kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxroyalbetroyalbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabet

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

 ప్రభుత్వ వైద్యుల నిర్లక్షంతో గర్భిణి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (25) 7 నెలల గర్భిణి. శుక్రవారం ఆమె ఐరన్ ఇంజక్షన్ కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్షంతో ఎలాంటి టెస్టులు చేయకుండానే వైద్యులు ఐరన్ ఇంజక్షన్ ఇవ్వడంతోనే మానస మృతి చెందిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్థులు మంచాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ముందు బైఠాయించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు పార్టీల నాయకులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన కోడలిని స్వంత మామే గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలండి లచ్చయ్య, అనసూర్య దంపతుల కుమార్తె శ్రావణి (23), అదే గ్రామానికి చెందిన శివర్ల సత్తయ్య, సత్తక్క దంపతుల చిన్న కొడుకు శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రావణి 9 నెలల గర్భిణి. వచ్చే నెల వైద్యులు ప్రసవం కోసం ఆమెకు డేట్ కూడా ఇచ్చారు. అయితే, శ్రావణి, శేఖర్ కులాలు వేర్వేరు కావడంతో శేఖర్ తండ్రికి వీరి వివాహం ఇష్టం లేదు. శ్రావణి ప్రస్తుతం వారి తల్లిగారింటిలో ఉంది. వారి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసిన మామ సత్తయ్య గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. కాగజ్‌నగర్ డిఎస్‌పి వహిదుద్దీన్, సిఐ కుమార స్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు శ్రావణి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాల్లో విమానం.. బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు..

ఎయిర్ చైనాకు చెందిన ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శనివారం ఎయిర్‌ చైనా విమానయాన సంస్థకు చెందిన విమానం తూర్పు చైనాలోని హాంగ్‌జౌ నుంచి దక్షిన కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్‌కు బయలు దేరింది. విమానం గాల్లోకి లేచిన కొంత సేపటికే ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ పేలి.. మంటలు అంటుకున్నాయి. మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికులు సోషల్‌మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.

బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలి:మంత్రి సీతక్క

తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, అయితే ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ బంద్‌ను ప్రజాభవన్‌లోని మంత్రి సీతక్క నివాసంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి శనివారం పర్యవేక్షించారు. అనంతరం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో బీసీ బంద్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపి వేస్తోందని ఆమె విమర్శించారు. బిజెపి పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణలోని బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు, కానీ ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వారికి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

……………..

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాక బిసి రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు..?:హరీష్ రావు

బిసి రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బిసిలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. ఆ రెండు పార్టీలు బిసిలను అవమానిస్తున్నాయని అన్నారు.బిసి రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బిజెపి పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బిసి రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు..? అని ప్రశ్నించారు.. పార్లమెంట్‌లో బిజెపికి 240 మంది ఎంపిలు, కాంగ్రెస్‌కు 99 ఎంపిల బలం ఉందని, రిజర్వేషన్ల బిల్లు అడ్డుకునేది ఎవరు..? అని అడిగారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ బిసి గణన చేయలేదని, బిజెపి అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నదని పేర్కొన్నారు.

గడిచిన 35 ఏళ్లల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బిసిలు గుర్తుకు రాలేదని విమర్శించారు. కానీ, ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బిసిలపై కపట ప్రేమ నటిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన ఏకైక నేత కెసిఆర్ అని, రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు… బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని అన్నారు. ‘జితానీ ఆబాదీ ఉత్నా హక్’ అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ, ఎనిమిది మంది బిజెపి ఎంపిలు గానీ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని అడిగారు.

రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా బిసి రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, ఎలాంటి పోరాటానికైనా బిఆర్‌ఎస్ కలిసి వస్తుందని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బిసి రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలను హరీష్‌రావు డిమాండ్ చేశారు.

