elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomcasibom girişcasibom güncel girişalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbet

భారత్‌కు కీలకం

నేడు ఇంగ్లండ్‌తో తలపడనున్న హర్మన్‌సేన

గెలిస్తే సెమీస్ ఆశలు సజీవం

మహిళల వన్డే వరల్డ్ కప్

ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళ జట్టు పరిస్థితి చావోరేవో అన్నట్టుగా ఉంది. టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో ఓటమిపాలైంది. ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల చేతిలో వరుసగా ఓటమిపాలైన హర్మన్‌సేన సెమీస్ రేసు కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉన్నప్పటికీ కేవలం 4 పాయింట్లు మాత్రమే కలిగిఉంది. దీంతో సేమీస్ చేరాలంటే సవాల్‌గా మారింది. రాబోయే మ్యాచ్‌లు బలమైన జట్లతో ఉండటంతో మరింత కష్టతరంగా మారింది. హర్మన్ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని తప్పకుండా గెలవాలి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ తర్వాత 23న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు చాలా కీలకం. ఈ రెండింటిలోనూ ఓడిపోతే భారత్ ప్రపంచ కప్ కలలు ఆవిరైనట్టే. ఇది సాధ్యపడకుంటే కనీసం ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సిందే.

చివరి పోరు బంగ్లాతో..

న్యూజిలాండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి న్యూజిలాండ్‌ను ఓడించడం వల్ల భారత్‌కు రెండు ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సెమీస్ రేసులో న్యూజిలాండ్‌కు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. నెట్ రన్ రేట్ మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఇక భారత్ చివరి లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, బంగ్లాదేశ్‌నూ తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో విజయం కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. అలా కాకుంటే.. ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిస్తే, సెమీఫైనల్ రేసు నుంచి పూర్తిగా వైదొలగకపోయినా, పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడు టీమిండియా ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు, వారి నెట్ రన్ రేట్ వంటి సంక్లిష్టమైన సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి, సెమీఫైనల్ బెర్త్‌ను సులభంగా ఖాయం చేసుకోవాలంటే, భారత్ తప్పనిసరిగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలవడమే సురక్షితం.

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

గెలుపే లక్షంగా ఆస్ట్రేలియా

నేడు తొలి వన్డే

పెర్త్: ఆసియా కప్ గెలుచుకుని జోరుమీదున్న టీమిండియా మరో సమరానికి సిద్ధం అయ్యింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. అందులో భాగంగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వన్డే సారథిగా శుభ్‌మన్ గిల్‌కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఏడు నెలల అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో అందరి చూపూ మాజీ కెప్టెన్ రోహిత్, కోహ్లీ మీదే ఉంది. 2027 ఐసిసి వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కెప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం అతనిపై మరింత ఉండే అవకాశం లేకపోలేదు.

ఈ మూడు మ్యాచ్‌లలో ఏ మాత్రం రాణించకపోయినా వారి కేరీర్‌కు ఎండ్ కార్డు పడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 50 ఓవర్ల ఫార్మట్ లో సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్‌లో దిగడం ఇదే తొలిసారి కూడా. స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా భావించే నంబర్ 4 స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగొచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ దళాన్ని మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడపాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి మొదటి వన్డే మ్యాచ్‌లో ఆడొవచ్చు.

ఆస్ట్రేలియాకు గాయాల బెడదా..

మరోవైపు- మిచెల్ మార్ష్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఆస్ట్రేలియా.. టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. గాయాలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మాట్ రెన్‌షా, మిచ్ ఓవెన్ మిడిల్ ఆర్డర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. జోష్ ఫిలిప్ 2021 తర్వాత తన తొలి వన్డే ఆడనున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్ కూడా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. స్వదేశంలో ఇదే అతనికి తొలి మ్యాచ్. అయినా వారు దేశవాళీలో రాణించిన అనుభవం లేకపోలేదు. ట్రావీస్ హెడ్, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, మాట్ రెన్షా, జోష్ ఫిలిప్, మిఛెల్ ఓవెన్ వంటి బ్యాటర్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. మిఛెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాట్ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం సయితం ప్రమాదకరంగా ఉంది. దీంతో ఆసీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక, వారికి సొంత గడ్డ, సొంతం మైదానం కాబట్టి వానికి కలిసొచ్చే అవకాశాలూ ఉన్నాయి.

అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది…. తాగుబోతుల వీరంగం

అమరావతి: ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో మందుబాబుల వీరంగం సృష్టిస్తున్నారు. బైక్ వెళ్తుండగా మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌తో ముగ్గురు యువ‌కులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ బంధువులు, స్థానికులు మందుబాబుల‌కు దేహ‌శుద్ధి చేశారు. వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తిరుపతి సమీపంలోని గూడూరులో విద్యార్థులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల హల్‌చల్ చేశారు. జర్నలిస్టు, షాపు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. సాధుపేట సెంటర్ లో దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జర్నలిస్టుకు కూడా భద్రత క‌రువైందని, లా అండ్ ఆర్డ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌పై విమ‌ర్శ‌లు వస్తున్నాయన్నారు.

గూడూరులో తరచూ విద్యార్థుల దాడులపై పోలీస్ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క జర్నలిస్టుకు భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో గంజాయి రాయుళ్లు వీరవిహారం చేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులపై దాడులు జరిగిన దాఖలలు చాలానే ఉన్నాయన్నారు. మందుబాబులు, గంజాయి రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. పోలీసులు ఉన్నారా? లేరా? సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్లకు రక్షణ లేకుండాపోయిందని నెటిజన్లు వాపోతున్నారు. మద్యం మత్తులో బైక్ లపై విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎన్నో సంఘటన జరిగిన కూడా శాంతి భద్రతల విషయంలో మార్పు రావడం లేవని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ

తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శ‌నివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. శనివారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు.

ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డీప్యూటీ ఇఒ వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ ర‌మేష్‌, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధ‌న‌శేఖర్, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల బాగోగుల కోసం ప్రత్యేక చట్టం

మన తెలంగాణ/హైదరాబాద్: నిస్సహాయకుల కు సహాయం అందించడమే మన బాధ్యత అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవ డం మన బాధ్యత అని, అందుకు గ్రూప్2 విజేతలు అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతంలో 10నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తానని హెచ్చరించారు. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతం ఎలా వస్తుందో.. అలాగే వారి తల్లిదండ్రుల అకౌంట్‌లో ఒకటో తేదీన పడుతుందని, దీని కోసం 

త్వరలో చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.ఆ చట్టం మీతోనే రాపిస్తామని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అందుకోసం కొత్తగా అధికారులు అయిన ఉద్యోగులతో ఒక కమిటీని నియమించాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని గ్రూప్ 2 విజేతలకు సిఎం సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు శనివారం శిల్ప కళావేదికలో సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని… కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు, బందు వర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని ఆరోపించారు. అల్లుడిని అంబానీగా, కొడుకును అదానీగా చేయడం కోసమే గత పదేళ్లు పాలన జరిగిందని విమమర్శించారు. గత ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు, హోదాలను తన కుటుంబీకులకే ఇఛ్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వెంటనే వారికి ఎంఎల్‌సిలు, ప్లానింగ్ కమిషన్‌లో పదవులు ఇచ్చిందని,కానీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని అన్నారు. తన కుటుంబం, బంధువుల ఉద్యోగాల గురించి ఆలోచించినట్లు యువత గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ మహిళల గురించి ఆలోచించలేదని ఆక్షేపించారు. కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గత పాలకకులు ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయి ఉండేది కాదు అని, రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయి ఉండేదని కాదని, మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆక్షేపించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవని..కానీ, వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నించారు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

నేను సిఎంగా ఉండకపోయినా.. మీరు అధికారులుగా ఉంటారు

గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు అని గ్రూప్ 2 విజేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని, మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని ఆక్షాంక్షించారు. రేపటి రోజున తాను ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. మీరు మాత్రం అధికారులుగానే ఉంటారని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పునర్:నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. నాయకులం తాత్కాళికం.. అధికారులే శాత్వతం అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే పనులు ఏవీ ఆపకుండా కొనసాగించాలని కోరారు.

