elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

’కాంత’ వచ్చేస్తోంది

దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ ’కాంత’ టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-, తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిలమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంత నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.

నక్సలిజం త్వరలో అంతరించిపోతుంది:మంత్రి రాజ్ నాథ్ సింగ్

పోలీసులు, సైనిక బలగాల అవిరణ కృషి ఫలితంగా త్వరలో నక్సలిజం కాలగర్భంలో కలిసిపోతుందని, చరిత్రలో ఓ మచ్చగా నిలిచిపోతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం నాడు ఉద్ఘాటించారు. పోలీసు సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ప్రసంగించారు. సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురిలో జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పుష్ప గుచ్ఛం సమర్పించి, అమర వీరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. సెరిమోనియల్ గార్డ్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

నక్సలిజం బెడదను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి ఫలితంగా ఒకప్పుడు ప్రభుత్వాలపై ఆయుధాలు ఎక్కుపెట్టిన మావోయిస్ట్ లే ప్రస్తుతం లొంగిపోయి అభివృద్ధి ప్రదాన స్రవంతిలోకి చేరుతున్నారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నక్సలైట్ల కు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలు విజయవంతమయినట్లే నన్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో నక్సల్స్ ముప్పు అంతమవుతుందని కేంద్రం ప్రకటించింది.

చాలా ఏళ్లపాటు నక్సలిజం మనదేశం అంతర్గత భద్రతకు ముప్పుగా ఉందని, ఒకప్పుడు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్రలోని అనేక జిల్లాలలో నక్సలిజం తీవ్రంగా ఉండేదని, ప్రజలు భయాందోళనలతో బతికే వారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు లేవు, రోడ్లు ఉండేవి కావు . ఆ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిర్ణయం ఫలితంగా, పోలీసులు,సిఆర్ పీఎఫ్, బీఎస్ ఎఫ్, స్థానిక పాలనా యంత్రాంగ కృషి చేయడంతో ఈ బెడద తొలగిపోయే రోజు త్వరలో వస్తుందని ఆయన తెలిపారు.

ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి వెల్లివిరుస్తోందని అన్నారు.మోదీ సర్కార్ పోలీసు దళాల ఆధునీకరణకు చేపడుతున్న చర్యలు, బడ్జెట్ ను కూడా మంత్రి వివరించారు. 1959లో లడఖ్ లో అత్యంత కఠినమైన వాతావరణంలో చైనా దళాలతో ప్రాణాలకు తెగించి పోరాడి మరణించిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు సిబ్బంది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి: మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంగళవారం మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని విస్మరించిందని, సమస్యలతో నిండిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు.

రాజేంద్రనగర్ లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ బస్తీ వద్ద రోడ్డు దాటుతున్న దినకర్ (44)ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడని స్థానికులు ఈరోజు తెలిపారు. హోటల్లో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు.స్థానికులు ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేశారు.

రాష్ట్రం మొత్తం ఒకటే మద్యం పాలసీ

రాష్ట్రం మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుందని, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదని, ఒక్కో లీడర్‌కు ఒక్కో ఆలోచన ఉండొచ్చని, కానీ, చట్టం అందుకు ఒప్పుకోదని, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందేనని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నట్టుగా సమాచారం. మద్యం విక్రయాలు, టెండర్‌లపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతుల గురించి పలువురు వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా సోమవారం ఆయన ఈ విధంగా అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది.

లిక్కర్ విక్రయాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో, వ్యాపారుల్లో అయోమయం నెలకొంది. దీంతో వారు మంత్రి వద్దకు వెళ్లి తమ బాధలను ఏకరువు పెట్టినట్టుగా తెలిసింది. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా నిబంధనలు పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలిసింది. డ్రా కు వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది.

ప్రభుత్వానికి నివేదిక

మద్యం విక్రయాలకు సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచాలని, పర్మిట్స్ రూమ్‌లకు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేశారు. ఈ విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది.

యూసుఫ్‌గూడ బస్తీ దవాఖానను పరిశీలించిన మాగంటి సునీత

యూసుఫ్‌గూడ బస్తీ దవాఖానను బిఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పరిశీలించారు. ముషీరాబాద్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లోని బస్తీ దవాఖానాను ఎంఎల్‌ఎ ముఠాగోపాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రోగులు వైద్య సిబ్బందితో వేరువేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ బస్తీ దవాఖానాను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌సి తక్కెలపల్లి రవీందర్ రావు సందర్శించి రోగుల పడుతున్న ఇక్కట్లను తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్‌లో బస్తీ దవాఖానను సందర్శించి పేషంట్స్,వైద్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సికింద్రాబాద్ రసూల్‌ఫురలోని బస్తీ దవఖానలో వసతులు ఎలా ఉన్నాయో బిఆర్‌ఎస్ నేత క్రిశాంక్ పరిశీలించారు.

