elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel giriş

చెక్‌పోస్టుల్లో అవినీతి.. రవాణశాఖ కీలక నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకొని యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణాశాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులను రద్దు చేస్తూ జూలై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజులు ఆలస్యంగా జివొ జారీ అయింది. ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. చెక్‌పోస్టులను ఇంకా తెలగించకపోవడం గమనార్హం.

జిఎస్టి అమలులోకి వచ్చాక చెక్‌పోస్ట్‌ల అవసరం దాదాపు తగ్గిపోయింది. కేంద్ర సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్‌పోస్టులను రద్దు చేశాయి. కానీ, తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి. ఏడాదిన్నర క్రితమే రాష్ట్రంలో చెక్‌పోస్టుల రద్దుకు రవాణాశాఖ నిర్ణయం తీసుకున్నా.. కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల క్రితం జివొ జారీ అయింది. అయినా అవినీతి అధికారుల తీరు మారలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టులు రద్దు చేయాలని రవాణాశాఖ కమీషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

డ్యూడ్ సినిమాకు షాక్.. ఇళయరాజాకు కోర్టు అనుమతి

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ మధ్యకాలంలో వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. పలు చిత్రాల్లో ఆయన అనుమతి లేకుండా తన పాటలు వాడుకున్నారని.. ఆయన ఆరోపించడం సర్వసాధారణమైంది. తాజాగా విడుదలై ‘డ్యూడ్’ చిత్రంలో కూడా ఆయన స్వరపరచిన రెండు పాటలు అనుమతి లేకుండా చిత్ర బృందం వినియోగించిందని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆ చిత్ర యూనిట్, ఆడియో కంపెనీ సోనీ మ్యూజిక్‌పై చట్టపరమైన చర్యలకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన మద్రాసు హై కోర్టును ఆశ్రయించగా.. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరి దీనిపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

ఇక డ్యూడ్ చిత్రం విషయానికొస్తే.. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంలో హీరో. ప్రేమలు ఫేమ్ మమిత బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్‌ 17న విడుదలై ఫర్వాలేదనిపించింది. 

రెండేళ్లలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం పూర్తి చేయాలి: సిఎం

హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూత‌న భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో స‌మీక్షించారు. అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అధునాతన వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణాలు ఉండాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌కు సూచించారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌తో పాటు స్థానికుల‌కు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల వేగ‌వంతానికి వైద్య ఆరోగ్య శాఖ‌, పోలీసు, జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారుల‌తో వెంటనే ఒక స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు.

ఈ క‌మిటీ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌తి ప‌ది రోజుల‌కోక‌సారి స‌మావేశ‌మై ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప‌రిష్క‌రించుకుంటూ ప‌నులు వేగంగా జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తయ్యాక అక్క‌డి బందోబ‌స్తు, ట్రాఫిక్ విధుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ముందుస్తుగానే త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని స్పష్టం చేశారు.

ఆసుప‌త్రికి వివిధ ర‌హ‌దారుల‌ను అనుసంధానించే ప్ర‌ణాళిక‌లు ఇప్ప‌టి నుంచే రూపొందించాల‌ని ఆర్ అండ్ బి అధికారుల‌కు సూచించారు. హైద‌రాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుప‌త్రులు, మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి సంబంధించి ప్ర‌తి నిర్మాణానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. నిర్మాణాల‌పై 24×7 ఆ అధికారి ప‌ర్య‌వేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆఫ్గానిస్థాన్‌తో సిరీస్.. జట్టులో వైభవ్‌కి చోటు

ఐపిఎల్‌లో అత్యంత చిన్న వయస్సులోనే ఎంపికై.. తక్కువ బంతుల్లో(35) సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వైభవ్ ఐపిఎల్ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో వైభవ్ మరోసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు సమాచారం. తమ అండర్-19 జట్టు భారత్‌లో పర్యటించే అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. భారత అండర్-19 స్థాయిలోని ఎ, బి జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ సూర్యవంశీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక అఫ్గన్‌- భారత అండర్‌-19 జట్ల మధ్య ఈ ట్రై సిరీస్‌ డబుల్‌ రౌండ్‌- రాబిన్‌ ఫార్మాట్లో జరుగనుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. మెరుగ్గా ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి.

రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వ హాస్పిటళ్లపై బురదజల్లుతున్నారు: దామోదర

హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ ఆస్పత్రులపై బిఆర్ఎస్ నాయకులు బురదజల్లుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మండిపడ్డారు. ప్రజలే ప్రతిపక్షాలకు మరోసారి గుణపాఠం చెబుతారని, బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని, అన్ని రకాల మెడిసిన్ బస్తీ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ నాయకులు బస్తీ దవాఖానల సందర్శనపై రాజ నర్సింహ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. డయాగ్నస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే రోగులకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నామని, 24 గంటల లోపల టెస్ట్ రిపోర్టులు రోగులకు అందజేస్తున్నామన్నారు.

బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో, గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై రోగుల సంఖ్య తగ్గిందని, పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నారని, రాజకీయ లబ్ది కోసం ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ హాస్పిటళ్లపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రైవేటు హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరియైన సమయంలో మరోసారి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, బస్తీ దవాఖాన్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని దామోదర పేర్కొన్నారు.. 

ఘోర రోడ్డు ప్రమాదం.. 63 మంది మృతి

ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గులు రోడ్డుపై పలు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గులు హైవేపై ఓ బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొంది. వెంటనే డ్రైవర్ బస్సును మరో వైపునకు తిప్పడంతో పక్కన.. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నియంత్రణ కోల్పోయి పలు వాహనాలు వరుసగా ఢీకొని బోల్తా పడ్డాయి. ప్రమాదంలో మరణించిన మృతదేహాలను పోస్ట్‌మార్టంకు, గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

‘మీసాల పిల్ల’.. ఇంటర్నెట్‌లో సరికొత్త రికార్డు


హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో నయనతార శశిరేఖ అనే పాత్రలో హీరోయిన్‌గా నటస్తున్నారు. 

దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం పూర్తి పాటని వదిలారు. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్‌లో రికార్టులను సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ పాటకు 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌పామ్స్‌లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు. ఈ పాటను ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ అలపించారు. బీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

ఏటా దీపావళి వస్తే ఇంతేనా!

ప్రతి ఏటా దీపావళిని చెడు అనే చీకటిపై సాధించిన వెలుగుల విజయంగా భావించి దేశంలో పండగ జరుపుకోవడం సంప్రదాయ ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బాణాసంచా కాల్పులు, టపాసుల మోతలు పండగ సంకేతాలుగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. క్లైమేట్ ట్రెండ్స్ తాజా అధ్యయనం ప్రకారం గత ఐదేళ్లలో లేని విధంగా ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయిందని తేలింది. నిషేధాజ్ఞలు ఎన్ని ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బాణాసంచా లేదా టపాసుల నిషేధాన్ని సంప్రదాయాన్ని ఉల్లంఘించడంగానే భావిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. అసలే వాహన కాలుష్యంతో, పంటదగ్ధాలతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, దీపావళి వచ్చే సరికి అవన్నీ మరిచిపోతుంటారు. 2018 లో కూడా ఢిల్లీలో టపాసుల అమ్మకాలు, వినియోగంపై సుప్రీం కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసినా, ఆచరణ శూన్యమైంది.

