మంగళవారం రాశి ఫలాలు (07-10-2025)
మేషం – శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభ సాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
వృషభం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది న్యాయ నిపుణుల సలహాలను పరిగణలోనికి తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం – మీ నడవడిక సూటిగా ఉంటుంది. మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు.
కర్కాటకం – ఆర్థిక విలువైన పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయవ్యయాలు సరి సమానంగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలలో కొంత సందిగ్ధత ఏర్పడును.
సింహం – జీవితంలో ఏదో సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడానికి గాను కావలసిన సలహాలను, సూచనలను పెద్దల నుండి అందుకుంటారు.
కన్య – మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మార్పులు కోరుకుంటారు. నిష్కారమైన తగాదాలు అపనిందలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి.
తుల – రుణాలు మొత్తం తీర్చి వేస్తారు. మిత్రబృందంలోనికి కొత్తవారికి చోటు కల్పిస్తారు. ఇతరుల అతి జోక్యం వలన కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి.
వృశ్చికం – అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
ధనుస్సు – అనుకున్న విధంగా నిర్ణయాలను అమలు చేయగలుగుతారు. ఎదుటివారు చెప్పేది ఆసాంతం వినడం విసుగు, కోపాలకు దూరంగా ఉండటం వలన లాభపడగలుగుతారు.
మకరం – సున్నిత వ్యవహారాలలో ఓర్పును చూపడం వలన లాభ పడతారు. ఉద్యోగములలో బదిలీ వేటు ఉన్న ఉన్నత పదవి ప్రాప్తి సూచనలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
కుంభం – లిఖితపూర్వక ఒప్పందములకు వక్రభాషములను తెచ్చే వర్గం పట్ల అప్రమత్తంగా ఉండండి. వాయిదాలలో ఉన్న కొన్ని కోర్టు కేసులు అనుకూలమైన మలుపు తిరుగుతాయి.
మీనం – భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూల పడతాయి. కంప్యూటర్ విద్య అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గీయులు కొన్ని కారణముల వలన దూరంగా ఉంటారు.
మరిన్ని చేదు వార్తలు వింటారు: సునీల్ గావస్కర్
సిడ్రా అమిన్పై ఐసిసి చర్యలు
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ యాక్షన్- ప్యాక్డ్ టీజర్ విడుదల
ఉత్తర బెంగాల్ వరదలు మానవ సృష్టే: మమతా బెనర్జీ
రాజస్థాన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు మృతి
‘ఛాంపియన్’ వచ్చేస్తున్నాడు
పెట్రోల్ బంక్లో కారులో మంటలు
పెట్రోల్ బంక్లోకి వచ్చిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం తప్పిన సంఘటన నగరంలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంప్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకు కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కారును హిందూస్థాన్ పెట్రోల్ పంప్లో నిలిపిన సమయంలో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది కారును అక్కడి నుంచి రోడ్డుపైకి నెట్టుకుంటూ వెళ్లారు. తర్వాత అగ్నిమాక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను ఆర్పి వేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తం కావడంతో కారులో ఉన్న ఇద్దరి ప్రాణాలు నిలిచాయి. దీంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు, పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తంగా ఉంకుంటే ఇద్దరు ప్రాణాలు పోయేవని, కారులో మంటలు పెట్రోల్ బంక్కు అంటుకుంటే భారీగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.