కెప్టెన్సీ చేజారుతుందేమో అని భయం వేసింది..: సూర్యకుమార్

గడిచిన కొద్దికాలంలోనే టీం ఇండియాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్ట్ క్రికెట్‌కి రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో అతడి స్థానంలో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంగ్లండ్ సిరీస్‌ రూపంలో గిల్‌కు పెద్ద సవాలే ఎదురైంది. అయితే ఆ ప్రతిష్టాత్మక సిరీస్‌ని గిల్ 2-2 తేడాతో సమం చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి.. ఆ బాధ్యతలు కూడా గిల్‌కే అప్పగించింది బిసిసిఐ. మరి ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి.

అయితే అంతకు ముందే గతేడాది టి-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టి-20 ఫార్మాట్‌కి రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో అతడి స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేశాడు. అయితే తాజాగా మూడు ఫార్మాట్‌లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంకేతాలు ఇచ్చారు. దీనిపై సూర్య తాజాగా స్పందించాడు. ‘‘గిల్ రెండు ఫార్మాట్‌లకు కెప్టెన్ కావడం సంతోషంగా ఉంది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టి-20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్‌ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం’’ అని సూర్య అన్నాడు. కాగా, అక్టోబర్ 19 భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్‌లో తలపడనుంది. 

బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపిలు మోడీపై ఒత్తిడి తేవాలి: హరీశ్ రావు

హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బిజెపిలు నాటకాలాడుతున్నాయని.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బిజెపి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాక.. రిజర్వేషన్లను ఆపేదెవరు? అని ప్రశ్నించారు. ‘‘ఆరుసార్లు జనగనన చేసిన కాంగ్రెస్ ఏనాడు బిసి గణన చేయలేదు. బిజెపి ఏకంగా జనగణను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోంది. ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపికి బిసిలు గుర్తుకురాలేదా.? రిజర్వేషన్లు పెంచాలని కెసిఆర్ రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టలేదు.? ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజెపి ఎంపిలు మోడీపై ఒత్తిడి తేవాలి. బిసి రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీ వేదికగా పోరాటం మొదలు పెట్టాలి’’ అని హరీశ్ అన్నారు. 

కొందరు అధికారుల పనితీరులో మార్పు రాలేదు: సిఎం

హైదరాబాద్: సిఎస్, సిఎంవొ కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల పని తీరులో ఇంకా మార్పు రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారు పని తీరులో ఇంకా మార్పు రావట్లేదని పేర్కొన్నారు. అధికారులు అలసత్వం వీడి పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని తెలిపారు.

అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తేనే పనులు వేగవంతం అవుతాయని సిఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని.. కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యచరణను వెంటనే చేపట్టాలని.. ఇకపై సిఎస్, సిఎంవొ అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలని ఆదేశించారు.

అగార్కర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన షమీ

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీం ఇండియా ఎంపిక మరో వివాదానికి తెరలేపింది. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో టీం ఇండియా పేసర్ షమీకి.. చీఫ్ సెలక్టర్ అగార్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. షమీ ఫిట్‌నెస్ గురించి తమ వద్ద సమాచారం లేదని మీడియా ముఖంగా అగార్కర్ వెల్లడించాడు. దీనిపై షమీ స్పందిస్తూ.. రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా అని సమాధానం ఇచ్చాడు.

కాగా, షమీ వ్యాఖ్యలపై శుక్రవారం అగార్కర్ మరోసారి స్పందించాడు. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే.. అలాంటి బౌలర్‌ని ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను. ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయామని’’ అని అగార్కర్ అన్నాడు.

దీనికి షమీ ధీటుగా జవాబిచ్చాడు. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నానో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా..!’’ అని షమీ కౌంటర్ ఇచ్చాడు. షమీ చివరిసారిగా ఈ ఏడాది జరిగి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న అతడు.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చాడు.

ప్రేమ పెళ్లి ఇష్టం లేక.. కోడలిని నరికి చంపేశాడు..

ఆసిఫాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణీని మామ నరికి చంపేశాడు. దహేగాం మండలం గెర్రె గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు ప్రేమ వివాహం ఇష్టం లేకనే సత్తయ్య (మామ) ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పుట్టింట్లో ఉన్న రాణి (మృతురాలు)ని సత్తయ్య హతమార్చాడు. గతేడాది రాణిని శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధిచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Wordpress Free Themes and Premium WP Plugins Download