elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasus

ప్రపంచకప్: భారత్ ఓటమి.. సెమీస్ కు ఇంగ్లండ్

ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లోభారత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. హీథర్ నైట్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నైట్ 91 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 109 పరుగులు సాధించింది. ఓపెనర్లు టామీ బ్యూమౌంట్ (22), అమీ జోన్స్ (56) జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (38) తనవంతు పాత్ర పోషించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు అద్భుత పోరాట పటిమను కనబరిచినా భారత్‌కు ఓటమి తప్పలేదు. మంధాన 8 ఫోర్లతో 88 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ 10 ఫోర్లతో 70 పరుగులు సాధించింది. దీప్తి శర్మ (57), హర్లిన్ డియోల్ (24)లు బాగానే బ్యాటింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

సోమవారం రాశి ఫలాలు (20-10-2025)

మేషం – మీకు అండగా నిలబడతారని ఆశించిన ఓ వర్గం వారు సకాలంలో అందుబాటులో లేకపోవడం లోటుగా పరిణమిస్తుంది. మీలో మొండితనం పట్టుదల అధికమవుతున్నట్లుగా భావిస్తారు.

వృషభం – కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది. నూతనమైన బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న విషయాలలో తెగించి నిర్ణయాలను తీసుకుంటారు.

మిథునం – సాంప్రదాయాలకు విలువని ఇచ్చి ఆధునిక పోకడలకు దూరంగా ఉంటారు మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడానికి కావలసిన విధంగా నడుచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది.

కర్కాటకం – ఓర్పు సహనాల విలువ తెలిసి వస్తుంది. సంతాన అవసరాలపైన దృష్టిని సారిస్తారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగు వసతులు కల్పించడానికి కృషి చేస్తారు.

సింహం – పరపతి కలిగిన సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి లాభపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.మీకు నచ్చిన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు

కన్య – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు.

తుల – సోదరుల నుండి వస్తు లాభాలు పొందుతారు. వివాహ ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం – బంధువులు మిత్రులు నుండి శుభవార్తలు వింటారు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతతి విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి ఊపిరి పీల్చుకుంటారు.

ధనుస్సు – అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎలర్జీ, అజీర్తి వంటి స్వల్ప ఇబ్బందుల పట్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినది. మొండి పట్టుదల ఉపకరించేది కాదని గ్రహించండి.

మకరం – ఆర్థిక లావదేవిలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు.ఈ విషయము గురించి కుటుంబ సభ్యులతో సమాలోచనలు సాగిస్తారు.

కుంభం – సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఎంతసేపు ఎదుటివారు మీకు హితం చెప్పడమే కానీ మీరు చెప్పేది కనీసం వినని వ్యక్తుల వలన చికాకు కలుగుతుంది.

మీనం – రొటీన్స్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. మిత్ర బృందంలోని ఒకరు మీతో శత్రుత్వం పెంచుకునే సూచనలు ఉన్నాయి.

 

కనుమరుగవుతున్న బిఆర్‌ఎస్.. ఎమ్మెల్సీ అద్దంకి కీలక వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ కనుమరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అయితే ఇతర పార్టీల నుంచి ఛోటా నాయకులను బిఆర్‌ఎస్‌లో చేర్పించుకుంటూ ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు తాపత్రయపడుతున్నారని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బిఆర్‌ఎస్ నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో వారు చేరుతున్నారని ఆయన చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ ఓట్లన్నీ బిజెపికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పడ్డట్లు ఇప్పుడు కూడా పడేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

పారా అథ్లెట్ అర్చనకు కెటిఆర్ అండ

శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ఆర్థిక సాయం

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న తెలంగాణ బిడ్డ మిట్టపల్లి అర్చన 

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పారా-అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన శుక్రవారం నంది నగర్‌లోని నివాసంలో కెటిఆర్‌ను కలిశారు. కుట్టుపని ద్వారా తన జీవనోపాధిని గడుపుతున్న అర్చన, డిసెంబర్ 8 నుండి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే ఎంపికయ్యారు.

