elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbet

అందరూ పగలబడి నవ్వుకునేలా చిత్రం

పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ‘లవ్ ఓటీపీ’కి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో నిర్వహించిన ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. “లవ్ ఓటీపీ’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌ను చేశాను. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేసేలా, పగలబడి నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది” అని అన్నారు. హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ “రాజీవ్ కనకాల ఈ మూవీని భుజానికెత్తుకుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత విజయ్ ఎం రెడ్డి, హీరోయిన్ జాన్విక, బాబా భాస్కర్, నాట్య రంగ, ప్రవీణ్, దినేష్, హర్ష, ఆనంద్ పాల్గొన్నారు.

దేశ రాజధానిలో భారీ ఎన్ కౌంటర్

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో బిహర్ కు చెందిన నలుగురు సిగ్మా గ్యాంగ్ సభ్యులు మరణించారు. గత కొంతకాలంగా ఈ గ్యాంగ్ బిహార్ లో నేరాలకు పాల్పడుతోంది. ఈ గ్యాంగ్ కీలక సభ్యుడు రంజన్ పాఠక్ పై బిహార్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్- బిహార్ పోలీసులు కలిసి ఢిల్లీ లో ఆపరేషన్ చేపట్టారు . ఈ క్రమంలో పోలీసులకు ఈ గ్యాంగ్ రోహిణి ప్రాంతంలో ఎదురుపడ్డారు. వెంటనే గ్యాంగ్ సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముఠా కీలక సభ్యుడు రంజన్ పాఠక్ ,బిమ్లేశ్ మహా, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ ఉన్నారు. 

ఈ పాట ‘సూపర్ డూపర్..’

‘మాస్ జాతర’ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన తు మేరా లవర్, ఓలే ఓలే, హుడియో హుడియో గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగా ఉత్సాహభరితమైన మాస్ పాట ’సూపర్ డూపర్’ను విడుదల చేసింది. రవితేజ మాస్ కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ బ్లాక్ బస్టర్ ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది. మాస్ జాతర చిత్రాన్ని, ఆల్బమ్ ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ఈ ’సూపర్ డూపర్’ గీతముంది. రెండు ఉత్సాహభరితమైన పాటలు, ఓ మంచి మెలోడీతో ఇప్పటికే ’మాస్ జాతర’ ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా విడుదలైన మాస్ ని ఉర్రూతలూగించే ఈ ’సూపర్ డూపర్’ గీతం, ఆ స్థానాన్ని మరింత పదిలం చేసింది. మునుపటి మాస్ మహారాజా రవితేజను గుర్తుచేసేలా, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే స్వాగ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలీల తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ, -శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ మాస్ గీతాన్ని ప్రేక్షకులు మెచ్చే నిజమైన వేడుకలా మలిచాయి. ’సూపర్ డూపర్’ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ ని మెప్పించడంతో పాటు, అందరినీ కాలు కదిపేలా చేసేలా ఎంతో హుషారుగా ఈ గీతముంది. భీమ్స్ సిసిరోలియోతో కలిసి రోహిణి సోరట్ ఆలపించడం ఈ పాటకు మరింత హుషారుని తీసుకొని వచ్చింది. గీత రచయిత సురేష్ గంగుల అందరూ పాడుకునేలా ఉల్లాసభరితమైన సాహిత్యాన్ని అందించి ఆకట్టుకున్నారు. సంగీతం, గానం, సాహిత్యం అన్నీ చక్కగా కుదిరి.. ’సూపర్ డూపర్’ను ఓ గొప్ప మాస్ గీతంగా తీర్చిదిద్దాయి. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ’మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా త్వరలో రానుంది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ’మాస్ జాతర’ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