చౌకబారు విమర్శలను ఎదుర్కొన్నప్పడు ఆవేదన కలిగింది

తన ఫామ్‌హౌజ్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తున్నట్లుగా ఒక పెద్దాయన చెప్పారని, మరి ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని సిఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదవిన తాను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలే కారణం అని అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రూ.3 కోట్లు తీసుకుని గ్రూప్- 1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారని, పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా..? అని ప్రశ్నించారు. కష్టపడి చదివిన వారిని అవమానించే విధంగా వారు మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయ చౌకబారు విమర్శలను ఎదుర్కొన్నప్పడు చాలా ఆవేదన కలిగిందని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ జరగని కులగణన కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని అన్నారు. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోందని విమర్శించారు. వాళ్ల దోపిడీ గురించి తాము చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని అన్నారు. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇవి నియామక పత్రాలు కావు..నిరుద్యోగుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు : భట్టి

తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు గ్రూప్-2 నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం సంకల్పానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఇలాంటి నియామకాలు చేయలేకపోయారని,తాము చేయకుండా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. అయినా యువత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. తాము ఇస్తున్నవి కేవలం నియామక పత్రాలు కావు అని, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కార్పొరేట్ రంగాల్లో కూడా అవకాశాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

బిసి బంద్ సంపూర్ణం

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలన్న డిమాండ్‌తో శనివారం బిసి సంఘాలు ఇచ్చిన బం ద్ ప్రశాంతంగా ముగిసింది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘా లు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బంద్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. బంద్ సందర్భంగా ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొన్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు వారు ఆశ్రయించడంతో ఇదే అదనుగా వారు అందినకాడికి దోచుకున్నారు. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం చూపింది.

అండగా నిలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ

బిసి సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతానికి కృషి చేశారు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పెట్, ఇమ్లీబన్, ట్యాంక్‌బండ్ అంబెడ్కర్ విగ్రహాల వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండ సురేఖ, ఎంపి అనిల్ యాదవ్ తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. కాగా, మం త్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు బంద్ లో పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ లిబర్టీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి , సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం,తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జై బిసి, బిసిల ఐక్యత వర్ధిల్లాలి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంద్‌లో భాగంగా బిసి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి డిపోల ఎదుట బైఠాయించి, నిరసనలకు దిగారు.

దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, టిజెఎస్,, సిపిఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ, మాలమహానాడు, ఆదివాసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, జాగృతి, గిరిజన, మైనార్టీ, విదార్థు లు, ప్రజాసంఘాలు బంద్‌లో పొల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులకు వెళ్లాల్సిన ప్రయాణికులు పలు ఇక్కట్ల నెదుర్కొన్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిని ఎక్కడికక్కడ బిసి సంఘాల నాయకులు అడ్డుకున్నా రు.ఆయా ఆర్‌టిసి డిపోల ముందు ఆందోళనకు దిగారు. గేట్ మీటింగులు నిర్వహించి, అక్కడే బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శిం చారు.జిల్లాలు, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్తాండ్‌లైన ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి.

ఆర్‌టిసి ప్రయాణీకుల అగచాట్లు

జూబ్లీ బస్‌స్టేషన్ ఎదుట బిజెపి కార్యకర్తలతో కలిసి మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ప్రధాన బస్టాండ్ ఎంజిబిఎస్ లోనూ ప్రయాణికులు బస్సులు లేక పడిగాపులు కాశారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు బస్సులు దొరక్క తీవ్ర ఇబ్బందులు నెదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ బోసి పోయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు కదలట్లేదు. మరోవైపు ఇదే అదనుగా క్యాబ్ డ్రైవర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్‌టిసి బస్సుల కోసమే పలువురు ప్రయాణికులు బస్టాండ ్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. ఎప్పటికీ బస్సులు రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఇక, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరం గల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా బిసి రిజర్వేషన్లు పోరు కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన బంద్ లో బిసి సంఘాలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఆర్‌టిసి సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బస్సు డిపోల ఎదుట బిసి సంఘాలు, పలు పార్టీల నేతలు నిరసనలు చేపట్టారు.