అయితే, ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అర్చనకు ఈ విజయం అపశ్రుతిగా మారే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కెటిఆర్ తక్షణమే స్పందించి, అర్చనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణా సామగ్రిని కూడా ఆమెకు అందజేశారు. కెటిఆర్ నుంచి సకాలంలో లభించిన ప్రోత్సాహంతో, అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే అర్చన కల సాకారం కానున్నది.

అర్చన పోరాటం స్ఫూర్తిదాయకం

అర్చన కథ ఆమె ధైర్యం, పట్టుదలకు నిదర్శనం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. చంద్రంపేటలోని ఒక కుట్టు మిషన్ నుండి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. తెలంగాణ ఆమెను చూసి గర్విస్తోందని, రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు ఆమెకు అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

నక్సల్స్ రహిత జిల్లాలకు మహర్థశ: కిషన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. నక్సల్స్ రహిత జిల్లాలకు మహర్ధశ పడుతుందని ఆయన అన్నారు. గత మూడు రోజుల్లోనే మూడు వందల మంది నక్సల్స్ లొంగిపోయారని, అందులో తెలుగు వారు ఎక్కువ మంది ఉన్నారని ఆయన ఆదివారం అంబర్‌పేటలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ అన్నారు. పదేళ్ళ క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్స్ ప్రభావిత జిల్లాలు, ఇప్పుడు 11కు తగ్గాయని అన్నారు. అవి కూడా నక్సల్స్ రహిత జిల్లాలుగా మారుతాయని, వాటికీ మహర్ధశ పడుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమొందించాలని కేంద్రం పట్టుదలగా ఉందని ఆయన వివరించారు.

‘ఆపరేషన్ కగార్‘తో సత్ఫలితాలు వస్తున్నాయని, ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. నక్సల్స్ ముందుకు వచ్చి హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. హింస ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమీ సాధించలేరనే సందేశం మరోసారి స్పష్టమైందని ఆయన తెలిపారు. త్వరలోనే దేశంలో నక్సల్స్ రహిత జిల్లాలుగా మాతుతాయని ఆయన చెప్పారు.

ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు పడుతున్నాయని అన్నారు. నక్సల్స్ కారణంగా ఆ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా నోచుకోలేదని ఆయన చెప్పారు. నక్సల్స్ రహిత జిల్లాలుగా మారడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణు గోపాల్ , ఆశన్నలు వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని విప్లవ ద్రోహులుగా పేర్కొంది. శత్రువుల ఎదుట లొంగిపోయి పార్టీ నష్టానికి కారణమైన నేతలకు తగిన శిక్ష ప్రజలే విధిస్తారని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది.

పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుం డానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపించింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోవచ్చ ని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని కోరింది. గత కొన్ని రోజులుగా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారు. కాగా 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారని అమిత్ షా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది. ‘2011 చివరి నుంచి విప్లవోద్యంమం గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వస్తోంది. 2018లో మవోయిస్టు పార్టీ ఒకసారి తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి.

2020 కేంద్ర కమిటీ సమావేశంలో.. మల్లోజుల దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై సొంత విశ్లేషణలతో నిర్థారించి ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడూ జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో ఆయన తప్పుడు రాజకీయ భావనలను పార్టీ విమర్శించింది. అనంతరం ఆయనను పార్టీ సరిదిద్దడానికి కృషి చేసింది. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్లీనం మల్లోజుల వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని విమర్శించి, వాటిని సరిదిద్దుకోవాలని కోరిం ది.

అయితే, 2025 మే నెలలో జరిగిన ఆపరేషన్ కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత మల్లో జులలో దీర్ఘకాలంగా ఉన్న సైద్దాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరి ల్లేలా చేశాయి‘ అని అభయ్ లేఖలో పేర్కొన్నారు. ‘విప్లవానికి ద్రోహులుగా మారిన మల్లోజుల, ఆశన్నల ముఠా సరైన మార్గంలో విప్లవ ఉద్యమాన్ని పునర్మిస్తామనడం బూటకం. వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటజిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవ ఉద్య మం, ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా, విప్లవ ఉద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపు నిస్తున్నాం. కగార్ యుద్ధంతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి, విప్లవ ప్రజలను చెందిన ఆయుధాలను శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతి ఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు‘ అని లేఖలో అభయ్ హెచ్చరించారు.

