెపి ఓట్ చోరీ ఎలా చేసిందో ప్రజలకు వివరించాని అన్నారు. ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని పేర్కొన్నారు.
వన్డే సిరీస్కు జడేజాను అందుకే ఎంపిక చేయలేదు: అగార్కర్
ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే వన్డే, టి-20 సిరీస్ల కోసం శనివారం భారత జట్లను బిసిసిఐ ప్రకటంచింది. వన్డేల కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి అతనడి స్థానంలో శుభ్మాన్ గిల్2ను కూర్చొబెట్టారు. దీంతో సెలక్షన్ కిమటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రోహిత్ ఫ్యాన్స్. తాజా తీవ్ర మరో విషయంపై కూడా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్పై మండిపడుతున్నారు.
అదేంటంటే.. టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో చోటు కల్పించకపోవడమే. జడేజా ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. అయినా అతడికి వన్డే జట్టులో చోటు లభించలేదు. ఈ విషయంపై వచ్చిన ప్రశ్నకు అజిత్ అగార్కర్ సమాధానం ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఇద్దర ఎడమచేతి వాటం స్పిన్నర్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. జడేజా సమర్థుడే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఎందుకంటే అక్కడి పరిస్థితుల కారణంగా మేము అదనపు స్పిన్నర్లను తీసుకువెళ్లాం. ఇప్పుడు మేం ఒకరికి అవకాశం ఇవ్వగలం. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లతో జట్టులో సమతుల్యతను కాపాడుకోగలం. ఆస్ట్రేలియాలో మనకు అంతకంటే ఎక్కువ అవసరం ఉంటుందని నేను అనుకోను. ఇది కేవలం మూడు మ్యాచ్ల చిన్న సిరీస్. అందరికి అవకాశం ఇవ్వలేము. దురదృష్టవశాత్తు ఈ సారి జడేజా మిస్అవుతున్నాడు. అంతకు మంచి ఏమీ కాదు’’ అని అగార్కర్ అన్నారు.