ఆదిలాబాద్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆర్‌టిసి బస్సులు బయటకు రాకుండా బిసి సంఘాలు అడ్డుకున్నాయి. హనుమ కొండలో పలు దుకాణ సముదాయాలు స్వచ్ఛందం గా మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలోని అన్ని డిపోల ముందు 5 గంటల నుంచి జెఎసి నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ ఇప్పటికే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలూ సైతం బంద్ పాటించాయి. బంద్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీల శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. మహబూబ్‌నగర్ ఆర్‌టిసి డిపో ముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధర్నాకు దిగారు. రాజ్యాంగ సవ రణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీఓలు చెల్లవని తెలిపారు. ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒక్క ఫైల్ ఆగినా ఊరుకోను

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పథకా లు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహారించ వద్దని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్య దర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అలసత్వం సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని సిఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని సిఎం సూచించారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం సిఎం నివాసంలో సిఎంఓ కా ర్యదర్శులు, సిఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమం త్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

సిఎంఓ అధికారులు ప్రతి వారం నివేదికలు అందించాలి

అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పు డు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సిఎస్‌ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సిఎంఓ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుం చి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. ఇకపై సిఎస్‌తో పాటు సిఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

ఫీల్డ్ విజిట్లు చేయాలని….

ఏసి గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి సిఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా అధికారులు ఏసి గదుల నుంచి బయటకు రావడం లేదు. ఫీల్డ్ విజిట్లు చేయాలని పదే పదే చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారంటూ సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై కంఫర్డ్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది. 

మద్యం దుకాణాలకు ‘మస్తు’ దరఖాస్తులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఏ4 మద్యం దు కాణాల కోసం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుదారులు శనివారం బారులుతీరారు. ముఖ్యంగా ఏపికి చెందిన మహిళలు దరఖాస్తు చే సుకోవడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన (సోన్ డి కులానికి) చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, ఇందుకోసం ఆమె రూ.4కోట్ల 50లక్షలు చెల్లించింది. ఎపికి చెందిన (సోన్ డి కులానికి) మహిళ లు ఈ దరఖాస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తమ కులానికి ఎపిలో రిజర్వేషన్ ఉందని, తెలంగాణలో కూడా (సోన్ డి కులానికి) రిజర్వేషన్‌లు కల్పించాలని వారు డిమాండ్ చేశా రు. అందులో భాగంగా తాము కూడా తెలంగాణ లో ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చేయడానికి ఈ దరఖాస్తులను దాఖలు చేశామని వారు తెలిపారు. అయితే, వారు డిమాండ్ చేసినట్టుగా ఎపికి చెందిన ఆ కులానికి ఇక్కడ రిజర్వేషన్‌లు వర్తించవని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన గౌడ్, ఎస్టీ, ఎస్సీలకే ఏ4 మద్యం షాపుల్లో రిజర్వేషన్‌లు వర్తిస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

శనివారం ఒక్కరోజే సుమారుగా 30వేల దరఖాస్తులు!

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శనివారం వరకు 80 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్కరోజే సుమారుగా 30వేల దరఖాస్తులు వచ్చినట్టుగా ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు ఆబ్కారీ శాఖ సెప్టెంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం వరకు మందకొడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది. శుక్రవారం ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు రాగా, శుక్రవారం సాయంత్రం వరకు 50వేల దరఖాస్తులు ఆబ్కారీ శాఖకు వచ్చాయి. శుక్రవారం వరకు 50 వేల దరఖాస్తులు రాగా శనివారం మరో 30 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.

ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున నాన్ రిఫండెబుల్ ఫీజును ఎక్సైజ్ శాఖ వసూలు చేస్తోంది. శనివారం నాటికి 80 వేల దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 23న మద్యం దుకాణాలకు డ్రా తీయను న్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మద్యం టెండర్లకు లక్షా 32 వేల దరఖాస్తులు రాగా వాటి ద్వారా 2,645 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో అప్పట్లో భారీగా దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో ఓ మద్యం దుకాణానికి ఒకటే దరఖాస్తు

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్టుగా తెలిసింది. రిజర్వుడ్ దుకాణాలకు గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్టుగా సమాచారం. వ్యాపారులు సిండికేట్లుగా మారి తక్కువగా దరఖాస్తులు వేశారన్న ఆరోపణలు పలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. దరఖాస్తుల ఫీజు ఎక్కువగా ఉండడంతో మద్యం వ్యాపారులు ఈసారి ఆచితూచి వ్యవహారిస్తున్నట్టుగా తెలిసింది. సిండికేట్‌లుగా మారి దరఖాస్తులను తక్కువగా వేసినట్టుగా తెలిసింది.

మందే ముందు.. అదే పసందు!

‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అన్నాడు సుమతీ శతకకారుడు ఎప్పుడో. ఈ మాటను ప్రస్తుత మన రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఉంటారు. అటువంటి రాజకీయ నాయకులలో అందెవేసిన చెయ్యి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. రాజకీయాల్లో బాగా రాటుదేలిన వ్యక్తి ఆయన. ఒకటా రెండా.. దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుండి దిగిపోయాక ఇంకో మాట మాట్లాడితే తప్పులేదని సుమతీ శతకకారుడే చెప్పాడు కదా అనుకుంటారేమో ఆయన. చరిత్ర రీలు వెనక్కు తిప్పితే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ‘ఎప్పటికామాటలాడి’ అన్నవిధంగా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ప్లేటు ఫిరాయించి చెప్పిందొకటి చేసింది ఒకటి అన్నవిధంగా వ్యవహరించిన విషయం జగద్విదితం.

మిగతా విషయాలు ఎలా ఉన్నా మద్యం విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఒక పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. 201419 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం విధానానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. 2024లో మళ్ళీ అధికారంలోకి రాగానే వైయస్సార్ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులను, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిందనే ఒక కేసు పెట్టి జైలుకు పంపించారు.

ఈ రభస ఇలా జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున కల్తీ మద్యం చలామణిలో ఉన్న విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కాదు. ఎక్సైజ్ పోలీసులే స్వయానా కేసులు పెడుతున్నారు. ఇలా కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిపోతున్నదని, ప్రజారోగ్యం ఆందోళనలో పడిందని, కొందరు మరణించారని తాము సేకరించిన సమాచారంతో కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తే అందులో ఒక మీడియా సంస్థ సంపాదకుడిమీద, ఒకరిద్దరు విలేకరుల మీద ఆధారాలు చూపండని కేసులు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ అంతా మద్యం చుట్టూ తిరుగుతున్నది. కాబట్టే చంద్రబాబు నాయుడు ఇతర అంశాల్లో కూడా తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ప్రస్తుతం మద్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. మద్యాన్ని నిషేధించాలని చాలాకాలంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట మద్యాన్ని నిషేధించింది, తమకు పట్టుగల ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేసింది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ.

1994 కు ముందు కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క చుక్క మద్యం కూడా అమ్మకుండా పీపుల్స్ వార్ కట్టడి చేస్తే, అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు జువ్వాడి చొక్కారావు దానికి మద్దతు పలికారు. ఆయన గాంధేయవాది. జీవితాంతం మద్యపానాన్ని వ్యతిరేకించినవారు. అయితే చిత్రంగా విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్ల మధ్య నిషేధ కార్యక్రమాన్ని తూట్లు పొడిచేందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లో పోలీసుల పహరాలో మద్యం అమ్మకాలు సాగించింది. మద్యంనుండి లభించే ఆదాయం అటువంటిది మరి. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు మద్యనిషేధాన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకొని, గెలిచిన వెంటనే మాట నిలుపుకొని సంపూర్ణ మధ్య నిషేధం విధించారు. ఆరోగ్యరీత్యా వైద్యులు నిర్ణయిస్తే కొద్ది మోతాదులో మద్యం సేవించేందుకు పర్మిట్లను అనుమతించారు. కొన్ని మాసాలకే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మధ్య నిషేధంపట్ల తాను మరింత కఠినంగా ఉంటానని చెప్పుకునేందుకు ఆ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. అంతేకాదు, హైదరాబాద్ పాతబస్తీలోని కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక విశాలమైన పార్కులో అప్పటి మద్య నిషేధ శాఖ స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యాన్ని తానే రోడ్డు రోలర్ నడిపిస్తూ వాటిని ధ్వంసం చేసి, పత్రికల్లో ఫోటోలు వేయించుకున్నారు. అప్పుడది అవసరం, అందుకే అది చేశారు.

