kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbet

ప్రపంచకప్: నేడు లంకతో సౌతాఫ్రికా పోరు

కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో సౌతాఫ్రికా తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా చాలా బలంగా ఉంది.

ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరుమీదుంది. శ్రీలంకపై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ లౌరా వాల్‌వర్డ్, సూనె లూస్, మరిజానె కాప్, ట్రియన, డి క్లార్క్ వంటి మ్యాచ్ విన్నర్‌లు జట్టులో ఉన్నారు. ఈ సీజన్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్ వంటి బలమైన జట్లను చిత్తుగా ఓడించింది.

అంతేగాక బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా జయకేతనం ఎగుర వేసింది. మూడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించడంతో సఫారీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇక శ్రీలంక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం కూడా సాధించలేదు. రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కాగా, మరో రెండు పోటీలు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి.

గాడిదా మజాకా… పాకిస్థాన్ టూ చైనా… ఈ కథ చదవాల్సిందే

కాదేవి కవిత కనర్హం అనేది శ్రీ శ్రీ ఉవాచ. కాదేది అంతర్జాతీయ వాణిజ్యానికి అనర్హం అనేది నేటి సామెత. గాడిద గాడిద అంటే మనం చులకనగా చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా 2 లక్షల గాడిదలను చైనాకు పాకిస్తాన్ ఎగుమతి చేస్తుంది. అదేదో చైనాలో ఓ నేటివ్ మెడిసిన్ తయారు చేసేకి ఈ గాడిద చర్మాన్ని వాడతారట. దాని ద్వారా రక్తహీనత మరియు సంతాన ఉత్పత్తి లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అక్కడి ప్రాంతీయ మెడిసన్ వాడేవారి నమ్మకం. పనిలో పని అక్కడ గాడిద మాంసాన్ని కూడా లొట్టలు వేసుకొని తింటారు అంట. మనదేశంలో కూడా బర్రె పాలు కంటే ఆవుపాలకంటే గాడిద పాలు చాలా రేటు ఎక్కువగా ఉంటుంది. 

మనదేశంలో పిల్లలకు గాడిదపాలు పట్టిస్తే వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి అని అంటారు. ఎవరైనా పిల్లలు మందబుద్ధిగా ఉంటే మీ అమ్మ శానీ పాలు పట్టలేదా అని అంటారు, అంటే అది గాడిద పాలు అన్నమాట. 

కర్నూలు నగరంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా గాడిదలు కనపడేటివి ఇప్పుడు అసలు కనపడడం లేదు. కర్నూలు అంటే మేము చదువుకున్నప్పుడు  డిడిడి అనేవారు డాన్కీస్, డాక్టర్స్, డస్ట్ అని అర్థం. ఏమైనా గాడిదలతో కూడా అంతర్జాతీయ వ్యాపారం చేయవచ్చు, కాబట్టి పని లేకుంటే గాడిదలు కాయిపో అని మనం ఇక అనరాదు. ఎందుకంటే గాడిదలు కాసి ఎక్కువగా పెంచుకుంటే వాటిని మనము ఎగుమతి చేయవచ్చు.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ 

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

కృషి, క్రమశిక్షణ విజయానికి మార్గదర్శకం

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మోషన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ వేగంగా జరుగుతోం ది. చిత్రీకరణలో బిజీగా ఉన్న చిరంజీవి, ఒక మంచి సందర్భానికి సమయం కేటాయించారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ సన్మానించారు.

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలకమైన భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను చిరంజీవి అభినందించారు. తన సహజమైన వినయం, పెద్ద మనసుతో చిరంజీవి, తిలక్ వర్మ ను ఆప్యాయంగా ఆహ్వానించారు.

ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్‌లోని ఆయన మరచిపోలేని క్షణాన్ని ఫ్రేమ్ చేసిన ఫోటోను అందజేశారు. కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాకుండా జీవితంలోనూ విజయానికి మార్గదర్శకమని అన్నా రు. ఈ కార్యక్రమంలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల పాల్గొన్నారు. వారు కూడా తిలక్ వర్మని ప్రశంసించారు.