‘విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే’

’భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు- మన రాజకీయ కార్యక్రమం’, ’భారతదేశంలో కులసమస్య మన దృక్పథం’, ’భారతదేశంలో బాతుల సమస్య- మన పార్టీ వైఖరి’, ’భారతదేశంలో దళారీ నిరంకుశ బూర్జువా వర్గం పై పార్టీ వైఖరి -రాజకీయ కార్యక్రమం’ డాక్యుమెంట్లను మరింతగా సంశ్లేషించి మారిన సామాజిక పరిస్థితులకు, మారుతున్న విప్లవయుద్ద స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ- సైనిక పంథా మరింతగా సంపన్నం చేసుకుని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్తు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే సోను, సతీష్ ముఠా ద్వారా సృష్టించబడ్డ ఈ స్థితిని పార్టీలో ఏర్పడిన సంక్షోభంగా గుర్తించి, ఈ సంక్షో భాన్ని అధిగమిద్దాం. ప్రస్తుతం మన స్వీయాత్మక శక్తులు నష్టపోయి, బలహీనపడ్డ స్థితిని అంగీకరిస్తూ, మన విప్లవోద్యమంపై శత్రువు.అధికృత సంపాదించిన స్థితిని గమనంలో ఉంచుకుని పార్టీని, పీ.ఎల్.జె.ఎ.ను, ఐక్య సంఘటనను మొత్తంగా విప్లవోద్యమాన్ని కాపాడుకుంటూ దేశవ్యాప్త విప్లవోద్యను పునర్నిర్మాణానికి పూనుకుందాం. సోను, సతీష్‌లు శత్రువుకు సరెండరయినా రేపు మరొకరు సరెండరైనా మన పార్టీ శత్రువుకు సరెండర్ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం. వర్గాలున్నంతకాలం వర్గ పోరాటాలు వాటి ఉన్నత రూపాలుగా ప్రజాయుద్దాలు కొనసాగడం తిరుగులేని చారిత్రక నియమం. ఈ నియమాన్ని లొంగుబాట్లు మార్చలేవు. కాబట్టి తాత్కాలిక వెనకంజలో సైతం విప్లవోద్యము పురోగమనం కోసం కృషి చేయడానికి గొప్ప ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ముందుకుసాగుదాం అంతిమ విజయం ప్రజలదే’ అని అభయ్ పేర్కొన్నారు.

ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి ఫైరయ్యారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో బుల్డోజర్ రాజ్యం వచ్చిందని.. రాష్ట్రంలో పాలనపరమైన వైఫల్యం కొనసాగుతున్నదని విమర్శించారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని.. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కాల్సిందేనని కెటిఆర్ పేర్కొన్నారు. ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామని వార్నింగ్ ఇచ్చారు.  ఇప్పటివరకు ఒక్క పెద్ద వ్యక్తి ఇల్లు అయినా కూలగొట్టారా…? అని నిలదీశారు. మూసీకి అడ్డంగా కడుతున్నవారిని ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. బడా నేతల ఇళ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదని, పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నా రాత్రికి రాత్రే కూలుస్తున్నారని ఆరోపించారు. పెద్దల ఇళ్ల చిరునామాలు హైడ్రాకు తెలియదు అని, పేదల ఇళ్లు కూలిస్తే అడిగేవారు లేరని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్య పరిపాలన అని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం చేపట్టకుండా కేవలం ప్రచారం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. బిసి రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను పూర్తిగా మోసం చేసిందని అన్నారు. ఎలాంటి హోంవర్క్ లేకుండా రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని, చివరికి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కోర్టు ఎండగట్టిందని పేర్కొన్నారు. నిజంగానే బిసి రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీకి, బిజెపి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, వారి ఎంపీలు తెలంగాణ గల్లీలో దొంగ పోరాటం చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటులో బిసి బిల్లు పెట్టేలా ప్రయత్నం చేయాలని సవాలు విసిరారు.

