యుద్ధభూమిలో అంతరిస్తున్న మతం
చివరి టెస్టుకు టీమిండియాలో మార్పులు?
ఆర్ఎఫ్సిలో భారీ పోరాటాలు
బంగారం భగభగ
బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ఏకంగా రూ.9,700 పెరిగి 10 గ్రాములు రూ.1,30,300కు చేరిం ది. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు, రూపాయి విలువ తగ్గడమే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు తెలిపారు. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్చత బంగారం ధర శుక్రవారం 10 గ్రాములు రూ.1,20,600 వద్ద ముగిసింది. స్థానిక బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.2,700 పెరిగి రికార్డు స్థాయిగా రూ. 1,22,700కు చేరింది. గత మార్కెట్ సెషన్లో ఇది రూ. 1,20,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలపై హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ స్పందిస్తూ, రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నప్పటికీ పెట్టుబడిదారులు ఇప్పటికీ పసిడిపై ఆసక్తి చూపుతున్నారు, ఈ కారణంగానే సోమవారం బంగారం ఆల్టైమ్ హైకి చేరిందని అన్నారు. డిమాండ్ వల్ల రాబోయే రోజుల్లోనే పెరిగే అవకాశముందని ఆయన అన్నారు. ఇక సోమవారం నాడు వెండి కూడా బాగా పెరిగింది. వెండి 1 కిలోకు రూ. 7,400 పెరిగి రూ.1,57,400కు చేరింది. ఇది శుక్రవారం రూ.1,50,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్కు 2 శాతం పెరిగి 3,949.58 డాలర్లకు, వెండి ఒక ఔన్స్ 1 శాతం పెరిగి 48.75 డాలర్లకు చేరింది.
మరింత పెరిగే అవకాశం : విశ్లేషకులు
గ్లోబల్ మార్కెట్లో ఒడిదుడుకులు, వాణిజ్య యుద్ధాల భయం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, కరెన్సీ బలహీనతలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. పరిశ్రమ అవసరాలు, సరఫరా లోపం కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారత దేశంలో వచ్చే పండుగ సీజన్ బంగారం, వెండి ధరలను మరింత పెంచగలదని భావిస్తున్నారు. దీపావళి, పెళ్లిళ్లు వంటి సాంప్రదాయ సందర్భాలు బంగారం, వెండికి భారీ డిమాండ్ను కలిగిస్తాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అక్టోబర్ నెలలో ఈ విలువైన లోహాల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
బెస్ట్ సెల్లింగ్ టీవీఎస్ రైడర్ బైక్లో కొత్త వేరియంట్లు- ధర రూ. 1లక్ష కన్నా తక్కువే!
దేశాభివృద్ధికి వలసల దెబ్బ!
చిత్తశుద్ధి లేని శివపూజలేల?
కారు చౌక
ప్రస్తుతం పెట్రోలు వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ధరలు మరో 4 నుంచి నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా మారనున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో జరిగిన 20వ ఫిక్కీ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025లో ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 22 లక్షల కోట్లను ఇంధన దిగుమతుల కోసం ఖర్చు చేస్తోంది. ఇది ఆర్థిక భారమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. 4నుంచి నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా మారతాయి. ఇది భారతదేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పెద్ద అడుగుగా నిలుస్తుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నం.1గా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. నేను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లు, ఇప్పుడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగింది అని అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 78 లక్షల కోట్లు, చైనా రూ. 47 లక్షల కోట్లు కాగా, భారత్ రూ. 22 లక్షల కోట్ల స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. భారత రైతులు మొక్కజొన్న నుండి ఇథనాల్ తయారీ ద్వారా అదనంగా రూ. 45,000 కోట్లు ఆర్జించారు. ఇది గ్రీన్ ఎనర్జీ దిశగా ఒక పెద్ద అడుగు అని అన్నారు.