elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

నిర్మాతతో విబేధాలు స్పందించిన దర్శకుడు సుజీత్

ఇటీవలే ‘ఒజి’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు దర్శకుడు సుజీత్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నెల 23 నుంచి ‘ఒజి’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ‘ఒజి’ చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే నాని హీరోగా సుజీత్ ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ‘ఒజి’ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే దాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కానీ, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నిర్మాత డివివి దానయ్య, సుజీత్‌ల మధ్య దూరం ఏర్పడిందని వార్తలొచ్చాయి.

అయితే ఈ వార్తలకు సుజీత్ చెక్ పెట్టాడు. అతడు మంగళవారం పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఒజి’ విషయంలో తనను నమ్మి ఎంతగానో సపోర్ట్ చేశారంటూ నిర్మాత దానయ్యకు సుజీత్ కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా విషయంలో చాలామంది ఏదేదో మాట్లాకున్నారని.. కానీ, సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారని.. తన నిర్మాత, టీమ్ గురించి మాటల్లో చెప్పలేనని సుజీత్ పోస్ట్ పెట్టాడు. దీంతో నిర్మాత దానయ్యతో తనకు విబేధాలు లేవని సుజీత్ తేల్చి చెప్పాడు.

ఒటిటిలో ‘మిరాయ్’.. అక్కడా రికార్డులు సృష్టిస్తోంది..

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కాసుల పంట పండించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ జియో హట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సీఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకు మిరాయ్ ఇప్పుడు ఒటిటిలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 200+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకున్నట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది.

అంతేకాక.. ఈ దీపావళి వీకెండ్‌లో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగానూ ఈ సినిమా నిలిచింది. ముఖ్యంగా ఇండియా, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలలో ఈ సినిమాను అత్యధిక మంది వీక్షించారు. కాగా, రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించని ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది. 

దానం నాగేందర్ బిఆర్ఎస్ లో ఉన్నారని ఎవరు చెప్పారు: కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ ను చేర్చడం సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటిఆర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కెటిఆర్ పర్యటించారు. ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ బిఆర్ఎస్ లో ఉన్నారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎఐసిసి అంటే .. ఆల్ ఇండియా కరప్షన్ కమిటి అని తెలియజేశారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలని, మేము పార్టీ మారలేదని అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి లెక్కలేదని కెటిఆర్ విమర్శించారు.

v

నార్సింగ్: రోడ్డు ప్రమాదంలో ముక్కుపచ్చలారని బాలుడు మృతి చెందన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో చోటు చేసుకంది. వేగంగా వచ్చి కారు ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి నవీన్ కుమార్, కొడుకు కుశల జోయల్ గాల్లో ఎగిరి కిందపడ్డారు. అనంతరం బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన జోయెల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి ఒడిలోనే బాలుడు కన్ను మూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప-ఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ దాఖలు చేశారు. మొత్తం 150కి పైగా నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీలతో పాటు.. స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఒయు, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌లు ఈ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్న వారికే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పటివరకూ దాఖలైన నామినేషన్లు.. బుధవారం నుంచి ఆర్వో సాయిరాం పరిశీలిస్తారు. ఆక్టోబర్ 24 వరకూ నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. నవంబర్ 11న పోలీంగ్.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు: రాచమల్లు

అమరావతి: అసాంఘిక కార్యక్రమాలను టిడిపి నేతలు ప్రోత్సహిస్తున్నారని వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. క్యాసినో, అసాంఘిక కార్యక్రమాలకు ప్రొద్దుటూరు అడ్డాగా మారిందని అన్నారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలపై రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరగుతున్నాయని, నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. టిడిపినేతలు పేదవాడి రక్తం తాగుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.  

చెరువులో పడి వృద్ధురాలు, ఆమె మనవరాలు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పీరం చెరువులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు  వృద్ధురాలు, ఆమె మనవరాలు చెరువులో పడి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తాండూర్ కు చెందిన యూసుఫ్(60), సబియా(10) గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర.. అరుదైన రికార్డు

శ్రీలంక మహిళ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు.. సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి శ్రీలంక ఉమెన్ క్రికెటర్‌గా ఆతపట్టు రికార్డుల్లోకెక్కింది. మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆటపట్టు ఈ రికార్డు సాధించింది. ఆసియాలో ఈ రికార్డును సాధించిన నాలుగో క్రికెట్‌గా నిలిచింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆటపట్టు ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదురుకొని 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ కూడా విజయానికి దగ్గర వరకూ వెళ్లింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా, ఆటపట్టు అద్భుతమైన బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. దీంతో బంగ్లాపై శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రెండో వన్డే : అడిలైడ్‌లో భారత్ ప్రాక్టీస్

అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీం ఇండియా ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 1-0 తేడాతో భారత్ వెనకంజలో ఉంది. ఈ క్రమంలో రెండు వన్డే కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అడిడైల్ చేరుకున్న భారత్.. అక్కడ ముమ్మరంగా సాధన ప్రారంభించింది.

ఏడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులు చేయగా, కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో రెండో వన్డే ఈ ఇద్దరికి కూడ కఠిన పరీక్ష కానుంది. దీంతో రెండె వన్డేలో భారత్ తిరిగి పు్ంజుకొని.. మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఎఎస్ పి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి… బుధవారం వస్తా… నీ సంగతి తేలుస్తా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎఎస్ పి వర్సెస్ టిడిపి ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ పరోక్షంగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి ఎఎస్ పి హెచ్చరించాడు. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎఎస్ పి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తాడిపత్రి అడిషనల్ ఎస్ పి రోహిత్ చౌదరిపై జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రోహిత్ బయటికి రావాలంటే ఎస్ఐ, కానిస్టేబుల్ కావాలని, ఎఎస్ పిగా పనికిరారని దుయ్యబట్టారు. తాడిపత్రిలో రోహిత్ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని చురకలంటించారు. రాళ్ల దాడి జరిగిని తరువాత ఘటనా స్థలానికి ఎఎస్ పి ఆలస్యంగా వచ్చారని జెసి దుయ్యబట్టారు. డిఎస్‌పి చైతన్య కంటే ఎఎస్‌పి పనికి రాని వ్యక్తి అని, రోహిత్ ఇంటికి ముందుకొచ్చి పడుకొని నిరసన తెలిపితే జవాబు లేదన్నారు.

ఎస్‌పిని చూసి మౌనంగా ఉన్నానని లేదంటే ఇంట్లోకి దూరేవాడినని జెసి ధ్వజమెత్తారు. ఐదేళ్లు కష్టపడితేనే ఈ స్థితిలో ఉన్నానని, భార్య పిల్లలను అందరిని మావాళ్లు పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎఎస్ పి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు 130 కేసులు ఉన్నాయని, మరో పది కేసులు పెట్టిన కూడా భయపడనని, తన జీవిత కాలంలో మర్యాదగా బతికానని మర్యాదగానే చస్తానన్నారు. తనకు ఎవరంటే భయం లేదని, తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, తనకు పోలీసులంటే భయం లేదన్నాడు. ఎఎస్ పి తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పోలీసులకు చాలా మర్యాద ఇస్తామని, రోహిత్ మరో చైతన్య మారారని ఎద్దేవా చేశారు. తన దగ్గర ఉన్న అన్ని రికార్డులు తీసుకుని పోలీసుల ముందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని జెసి సవాల్ విసిరారు. 

Wordpress Free Themes and Premium WP Plugins Download