చేప పొడవడంతో మత్య్సకారుడు మృతి

బెంగళూరు: సముద్రంలో చేప పొడవడంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. కార్వారకు చెందిన  అక్షయ అనిల్ మాజాళికర్ అనే మత్స్యకారుడు తన తోటి మత్స్యకారులతో కలిసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా బోటు అంచున కూర్చున్నాడు. నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన చేప అతడిని పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతడిని తీరానికి తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అతడు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌.. అందరి కళ్లు ఇద్దరిపైనే

పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి, రోహిత్‌లు ఆడుతున్న సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఇప్పటికే టి20, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి, రోహిత్‌లు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి వీరిపైనే నిలిచింది. ఇద్దరికి సిరీస్ చాలా కీలకంగా మారింది. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు.

ఇలాంటి స్థితిలో రోహిత్, కోహ్లిలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కానీ అపార అనుభవజ్ఞులైన వీరిని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా వీరికుంది. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టీమిండియాలో చోటు కాపాడు కోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. నిలకడైన ఆటను కనబరిచి నప్పుడే వీరికి జట్టులో స్థానం ఉంటుంది. అంతేగాక రానున్న వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కాపాడుకోవాలంటే ఆడే ప్రతి సిరీస్‌లోనూ సత్తా చాటాల్సిన అవసరం వీరికి ఉంది. ఏమాత్రం విఫలమైన జట్టులో స్థానం గల్లంతు కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోహ్లి, రోహిత్‌లకు చాలా కీలకమని చెప్పక తప్పదు.

కాగా, ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 19న పెర్త్‌లో జరుగనుంది. రెండో వన్డే 23న అడిలైడ్‌లో, మూడో, చివరి వన్డే 25న సిడ్నీలో జరుగుతుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది.

నిరుద్యోగ యువత చెవిలో పువ్వులు

‘అంధులకు చూపు కావాలి.. నిరుద్యోగులకు జాబు కావాలి’ ఇది బీహార్‌లో నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తున్న నినాదం. ప్రభుత్వ ఉద్యోగం దక్కకుంటే కూరగాయలు అమ్ముకోవడమో లేదా కూలిపనులకు వెళ్లడమో తప్పదన్న నిర్వేదనతో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లకు యువత ప్రిపేర్ కావడం బీహార్‌లో కనిపించే జీవన చిత్రం. పాట్నా లోని ఎపిజె అబ్దుల్ కలాం సైన్స్ సెంటర్ బయట పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తుండడం నిత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు బీహార్‌లో ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు గట్టి ప్రయత్నం చేయలేదనే చెప్పక తప్పదు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాయకులు యువ ఓటర్లను ఆకట్టుకోడానికి ఏవో పథకాలను ప్రకటించి అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్‌డిఎ కూటమి, మరోవైపు విపక్ష నేతలు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వియాదవ్ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పదేపదే భరోసా ఇస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎలాంటి గట్టి అవకాశాలు కల్పించని వారు ఎన్నికల్లోనే దీన్ని తెరపైకి తీసుకు రావడం నవ్వు తెప్పిస్తోంది. ఇదంతా ఓట్ల కోసం నిరుద్యోగులకు లేనిపోని భ్రమలు కల్పించి చెవిలో పువ్వులు పెట్టడమే తప్ప మరేమీ కాదు. ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో చాలామంది యువ ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే తమకు అత్యంత టాప్ ప్రయారిటీ అని అంగీకరిస్తున్నారు. రాష్ట్రం లోని ఓటర్లలో 22 శాతం మంది అంటే 1.63 కోట్ల ఓటర్లు 18 నుంచి 23 ఏళ్ల వారే. వీరిలో 1.5 కోట్ల మంది 20 ఏళ్ల వయసు దాటిన వారే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో 14 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకున్నాక తుది జాబితా విడుదలైంది. ఈ కీలకమైన ఓటర్లను గెలవడానికి పాలనలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్‌డిఎ). విపక్ష గ్రాండ్ అలియన్స్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన హామీని పరాకాష్ఠకు తీసుకెళ్తున్నాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల వివిధ రంగాల్లో నిరుద్యోగులకు లక్షలాది అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేయడమైందని ప్రకటించింది. దీనికి తోడు భవిష్యత్తులో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనేక సందర్భాల్లో హామీ ఇస్తున్నారు.

మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ గత గ్రాండ్ అలియన్స్ ప్రభుత్వకాలంలో తాను డిప్యూటీ సిఎంగా ఉన్నప్పుడు 17 నెలల వ్యవధి లోనే యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమైందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి వస్తే ఎన్ని ఉద్యోగాల లభిస్తాయో ఎవరైనా ఊహించవచ్చని ఊరిస్తున్నారు. దీన్ని ఇప్పుడు యువత ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయం లోనే యువత ఉద్యోగాల సమస్య మీకు గుర్తొస్తొందా? ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదు? అన్న ప్రశ్నలు యువతనుంచి ఎదురవుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) 2021 22 ప్రకారం బీహార్‌లో నిరుద్యోగ రేటు 5.9 శాతం వరకు ఉంది. జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 4.1 శాతం కన్నా బీహార్‌లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండడం గమనార్హం.

అలాగే బీహార్‌లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసు వారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం కావడం బట్టి బీహార్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తోందో తెలుస్తోంది. బీహార్‌లో ఉద్యోగ అవకాశాలు కరవు కావడంతో లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం నిత్యదృశ్యమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క ప్రభుత్వేతర అనధికారిక ఉపాధి మార్గాల పైన, స్వయం ఉపాధిపైన, క్యాజువల్ ఉద్యోగాల పైన ఆధారపడి బతుకుతున్నారు. బీహార్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం సర్వసాధారణం కాగా, అర్బన్ ఏరియాల్లో తమ నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఒక పనికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు కనిపిస్తుంటారు. వ్యవసాయ రంగంలో ఈపరిస్థితి కనిపిస్తుంది.

యువ ఓటర్ల మనోగతం తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిమాన నాయకులు లేదా పార్టీ ఎవరికి మీరు ఓటేస్తారని అడగ్గా.. కొంతమంది ప్రతి ఐదేళ్లకు పాలనలో మార్పు తప్పనిసరి అని తమ అభిప్రాయం వెలిబుచ్చగా, మరి కొంతమంది ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. మొత్తంమీద రాష్ట్రం కోసం ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిశోర్ బీహార్ యువకుల, ప్రజల వాస్తవ సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో ఒక వర్గం తేజస్వియాదవ్‌పై మొగ్గు చూపుతోంది. ‘ఆయన యువకుడు, అంతేకాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ లాంటి యువకులకు కొత్తగా ఉద్యోగాలు కల్పించడానికి గట్టిగా ఏదో ఒకటి చేయగల’రని నమ్ముతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడిన తరువాత ఎవరైతే అధికారం లోకి వస్తారో వారు ఉద్యోగాల్లో యువతకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉందని, నూటికి నూరు శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా చూడవలసిన బాధ్యత ఉందని యువకుల నుంచి ఏకాభిప్రాయం వస్తోంది. 

డిసెంబర్ 19 ప్రజాపాలన విజయోత్సవాలు

మన తెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబి నెట్ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏ ర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉ త్సవాలను నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిందని అన్నారు. ఉత్సవాల నిర్వ హణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింద ని, రూ.10,500 కోట్లతో నిర్మించే 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కేబినె ట్ ఆమోదించిందని, త్వరలో టెండర్లు పిల వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలి పారు. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రా లు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతా లు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తర ణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి పేర్కొన్నా రు.