కొద్ది నెలల్లోనే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఆయన చేసిన తొలి సంతకాలలో బెల్ట్ షాపుల ఎత్తివేత కూడా ప్రధానమైనది. బెల్ట్ షాపులు అధికారికంగా ఏర్పాటు చేసేవి కాదు. వాటిని ఎత్తివేస్తామని ఒక ముఖ్యమంత్రి అధికారికంగా సంతకం చేయడమేమిటి? అది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ బాధ్యత కదా అని ముక్కున వేలేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ బాధ్యత అక్రమ మద్యం ఉత్పత్తిని నిరోధించడం, కల్తీ మద్యం పంపిణీ ఆపడం, అనధికారికంగా ఏర్పాటయే మద్యం దుకాణాలను అంటే బెల్ట్ షాపులను నిర్మూలించడం. అది అధికారులు సహజంగా చేసుకోవాల్సిన పని. సంతకం అయితే చేసారు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏ రీతిలో విచ్చలవిడిగా పెరుగుతూపోయాయో ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి వెళ్లి ప్రజలు అడిగినా చెబుతారు. 2019లో ఆయన ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను పాదయాత్ర సందర్భంగా కానీ, ఇతరత్రా కానీ చెప్పిన సంపూర్ణ మద్య నిషేధానికి బాటలు వేస్తూ మద్యం విధానాల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. మద్యం విక్రయాలు ప్రైవేట్ వారి చేతుల్లో లేకుండా చేశారు.

దుకాణాల సంఖ్య బాగా తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మాదిరిగానే అవి ఉదయం తెరిస్తే సాయంత్రం మూసివేసేవారు. అదేవిధంగా, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన బ్రాండ్లనే ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మినా ధరలు మాత్రం బాగా పెంచారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దీనివల్ల నిజానికి ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గుతుంది. అయినప్పటికీ ప్రచార సమయంలోగానీ, అంతకు ముందుగానీ తాను చెప్పినట్టు సామాన్య ప్రజలకు మద్యం అందుబాటులో లేకుండా చేసినట్లయితే వారిని తాగుడుకు బానిసలు కాకుండా కాపాడటానికి ప్రయత్నించవచ్చునని ఆయన ప్రభుత్వం సంపూర్ణంగా నమ్మింది. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్తుండిన మాట మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలుంటాయని. ఆచరణలోనూ ఆయన అదే చేసి చూపించారు. కేరళ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.

వీటితోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ప్రతి మద్యం బాటిల్ ను విక్రయించే ముందు వినియోగదారుడి ఎదుటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం అమ్మే మద్యంలో కల్తీ లేదా అక్రమ మద్యం వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో. బాటిళ్లు స్కాన్ కాకపోతే దాన్ని విక్రయించేవారు కాదు. ఆంధ్రప్రదేశ్ లో మద్యపానప్రియులు ఎవరినడిగినా ఈ విషయం చెబుతారు. స్కాన్ తో ఆ మద్యం సీసా ఏ డిస్టిలరీనుండి, ఏ డిపో నుండి వచ్చిందో ఏ షాపునకు అది వెళ్ళిందో, ఆ షాపులోనే విక్రయించారా లేదా అనే విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాటు కారణంగా కల్తీ, అక్రమ మద్యాన్ని పట్టుకోవడం చాలా సులువు అయ్యేది.

గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి ఇదంతా జరుగుతున్న సమయంలో నాణ్యత లేని మద్యం తాగి వేలమంది మృతి చెందారంటూ అప్పటి ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ వారు, ఆయనతో స్నేహం చేసిన ఇతర కొన్ని పార్టీలు పెద్దయెత్తున ప్రచారం చేసాయి. ఇవన్నీ అభూతకల్పనలని తేల్చేస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీతో కలిసి కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర హోమ్ శాఖ 2022- 2023 నివేదికల్లో అక్రమ మద్యం కేసులు గాని, మృతులు గాని ఆంధ్రప్రదేశ్ నమోదు కాలేదని స్పష్టంగా చెప్పింది. ఇదిలాఉంటే 2024 ఎన్నికల ప్రచారంలో 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబునాయుడు మద్యం విషయంలో జరిపిన ప్రచారం తీరు అందరినీ నిర్ఘాంతపరచకతప్పదు. ‘రోజంతా కష్టపడి అలసట మరచిపోవడానికి రెండు పెగ్గులు తాగాలనుకుంటారు.

ఆ మద్యం మీకు సరైనది అందడం లేదు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందిస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో ప్రతి బహిరంగసభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉత్సాహపరిచారు.అనధికారిక అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 90 లక్షలమంది మద్యం సేవించే వాళ్ళు ఉండొచ్చని ఒక లెక్క. ప్రచారం తొలి రోజుల్లో చంద్రబాబునాయుడు పదేపదే మద్యం గురించి ఇలా మాట్లాడుతుంటే ఇంత సీనియర్ నాయకుడు ప్రజలను మద్యం తాగడానికి ప్రోత్సహించడం ఎబ్బెట్టుగా ఉన్నదని, మద్యనిషేధాన్ని నిజాయితీగా నమ్మి, దాని కారణంగా వచ్చే విపరిణామాలను కూడా లెక్కచేయకుండా కచ్చితంగా అమలుపరిచిన ఎన్టీ రామారావు తన ఆరాధ్యదైవం అని చెప్పుకుంటూ ఆయన ఆత్మక్షోభించే విధంగా ఇవేం మాటలు అనుకున్న వాళ్ళకు.. ఇది ఆ 90 లక్షల ఓట్లకు వేస్తున్న గాలమని ఆ తర్వాత అర్థమైంది.

ఆయన ఆశించినట్టే ఇతర అంశాలు కూడా కలిసి వచ్చి అధికారంలోకి రాగానే ప్రచార సమయంలో తాను ప్రజలకు మాట ఇచ్చినట్టుగా సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం కాకుండా ప్రభుత్వం అదుపులోనుండే మద్యం విక్రయాలను ఎత్తేశారు. మద్యం అసలైనదా, నకిలీదా అని తెలుసుకునే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో 11 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అమ్మకాలు జరిగితే, అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్లు దాదాపు 5,280 కోట్ల రూపాయల విలువచేసే మద్యం అనధికారిక ఉత్పత్తి, సరఫరా జరిగిందని కడప లోకసభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు. దానిమీద ప్రభుత్వంనుంచి ఈనాటివరకు ఎటువంటి వివరణ లేదు. మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న మద్యం విక్రయాలకు సంబంధించి, వాటిలో కల్తీ జరిగిన విషయంపైన, ఆ కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు కూడా సంభవించాయన్న వార్తలపైన నిజనిర్ధారణకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను తేలిస్తే బాగుంటుంది.

