elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet giriş

మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతంలోని ఓ గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై మేనమామ పలుసార్లు అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో మేనమామను స్థానికులు పట్టుకున్నారు. కామాంధుడికి పోలీసులు దేహశుద్ధి చేసి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రా మీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను సడలించే ప్రతిపాదన మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. ఈ నెల 23న జరుగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. ఈ మేరకు ఇ ద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హత క లిగించే నిబంధనలను సడలించే ఫైల్ పై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క మంగళవారం సం తకం చేశారు. కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఈ ఫైలు చేరుతుంది.

అనంతరం గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ మంత్రి మండలి వెసుబాటు కల్పిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తీసుకువచ్చిన నిబంధనలు ప్రస్తుతం అవసరం లేదని, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అనర్హతను ఎత్తివేసి చట్ట సవరణ చేయాలని ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇలా చట్టసవరణ చేయడం వల్ల త్వరలో జరిగే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల నుంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. 

మావోలంతా లొంగిపోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని, తద్వారా దేశ అభివృద్ధి లో భాగస్వామ్యులు కావాలని సిఎం రేవంత్ రెడ్డి పి లుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గోషామహల్ పో లీస్ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పో లీసులపై ప్రశంసలు కురిపించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని, విధి నిర్వహణలో ఒక్కో సారి ప్రాణాలను సైతం పణం గా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణా లు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని,

విధి నిర్వహణలో దే శం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవ డం మనందరి కర్త వ్యం అని అన్నారు. మనకున్న బాధ్యతతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’ న పో లీస్ అమరవీరుల సంస్మరణ దినో త్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని తెలిపారు. గ్రేహౌం డ్స్ కమాండోలు టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవ న్ కళ్యాణ్‌లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడు తూ వీరమరణం చెందగా, అసిస్టెంట్ కమాండెం ట్ బానోతు జవహర్‌లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వ హణలో మరణించారన్నారు. మూడ్రోజుల క్రితం నిజామాబాద్‌లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్‌కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారన్నారు. భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని

భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారు లకు, వారి కుటుంబా నికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నా మన్నారు. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. -2008, జూన్ 29న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో ఒక్కొక్కరికి 200 గజాల స్థలం కేటాయించామని వెల్లడించారు.

పోలీ స్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తమ ప్రభుత్వానికి గర్వకారణ మన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించిందన్నారు. అదేవిధంగా, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని తెలిపారు. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమన్నారు. అలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన పోలీస్ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చామని, డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశామన్నారు.

ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయన్నారు. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్ అని కొనియాడారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణమన్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డిజిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ’సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేశామన్నారు. ఈ విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్ గా నిలిచిందని తెలిపారు. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వా త దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్‌ఐలను రిక్రూట్ చేసిందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పిం చామని తెలిపారు. తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించామన్నారు.

విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నామని తెలిపారు. మెడికల్ సీట్లలోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు.. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఎఎస్‌ఐల వరకు కోటి రూపాయలను, ఎస్‌ఐ, సిఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డిఎస్పీ, , అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపిఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించామన్నారు. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరుల పిల్లలకు కేటాయించామన్నారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తించి, పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపిఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒలంపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డిఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను ఇనుమడింపజేశామన్నారు.

పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసింగ్‌కు మూల స్థంభాలన్నారు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కాబట్టి పోలీ సులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి ప్రయత్నించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మ కం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలన్నారు. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ ను అనుసరించాలని తెలిపారు. ‘ముఖ్యంగా శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. ’ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని’ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

నామినేషన్ల జోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెం బ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మం గళవారం(అక్టోబర్ 21) ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజు పెద్ద ఎత్తున అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేశారు. 189కిపైగా నామినేషన్లు దాఖలుగా… అభ్యర్థుల సంఖ్య 200 మార్క్‌ని దా టింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికి మాత్రమే అధికారులు నామినేషన్లు వే సేందు కు అవకాశం కల్పించారు. అర్థరాత్రి వరకు అభ్యర్థు లు క్యూ లైన్‌లో నిల్చుని నామినేషన్లు దాఖ లు చే శారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వ తంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. ఆర్‌ఆర్‌ఆర్ బాధిత రైతులు,