మన్ననూర్ టు -శ్రీశైలం ఎలివేటెడ్ కారి డార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్య యంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ కేబినెట్ తీర్మా నం చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీకప్పులో తుపాన్ లాంటిదని మంత్రి పొంగులేటి అ న్నారు. సురేఖ ఎపిసోడ్‌ను కొందరు సము ద్రంలో తుపానులా సృష్టించారని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని తెలిపారు. ఈ నెల 23న మళ్లీ మంత్రివర్గ సమావేశం జరుగు తుందని వెల్లడించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు ని ర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సం బంధించి రక్షణ శాఖ భూములు వినియో గించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నా యంగా 435.08 ఎకరాల భూములను అ ప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి పొంగులేటి భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు పది ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

హాజరుకాని మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం సుమారుగా 4 గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. అయితే, కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు.

పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2పై క్షుణ్ణంగా పరిశీలించడానికి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ కమిటీకి సిఎస్ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైలు ఎండి, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. మెట్రో 2ఏ, 2బి విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందని మంత్రి తెలిపారు. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలను కేబినెట్ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుందన్నారు. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు.

కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్‌లో కొత్తగా వ్యవసాయ కళాశాలలు

వీటితో పాటు ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని కేబినేట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలలు లేని కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలను పారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ అనర్హతగా ఉన్న నిబంధనను మంత్రివర్గం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని అందులో భాగంగా ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు.

నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి మరో 7 ఎకరాలు

నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసిందని ఆయన అన్నారు.

మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500ల బోనస్

కేంద్రం సహకరించకపోయినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేయగా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించిందన్నారు. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.

వానకాలం సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500ల బోనస్ రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

చిదంబరం చేసింది పెద్ద సాహసమే!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పి. చిదంబరం పెద్ద సాహసమే చేసారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పు నిర్ణయమని, ఆ కారణంగా అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధి తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఆయన ఆ మాటలు పరోక్షంగానో, నర్మగర్భంగానో కాదు, సూటిగానే చెప్పారు. ఆ మాటలు సహజంగానే సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. వారు తనపై విమర్శలు చేసారు. కాని, అంత తీవ్రమైన వ్యాఖ్యలు సాక్షాత్తూ ఇందిరపై చేసినా, తర్వాత మూడు రోజులలోనూ ఈ వ్యాసం రాసే సమయానికి తనపై ఎటువంటి చర్య తీసుకోకపోవటం గమనించదగ్గది. చిదంబరం లోగడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా కూడా పని చేసిన నాయకుడు. మేధావి గానూ గుర్తింపు ఉన్నది. అందువల్ల ఆయన వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేము. ఆయన ఈ నెల 12న, పంజాబ్‌కు పొరుగున గల హిమాచల్‌ప్రదేశ్ పట్టణం కసౌలీలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటూ, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు తీవ్రవాదులను బయటకు రప్పించేందుకు, ఆ దేవాలయ ప్రాంగణాన్ని స్వాధీన పరచుకునేందుకు ఇతర మార్గాలు ఉండేవని, అందుకు బదులు సైనిక చర్యను చేపట్టడం తప్పు నిర్ణయమని అన్నారు. సైనిక చర్య జరిగింది 1984 జూన్ మొదటి వారంలో కాగా, అదే సంవత్సరం అక్టోబర్ 31న, ఇందిరాగాంధిని ఆమె అంగరక్షకులు అయిన ఇద్దరు సిక్కు జవాన్లు తన అధికారిక నివాసంలోనే కాల్చి హత్య చేసారు.