చేయాల్సిన చోట పని చేయకుండా బిసిలను మోసం చేసే ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణలో నాటకాలు ఆడుతున్నాయని కెటిఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీలు బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. తమకు ఉన్న రాజ్యసభ ఎంపీల ద్వారా పార్లమెంటులో పూర్తి మద్దతు అందిస్తామని అన్నారు.

జెఇఇ మెయిన్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

జనవరి 21 నుంచి 30 వరకు తొలి విడత జెఇఇ మెయిన్

ఏప్రిల్‌లో 1 నుంచి 10 వరకు రెండో విడత

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2026 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో తొలి విడత జెఇఇ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది.జెఇఇ మెయిన్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది.

జెఇఇ మెయిన్ సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. సెషన్ -2 పరీక్షకు జనవరి ఆఖరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా పరీక్ష నిర్వహించే సిటీల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తున్నామని.. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంది.

డాక్యుమెంట్లు అప్‌డేట్ చేసుకోండి: ఎన్‌టిఎ సూచన

జెఇఇ మెయిన్ 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టిఎ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.

ఆధార్: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం) సరిగా ఉండేలా అప్‌డేట్ చేసుకోండి. అలాగే, తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు మీ కార్డులో అప్‌డేట్ అయి ఉండాలి. దివ్యాంగ అభ్యర్థులైతే యుడిఐడి కార్డు చెల్లుబాటవుతుంది. అయితే, రెన్యువల్ చేయించుకొని అప్‌డేట్‌గా ఉండటం తప్పనిసరి. ఎస్‌సి, ఎస్‌టి,ఒబిసిఎన్‌సిఎల్, ఇడబ్లూఎస్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు సర్టిఫికెట్లు చెల్లుబాటయ్యేలా అప్‌డేట్ చేయించుకోవాలి.

జెఇఇ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్

జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30 వరకు

దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ నెలలో ప్రారంభం

జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు

దరఖాస్తుల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభం

మావోలతో సంబంధాలు తెంచుకోండి.. నాయకులకు బండి సంజయ్ వార్నింగ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వారు, మద్దతు ఇస్తున్న వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హితవు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనతో పాటు అవినీతి, నేర, ఉగ్రవాద సంబంధాల నెట్ వర్క్‌ను వెలికి తీసి బయటపెట్టడానికి చర్యలు చేపట్టిన్నట్లు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. మావోలకు మద్దతునిస్తున్న వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో గుట్టు బయటపడుతుందని ఆయన హెచ్చరించారు.

దేశ భద్రతకు ముప్పు కలిగించే వారు ఎవరైనా తప్పించుకోలేరని.. భద్రత విషయంలో కరుణ చూపకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత భద్రత విషయంలోనూ ముప్పు కలిగించే వారిని క్షమించేది లేదని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసే వారి వైపు నిలబడే వారు ఎవరైనా రాజీ లేదని తెలిపారు. రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతూ మావోలకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఇదే తమ హెచ్చరిక అని ఆయన తెలిపారు.

ఈ దీపావళికైనా.. బాంబులేటి బాంబులు పేలతాయా?: కెటిఆర్ ఎద్దేవా

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చురకలంటించారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి.. బాంబులు పేలతాయన్నారని.. మళ్లీ దీపావళి కూడా వచ్చనా, బాంబులు పేలడం లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం బిఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి తీసుకెళ్లామని, కాంగ్రెస్ పాలనలో పారిశ్రామివేత్తలకు తుపాకులు పెడుతున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా దందాలు చేస్తోందని కెటిఆర్ విమర్శించారు. ప్రజా రవాణాను బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవలసిన ప్రభుత్వం, ప్రజలు ఉన్న ప్రాంతాలను పక్కనపెట్టి, భవిష్యత్తు లేని ఫ్యూచర్ సిటీ వైపు అడ్డగోలు సొమ్మును ఖర్చు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తమ భూములకు మరింత ధర వచ్చేలా ప్రజల సొమ్ముతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download