ఒయు నిరుద్యోగ జెఎసి నా యకులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల ప్రతినిధులు, స్వతంత్రులు ఎక్కువగా ఉన్నారు. నామినేషన్ల చివరిరోజున బిజెపి తరఫున లంకల దీపక్‌రెడ్డి సైతం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేశారు. నామినేషన్ల చివరిరోజున బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఇతర పార్టీల అభ్యర్థులు మరోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మునుపెన్నడూ లేని విధంగా 200 మందికి పైగా అభ్యర్థులు నామిషన్లు దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

24న సాయంత్ర తుది పోటీదారుల జాబితా

నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభం కాగా, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు 189 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉండగా, వాటి పరిశీలన బుధవారం నుంచి రిటర్నింగ్ అధికారి పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. తిరస్కరించిన నామినేషన్లతో పాటు ఎవరైనా ఉపసంహింహరణ గడువు పూర్తయిన మిగిలిన అభ్యర్థులు తుది పోటీదారులుగా ప్రకటిస్తారు. వారిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి బి. ఫాంతో పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీ గుర్తును కేటాయిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుండగా.. 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.

అడవి బిడ్డలకు ఇది నిజమైన దీపావళి

న్యూఢిల్లీ : దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ జాతి ప్రజలకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను అందులో పేర్కొన్నారు. ఈ దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉందని, మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారని అన్నారు. అడవి బిడ్డలకు ఇది నిజమైన దీపావళిగా అభివర్ణించారు. గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నిండాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో ఆయుధాలు, హింసను విడనాడి జనంలోకి వందలాది మంది మావోయిస్టులు వచ్చారని, దేశానికి నిజంగా ఇది గొప్ప విజయం అన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు రాముడే స్ఫూర్తి అన్నారు. ఆపరేషన్ ద్వారా ధర్మాన్ని కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. తద్వారా ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ తెలిపారు. అంతకు ముందు రోజు సోమవారంనాడు భారత సైనిక బలగాల ధైర్య సాహసా ల వల్లనే దేశంలో నక్సల్ – మావోయిస్ట్ తీవ్రవా దం దాదాపు నిర్మూలించే దశకు చేరిందని ప్రధా ని నరేంద్రమోదీ వెల్లడించారు. కొన్ని తరాల పా టు భయాందోళనలు, హింస చూసిన వేలాది మం ది ప్రస్తుతం అభివృద్ధి పథంలో పయనించేందుకు ప్రధాన జీవన స్రవంతిలో చేరుతున్నారని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ సోమవారం భారత నౌ కాదళం విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాం త్‌లో భద్రతా దళాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని దీపావళిని సైనిక దళాలతో జరుపుకునే సాంప్రదాయాన్ని కొనసాగించారు. 2014కు ముందు దేశవ్యాప్తం గా చాలా రాష్ట్రాలలోని 125 జిల్లాలలో నక్సలి జం ప్రబలంగా ఉండేదని, మావోయిస్ట్‌లు చెలరేగి పోయేవారని, ప్రస్తుతం 11 జిల్లాలకే ఈ సం ఖ్య పరిమితమైందని, కేవలం మూడు జిల్లాలలో మాత్రమే తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రధా ని మోదీ వివరించారు. 100కు పైగా జిల్లాలు మావోయిస్ట్ ఉగ్రవాదం నీడ నుంచి బయటపడి పూర్తి స్వేఛ్ఛగా ఊపిరిపీల్చుకుంటూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాయన్నారు. ఒకప్పుడు మావోయిస్ట్‌లు చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి, స్కూళ్లు, ఆస్పత్రులు ఏర్పాటుకు అడ్డుకున్నారని, పలు చోట్ల స్కూళ్లను, దవాఖానాలను పేల్చివేసి, వైద్యులను హతమార్చారని ప్రధాని గుర్తుచేశారు. ఆ ప్రదేశాలలో నేడు రహదారులను నిర్మించి, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని, పాఠశాలలను, ఆసుపత్రులను, నిర్మించి విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే కార్యక్రమం సాగుతోందని ఆయన తెలిపారు.