సైనిక చర్యకు ముందు కాలంలో, అట్లానే ఇందిరాగాంధి హత్య అనంతర కాలంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రం, దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే గాక, ముఖ్యంగా ఉత్తర భారతమంతా అల్లకల్లోమైంది. అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. తదనంతర దాడులలో, అల్లర్లలో వేలాదిమంది పౌరులు, యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమం చాలా కాలం పాటు తీవ్రంగా సాగింది. అదంతా పాకిస్థాన్‌కు గొప్ప అవకాశంగా లభించింది. మొత్తం ప్రపంచంలోని సిక్కులకే గాక, సిక్కు మత గురువులను అమితంగా ఆరాధించే అసంఖ్యాకులైన హిందువులకు కూడా స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య, తదనంతర ‘ఆపరేషను’ పెద్ద మానసికి గాయాన్నే చేసాయి. అప్పటి నుంచి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పంజాబ్ లోనే గాక, పంజాబీలు పెద్ద సంఖ్యలో నివసించే బ్రిటన్, కెనడా వంటి ఇతర దేశాలలోనూ ఆపరేషన్ బ్లూస్టార్ ప్రభావపు ఛాయలు మిగిలి ఉన్నాయంటే, ఆ తీవ్రతను అర్థం చేసుకోవటం కష్టం కాదు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, యథాతథంగా సిక్కు తీవ్రవాదంపై, వేర్పాటువాదులపై మాత్రమే చర్య జరిగి ఉంటే, అది ఎంత కఠినమైనది అయినప్పటికీ ఆ తర్వాత ప్రభావాలు, పరిణామాలు ఈ విధంగా ఉండేవి కావు. కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఈ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఇంకా అనుకోవాలంటే, బహుశా ఇందిరాగాంధీపై ఆ దాడి కూడా జరిగేది కాదేమో. దీనంతటికి మూలం స్వర్ణ దేవాలయం వంటి వందల ఏళ్ల అత్యంత పవిత్ర కేంద్రంపై సైనిక దాడిలో, తీవ్రవాదులను కాల్చటం అట్లుంచి ఆ నిర్మాణాలకు సైతం నష్టం కలిగించటంలో ఉంది.

వాస్తవానికి ఇదంతా అప్పటి ఆలోచనాపరులు ముందుగా ఊహించలేనటువంటి దేమీ కాదు. స్వర్ణ దేవాలయ చరిత్ర, పవిత్రత మాత్రమే గాక, మొఘలుల ఆక్రమణ కాలం నుంచి స్థానికుల మహా వీరోచిత ప్రతిఘటనా యుద్ధాలు, సిక్కు మతం పుట్టుక, ఆ మతస్థుల నిబద్ధతలు, గురువుల పట్ల సంపూర్ణ విధేయతల చరిత్ర తెలిసిన వారందరూ ఊహించగలదే. బయట అత్యధికులకు తెలియనిది ఏమంటే, సిక్కు మత ఆవిర్భావానికి ముందు ఆ సరిహద్దు ప్రాంతాలన్నింటా ఉండిన హిందూ కుటుంబాలు, సిక్కు గురువుల పిలుపు మేరకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో యువకుడిని ఆ మతంలోకి స్వచ్ఛందంగా, సంతోషంగా చేర్చారు. ఆ విధంగా ఎన్నెన్నో కుటుంబాలు హిందూ, సిక్కు మతాలతో కూడిన మిశ్రమ మత కుటుంబాలు అయాయి. బ్లూస్టార్ అనంతరం, ఖలిస్థానీ ఉద్యమం ఇంకా ఉధృతంగా సాగుతుండిన కాంలోనే, ఒక జర్నలిస్టుగా అక్కడి గ్రామాలలో పర్యటించిన నేను, వారి ఇళ్లలో గోడలపై గల కుటుంబపు ఫోటోలలో వారి కుటుంబ సభ్యులు హిందువులు, సిక్కులు కూడా ఉండిన చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాను. ఆ విషయమై ప్రశ్నించిన నాకు వారిచ్చిన వివరణను బట్టి, అటువంటి మిశ్రమ మత కుటుంబ సంప్రదాయం గురించి ప్రత్యక్షంగా గమనించాను. ఇటువంటి స్థితి ప్రపంచ మతాలలో మరెక్కడైనా ఉందేమో తెలియదు.