అమెజాన్‌లో 6 లక్షల ఉద్యోగాలకు ముప్పు

ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 2030 సంవత్సరం నాటికి కంపెనీ తన కేంద్రాల్లో సుమారు 6 లక్షల మంది ఉ ద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో 6 లక్షలకుపైగా ఉద్యోగాలను రోబోలు భర్తీ చేసే అవకాశం ఉంది. గిడ్డంగుల్లో వస్తువులను ఎంచుకోవడం, ప్యాక్ చేయడం, డెలివరీ చేయడం వంటి పనులను రోబోలు నిర్వహించనున్నాయి. 2018 నుంచి అమెరికాలో అమెజాన్ శ్రామికశక్తి మూడు రెట్లు పెరిగి 12 లక్షలకు చేరింది. అయితే ఆటోమేషన్ కారణంగా కొత్త నియామకాలు నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. 2033 నాటికి అమ్మకాలు రెట్టింపు అవుతాయని అంచనా ఉన్నప్పటికీ, రోబోటిక్ ఆటోమేషన్‌తో కంపెనీ నియామక రేటు స్థిరంగా ఉండగలదని అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌లు బోర్డుకు తెలిపారు. దీంతో 6 లక్షల మంది అదనపు ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

అంతర్గత పత్రాల ప్రకారం, ప్రతి వస్తువుపై 30 సెంట్లు ( రూ.2.5) ఆదా అవుతుందని, 2025-2027 కాలంలో మొత్తం 12.6 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లు) ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అమెజాన్ తన 75 శాతం కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. లూసియానాలోని శ్రేవ్‌పోర్ట్‌లో ఇటీవల ప్రారంభించిన అత్యాధునిక గిడ్డంగి ఇప్పటికే మానవ శ్రామికశక్తిని 25 శాతం తగ్గించింది. 2027 నాటికి ఇలాంటి 40 కేంద్రాలను నిర్మించాలనుకుంటోంది. అయితే అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ చూసిన పత్రాలు అసంపూర్ణమని, కంపెనీ పూర్తి నియామక వ్యూహాన్ని ప్రతిబింబించడం లేదని తెలిపారు. సెలవు సీజన్ కోసం 2.5 లక్షల మందిని తాత్కాలికంగా నియమించనున్నట్లు చెప్పారు. అమెజాన్ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ ఉదిత్ మదన్ మాట్లాడుతూ, ఆటోమేషన్ వల్ల ఆదా అయ్యే డబ్బుతో కొత్త ఉద్యోగాలను సృష్టించడం సంస్థ సుదీర్ఘ విధానమని అన్నారు.

భారత్‌కు చావో రేవో.. నేడు కివీస్‌తో కీలక పోరు

నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య టీమిండియా తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లకు నెలకొంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగు పడుతాయి. ఒక వేళ న్యూజిలాండ్ ఓడిపోతే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కివీస్ సెమీస్ రేసులో నిలుస్తోంది. ఓటమి పాలైతే మాత్రం లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది.

వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇలాంటి స్థితిలో కివీస్‌తో పోరు కీలకంగా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న టీమిండియా బలమైన కివీస్‌కు ఎలాంటి పోటీ ఇస్తుందో చెప్పలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా సమష్టిగా రాణించడంలో భారత క్రికెటర్లు విఫలమవుతున్నారు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన బాధ్యత జట్టు సభ్యులపై నెలకొంది.

మంధానపైనే ఆశలు..

ఇక కొంత కాలంగా అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో మంధాన అద్భుత బ్యాటింతో అలరించింది. అయితే కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మంధాన నుంచి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను జట్టు ఆశిస్తోంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హర్మన్ గాడిలో పడడంతో భారత బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది.

కాగా, కీలక బ్యాటర్లు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఇక సీనియర్ క్రికెటర్ దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా దీప్తి సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరోవైపు బౌలింగ్ వైఫల్యం కూడా టీమిండియాను వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించక తప్పదు. ఇదిలావుంటే ఈ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌తో పోరు న్యూజిలాండ్‌కు కూడా సవాల్‌గా తయారైంది. రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో హోరాహోరీ సమరం ఖాయమనే చెప్పాలి.

విజయవాడ నుంచి సింగపూర్ విమాన టికెట్ ధర రూ. 8 వేలు

అమరావతి: విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు నవంబర్ 15 నుంచి ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభమవుతుంది. సింగపూర్ నుంచి విజయవాడకు విమాన టికెట్ ధర రూ. 8 వేలు. సింగపూర్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 7.45కు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి విజయవాడ నుంచి ఉదయం 10.45కు బయలుదేరి సింగపూర్ వెళ్తుంది. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లడానికి 4 గంటల సమయం పడుతుంది. వారానికి మూడు రోజులు మాత్రమే సర్వీసు ఉంటుంది. మంగళవారం, గరువారం, శనివారాల్లో ఉంటుంది.