2024 నుంచి బాణాసంచా అక్రమ అమ్మకాలను నిషేధించారు. కానీ అవి పని చేయడం లేదు. సరిహద్దు లోని పట్టణాల్లో బాణాసంచా, టపాసుల అక్రమాలు విచ్చలవిడిగానే సాగుతున్నాయి. దీపావళి తరువాత ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఎక్యుఐ) బాణాసంచా కాల్పులతో ప్రమాదకరమైన జోన్‌గా తయారైంది. ఎక్యుఐ 050 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్టు, 447 కు పాయింట్లు పెరిగితే తీవ్ర వాయు కాలుష్యంగా మారినట్టు కాలుష్య సూచికల సారాంశం అందరికీ తెలిసిందే. దీని ప్రకారం దీపావళి పండగ రాత్రి నుంచి మంగళవారం నాటికి వాయు నాణ్యత స్థాయిలు 400 పాయింట్లు మించి క్షీణించాయి. 38 ఎయిర్ మోనిటరింగ్ స్టేషన్లలో 36 రెడ్‌జోన్లలోనే ఉండటం విశేషం. వజిర్‌పూర 423, ద్వారకా 417, అశోక్‌విహార్ 404, ఆనంద్‌విహార్ లో 404 గా ఎక్యుఐ నమోదైంది. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 235 ఎక్యుఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సోమవారం సాయంత్రం అంటే దీపావళి రోజున సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఎక్యూఐ 345గా ‘వెరీపూర్’ కేటగిరిలో నమోదైంది. బాణాసంచా కాల్పులవల్లనే రాత్రికి రాత్రి వాయు నాణ్యత అధ్వానంగా తయారైంది.

దీపావళికి వారం రోజుల ముందునుంచే ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్ల క్షీణతను సూచించింది. నోయిడా, ఘజియాబాద్‌ల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీలో విషవాయువులు గాఢత 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, కంటి దురదలతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలుగా దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది అనేక ఆంక్షలు విధించినా, ప్రజాప్రతినిధుల నుంచి వివిధ వర్గాల నుంచి గ్రీన్ కాకర్స్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ కోర్టు ఆదేశాలు పండగ సంప్రదాయం ముందు నిలువలేదు. అర్ధరాత్రి దాటినా బాణాసంచాలు కాలుస్తున్నారు. టపాసులు పేలుస్తున్నారు. బాణాసంచాలు, టపాసుల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై చాలా మందికి అవగాహన ఉండడం లేదు. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం తదితర వ్యాధులు సంక్రమిస్తుంటాయని ప్రజల్లో చాలా మందికి తెలియడం లేదు.

కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బాణాసంచా, టపాసుల తయారీపై లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. తమిళనాడులో శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలు ఎన్నో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిషేధం వల్ల తమకు ఉపాధి పోతుందన్న ఆందోళన వారిలో ఉంటోంది. అలాగే గ్రీన్‌కాకర్స్ ప్రయోజనం గురించి కూడా ప్రజలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. హానికరమైన రసాయనాలు వినియోగించకుండా, తయారు చేసే బాణాసంచాలనే గ్రీన్ కాకర్స్‌గా వ్యవహరిస్తారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వమే సబ్సిడీపై గ్రీన్ కాకర్స్‌ను ప్రజలకు పంపిణీ చేస్తే చాలావరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్న సూచనలు వస్తున్నాయి. వాయు నాణ్యతను పెంపొందించడానికి గత దశాబ్దకాలంగా చర్చలు జరుగుతున్నాయి.

ఢిల్లీ వంటి నగరాలు, రాష్ట్రాలు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపి) సిద్ధం చేసి అమలు లోకి తీసుకొచ్చాయి. అయితే సవాళ్లకు స్పందించి చర్యలు తీసుకోవడం జాప్యం అవుతోంది. ఇప్పుడు చేయవలసిందంతా మధ్యతరహా నుంచి స్వల్పకాలిక ప్రణాళికలతో ఏడాది పొడుగునా, గాలి స్వచ్ఛంగా ఉండేలా చర్యలు కొనసాగించడం తప్పనిసరి. ఈ మేరకు నిధులు సమృద్ధిగా కేటాయించడం అవసరం. ఇందులో పౌరులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. పాలకవర్గాల జవాబుదారీతనం పెరగాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) ప్రస్తుతం వాయు నాణ్యత పిఎం (పర్టిక్యులర్ మేటర్)ను 2.5 కంటే తగ్గించాలని లక్షంగా పెట్టుకుంది. ఈ లక్షంలో కనీసం 20 నుంచి 40 శాతం వరకైనా 2026 నాటికి సాధించవలసి ఉంది. ఈ మేరకు లక్షాలను సాధించలేకుంటే ఢిల్లీతోపాటు ఎన్‌సిఆర్ తదితర పరిసర ప్రాంతాల్లోనూ ఎవరూ నివసించలేని దుర్భర పరిస్థితి దాపురిస్తుంది. 