విషయం ఏమంటే, చిదంబరం వివరించకపోవచ్చు గాని, ఆయన అసాధారణమైన వ్యాఖ్యలతో సంబంధం గల ఇటువంటి నేపథ్య విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నా పర్యటన సమయంలో గ్రామాలు, చిన్న పట్టణాల సామాన్య ప్రజల నుంచి విన్నాను. చూసాను. ఆ విషయాలు ఎంతగా తెలియగలిగితే, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పిదం మనకు అంతగా అర్థమవుతుంది. స్వర్ణ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకునేందుకు సైనిక చర్యకు భిన్నంగా ఇతర పద్ధతులు ఉండెనని చిదంబరం ఒక మాట అన్నారు. ఆ పద్ధతులు ఏమిటో ఆయన వివరించలేదు. కాని ఆ విషయమై, ఆపరేషన్ అనంతరం కాలంలో జాతీయ స్థాయిలోకొన్ని చర్చలు జరిగాయి. యుద్ధ సమయాలలో కోటలను నెలల తరబడి దిగ్బంధించి అన్ని సరఫరాలను నిలిపి వేసిన పద్ధతులు, లోపలి మనుషులు స్పృహ కోల్పోయేట్లు రసాయనిక వాయువులను వదలటం వంటివి వాటిలో కొన్ని. కాని, ఎందువల్లనైతేనేమి ఇందిరాగాంధి ప్రత్యక్ష సైనిక చర్య పద్ధతిని ఎంచుకుని పెద్ద తప్పునే చేసారు. నేను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కర్ఫూ మధ్య లోపలకు ప్రవేశించి చూసినపుడు, యథాతథంగా దేవాలయానికి జరిగిని నష్టం లేదు గాని, ఆ చుట్టూ గల ఇతర నిర్మానాలన్నీ దెబ్బ తినటాన్ని గమనించాను. సైనిక చర్య గురించి అక్కడి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులు, ఇతరత్రా కనిపించిన కొద్ది మంది యువకులు, లంగర్‌లో భక్తులకు ఆహారం అందజేసే సిబ్బంది, తమ గొంతును పెంచకుండా, బరువైన మొహాలతో, చిన్నచిన్న మాటలుగా చెప్పినవి విన్నాను.

చిదంబరం అన్న ‘పెద్ద తప్పు’ ఎంతటి పెద్ద తప్పో అర్థం చేసుకోవటం ఎంతమాత్రం కష్టం కాదు. బ్లూస్టార్‌కు ముందు వెనుకల పరిణామాలను దృష్టిలోకి తీసుకున్నపుడు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. అవి పలుమార్లు చర్చకు వచ్చినవే. అయినా, సందర్భం ఏర్పడింది గనుక రెండు మాటలు క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం. పంజాబ్ రాజకీయాలు మొదటి నుంచి అకాలీదళ్, కాంగ్రెస్‌ల చుట్టూ తిరుగుతుండేవి. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు ఇందిరాగాంధీ, అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ సలహా ప్రకారం సిక్కులను చీల్చేందుకు సంత్ జర్నేల్ సింగ్ భిండ్రావాలేను ప్రోత్సహించి రాజకీయాలలోకి తెచ్చారు. అదే వ్యక్తి క్రమంగా సిక్కుల హక్కులు, పంజాబ్ హక్కుల పేర మిలిటెంట్‌గా మారి ఏకు మేకయ్యాడు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఇక తర్వాతి పరిణామాలు తెలిసినవే. బ్లూస్టార్ తప్పుకన్న ముందు కాలంలోనే ఇందిరాగాంధీ చేసిన ఒరిజినల్ తప్పు అది. ఇక బ్లూస్టార్ తర్వాత చేసిన తప్పు ఆపరేషన్ ఉడ్‌రోజ్. దీని గురించి బయటి దేశం విన్నది తక్కువ. దాని వల్ల కలిగిన హాని చాలా ఎక్కువ. అది నా పర్యటనలో విస్తారంగా విన్నవిషయం. ఈ కొత్త ఆపరేషన్ కింద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గ్రామాలను చుట్టుముట్టి యువకులను నిర్బంధించటం, హింసించటం సాగించాయి. తీవ్రవాదం అన్నది లేకుండా చేయాలన్నది ఉద్దేశం. కాని అందుకు విరుద్ధంగా జరిగింది. యువకులు భయపడి పాకిస్థాన్‌కు పారిపోవటం, అక్కడ కొద్ది రోజుల శిక్షణతో ఆయుధాలు, డబ్బుతీసుకుని రావటం, హింసా చర్యలకు పాల్పడటం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున జరిగింది. సరిహద్దు జిల్లా లైన పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, అమృత్‌సర్, తరణ్ తారణ్, ఫిరోజ్‌పూర్‌లలోని పలు ప్రాంతాలలో పట్టు సంపాదించి వాటిని విముక్త ప్రాంతాలుగా ప్రకటించారు. అక్కడ కొన్ని చోట్లకు స్వయంగా వెళ్లిన నేను, భద్రతా బలగాల కదలికలు, నియంత్రణ ఎంత పరిమితంగా ఉండిందో గమనించాను.

