elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbetting

రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్

రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారని శుభవార్త చెప్పారు. ఉపాసన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.దీపావళి తమ ఇంట ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.మొదటి బిడ్డ అయిన క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబంలో ఆనందం నిండిందని, ఇప్పుడు మరో బిడ్డ రాకతో ఆనందం మరింత పెరిగిందని తెలుస్తోందని క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన ఉపాసన ..తన ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయని తెలుపుతూ ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేశారు. ఈ వీడియోలో కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశ్వీరదించారు.

ట్రాక్టర్ బైకును ఢీకొనడంతో ఇద్దరు బాలురు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. తండ్రికి, మరో బాలుడుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ వద్ద తండ్రి ముగ్గురు కుమారులతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అభిరామ్(9), రాము (5) గా పోలీసులు గుర్తించారు. 

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు మృతదేహం లభ్యం

అమరావతి: కాకినాడజిల్లా తుని పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకు వచ్చి తాటిక నారాయణరావు(62) అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు మృతి చెందాడు. పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తుండగా బహిర్భూమికి వెళ్తానని చెరువులో దూకాడు. తుని పట్టణ శివారులోని కోమటి చెరువు పక్కన పోలీసులు వాహనాన్ని ఆపారు. తదుపరి చెరువులో దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని గ్రామీణ పోలీస్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నిందితుడి అచూకీ కోసం గజ ఈతగాళ్లతో బుధవారం రాత్రి పోలీసులు వెతికారు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా చెరువులో నిందితుడి మృతదేహం లభ్యం అయింది.

మూడో వికెట్ కోల్పొయిన భారత్

 టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే లో పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఆసీస్ స్పిన్నర్లను బరిలోకి దింపిన సరే భారీ షాట్లకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో 135 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పొయింది. రెండో వ‌న్డేలో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మహాఫ్ సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ‌కు ఇది 59వ అర్థ శ‌త‌కం . ఈ మ్యాచ్ లో 74 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. హాఫ్ సెంచ‌రీలో నాలుగు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. అయితే కుదురుగా ఆడుతున్న రోహిత్ శర్(73) మిచెల్ స్టార్క్ వేసిన ఫార్ట్ బంతిని ఆడబోయి హేజిల్ వుడ్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో శ్రేయాస్ తో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లకు 3 వికెట్లు కోల్పొయి 137 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న శ్రేయాస్ అయ్యార్(51; 67 బంతుల్లో) హఫ్ సెంచరీ చేశాడు. కెరీర్ లో శ్రేయాస్ కి 23వ అర్థశతకం

మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు అధికారులు ముగ్గు వేసేందుకు గ్రామానికి వచ్చారు. అయితే భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని , ఇండ్లకు ముగ్గు వేయవద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామస్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్థులంతా ఏకమవ్వడంతో  అటవీ అధికారులు వెనుదిరిగారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరకుండా గ్రామస్థులను చెదగొట్టారు. గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

లొంగుబాటు.. కాకూడదు నగుబాటు

సుమారు అరవై ఏళ్ల క్రితం మన దేశంలో రాజుకున్న నక్సలైట్ల పోరాటానికి తుది ఘడియలను కేంద్ర ప్రభుత్వం రచిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి మావోయిస్టుల వరుస లొంగుబాట్లు దీనికి సంకేతాలు అనవచ్చు. అయితే వీరి అస్త్ర సన్యాస వార్తలు తెలుగువారిని అమితంగా కలవరపరుస్తున్నాయి. సమాజ మార్పు కోసం సాయుధ పంథాను ఎంచుకున్న ఆ కమ్యూనిస్టు పార్టీలో ముందు వరుసలో తెలుగువారే ఎక్కువ. ప్రత్యేకంగా తెలంగాణకు చెందినవారు నాయకత్వ స్థానంలో ఉండడం మూలాన వారి ప్రతి కదలిక, నిర్ణయం ఇక్కడి ప్రజల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య పోలీసుల తూటాలకు వారు బలి అవుతున్న తీరుకు క్షోభ పడుతున్న గుండెల సంఖ్య కూడా ఇక్కడ తక్కువేమి ఉండదు. తెలంగాణ జిల్లాల్లో భూస్వాముల దౌర్జన్యాలను కట్టడి చేసి, నక్సలైట్లు తెచ్చిన మార్పును గమనించినవారు, అలా ఉపశమనం పొందినవారు తప్పకుండా వారిని ఇష్టపడతారు, అభిమానిస్తారు. కళాకారులు, రచయితల్లో కూడా వారి వాదాన్ని సమర్థించి, వారి పక్షాన నిలిచేవారు ఎందరో ఉన్నారు. సాధారణంగా నక్సలైట్లలో వీరత్వాన్ని, ప్రాణాన్ని లెక్కచేయనితనాన్ని మాత్రమే చూసిన, వారి నుంచి అవే ఆశించిన వారికి ఇంత భారీ సంఖ్యలో లొంగుబాట్లు జీర్ణం అయ్యే పరిస్థితి లేదు. తాము ఎంతో ఉన్నతంగా భావించిన సమరభేరి ఇలా చప్పబడడంతో వారిని నిరాశపరుస్తోంది.