త్వరలో వాణిజ్య ఒప్పందం?

వాషింగ్టన్ : భారతదేశం అమెరికా చాలా కాలంగా చర్చలలో ఉన్న వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు 15 లేదా 16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తుల నుంచి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ బుధవారం మింట్ ఈ వార్త రిపోర్ట్ చేసింది. ఇంధనం, వ్యవసాయానికి సంబంధించిన భిన్నాభిప్రాయాల కారణంగా ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒప్పందం కుదిరితే భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉందని మింట్ పేర్కొంది. అమెరికా నుంచి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులను చేసుకునేందుకు భారత్ అంగీకరించవచ్చని , ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని మింట్ పేర్కొంది. 

బంధుప్రీతికే బీహార్ పార్టీల జై

వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాలను తుప్పు పట్టిస్తాయని రాజకీయ పార్టీల అగ్రనాయకులు పదేపదే చెబుతుంటారు. కానీ బీహార్‌లో చాలా ప్రధాన పార్టీలు తమ సీనియర్ నాయకులకు చెందిన రక్తసంబంధీకులకే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి టికెట్ ఇస్తుండడం విశేషం. అధికార నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ)లేదా గ్రాండ్ అలయన్స్ (ఇండియా కూటమి) ఏదైనా ఈ ట్రెండ్‌కు మినహాయింపు కాదు. వంశపారంపర్య రాజకీయాలపై పదేపదే విమర్శలు సంధించే బిజెపి కూడా బీహార్‌లో బంధుప్రీతికి తలొగ్గక తప్పడం లేదు. కొడుకులు, కూతుళ్లు, భార్యలు, కోడళ్లు, అల్లుళ్లు, దగ్గరి బంధువులు ఇలా ఎందరో బరిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా నైతిక ప్రాధాన్యత, సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. బీహార్‌లో గ్రామీణ జనాభా విద్యాస్థాయి చాలా తక్కువగా ఉండడంతో వారసత్వ రాజకీయాల గురించి ఓటర్లు అంతగా పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితి కొనసాగడానికి దోహదమవుతోంది. ఎన్‌డిఎ లోని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి హిందుస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్) సంస్థాపకులుగా రాజకీయ ప్రాచుర్యం మంచి పేరుంది.

ఆయన తన కోడలు దీపాకుమారిని ఇమామ్‌గంజ్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టారు. ఆమె తల్లి జ్యోతిదేవీ బరాచట్టి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, సికంద్రా స్థానంనుంచి జితన్ రామ్‌మాంఝీ అల్లుడు ప్రఫుల్ మాంఝీ బరిలోకి దిగారు. మాజీ ఎంపీ, భూమిహార్ నాయకుడు అరుణ్‌కుమార్ కొడుకు, సోదరుడు, సమీప బంధువులు ఎన్నికల్లో పోటీకి టికెట్లు పొందగలిగారు. అరుణ్‌కుమార్ కొడుకు రితురాజ్ కుమార్ ఘోసి నియోజకవర్గం నుంచి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన సోదరుడు అనిల్ కుమార్ , దగ్గరి బంధువు రోమిత్ కుమార్ క్రమంగా తికారీ, అటారీ స్థానాల నుంచి హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీ టికెట్ పొందారు. బిజెపి తన విధానాలను విడిచిపెట్టి సంస్థాగత రాజకీయ ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇస్తోంది. ఉదాహరణకు టికెట్లు పొందిన వారిలో రాజకీయ అనుభవజ్ఞుడైన, మాజీ ఎంపి శకుని చౌదరి కుమారుడైన బీహార్ డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు. శకుని చౌదరి పూర్వపు సమతా పార్టీ సంస్థాగత సభ్యుల్లో ఒకరు.