‘జనరల్ జెడ్’ నిరసనలు

ఆండీస్ నుండి హిమాలయాల వరకు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త నిరసనల తరంగం చెలరేగుతోంది. ప్రభుత్వాలపై తరతరాలుగా అసంతృప్తి, యువతలో నెలకొన్న ఆగ్రహావేశాలు ప్రభుత్వాలలో మార్పులకు దారితీస్తున్నాయి. ఇటీవల మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినాను సైనిక తిరుగుబాటు తర్వాత అధికారం నుండి తొలగించి దేశం నుండి బయటకు పంపారు. యువ నిరసనకారులు తమను తాము ‘జనరల్ జెడ్ మడగాస్కర్’ అని పిలుచుకుంటూ వారాల తరబడి జరిగిన ప్రదర్శనల పరాకాష్ట ఇది. ఈ హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో చెలరేగిన రాజకీయ నాయకత్వంపై ఆగ్రహం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కనిపిస్తున్నది. నేపాల్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, కెన్యా, పెరూ, మొరాకో వంటి దేశాలలో ఇటీవలి కాలంలో ఇటువంటి నిరసనలు చూసాం. ఈ నిరసనలు పేరుకుపోయిన అసంతృప్తితో చెలరేగినవే. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక అనిశ్చితి, అవినీతి, నాయకుల బంధుప్రీతి వంటి దీర్ఘకాలిక సమస్యలకు పరాకాష్టగా మారుతున్నాయి.

చెప్పుకోదగిన నాయకత్వం అంటూ లేకుండా, దాదాపు అన్ని రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేస్తూ, తమను తాము ‘జనరల్ జెడ్’ అని ముద్ర వేసుకుంటూ నిరసనలకు దిగుతున్నారు. వారు సుమారుగా 1996 నుండి 2010 మధ్య జన్మించిన వారుగా, అంటే పూర్తిగా ఇంటర్నెట్ యుగంలో పెరిగిన మొదటి తరం అని చెప్పవచ్చు. ఇవ్వన్నీ దాదాపు ఒకే వరుసలో జరుగుతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. సాధారణ అంశం ఏమిటంటే ఈ యువతకు సాంప్రదాయ రాజకీయ పార్టీలు, నాయకులపై విశ్వాసం సన్నగిల్లింది. మెరుగైన పాలన అందీయగల వారి సామర్థ్యంపై తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. సాధారణ పౌర సమస్యలపై నిరసనలు ప్రారంభం కావడం, అవి చివరకు ప్రభుత్వంలో మార్పుకు దారితీయడమా, చివరకు హింసాయుత చర్యలకు సైతం పాల్పడటం జరుగుతూ వస్తున్నది.

‘ఈ యువత నేతృత్వంలోని నిరసనలను కలిపేది ఏమిటంటే, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలు తమ తరం ఆందోళనలకు, అది అవినీతి, వాతావరణ మార్పు లేదా ఆర్థిక అసమానత వంటి వాటికి ప్రతిస్పందించవు అనే ఉమ్మడి భావన. సంస్థాగత వ్యవస్థలు విఫలం భావించినప్పుడు’ అని నిరసనలు, సామాజిక ఉద్యమాలపై పరిశోధన చేసిన యుకె ఆధారిత లాభాపేక్షలేని సోషల్ ఛేంజ్ ల్యాబ్ డైరెక్టర్ సామ్ నాడెల్ పేర్కొన్నారు. వారి నిర్దిష్ట డిమాండ్లు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ నిరసనలలో ఎక్కువ భాగం ప్రభుత్వ అతిక్రమణ లేదా నిర్లక్ష్యం కారణంగా చెలరేగాయి. కొన్ని భద్రతా దళాల కఠినమైన స్పందన, క్రూరమైన అణచివేతను కూడా ఎదుర్కొన్నాయి. మొరాకోలో, మొరాకో డయలింగ్ కోడ్ పేరు పెట్టబడిన జెన్ జెడ్ 212 అనే నాయకుడు లేని సమష్టి మెరుగైన ప్రజాసేవలు, ఆరోగ్యం, విద్యపై ఖర్చు పెంచాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చింది.