చివరకు పరిస్థితిని అదుపు చేసేందుకు చాలా కాలం పట్టింది. ఇది బ్లూస్టార్‌కు ముందు, తర్వాతల పరిస్థితులు కాగా, ఇందిరాగాంధి హత్య అనంతరం ముఖ్యంగా ఢిల్లీతోపాటు పలు హిందీ రాష్ట్రాలలో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండ తెలిసిందే. అపుడు ఢిల్లీలో నివసిస్తుండిన నేను అటువంటి ఘటనలు అనేకం గమనించాను. ఆ విధంగా, చిదంబరం అన్న ‘పెద్దతప్పు’కు ముందు వెనుకలు చాలానే ఉన్నాయి. ఇవేవీ రహస్యం కాదు. చర్చలు జరగనివీ కాదు. చిదంబరం ఎందువల్ల ఇపుడీ ప్రస్తావన చేసారో తెలియదుగాని, అందుకు ఆయనను ఆక్షేపించిన వారికి కూడా అవి తెలిసిన విషయాలే. అందుకే కావచ్చు వారు విషయాన్ని అంతకన్న ముందుకు తీసుకుపోవటం లేదు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా, జాతి అయినా, దేశమైనా ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు గ్రహించటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగం ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు ఇందిరాగాంధి వెంటనే ప్రధాన మంత్రి స్థానంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ఏ పాఠాలూ నేర్వలేదు. ఆ వెనుక జరిగిన ఎన్నికలలో, ఒక మహావృక్షం కూలితే భూమి కంపించటం సహజమంటూ సిక్కు వ్యతిరేక హింసాకాండను బాహాటంగా సమర్థించారు. పత్రికల అడ్వర్టయిజ్‌మెంట్లు అంతే సమర్థనా పూర్వకంగా ఇచ్చారు. ఇవి కూడా నేను స్వయంగా విన్నవి, చూసినవి. ఈ ధోరణికి కొనసాగింపా అన్నట్లు, శ్రీలంక వివాదంలో పెద్ద మనిషి మధ్యవర్తి త్వానికి పరిమితం కావటానికి బదులు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్) పేరిట సైన్యాన్ని పంపగా, ఆ దళాలు ప్రత్యక్ష చర్యలలో పాల్గొన్నాయి. అది చివరకు రాజీవ్‌కు ప్రాణాంతకమైంది. ఇటువంటి తప్పులు ఇంకా ఉన్నాయి గాని ఆ చర్చకు ఇది సందర్భం కాదు.

టంకశాల అశోక్  

డ్రగ్స్ మాఫియాకు ‘ఈగల్’ కళ్లెం

హైదరాబాద్ మహా నగరాన్ని పట్టిపీడిస్తోన్న ‘మత్తు’ను వదలించేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భాగ్యనగరాన్ని డ్రగ్స్ విక్రయాలకు, తయారీకి అడ్దాగా చేసుకున్న మాఫియా భరతం పట్టేందుకు ఉక్కుపాదం మోపుతోంది. నిన్నటివరకు క్రయవిక్రయాలపై దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం… డ్రగ్స్ తయారీ ముఠాలపై కూడా డేగకన్ను పెట్టింది. నగరంలో డ్రగ్స్ ఊసేలేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ విక్రయాలు జోరందుకుంటుండటాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రముఖులు నివసించే ప్రాంతాలనుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ విక్రయాలు కొనసాగడం ప్రభుత్వానికి సవాల్‌గా మారడంతో సరఫరాతో పాటు తయారీ ముఠాల ఆగడాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. పబ్‌లు.. వీకెండ్ పార్టీలు, రిసార్టు ఫంక్షన్లపై నిఘా పెట్టింది. పరిశ్రమల పేరిట గుట్టుగా డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాల భరతం పడుతోంది. ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిన తరువాత నగరంలో డ్రగ్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నగరంతో పాటు శివార్లలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈగల్ టీమ్ ముందుగా నగరంలో క్రయవిక్రయాలు, సరఫరాపైనే దృష్టి సారించగా, మహారాష్ట్ర పోలీసులు నగరంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నాకే అప్రమత్తమైన నగర పోలీసులు దూకుడు పెంచింది.