సామ్రాట్ చౌదరి 15 ఏళ్ల విరామం తరువాత తారాపూర్ నుంచి పోటీకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కుమారుడు, మాజీ రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా మేనల్లుడు అయిన నితీశ్ మిశ్రాను తిరిగి ఝాంఝర్‌పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి పోటీ చేయిస్తోంది. నితీశ్ కుమార్ కేబినెట్‌లో నితీశ్ మిశ్రా మంత్రిగా ఉన్నారు. అదే విధంగా శ్రేయాసి సింగ్ జమూల్ స్థానంనుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తల్లి పుతుల్ కుమారి బాంకాకు ఎంపిగా ఉన్నారు. గౌరబౌరమ్ స్థానంనుంచి బిజెపి సుజిత్ కుమార్ సింగ్‌కు తిరిగి టికెట్ ఇచ్చింది. ఎమ్‌ఎల్‌ఎ స్వర్ణసింగ్ భర్త సంజీవ్ చౌరాసియా డిఘా నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ గవర్నర్ గంగాప్రసాద్ కుమారుడు సంజీవ్ చౌరాసియా. మాజీ ఎమ్‌ఎల్‌ఎ నవీన్ కిషోర్ ప్రసాద్ కుమారుడు నితిన్ నబీన్ బంకిపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విధంగా మరికొందరు బిజెపిలో పోటీకి దిగుతున్నారు.

మాజీ ఎంఎల్‌ఎ, మాజీ ఎంపి సీతారామ్ సింగ్ కుమారుడు రాణా రణ్‌ధీర్ మధుబన్ నుంచి రంగంలో ఉండగా, మాజీ ఎంఎల్‌ఎ భూపేంద్ర సింగ్ కుమారుడు దేవేష్ కాంత్ సింగ్ గొరియాకోథి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంఎల్‌ఎ సునీల్ పాండే కుమారుడు విశాల్ ప్రశాంత్ తరారీ నుంచి, మాజీ ఎంఎల్‌ఎ రామ్ నరేష్ యాదవ్ కోడలు గాయత్రీ దేవి పరిహార్ నియోజకవర్గంనుంచి పోటీలో ఉన్నారు. అరుణ్‌కుమార్ సింగ్ తండ్రి బ్రిజ్ కిషోర్ సింగ్, తాత యమునా సింగ్ బరూరాజ్ ఎంఎల్‌ఎలుగా పనిచేశారు. జెడి(యు) పార్టీ అభ్యర్థుల జాబితా కూడా దీనికి తీసిపోలేదు. ఎమ్‌ఎల్‌ఎ నీలం దేవీ భర్త అనంత్ సింగ్ మొకమా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపి ఆనంద్‌మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ నబీనగర్ నుంచి, మాజీ మంత్రి మంజువర్మ కుమారుడు అభిషేక్ కుమార్ చెరియా బరియార్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం లోని ఎల్‌జెపి (ఆర్‌వి) లో కూడా బంధుత్వాలు వదల్లేదు.

చిరాగ్ పాశ్వాన్ తన మేనల్లుడు సిమంత్ మృణాల్‌కు టికెట్ ఇచ్చారు. ఆయన బావ జముయి ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)అధినేత, రాజ్యసభ సభ్యులు ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత ససారం నుంచి పోటీ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వంశపారంపర్య రాజకీయాల కేంద్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌జెడిలో అనేక మంది రాజకీయ వారసులు కనిపిస్తారు. మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వియాదవ్, రఘొపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఠా నాయకుడు నుంచి రాజకీయ నాయకుడుగా మారిన దివంగత మొహమ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు ఆర్‌జెడి రఘునాథ్ పూర్ నుంచి టికెట్ ఇచ్చింది. అలాగే ముఠా నాయకుడు, మాజీ ఎమ్‌ఎల్‌ఎ మున్నా శుక్లా కుమార్తె శివానీ శుక్లా లాల్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బ్రిజ్ బిహార్ హత్య కేసులో మున్నాశుక్లా ప్రస్తుతం జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. శివానీ శుక్లా తల్లి మాజీ ఎంఎల్‌ఎ. ఈ విధంగా ఆర్‌జెడి మరికొందరికి టికెట్లు ఇచ్చింది. 