పెరూలో, పెన్షన్ చట్టంపై నిరసనలు విస్తృత డిమాండ్లుగా చెలరేగాయి. వీటిలో పెరుగుతున్న అభద్రత, ప్రభుత్వంలో విస్తృతమైన అవినీతి తోడయ్యాయి. ఇండోనేషియాలో, చట్టసభ సభ్యుల ప్రోత్సాహకాలు, జీవన వ్యయంపై ఘోరమైన నిరసనలు చెలరేగాయి. అధ్యక్షుడు కీలకమైన ఆర్థిక, భద్రతా మంత్రులను భర్తీ చేయవలసి వచ్చింది. ‘జనరల్ జెడ్’ నిరసనగా పిలువబడే అత్యంత విస్తృతంగా గుర్తింపు పొందిన ఉద్యమం నేపాల్‌లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు. ఇది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి రాజీనామాతో ముగిసింది. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో విజయవంతమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుండి నిరసనకారులు ప్రేరణ పొందారు. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్ నిరసనలు ప్రభుత్వాల తొలగింపుకు దారితీసాయి.

మడగాస్కర్‌లో, నిరసనకారులు నేపాల్, శ్రీలంకలోని ఉద్యమాల ద్వారా తాము ప్రత్యేకంగా ప్రేరణ పొందామని చెప్పారు. సాధారణమైన నీటి సరఫరా, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కానీ అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామా చేయాలని ప్రదర్శనకారులు పిలుపునివ్వడంతో త్వరగా విస్తృత అసంతృప్తిగా మారాయి. దానితో మడగాస్కర్ సైనిక తిరుగుబాటు నాయకుడు తాను ‘అధ్యక్ష పదవిని తీసుకుంటున్నానని’ చెప్పాడు. పలు దేశాలలో, ఒక ఏకైక పాప్ సంస్కృతి చిహ్నం ఉద్భవించింది: నవ్వుతున్న పుర్రె, క్రాస్‌బోన్‌లను గడ్డి టోపీ ధరించి చూపించే నల్ల జెండా. ఈ జెండా ‘వన్ పీస్’ అనే కల్ట్ జపనీస్ మాంగా, అనిమే సిరీస్ నుండి వచ్చింది. ఇది అవినీతి ప్రభుత్వాలను ఎదుర్కొనే దొంగల బృందాన్ని అనుసరిస్తుంది. నేపాల్‌లో, నేపాల్ ప్రభుత్వ స్థావరాలైన సింఘా దర్బార్ గేట్లపై, మంత్రిత్వ శాఖలపై నిరసనకారులు అదే జెండాను వేలాడదీశారు. వీటిలో చాలా వాటిని నిరసనలలో దహనం చేశారు.

ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మొరాకో, మడగాస్కర్‌లలో కూడా జనసమూహం అదే విధంగా చేసింది. పెరువియన్ రాజధాని లిమాలో, 27 ఏళ్ల ఎలక్ట్రీషియన్ డేవిడ్ టాఫర్ శాన్ మార్టిన్ స్క్వేర్‌లో అదే జెండాతో నిలబడ్డాడు. ‘మేము అదే పోరాటం చేస్తున్నాము మా విషయంలో, హంతకులు కూడా అయిన అవినీతి అధికారులపై’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. 500 కంటే ఎక్కువ నిరసనలలో 50 మంది పౌరులు మరణించినప్పటికీ అధ్యక్షుడు దినా బోలువార్టే ప్రభుత్వం డిసెంబర్ 2022 నుండి అధికారంలో ఉందని గుర్తుచేసుకున్నారు. ‘నా విషయంలో, ఇది అధికార దుర్వినియోగం, అవినీతి, మరణాలపై ఆగ్రహం’ అని టఫూర్ పేర్కొన్నారు. 2017 నుండి దక్షిణ అమెరికాను పీడిస్తున్న హత్యలు, దోపిడీల పెరుగుదలను ప్రస్తావిస్తూ, నేరాలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలహీనపరిచిన కొత్త చట్టాల మధ్య. 2022లో లంచం తీసుకోవడం, నిరసనకారులపై ఘోరమైన అణచివేతలో పాల్గొనడం వంటి వివిధ ఆరోపణలపై బోలువార్టే నెలల తరబడి విచారణలో ఉన్నారు.

