elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbetting

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

betebet

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

dinamobet

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

ultrabet

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

tarafbet

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

marsbahis giriş

betcio

kralbet

దళపతులుగా దళితులు ఎదగాలి

దేశంలో జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, అణగారినవర్గాలను అణగాదొక్కే ప్రయత్నాలు, అమాయక బహుజనులపై రాక్షసతత్వం నాటి కన్నా నేడే ఎక్కువగా కనబడుతున్నది. డా. అంబేద్కర్ కాలంలో అంటరానితనం, కులవివక్ష లాంటి మానసిక దాడులుండేవి. నేటి స్వాత్రంత్య్ర భారతంలో వాటితోపాటు భౌతిక దాడులనూ చూస్తున్నాం. దేశంలో ప్రతి రోజు సాధారణ దళిత ప్రజలపై ఎక్కడోచోట ఏదో ఘటన నమోదవుతున్నది. ఇప్పుడు ముఖ్యవ్యక్తులపై దాడులతో ఆధిపత్య కులాల అధిపత్యాన్నిచాటే సంఘటనలు చూడాల్సిన దౌర్భాగ్యం నెలకొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటుదాడి, ఐపిఎస్ పురాన్ కుమార్ కులవివక్ష ఘటనలు ఇలా అనేక ఘటనలు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి. దళితుల ప్రాణాలకు రక్షణ లేదు, దళిత బాలికల, మహిళలపై లైంగిక హింసలు, వారి మానవ విలువలకు లెక్కే లేకుండా పోతుంది.

అందుకే దళితశక్తి దళపతి రూపం దాల్చాలి. బాబా సాహెబ్ మార్గంలో నడిచే విద్యావంతులు, మేధావులు నాయకులుగా తయారవ్వాలి. మానవులను జంతువులుగా చూసే క్రూరమృగాలను రూపుమాపి, మానవత్వమే అసలైన మతం అని చాటి చెప్పి శాంతి మార్గంలో నడిపించే దళపతులుగా ఎదగాలి. ఆనాడు దళితుల హక్కులకై, అసమానతలపై, కులవివక్షకు వ్యతిరేకంగా సుదీర్గ కాలం పాటు పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ నేడు లేరు. నేడు కుల వివక్ష దారుణాలు విచ్చలవిడిగా పెరిగిపోయిన దారుణాలు చూస్తుం టే నాయకత్వ పటిగల అభినవ అంబేద్కరులు ప్రతిచోట పుట్టాలని దళిత వర్గం ఎదురు చూస్తున్నది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలిలో ఒక దళిత యువకుడిని మూకుమ్మడిగా కొట్టి చంపిన వీడియో వైరల్ అవడంతో ఆ రాష్ట్రం మొత్తం అట్టుడుకిపోయింది.

ఇలా చెప్పుకుంటూపొతే దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దళితులు వేరే కులం వారితో పెళ్లి చేసుకున్న సంఘటనల్లో అబ్బాయి, అమ్మాయి అనే తేడా చూడకుండా బట్టలూడదీసి, గుండు గీయించి దాడిచేసే అఘాయిత్యాలను, కొన్ని వికృత చేష్టలను చూస్తే ఒళ్ళు జుగుప్సాకరంగా మారుతుంది. 2022లో మధ్యప్రదేశ్ లో దళిత దంపతులను కొడుకుతో సహా కాల్చి చంపారు. 2025 ఆగస్టులో తమిళనాడులో దళిత పాఠశాల విద్యార్ధిపై మరో వర్గ ముగ్గురు విద్యార్థులు కలిసి కేవలం కుల కారణంగా కత్తులతో దాడి చేయడం దిగ్భ్రాంతికర విషయం. నిన్నగాక మొన్న అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 16 ఏళ్ల దళిత బాలిక అయిదుగురి చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురికావడం ఆమె కుటుంబంలో రక్తం మరిగేలా చేసిందేమో కానీ సమాజంలో కొందరికి చీమకుట్టినంత బాధకూడా కలగక పోవచ్చు! మరో సంఘటనలో మధ్యప్రదేశ్‌లో (2025 మార్చి నెల) ఓ దళిత వరుడు పెళ్ళికి గుర్రంపై వెళ్లినందుకు రాళ్ళతో కొట్టి చంపారు.

మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి వేడుకలలో శబ్దం పెంచి డిజె పాటలు పెట్టారని ఒకేసారి 40 మంది దాడి చేసి రాళ్ళతో కర్రెలతో దాడులు చేసి పెళ్ళి జరగకుండా ఊర్లోకి రానివ్వలేదు. ఇలా చెప్పుకుంటూపోతే వందల వేల ఉదాహరణలు దేశంలో ప్రతి రాష్ట్రం లో చోటు చేసుకుంటున్నాయి. దళితులపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన దేశంమొత్తంలో నమోదైన అట్రాసిటీ కేసులు చూసినట్లయితే 2020లో 50 వేలు, 2021లో 50,744, 2022లో 57428 నమోదైనట్లు అధికారిక నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అధికంగా, తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. మరీ వీటిని ఆపేదెవారు? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత రక్షణ కల్పించినప్పటికీ రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు! దళితులతోపాటు మైనారిటీలపైనా దాడులు జరుగుతున్నాయి. వీటిని ఆపేదెవరు, పరిష్కారం ఎక్కడ? దేశం శాంతి మార్గంలో నడిచేదెప్పుడు, కుల మతాల మంటలు ఆరేదెప్పుడు.? ముందుకు వచ్చే నాయకులెవ్వరు? దళితుల కోసం, పీడిత వర్గాల కోసం పోరాటం చేయడానికి ‘చేగువేరా’ జార్జిరెడ్డి లాంటి నాయకులు మళ్ళీ ఎప్పుడు పుడుతారో అని ఎదురు చూస్తుందీ సమాజం.!

– సయ్యద్ జబి, 9949303079

విషాదాలతో వెలవెలబోయిన దీపావళి

అక్టోబర్ 20న సాయంత్రం భారతదేశం అంతటా దీపావళి వెలుగులు విరజిమ్ముతుండగా, ఆనందాల పండుగ మరో సారి పొగ కమ్ముకుంది. చాలా కాలంగా వేడుగలకు ప్రతీకగా నిలుస్తున్న టపాకాయలు, బాణాసంచా, ఆరోగ్యం, పర్యావరణం, ఎన్నికల అవకాశవాదంపై జాతీయ చర్చలలో కేంద్రాలుగా మారాయి. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎఒఐ) ప్రతిదినం ప్రమాదకర స్థాయిని దాటి హెచ్చుతోంది. సుప్రీం కోర్టు నిర్ణీత గంటల్లో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్లను అమ్మకాలను అనుమతించడం వల్ల నిబంధనలు అమలు క్లిష్టంగా మారింది. అసోంలో సంబరాలు లేవు. రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. గాయకుడు జుబీన్ గార్గ్ మృతికి ప్రజలు సామూహిక సంతాపం ప్రకటించడంతో ఈ ఏడాది దీపావళికి బాణాసంచా కాల్చరాదని ప్రతినబూనారు. ఈ పండుగ కేవలం టపాసులు కాల్చడానికే పరిమితం కాలేదు. మతపరమైన సానుకూలతకోసం ఉపయోగించుకునే రాజకీయాలు, దీర్ఘకాలిక మనుగడ కంటే స్వల్పకాలిక ఆర్థిక లాభాలకు కక్కుర్తిపడే వారి అంతరాలను బహిర్గతం చేసే యుద్ధభూమిగా మారింది.