అరకొర ప్రజాస్వామ్యం మాకు అక్కర్లేదు

లడఖ్ ప్రజలు సెప్టెంబర్ 24ను మరచిపోలేరు. ఆగ్రహోదగ్రులైన జనరేషన్ జెడ్ యువకులు స్థానిక బిజెపి కార్యాలయాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు పోలీసులు జరిపిన కాల్పులలో మాజీ సైనికుడితో పాటు నలుగురు యువకులు ఆనాడు మరణించారు. నమ్మశక్యం కాని విధంగా నిరసనలకు సంబంధించి ఓ గాంధేయవాది, హింసను వ్యతిరేకించే స్థానిక హీరో సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. 1600 కిలోమీటర్ల దూరంలోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు పంపారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర వంటి ఆరోపణలతో ఆ అరెస్టు జరిగింది.

లడఖ్ విభిన్నమైన నేపథ్యంగల రెండు మతాలకు ఆలవాలం. బౌద్ధులతో కూడిన లేహ్, మెజారిటీ షియా ముస్లింలు ఉండే కార్గిల్. ఆ రెండు ప్రాంతాలు రాజకీయంగా, సామాజికంగా భిన్నమైన నేపథ్యం కలవే. కానీ, ప్రజాస్వామ్య ఆకాంక్ష వారిని ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ తమ విభేదాలను పక్కన పెట్టి ఏకంకావడంతో లడఖ్ రాజకీయాలలో కొత్త చైతన్యం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) నేత సజ్జాద్ హుస్సేన్ కార్గిలి తో హరీందర్ జరిపిన ఇంటర్వ్యూ. 

ప్రశ్న: గతంలో లడఖ్ స్వతంత్ర ప్రతిపత్తి గల హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు 2023లో ఎన్నికలు జరిగాయి. లేహ్ అపెక్స్ సంస్థ వాటిని బాయ్‌కాట్ చేసింది, కెడిఎ పాల్గొన్నది. త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండుసంస్థలు కలిసి పనిచేస్తాయా?

జవాబు: ఈ ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే జరగవలసి ఉంది. వాయిదా పడ్డాయి. ఇప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఈ మధ్య జరిగిన హింసాకాండతో ఎన్నికలు మరింత జాప్యం కావచ్చు. బిజెపి మౌనంగా ఉంది. బిజెపి కేవలం ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీయే కాదు. కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం యంత్రాంగం దానికి అనుకూలంగా ఉందని ప్రజలకు తెలుసు. కెడిఎకు సంబంధించినంతవరకూ ఎన్నికలు కేవలం రాజకీయ వ్యవహారం కాదు. అది జనవాక్య సేకరణ (రిఫరేండమ్). ఈ ప్రాంతంలో ప్రజలు తన ఆకాంక్షలను ఎలా తోసిపుచ్చారో తమ ఓట్ల ద్వారా చెబుతారు. ఈ సందేశం కౌన్సిల్ ఎన్నికలకే పరిమితంకాదు. పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించవచ్చు.

ప్రశ్న: గతంలో కార్గిల్, లేహ్ ఆలోచనలు భిన్నంగా ఉండేవి కదా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత, లేహ్ ఆ చర్యను స్వాగతించగా, కార్గిల్ వ్యతిరేకించింది. ఏ మార్పు మీ ఇద్దరినీ ఎలా ఏకం చేసింది?

జవాబు: తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోరని ప్రజలు గుర్తించినప్పుడు వారు షాక్ తిన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో దాని వల్ల గ్యారంటీగా కలిగే రక్షణలు దూరమయ్యాయి. అభద్రతా భావం రెండు వర్గాలను ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ ప్రజాస్వామ్య పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత వహిస్తోంది. కార్గిల్‌లో డెమోక్రాటిక్ అలయన్స్ చురుగ్గా పని చేస్తోంది. సరైన ప్రాతినిధ్యం లేకపోవడమే సమస్యకు కారణమని ప్రజలు గుర్తించారు. నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం కొరవడడం వల్ల సమన్వయ కృషి వల్లనే తమ వాదన వినిపించగలమని తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యపరమైన మార్పుకోసం అందరూ ఏకం కావడం అవసరం.

ప్రశ్న: లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంపై గతంలో లేహ్, కార్గిల్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయంలో విభేదాలు తొలగాయా?