చివరకు తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీ ఆమె స్థానంలోకి రాగా అది సరిపోదని టఫూర్ పేర్కొన్నారు. ‘అధ్యక్షుడు కాంగ్రెస్‌కు మిత్రుడు, ఆయన అక్కడి నుండి వెళ్లిపోవాలి’ అని స్పష్టం చేశారు. గతంలో 2011లో వాల్ స్ట్రీట్ ఆక్రమణ, 2010 నుండి 2012 మధ్య అరబ్ స్ప్రింగ్, హాంకాంగ్‌లో 2014 అంబ్రెల్లా విప్లవం వంటి అనేక ముఖ్యమైన నిరసనలకు యువత నాయకత్వం వహించారు. వారు సామూహిక సమీకరణ కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాను కూడా ఉపయోగించినప్పటికీ, జనరల్ జెడ్ నిరసనకారులు దానిని మరొక స్థాయికి తీసుకు వెళుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సమాచారాన్ని పంచుకోవడానికి, కనెక్షన్‌లను నిర్మించడానికి శక్తివంతమైన సాధనాలు. కానీ అత్యంత ప్రభావవంతమైన ఉద్యమాలు తరచుగా డిజిటల్ సమీకరణను సాంప్రదాయ వ్యక్తిగత నిర్వహణతో మిళితం చేస్తాయి. ఈ ఇటీవలి నిరసనలలో మనం చూసినట్లుగా, అని సోషల్ ఛేంజ్ ల్యాబ్ నుండి నాదెల్ పేర్కొన్నారు. నేపాల్‌లో ఉధృతమైన నిరసనలు ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, రిజిస్ట్రేషన్ గడువును పాటించనందుకు ప్రభుత్వం చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లపై నిషేధాన్ని ప్రకటించింది. చాలా మంది యువ నేపాలీలు దీనిని తమను నిశ్శబ్దం చేసే ప్రయత్నంగా భావించారు. గుర్తింపును తప్పించుకోవడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా సోషల్ మీడియా సైట్‌లను యాక్సెస్ చేయడం ప్రారంభించారు.

తరువాతి కొద్ది రోజుల్లో, వారు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లను ఉపయోగించి రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలిని హైలైట్ చేశారు. నేపాల్‌లోని ధనిక, పేదల మధ్య అసమానతలను ఎత్తిచూపారు. ప్రణాళికాబద్ధమైన ర్యాలీలు, వేదికలను ప్రకటించారు. తరువాత, వారిలో కొందరు గేమింగ్ చాట్ ప్లాట్‌ఫామ్ డిస్కార్డ్‌ను ఉపయోగించి దేశానికి తాత్కాలిక నాయకుడిగా ఎవరిని నామినేట్ చేయాలో సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా లేదా అన్యాయానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం జరిగినా, అది డిజిటల్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. నేపాల్‌లో కూడా అదే జరిగింది. నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తర్వాత జరిగిన మార్పులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఇతర దేశాలను కూడా ప్రభావితం చేశాయి’ అని ఓ నిరసనకారుడు తెలిపారు. నేపాల్‌లో జరిగిన నిరసనలు యువతను మాత్రమే కాకుండా ఇతర తరాలను కూడా మేల్కొలిపిందని ఆయన పేర్కొన్నారు. మనం ప్రపంచ పౌరులమని, డిజిటల్ స్థలం మనందరినీ కలుపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని మేము గ్రహించాము అని చెప్పారు.

చలసాని నరేంద్ర

98495 69050

Wordpress Free Themes and Premium WP Plugins Download