దండకారణ్య ప్రాంతం, ముఖ్యంగా దక్షిణ చత్తీస్‌గఢ్ లో కొందరు మావోయిస్ట్ అగ్రనాయకులతో సహా 200 మందికి పైగా నక్సల్స్ లొంగిపోయి, ఆయుధాలను సమర్పించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఇప్పటికే కష్టా ల్లో ఉంది. ఈ మధ్య పెద్దఎత్తున నాయకులు, కేడర్ పోలీసులు, అధికారుల ముందు లొంగిపోవడంతో తీవ్రంగా దెబ్బతింది. ప్రధాని గోవా లో ఆదివారం నావికులు ప్రదర్శించిన దీపావళి సాంసృ్కతిక కార్యక్రమానికి హాజరయ్యారు. నౌకా దళం జవాన్లతో విందులో పాల్గొన్నారు. పణజి తీరానికి సమీపంలో స్వదేశీ క్యారియర్‌లో రాత్రి గడిపారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో నిర్మించిన విమాన వాహక నౌకపై మిగ్ -20 విమానాలతో దూ సుకువెళ్తూ నౌకాదళం ప్రదర్శించిన వైమానిక శక్తిని ఆయన తిలకించారు. భారత సముద్ర తీర రక్షణతో పాటు సముద్ర మార్గాల కమ్యునికేషన్‌ను పరిరక్షించడంలో నౌకాదళం పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచ చము రు సరఫరాలో 66శాతం, కంటైనర్ షిప్ మెంట్ లో 50 శాతం హిందూ మహా సముద్రం గుండా వెళ్తుంటాయని, భారత నౌకాదళం పాత్రను విజయవంతంగా పోషిస్తోందని అన్నారు. 

జూబ్లీహిల్స్‌లో కెసిఆర్ ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం కోసం బిఆర్‌ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఒ) ఆమోదం తెలిపారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితతాలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ఆగ్రనేత హరీష్ రావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,శ్రీనివాస్ గౌడ్,నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎలు వివేకానంద్ గౌడ్,

సుధీర్ రెడ్డి,ముఠా గోపాల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, ఎం. కృష్ణారావు తదితరులు బిఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేసిన ప్రతిపాదన మేరకు 40 మంది స్టార్ క్యాంపెనర్లకు వాహన అనుమతి పాస్‌లను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికలో గెలుపే లక్షంగా పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్యకర్తల్లో మరింత మరింత ఊపు తీసుకువచ్చి, ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ అధినేత కెసిఆర్ జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో కెసిఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిసింది. సభ లేదా రోడ్ షోలో కెసిఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సర్వీస్‌లో ఉన్న టీచర్లకూ టెట్ తప్పనిసరి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నుంచి మి నహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని నేషనల్ కౌ న్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) తిరస్కరించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉ ద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొం ది. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని పేర్కొంది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని తెలిపింది.

విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్‌సిటిఇ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇచ్చింది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసులో కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి 

పత్తి కొనుగోలు షురూ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మం గళవారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమైనట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మొత్తం 317 జి న్నింగ్ మిల్లులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా (సీసీఐ) నోటిఫై చేసిందని అన్నారు. బు ధవారం ఖమ్మం జిల్లా, 24న నల్గొండ జిల్లాలో ప్రారంభం కానున్న పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని- మంత్రి స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో కూడా వెంటనే సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. 24 గం టల్లో రైతుల సమస్యకు పరిష్కరించే విధంగా ఒ క సీనియర్ అధికారితో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యా ప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని, దీంతో వారు అనుకూలమైన సమయం చూసుకొని వారి

పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మంత్రిగా విజ్ఙప్తి మేర కు రైతులు తమ ఫోన్ నెంబర్‌ను అప్ డేట్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ రాష్ట్రంలో సీసీ ఐ కల్పించిందని తెలిపారు. దీంతో రైతుల మొ బైల్ నెంబర్ అప్ డేట్ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏ.ఈ.ఓ యాప్ లాగిన్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చిందని, తమ పరిధిలోని ఏఈఓ సంప్రదించి మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చని, దీని ద్వారా మరుసటి రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని మంత్రి వివరించారు. రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీని ద్వారా తమ సందేహాలు లేదా ఫిర్యాదులను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. 24 గంటలలో వారి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 9 వరకు పనిచేస్తాయని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం 2025-.26లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తున్నామని, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికల వద్ద రైతులను సమీకరించి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, రైతులకు లబ్ది కలిగించే పూర్తి సమాచారాన్ని పక్కాగా అందించాల్సిన బాధ్యత డిఏఓ, ఏఓ, ఏఈఓలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన శాస్త్రవేతలను, వ్యవసాయ నిపుణలను ఆహ్వానించి రైతులకు వ్యవసాయ ఉత్తత్తులకు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని కూడా ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసుల వంగడాలను, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీ మీద రైతులకు అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు సమాచారం రైతులకు అందివ్వాలని అన్నారు. తదుపరి రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదికలలో రైతులను పూర్తి స్థాయిలో హాజరయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనాలు పంపిణీ

రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా పథకంలో మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనాలను మంత్రి తుమ్మల పంపిణీ చేశారు. ఒక్కొక్క పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పిన మేరకు గతవారం జాతీయ నూనె గింజల మిషన్‌ను – మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఈ యాసంగిలో 2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాలు 14 జిల్లాలలో పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. గత సీజన్‌లో జిల్లాకు ఎంపిక చేసిన ఒక మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి, వాటి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయాలని, త్వరలో ఇంకో 1,70,000 మట్టి నమూనా ఫలితాలు అందుతాయని – మంత్రి తుమ్మల వివరించారు. నేచురల్ ఫార్మింగ్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం – మంత్రి తుమ్మల ఇప్పటికే క్లస్టర్ల గుర్తింపు, శిక్షణ పూర్తి – చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

గత పదేళ్లలో రైతులు దాదాపు రూ. 3వేల కోట్లు నష్టపోయారు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ, గరిష్ట స్థాయిలో రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంంతో రాష్ట్ర రైతాంగం గత పదేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టపోయిందని, కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి కేటాయించిన అట్టి నిధులను తిరిగి అవే రాష్ట్రాలకు తరువాత కేటాయిస్తే కనీసం రాష్ట్రాల ప్రాథమిక హక్కులను, ఆయా రాష్ట్రాల రైతలు ప్రయోజనాలను కాపాడే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు ఉండేదని అన్నారు. కానీ అలా చేయకపోవడంతో

అప్పటి ప్రభుత్వ రాజకీయ దురుద్దేశాలకు రైతులు నష్టపోయాయరని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, దానికి తగ్గ రాష్ట్రవాటా నిధులు విడుదల చేసి మన రాష్ట్ర రైతులకు ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని కృతనిశ్ఛయంతో ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రజా ప్రభుత్వానికి పరమావధి అని తెలిపారు. దానికి తగ్గట్లు ఆర్థిక వెసులుబాటు రాగానే ఒక్కొక్క పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతవారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు, పొద్దుతిరుగుడు 83.78 క్వింటాళ్ల హైబ్రిడ్ విత్తనాలను, 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలకు 45.41 లక్షల మొత్తాన్ని వినియోగించి సరఫరా చేయాలని నిశ్చయించినట్లు పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం

మద్ధతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని మంత్రిగారు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విమర్శించారు. కాని రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను ఇప్పటికే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగైనట్టు, ఎకరానికి 18.50 క్వింటాళ్ల చొప్పున మొత్తం 11,55,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దీనిలో 30 సెంటర్ల ద్వారా 220 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