అంబర్‌పేట గంగానగర్ బస్తీ దవకానాను ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్ సందర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రేమ్ నగర్ బస్తీ దవఖానను ఎంఎల్‌సి వంటేరు యాదవ్ రెడ్డి, ఎంఎల్‌ఎ సునీత లక్ష్మారెడ్డి సందర్శించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. షేక్‌పేట బస్తీ దవాఖానను మాంజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సి డాసోజు శ్రవణ్, పరిశీలించారు. కెసిఆర్ ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు కుప్ప కూలే పరిస్థితి దాపురించిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బస్తీ దవాఖానాల్లో పరిస్థితులు మారాలని లేదంటే బిఆర్‌ఎస్ పత్యేక కార్యాచరణ కు పుంజుకుంటుందని హెచ్చరించారు .

షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం

 షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌ను పత్రికల్లో ప్రచురించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా కేసు నమోదు చేసింది. సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ ఎం.ప్రమోద్ కుమార్ హత్యకు సంబంధించి మృతుడిని ఇటీవల అరెస్టు చేసిన తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్‌కు సంబంధించిన సర్వీస్ ఆయుధాన్ని లాక్కునేందుకు, పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని ఆ ఫలితంగా అతను తక్షణమే మరణించాడని పత్రికల్లో వచ్చిన నివేదికల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు మానవ హక్కుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. సంఘటనకు దారితీసిన పరిస్థితులు, ఏదైనా మెజిస్టీరియల్ లేదా జ్యుడీషియల్ విచారణ స్థితి, ఎన్‌కౌంటర్ మరణాలపై సుప్రీంకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న వివరాలు, ఎఫ్‌ఐఆర్, పోస్ట్‌మార్టం నివేదిక కాపీలతో సహా వచ్చే నెల 24 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ తెలంగాణ డిజిపిని ఆదేశించింది.

మా చిన్నారితో మొదటి దీపావళీ: వరుణ్ తేజ్

సోమవారం దేశవ్యాప్తంగా దీపావళీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న, పెద్ద అంతా కలిసి టపాసులు కాలుస్తూ పండగను ఆనందంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహంగా పండగను జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్‌ కూడా దీపావళీ సెలబ్రేషన్స్ ఫోటలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఈ దీపావళీ తనకు ఎంతో ప్రత్యేకమైందని వరుణ్ పేర్కొన్నాడు.

ఈ ఏడాది వరుణ్ తేజ్, లావణ్య దంపతులు.. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరిద్దరికి మగ బిడ్డ పుట్టాడు. ఆ బాబుకి వాయువ్ తేజ్ అని నామకరణం చేస్తున్నట్లు దంపతులు ప్రకటించారు. అయితే తాజాగా వరుణ్ ఇంట్లో దీపావళీ ఘనంగా జరిగింది. చిన్నారి పుట్టినాక వచ్చిన తొలి దీపావళీ కావడంతో సంబరాలు అంబరాన్ని తాకేలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన వరుణ్ ‘‘మా చిన్నారి మొదటి దీపావళీ’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

బ్రిడ్జి పైనుంచి భార్యను తోసేసిన భర్త

 కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన మంచిర్యాల జిల్లా, నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధిందిచ వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన జగన్నాథం కుమారస్వామికి పెద్దపెల్లి జిల్లా, కనుకుల గ్రామానికి చెందిన పులిదండి రజిత (30)తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెళ్లయిన ఏడాది నుంచే అనుమానంతో కుమారస్వామి నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినప్పటికీ అతని తీరు మారలేదు.

శనివారం మళ్ళీ భార్యతో గొడవపడి చంపేస్తానని బెదిరించడంతో భయపడిన ఆమె ఆదివారం తెల్లవారుజామున పుట్టింటికి వెళ్ళింది. కుమారస్వామి అదేరోజు అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవపడి బైక్‌పై ఎక్కించుకొని మళ్లీ మందమర్రికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నస్పూర్ పరిధి జాతీయ రహదారి 363 బ్రిడ్జిపై మళ్లీ భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో కుమారస్వామి బ్రిడ్జి పైనుంచి భార్యను కిందకి తోసేశాడు. ఈ ఘటనలో రజిత ఘటన స్థలిలోనే మృతి చెందింది. అల్లుడే తన బిడ్డను హత్య చేశాడని రజిత తండ్రి పులిదండి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

దీపావళి పండుగలో అపశృతి

దీపావళి బాణాసంచా వల్ల గాయాలు కావడంతో పలువురు నగరంలోని సరోజినీ దేవి ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకు ౫౪ మందికి గాయాలు కాగా, కొందరు చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లి పోయారు. ముగ్గురి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సరోజిని దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదీని తెలిపారు. దీపావళి కావడంతో నగర ప్రజలు సంతోషంగా బాణసంచా కాల్చారు. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు మెహిదీపట్నంలోని సరోజీని కంటి ఆస్పత్రికి వచ్చారు. ఇందులో కామారెడ్డికి చెందిన బాలుడు దుర్గా ప్రసాద్(12), ప్రొద్గుటూరుకు చెందిన అంజయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు.

బాణసంచా వల్ల గాయపడిన వారిలో 15 మంది పిల్లలు, 47 మంది పెద్దవారు ఉన్నారు. దీపావళి పండగ సందర్భంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్ మోదీని తెలిపారు. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బుధవారం ఉదయం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వారిలో 95 శాతం మంది మిర్చి పటాకుల వల్ల గాయాలయ్యాయని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో ప్రతి ఒక్కరు తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download