ముంబయిలో బంగ్లాదేశ్ మహిళ డ్రగ్స్‌తో పట్టుపడగా… విచారణలో చర్లపల్లిలో వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారీ వెలుగు చూసింది. సుమారు రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ దందా నగరంలోని చర్లపల్లి కేంద్రంగా సాగుతున్నట్లు… ఇక్కడినుంచే దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు తెలియడంతో నగరవాసులతో పాటు పోలీసులు విస్తుపోవల్సివచ్చింది. ఈ కేసులో రూ. 11.58 కోట్ల ముడి సరకులతో పాటు 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసు బోయిన్‌పల్లిలో బట్టబయలయ్యింది. ఓ తయారీదారుడు స్కూల్ నిర్వహకుడే కావడం విశేషం. తన పాఠశాలలోనే డ్రగ్స్ తయారీ చేస్తూ ఈగల్ టీమ్‌కు దొరికిపోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బోయిన్‌పల్లిలో మేధా స్కూల్‌ను నిర్వహిస్తున్న జయప్రకాష్‌గౌడ్ పాఠశాల రెండో అంతస్థులోనే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. పాఠశాలలో అల్ఫోజోలుం తయారీ చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు కంపౌండ్‌లకు భారీగా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

పాఠశాలలో డ్రగ్స్ తయారీని సీరియస్‌గా పరిగణించిన అధికార యంత్రాంగం పాఠశాలను సీజ్ చేసి నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత వారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో గుట్టుగా డ్రగ్స్‌ను తయారీ చేస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించి రూ. 72 కోట్ల విలువజేసే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో నలుగురు నిందితులను కూడా అరెస్టు చేసింది. ఏకంగా ఫ్లాట్‌లోని ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పోలీసు వర్గాలను సైతం నివ్వరపరిచింది. నగరంతోపాటు శివార్లలో ఈగల్ బృందం నిఘాను మరింత ముమ్మరం చేస్తోంది. డ్రగ్స్ విక్రయాలు, తయారీపై ఉక్కుపాదం మోపి… హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈగల్ టీమ్ పేర్కొంటుంది.

ఎం.వి. శివశంకర్

93953 45694

భవిష్యత్ భారతీయులదే

మన తెలంగాణ / అమరావతి : 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక సహకారం అందిస్తోందని చెప్పారు. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ‘అమెరికా వెలుపల తమ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతున్నట్లు గూగుల్ సీఈఓ స్వయంగా చెప్పారన్నారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్, సబ్-సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని,

ఈ సబ్- సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్‌వేగా మారనుందని మోదీ తెలిపారు. గురువారం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 16 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఏపీ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తుండటంతో అభివృద్ధి వేగంగా సాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు సభలో పాల్గొన్నారు. సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, రాష్ట్రంలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని ప్రధాని మోదీ అన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం : రూ.9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు, రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్‌లకు, రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య 4వ లైన్‌కు, రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

మోదీ లాంటి నాయకుడిని చూడలేదు : చంద్రబాబు

మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదన్నారు.

25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని తెలిపారు.మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామన్నారు. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని, జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు పరిధిలోకి వచ్చాయన్నారు.

దేశం కోసం పనిచేసే కర్మయోగి మోదీ : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశ సేవే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు.

కూటమి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని, కనీసం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా సమష్టిగా పనిచేస్తామని, రాబోయే తరాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download