ఘట్‌బంధన్‌లో లుకలుకలు

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా కషాయిదళానికి చెక్ పెట్టాలన్న ల క్ష్యంతో బరిలోకి దిగిన మహా ఘట్‌బంధన్‌లో చిచ్చురేగింది. పకడ్బందీగా 243 స్థానాలకు పోటీ విషయంలోఆర్జేడీ, కాంగ్రె స్ మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రా యం సాధ్యం కాలేదు. ఫలితం గా కూటమిలోని పార్టీలు 11 స్థానాల్లో తమలో తామే ప్రత్యక్షంగా పోటీ పడుతున్నారు. ఇది ప్రతిపక్షాల కూటమిలో అంతర్గత కుమ్ములాటను తేటతెల్లంచేసింది. బీహార్ ఎన్నికల మొదటిదశ పోలింగ్ జరగడానికి ఇక 15 రో జులే గడువు ఉన్నా, ప్రతిపక్ష శ్రేణుల్లో గందరగో ళం సద్దుమణగపోవడంతో ఎన్డీఏ భాగస్వామి పార్టీలైన బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా వినియోగించుకుంటున్నాయి. పోటీ దశలోనే ఏకాభిప్రాయం రాలేని పార్టీలు అధికారంలోకి వస్తే..కీచులాటలు తప్పవ ని ఆ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో పరస్పరం పోటీ పడుతుండగా, సిపిఐ, కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాల్లో తలపడుతున్నాయి. ముఖేషి సహానీకి చెందిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, (విఐపీ), ఆర్జేడీ మరో రెండు స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ కు సిద్ధమవుతున్నాయి. సోమవారం నాడు ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పోటీ కూడా అభ్యర్థులను నిలబెట్టిన ఆరు స్థానాలు ఉ న్నాయి. అవి వైశాలి, సికంద్ర, కహల్గావ్, సుల్తాన్ గంజ్, నర్కటియా గంజ్, వార్సలి గంజ్. కాగా, కాంగ్రెస్- సిపిఐ కూడా 

బచ్వారా, రాజపాకర్, బీహార్ షరీఫ్, కార్ఘర్లలో ఫ్రెండ్లీ పైట్ కు ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టాయి. నవంబర్ 6న మొదటిదశ ఎన్నికలు జరిగే స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. కానీ, బచ్వారా, రాజ పకార్, బీహార్ షరీఫ్ స్థానాలకు మహా గట్బంధన్ మిత్రులలో ఎవరూ తగ్గలేదు. దీంతో వారి మధ్య పోటీ అనివార్యమైంది. అక్టోబర్ 23న రెండోదశ పోలింగ్ కు వెళ్లే స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అప్పడు మొత్తం ఎవరెవరు ప్రత్యక్ష ఘర్షణకు దిగుతున్నారో స్పష్టమవుతుంది. గట్బంధన్ పార్టీల అంతర్గత ఘర్షణలు ప్రతిపక్ష ఓట్లను చీల్చడంతో పాటు అనేక నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

బుధవారం రాశి పలాలు (22-10-2025)

మేషం – మేధస్సుకు పదును పెట్టి విద్యాపరంగా అభివృద్ధిని సాధిస్తారు. తాత్కాలిక అవసరాలకన్న భవిష్యత్తుకు, తత్ సంబంధిత విషయ వ్యవహారాలకు ప్రాముఖ్యతను ఇస్తారు. స్వల్ప ఢన లాభ సూచన.

వృషభం – వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్తలు చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ జరగదు.

మిథునం – బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన.

కర్కాటకం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.

సింహం – సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి- వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య – నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. తేలికగా సాగుతాయి అనుకున్న కార్యక్రమాలు తప్ప క్లిష్టమైన నూతనమైన విషయ వ్యవహారాలు పరిగణలోనికి తీసుకోకండి.ఇదీ మీకు మేలు కలిగించె విషయం.

తుల – వృత్తి ఉద్యోగాలపరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. సహోదర వర్గంతో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చికం – ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండటం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. రాజకీయాలకు వివాదాలకు అయినంత దూరంగా ఉంటారు. ఆనందంగా ఉండగలుగుతారు.

ధనుస్సు – నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు.ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

మకరం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ఆనందం కలుగుతుంది.

కుంభం – వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. అప్పు చేయకపోవటమే పొదుపుకు తొలిమెట్టు అని దృఢనిశ్చయానికి వస్తారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మీనం – అన్ని విషయాల్లోనూ చాలా నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తారు. శత్రువుల వ్యూహములను భంగం చేస్తారు అసాధ్యం అనుకున్న కార్యక్రమాలలో సైతం కొంత పురోభివృద్ధి సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.

 

Wordpress Free Themes and Premium WP Plugins Download