మెల్లమెల్లగా ప్రభుత్వ బలగాల పైచేయితో మావోయిస్టుల కోట బద్దలవుతుండగా అగ్రనేతల లొంగుబాటుతో వారి శిఖరమే కూలినట్లు, పునాదులే కదిలినట్లుగా జనం భావిస్తున్నారు. కేంద్ర బలగాల దెబ్బకు మావోయిస్టులు బలహీనపడినా, తమ యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన సందర్భాలే గతంలో కనబడ్డాయి. అయితే సుమారు ఒక ఏడాది క్రితం నుండే వారిలో కొందరికి ప్రభుత్వం ముందు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన కలిగిన విషయం ఈ మధ్య బయటపడింది. ఆ లొంగుబాటు ఆలోచన అగ్ర నాయకులకు కలగడమే ఎవరు ఊహించని విషయం. ఇక పోలీసులతో వేగలేం, లక్ష్యాన్ని చేరుకోలేం, తుపాకులు అప్పగించి బతికిపోదాం అనుకొని తమ అనుచరులతో పెద్ద తలలే వంచుకొని బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు మావోయిస్టులు లొంగిపోయిన విధానం ఎంతో సంకేతాత్మకంగా ఉంది. ఇన్నేళ్లు వారు నమ్మి, ప్రజలను నమ్మించి పోరాడిన సిద్ధాంతాన్ని శత్రువు కాళ్ల దగ్గర సాగిలపరచినట్లుగా అది సాగింది.

లొంగిపోయేవారు తమ ఇష్టానుసారంగా బయటికి వస్తే సరిపోయేది. పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోతామని నిలబడితే చాలు, అంతా వారే చూసుకునేవారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రుల ముందు పెద్ద హంగామాగా ఆయుధాలను అప్పగించి, నవ్వుతూ రాజ్యాంగం ప్రతిని అందుకోవడం ఎన్నో విపరీత అర్థాలకు తావిచ్చింది. పార్టీ ఇచ్చిన తుపాకిని పార్టీకి వాపసు ఇచ్చేసి తమ దారిలో తాము వెళితే అంతా గౌరవప్రదంగానే ఉండేది.పోలీసుల హిట్ లిస్టులో ఉన్నవారు, కేసుల్లో నిందితులు కావాలనుకుంటే లొంగిపోవచ్చు. మిగతావారు పార్టీకి దూరంగా తమ బతుకు తాము బతకవచ్చు. తుపాకీ పట్టినా కేసులు లేనపుడు నేరస్థులు కారు. ఇలా పదుల సంఖ్యలో కొత్త యూనిఫారాల్లో ఆయుధాలతో ప్రభుత్వాల ముందు కవాతు చేయడం చూస్తుంటే ఎలాంటి సిద్ధాంతం లేని బందిపోటు ముఠాలను తలపిస్తోంది. పార్టీని ఎంత బలహీనం చేశామో చూడండి అని ప్రభుత్వం ముందు ప్రదర్శించినట్లుగా వీరి లొంగుబాటు తీరు ఉంది. లొంగిపోయిన ప్రతి చేతికి రాజ్యాంగ ప్రతి వచ్చింది. ఆయుధంతో కన్నా రాజ్యాంగం బాటలో ప్రజలకు మేలు చేయొచ్చు అని వారంతా ఒప్పుకున్నట్లుగా ఆ ప్రహసనం సాగింది. నక్సలైటు ఉద్యమం కన్నా ముందే భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగంలో సూచించినట్లుగా పాలన సాగడం లేదు, అందులో పేర్కొన్న హక్కులు వివిధ జాతులకు, పేదలకు దక్కడం లేదనే విషయం కాలక్రమంగా బయటపడింది. ఇదేం పాలన అని ప్రశ్నించిన గొంతులపై పాలకులు ఉక్కుపాదం మోపారు. పాలకులెవరైనా యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. దొంగదారిలో ఎమర్జెన్సీవచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది.

రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను కాపాడేందుకు ఉద్యమాలు చేపట్టవలసి వస్తోంది. నేరాలకు శిక్షలను వేసే న్యాయ వ్యవస్థను పక్కనబెట్టి పోలీసులు ప్రభుత్వ అనుమతితో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా హక్కును అంగడి సరుకు చేశారు. కనీస వేతనాలు శ్రమజీవి చేతికందవు. కార్మిక హక్కులు కాలరాస్తున్నారు. గిరిజనులకున్న అటవీ హక్కులు పారిశ్రామికవేత్తల పాదాక్రాంతం చేస్తున్నారు. చట్టసభల్లో బలమున్న ప్రభుత్వాలు సవరణల పేరిట తమకు అనుకూల మార్పులు చేసుకుంటున్నాయి. మత స్వేచ్ఛపై నిరంతర దాడి జరుగుతోంది. హిందూయేతరులకు దేశంలో రక్షణ కరువైంది. గత పన్నెండేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తూ మనుధర్మాన్ని అమలు చేస్తున్నది. హిందూత్వశక్తుల పాలనలో పరమత సహనం కనీస స్థాయికి పడిపోయింది.