పలు జిల్లాల్లో యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజారోగ్యానికి నష్టం కలగడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు కూడా గండిపడుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలమీద ప్రభుత్వం నిగ్గుతేల్చితే మంచిది. మద్యం కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలు లేకుండా క్యూఆర్ కోడ్‌ను ఎత్తివేశారు. గత కొద్దిరోజులుగా దీనిమీద ఇంత రభస జరిగాక ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమై క్యూఆర్ కోడ్ పద్ధతిని మళ్ళీ ప్రవేశపెట్టినట్టు తెలుస్తున్నది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగేపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మద్యం విక్రయాల విలువ భారీగా తగ్గింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏటా గత సంవత్సరంతో పోలిస్తే ఓ పదిశాతం వరకు ఎక్సైజ్ రాబడి పెరుగుతూ ఉంటుంది. పశ్చిమగోదావరిలో గత ఏడాదికన్నా ఈ ఏడాది విక్రయాల విలువ నాలుగు శాతం తగ్గగా శ్రీకాకుళం, వైయస్సార్ కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో విక్రయాల విలువ ఒక శాతం కూడా పెరగలేదు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మూడు శాతం మాత్రమే పెరిగింది. మన్యం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో నాలుగు శాతం మాత్రమే పెరిగినట్టు అందుబాటులో ఉన్న లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం కల్తీ మద్యం విక్రయాలన్నది స్పష్టం.

ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కూడా ఈ కల్తీ మద్యం మీద చర్చ జరగడం, నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ సూచించడం ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించిన ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ విషయంలో విచారణ సందర్భంగా ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో పే ర్కొన్నట్టు రాజకీయ నేతల మీద కేసులు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లవేళలా ప్రత్యర్థి అనేవారు ఉంటారు. అయితే ప్రత్యర్థులు మాట్లాడే మాటలను, చేసే విమర్శలను, తమ దృష్టికి తీసుకువచ్చే అంశాలను ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకొని పట్టించుకుని అవసరమయిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.

పాక్ దాడిలో ముగ్గురు క్రికెటర్లు మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరోమారు అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై శనివారం వైమానిక దాడులకు దిగింది. ఈ భీకర దాడులలో పలువురు ఉగ్రవాదులు, పౌరులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు యువ క్రికెటర్లు కూ డా ఉన్నారని ది డాన్ పత్రిక తెలిపింది. ఇప్పుడు పాక్, అఫ్గాన్ సేనల మధ్య డోలాయమాన స్థితిలో ఉన్న కాల్పుల విరమణ ఇప్పటి ఈ దాడుల ఘటనతో చతికిలపడింది. పైగా దోహాలో జరగాల్సిన ఇరుపక్షాల శాంతి చర్చలపై నీలినీడలు పర్చుకున్నాయి. తహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) బహదూర్ వర్గం పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో ప్రా బల్యం చాటుకునేందుకు యత్నించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కరోజు క్రితమే నార్త్ వజరిస్థాన్‌లోని పాక్ సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు కాల్పులు, బాంబుల దాడికి దిగారు.

తాలిబన్ల ఉగ్రసంస్థ దాడికి ప్రతీకారంగా పాక్ సేనలు శనివారం అఫ్గాన్ మారుమూ ల ప్రాంతంలోని ఉర్గన్, బర్మాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలపై వైమానిక దా డులకు దిగాయి. అక్కడ ఉగ్రవాద స్థావరాలను లక్షాలుగా ఎంచుకున్నాయి. ఈ దాడులలో క్రికెటర్లు మృతి చెందారని పత్రిక తెలిపింది. క్రికెటర్ల మృతిని అఫ్గాన్‌స్థాన్ క్రికెట్ బోర్డు నిర్థారించింది. ముగ్గురు యువ ఆటగాళ్లు కబీర్, సిబ్ఘహతుల్లా, హరూన్‌లు చనిపోయారని ఈ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. క్రికెటర్ల మృతికి నిరసనగా తాము మూడు దేశాల టి 201 సీరిస్ క్రికెట్ పోటీని బహిష్కరిస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ పోటీలో పాక్ క్రికెట్ జట్టు ప్రధాన పక్షంగా ఉంది నవంబర్ చివరిలో ఈ క్రికెట్ జరగాల్సి ఉంది. జరిగ. ఇప్పటి దాడులతో దోహాలో జరిగే శాంతిచర్చలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని , యధావిధిగా జరుగుతాయని పాక్ తరఫున విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాబిబన్లతో చర్చలు జరుపుతారని ప్రకటన వెలువడింది.  

Wordpress Free Themes and Premium WP Plugins Download