elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXM

మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్లకు రూ.847 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సిఇఒసత్య నాదెళ్ల 2024-25 ఆర్థిక సంవత్సరానికి 96.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.847 కోట్లు) జీతం అందుకున్నారు. ఇది ఇప్పటివరకు ఆయనకు లభించిన అత్యధిక వేతనం కాగా, గత సంవత్సరం 79.1 మిలియన్ డాలర్లు (రూ.694 కోట్లు) వేతనం కంటే 22% ఎక్కువగా ఉంది. కంపెనీ బోర్డు ప్రకారం, నాదెళ్ల వేతనం పెరుగుదలకు కారణం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ (ఎఐ) రంగంలో సాధించిన విశేష పురోగతి, అయితే నాదెళ్ల జీతం ప్యాకేజీలో 2.5 మిలియన్ డాలర్లు (రూ.22 కోట్లు) మూల వేతనం కాగా, మిగిలిన 90% షేర్ల రూపంలో ఉంది. ఆయనతో పాటు సిఎఫ్‌ఒ అమీ హుడ్‌కి రూ.259 కోట్లు, కమర్షియల్ హెడ్ జడ్సన్ ఆల్థాఫ్‌కి రూ.247 కోట్లు వేతనాలు లభించాయి.

నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎఐ రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించింది. అజూర్ క్లౌడ్ వ్యాపారం అమెజాన్‌తో పోటీపడుతూ వేగంగా ఎదుగుతోంది. ఈ సంవత్సరం మైక్రోసాఫ్ట్ షేర్లు 23% పెరిగాయి. గిట్‌హబ్, లింక్డ్‌ఇన్, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కొనుగోళ్లతో కంపెనీ వ్యాపారాన్ని విస్తరించారు. నాదెళ్ల 2019లో ఓపెన్ ఎఐలో పెట్టుబడి పెట్టి, చాట్ జిపిటి విజయంతో ఎఐ రంగంలో మైక్రోసాఫ్ట్ స్థానాన్ని బలపరిచారు. హైదరాబాద్‌లో జన్మించిన ఆయన మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్, అమెరికా విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ పూర్తి చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి, 2014లో కంపెనీ మూడో సిఇఒగా బాధ్యతలు చేపట్టారు.

ఇంగ్లడ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (78) జట్టును ఆదుకుంది. కాప్సె (38), చార్లి డీన్ (26) పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను సదర్లాండ్, అష్లే గార్డ్‌నర్ ఆదుకున్నారు. చెలరేగి ఆడిన గార్డ్‌నర్ 73 బంతుల్లోనే 16 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేసింది. సదర్లాండ్ 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని అందుకుంది.

నవంబర్ 1లోగా రూ. 900 కోట్లు చెల్లించాలి

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు మరోసారి కాలేజీల బంద్‌కు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిధులు విడుదల కాకపోవడంతో నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ నోటీసుసు అందించారు. ఈ నెల 24న ప్రొఫెషనల్ అక్రిడేటెడ్ కాలేజెస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించాలని, 25న విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించి, 26న జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని, నవంబర్ 1న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, నవంబర్ 1 నాటికి ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.700 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు.

పాక్ ఆర్మీ చీఫ్ తీరుతో వ్యవస్థలు నాశనం : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి విరుచుకుపడ్డారు. సైనిక బలంతో వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. జైల్లో తనతోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనను ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని వాపోయారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పాక్ ఆర్మీ చీఫ్‌పై మాజీ ప్రధాని నిప్పులు చెరిగారు.

“చట్టం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య పునాదులను బలహీన పరుస్తున్నారని విమర్వించారు.“ జైల్లో నన్ను పూర్తిగా ఒంటరిగా ఉంచారు. ఇలా రాజకీయ బాధితులను చేయడం పాక్ చరిత్రలో ఎప్పుడూ లేదు. జైలు నిబంధనల ప్రకారం కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కుమారులతోనూ కొన్ని నిమిషాలే మాట్లాడనిస్తున్నారు. రాజకీయ సహచరులతోనూ భేటీ కానివ్వడం లేదు. ప్రస్తుత పాలకుల తీరుతో సరిహద్దులో పరిస్థితులు దిగజారుతున్నాయి. అఫ్గాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి ” అని ఇమ్రాన్ వాపోయారు.

మరోవైపు ఇమ్రాన్ సన్నిహితుడు జుల్ఫీ బొఖారీ స్పందిస్తూ జైలు అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుష్రా బీబీని ఆరు గంటలకు పైగా జైలు బయట వేచి ఉండేలా చేశారని, ఇమ్రాన్‌తో భేటీ కాకుండా చూస్తున్నారని విమర్శించారు. 

500 కేజీల గంజాయి సీజ్

ఈగల్ టీం దూకుడు పెంచింది. ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. సినీ రేంజ్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ టీమ్, ఖమ్మం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేపట్టి దాదాపు 500 కిలోల గంజాయి పట్టుకున్నారు. కేసుకు సంబం ధించిన వివారల్లోకి వెళితే ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా లారీలో 500 కేజీల గంజాయి వారణాసి తరలిస్తున్నట్లు ఈగల్ టీమ్‌కు విశ్వస నీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఈగల్ టీమ్ నిందితులను పట్టుకునేందుకు ఖమ్మం నార్కోటిక్స్ బ్యూరో అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. మంగళవారం రాత్రి మొత్తం నిందితుల వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేశారు.

పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు లారీ వేగం పెంచారు. అయినప్పటికీ పోలీసులు వెంటాడటంతో పోలీసుల కళ్లు గప్పి ట్రక్‌ను దారి మళ్లించారు. వెంటనే అప్రమత్తమైన ఈగల్ టీమ్ తెలివిగా జిపిఎస్ ద్వారా లారీ అడ్రస్‌ను ట్రాక్ చేశారు. ట్రక్ జార్ఖండ్‌లో ఉన్నట్లు గుర్తించి ఈ మేరకు రాంచీ ఎన్‌సిబికి తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన రాంచీ ఎన్‌సిబి అధికారులు గంజాయ్ లోడ్‌తో వెళ్తున్న లారీని రాంచీ-జార్ఖండ్ మధ్యలో పట్టుకున్నారు. అనంతరం నిందితులను తెలంగాణ పోలీసులకు రాంచీ అధికారులు అప్పగించారు. లారీతో పాటు 500 కేజీల గంజా యిని తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హర్యానాకు చెందిన నసీమ్ కమ్రుద్దీన్ పోలీసులకు పట్టుబడగా, ఉత్తరప్రదేశ్ వారణాసి నివాసులు రిసీవర్లు అయన ముఫ్తాక్ ఖాన్, ఆరిఫ్‌లు పరారీలో ఉన్నారు.

యంనంపేట్‌లో కాల్పుల కలకలం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటీ స్టీల్ సమీపంలో గోరక్షక సభ్యుడిపై కాల్పుల సంఘటన బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరక్షక సభ్యుడు ప్రశాంత్ సింగ్ సోను పశువుల తరలింపుపై బిజెపి నాయకులకు సమాచారం ఇస్తున్నాడంటూ బహదూర్‌పూర్‌కు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి యంనంపేట్ కిటీ స్టీల్ సమీపంలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయం వెనుక వెంచర్‌లోకి చర్చల నిమిత్తం తీసుకువెళ్లాడు. అనంతరం ప్రశాంత్ సింగ్ సోనుపై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో సోను రోడ్డు మీదకు వచ్చి పడిపోగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సిఐ రాజు ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భారీ వర్షాలు.. ఇల్లు కూలి ఇద్దరు మహిళలు మృతి

చెన్నై: తమిళనాడులోని భారీ వర్షాలకు ఇల్లుకూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ కం తమిళనాడులోని చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం, రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించి సహాయ చర్యలను ముమ్మరం చేసింది. 

‘మిరాయ్’ని పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ చేస్తున్నాం

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా మేకర్స్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో యూనిట్ అందరికీ మెమెంటోలు అందించి అభినందించారు.

ఈ వేడుకలో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. “సినిమా రిలీజ్ అయి దాదాపుగా 45 రోజులు అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన వరకూ కూడా థియేటర్లలో ఈ సినిమా నడుస్త్తోంది. ఇంత బ్రహ్మాండ్ బ్లాక్ బాస్టర్ లాంటి సినిమా ఇచ్చిన డాక్టర్ కార్తీక్‌కి థాంక్యూ” అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా ఇది నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. “సినిమాని నేను ఎప్పుడు కూడా మ్యాజిక్ అనుకునేవాడిని. తీయడం మొదలుపెట్టాక మ్యాజిక్ అనేది నెమ్మదిగా అర్థమైంది. అందరి సహకారంతో సినిమా తయారవుతుంది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు”అని తెలియజేశారు. ఈ వేడుకలో రితిక నాయక్, గౌరా హరి, వై.రవిశంకర్, మారుతి, వెంకటేష్ మహా, సంపత్ నంది, శ్రీరామ్ ఆదిత్య, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకల తేదీలు ఫైనల్ అయ్యాయి. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లి కొడుకు వేడుక జరగనుంది. అక్టోబర్ 28న మెహందీ వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వేడుక ఆనందోత్సవంగా ఉండబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తం అక్టోబర్ 30న రాత్రి 10:35కి హైదరాబాద్‌లో జరగనుంది. మొత్తం వేడుకలు స్టార్‌లతో, సంతోషాలతో మరచిపోలేని ఈవెంట్‌గా జరగనున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి .. ఆరుగురి మృతి

కీవ్: ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ లోని పలు ఇంధన మౌలిక సదుపాయాలను లక్షంగా చేసుకొని బుధవారం కూడా రష్యా దాడులకు పాల్పడినట్టు చెప్పారు.

ఈ దాడిలో 18 మంది గాయ పడినట్టు కీవ్ పరిపాలన అధిపతి తైమూర్ వెల్లడించారు. దాడి కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యుద్ధం ముగింపుపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ పుతిన్‌కు సూచించినప్పటికీ కీవ్‌పై మాస్కో దాడులు కొనసాగిస్తుండడం గమనార్హం.

Wordpress Free Themes and Premium WP Plugins Download