జవాబు: గతంలో మతపరమైన విభేదాలు ఉద్దేశపూర్వకమైన సామాజిక పరిస్థితులవల్ల ఏర్పడినవి. గతంలో ప్రభుత్వాలు ఈ విభేదాలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాయి. హింస ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో లేహ్ లోని బౌద్ధ మతస్థులు పార్లమెంటులో కనీసం ఒక బౌద్ధుడు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. సమంజసమైన కోర్కే. అలాగే కార్గిల్ నుంచి షియా ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లభించాలని కోరుకున్నారు. దేశంలో నిజమైన షియా ప్రతినిధి లేరు కూడా. అందువల్ల షియా ప్రతినిధి లడఖ్ నుంచి పార్లమెంటుకు వెళ్లాలని కోరుకుంటున్నది. లడఖ్‌కు రెండు పార్లమెంటు సీట్లు, ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తే, రెండు కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లభిస్తుంది.

ప్రశ్న: బిజెపి లేదా ప్రభుత్వం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? లడఖ్‌కు సంబంధించి వారి ఉద్దేశం ఏమై ఉంటుంది?

జవాబు: వారి చివరి ఎత్తు ఏమిటన్నది ఆందోళన కలిగించడం లేదు. మా న్యాయపరమైన హక్కుల కోసం మేం పోరాటం సాగించేందుకు దృఢచిత్తంతో ఉన్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలను మాపై రుద్దేయలేదు. లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలన్నదే మా నిశ్చితాభిప్రాయం. ఆ డిమాండ్ నెరవేరే వరకూ మేం విశ్రమించం.

ప్రశ్న: గతంలో కార్గిల్‌లో బిజెపి పెద్దగా లేదు. అయినా కౌన్సిల్ ఎన్నికల్లో కాస్త మెరుగ్గా ఓ సీటు గెలుచుకుంది ఎలా?

జవాబు: కార్గిల్‌లో బిజెపి ప్రభావం నిజానికి పరిమితమే. బౌద్ధుల జనాభా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వారు సులభంగా మద్దతు పొందుతున్నారు. మొత్తం మీద చూస్తే, లేహ్‌లో వారి బలం గణనీయమైనదే.

ప్రశ్న: సోనం వాంగ్ చుక్‌ను విడుదల చేయాలని జరిగిన హింసాత్మక ఘటనలపై జుడీషియల్ విచారణ చేయాలని మీరు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందస్తు డిమాండ్లు ఇవేనా. ఇదికాక మీ డిమాండ్ ఏమైనా ఉందా?

జవాబు: మా ప్రధాన డిమాండ్ ఒకటే లడఖ్‌కు తమ డిమాండ్ చెప్పే అవకాశం ఇవ్వండి. కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజల గొంతు మూగపోయింది. ఇక్కడి ప్రజలకు రాజకీయ డిమాండ్లు ఏమీ లేవు. అంతా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. కంటి తుడుపు ప్రజాస్వామ్యం కాదు. పూర్తిస్థాయి నిజమైన ప్రజాస్వామ్యం. లడఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పించాలన్నదే మా డిమాండ్. మాకు రాజ్యాంగపరమైన అన్ని హక్కులు కల్పించండి. అదనంగా ఆరో షెడ్యూల్‌లో మమ్మల్ని చేర్చమని కోరుతున్నాం.

ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పిస్తే!

జవాబు: వారు అదే చేయవచ్చు. కానీ, దానివల్ల మా పోరాటం ముగిసిపోదు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం అయినా, పూర్తి అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉంటాయి. ప్రజలకు నిర్ణయాధికారం ఉండదు. లడఖ్ మరో ఢిల్లీ కావాలని మేం కోరుకోవడం లేదు. రాజ్యాంగ పరిరక్షణలతో కూడిన ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా నడిచే స్వయం పాలిత రాష్టం హోదా కల్పించాలి. పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తే తప్ప అది నెరవేరదు.

స్థానికంపై నేడు నిర్ణయం?

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గం నేడు మరోసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. బిసి రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తుండగా మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ పనులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం కాగా, నేడు మరోసారి కేబినెట్ భేటీ జరుగనుంది.

Wordpress Free Themes and Premium WP Plugins Download