రాజ్యాంగం ఇప్పుడు కేవలం ప్రదర్శన కోసం అన్ని పార్టీల హస్తభూషణమైది. ఆచరణలో మాత్రం అందరూ దారి తప్పుతున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ఆయుధం అవసరమే ఉండదు. ఆయుధాన్ని అప్పగించి రాజ్యాంగాన్ని అందుకొనే పరిస్థితులు దేశంలో లేవు. ఆయుధానికి రాజ్యాంగ ప్రతి ప్రత్యామ్నాయం కాదు.ఇంకా అలాంటి రోజులు రాలేదు. నలభై ఏళ్లుగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవారు ఇప్పుడే కొత్తగా రాజ్యాంగాన్ని చూస్తున్నట్లు, దాని అమలు బ్రహ్మాండంగా జరుగుతున్నట్లు పోజులు పెట్టడం చాల మందికి అసహజంగా కనబడింది. ప్రతి వ్యక్తిపై ఆయన గతకాలపు నడవడిక ఆధారంగా జనానికి ఆయనపై కొన్ని అంచనాలు ఉంటాయి. అవి బెడిసికొట్టినపుడు ఆయనపై గౌరవం తగ్గిపోవడం సహజమే. అందుకే ఈ లొంగుబాట్లపై సామాజిక మాధ్యమాల్లో భిన్న కథనాలు వస్తున్నాయి. రాజ్యాంగ ప్రతిని అందుకున్న మాజీ మావోయిస్టులు బాధ్యతగా దాని అమలుకై కొత్తగా కార్యాచరణ మొదలుపెడితే ఈ లొంగుబాట్లను కూడా హర్షించవచ్చు.

 బద్రి నర్సన్, 94401 28169

ప్రమాదాలకు అడ్డాగా.. రైల్వే అండర్ బ్రిడ్జి

కొత్తగూడెంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు చేరడం వల్ల, రోడ్డుపై గుంతలు పడటం వల్ల, మరియు సిమెంట్ రోడ్డు నుండి ఇనుప కడ్డీలు బయటకు రావడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. భారీ వాహనాలు మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. గురువారం ఉదయం 5 గంటల సమయంలో అండర్ బ్రిడ్జి వద్ద యాష్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ అతివేగంగా నడపడమేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రెండు వికెట్లు కోల్పొయిన భారత్

టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పెర్త్ లో గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఆస్ట్రేలియా.. ఇక్కడే చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6.1 ఓవర్ లో కెప్టన్ శుభ్ మన్ గిల్ వికెట్ కొల్పోయింది. బార్ట్ లెట్ బౌలింగ్ లలో భారీ షాట్ కు ప్రయత్నించిన గిల్ మిచెల్ మార్ష్ చేతికి చిక్కడంతో పెవిలియన్ కు చేరాడు. తొలి వన్డేలో మాదిరిగానే విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. 6.5వ ఓవర్ లో బార్ట్ లెట్ బౌలింగ్ లో విరాట్ అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ (13) రోహీత్ శర్మ(26) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పొయి 50 పరుగులు చేసింది.

అన్నదాత కష్టాలు..

అన్నతదాత సుఖీభవ కష్టాలు తొలగడం లేదు.ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతన్నలకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రకోపంతో పంటలకు నష్టం కలుగుతుంది. ములుగు జిల్లా మాజేడు మండలం పడిగాపురం గ్రామ శివారులో మిరప సాగు చేస్తున్న రైతుల కష్టాలకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయింది. దీంతో రైతులు విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ములుగు లేదా రేగొండ తీసుకొళ్లాలని తెలిపారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు ట్రాక్టర్ వెళ్లడానికి బాట లేక పోవడంతో రైతులు ఎడ్లబండిని కిరాయికి తీసుకొని దానిమీద ట్రాన్స్ ఫార్మర్ పెట్టి, బండికి తాళ్లతో కట్టి.. మోకాలి లోతు బురదలో బండిని లాగుతూ అరకిలో మీటరు దూరం ఉన్న రోడ్డు మీదకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్ పై రేగొండకు తీసుకెళ్ళారు.

అన్నదాత కష్లాలు..

అన్నతదాత సుఖీభవ కష్టాలు తొలగడం లేదు.ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతన్నలకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రకోపంతో పంటలకు నష్టం కలుగుతుంది. ములుగు జిల్లా మాజేడు మండలం పడిగాపురం గ్రామ శివారులో మిరప సాగు చేస్తున్న రైతుల కష్టాలకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయింది. దీంతో రైతులు విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ములుగు లేదా రేగొండ తీసుకొళ్లాలని తెలిపారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు ట్రాక్టర్ వెళ్లడానికి బాట లేక పోవడంతో రైతులు ఎడ్లబండిని కిరాయికి తీసుకొని దానిమీద ట్రాన్స్ ఫార్మర్ పెట్టి, బండికి తాళ్లతో కట్టి.. మోకాలి లోతు బురదలో బండిని లాగుతూ అరకిలో మీటరు దూరం ఉన్న రోడ్డు మీదకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్ పై రేగొండకు తీసుకెళ్ళారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download