ఢిల్లీలో విషపూరిత దీపావళి, బిజెపి పాలనకు సవాల్ ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం ఏటా భయంకరమైన ఓ బెడద. శీతాకాలం దగ్గరపడేకొద్దీ కమ్మేసే పొగమంచు, పొరుగు రాష్ట్రాల నుంచి కాల్చే చెత్త, వ్యవసాయ వ్యర్థాలవల్ల వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, వీటికితోడు బాణాసంచాల ద్వారా పెరిగే విషపూరిత మిశ్రమాలు వేలాదిమంది ఉసురును తీస్తోంది. ప్రతి ఏడాది దీపావళి సీజన్‌లో శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆస్పత్రుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుప్రీంకోర్టు అక్టోబర్ 2025లో ఇచ్చిన ఆదేశం ప్రకారం దీపావళి నాడు సాయంత్రం 6-9 గంటల మధ్య కొన్ని ప్రదేశాల్లో రాత్రి -10 గంటల వరకూ పర్యావరణ అనుకూల (కాలుష్యం తగ్గించే) గ్రీన్ క్రాకర్లను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది.

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) వెలుపల పూర్తిగా విషేధాన్ని విధిస్తుంది. ఇది బాణాసంచాపై పూర్తి నిషేధం కాదు. జాగ్రత్తలతో కూడిన ఆదేశం. అమ్మకాలు అధికార అవుట్‌లెట్‌లకే పరిమితం చేశారు. బాణాసంచా కాల్చుకునే సమయాన్ని పరిమితం చేశారు. అమలు బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులపై ఉంటుంది. దీనికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మద్దతు ఇస్తుంది. అయినా, 2025 ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన బిజెపి నేతృత్వంలోని పాలనా యంత్రాంగంపై పెద్ద బాధ్యతే ఉంది. 1998 తర్వాత ఢిల్లీలో బిజెపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ హామీతో ముందుకు వచ్చింది. కానీ, కాలుష్య నియంత్రణ చర్యలపై ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. జాతీయ ట్రాక్ రికార్డు తరచు ప్రజారోగ్యం కంటే, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధానమే ఇప్పుడు సమస్య అయింది. గ్రీన్‌క్రాకర్స్‌కు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసర్చ్ (సిఎస్‌ఐఆర్) సర్టిఫికేషన్ లేకపోవడం వ్యవస్థాగత వైఫల్యాన్ని వెల్లడిస్తోంది. ప్రతి బ్యాచ్‌ను ప్రమాణీకరించడానికి ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు అవసరం.

కానీ, చాందీనీ చౌక్, సదర్ బజార్ అంతటా నకిలీవస్తువులను అమ్మకందార్లు విక్రయిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ సవాల్ కేవలం లాజిస్టికల్ మాత్రమే కాదు. రాజకీయమైనది. కేంద్రం, రాష్ట్రస్థాయి లో బిజెపి పర్యావరణ విధానాలను దారుణంగా మారుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. హస్టియో అరండ్ వంటి జీవవైవిధ్యంగల కీలక ప్రాంతాలలో బొగ్గుగనుల తవ్వకాలకు అనుమతిలు ఇవ్వడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వరకు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దశాబ్దికాలంగా వాతావరణం కన్నా, పారిశ్రామిక లాబీలకే ప్రాధాన్యత ఇస్తోంది.హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉన్నా పంటలను తగులబెట్టడాన్ని అరికట్టడంలో వైఫల్యం, బిజెపి పాలిత ఢిల్లీకి సంకటంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేకతగా చిత్రీకరించిన బిజెపి, ఇప్పుడు ఇరకాటంలోపడింది.

పార్టీ ఈ మధ్య చేస్తున్న ప్రచారాలు, దాని పర్యవేక్షణలో వెలవెలబోతున్నాయి. దీపావళికి సంబంధించి దాని నినాదాలకు, దాని చర్యలకు మధ్య వైవిధ్యం తేటతెల్లమవుతోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు మధ్య మెరుగైన పాలన అందించాల్సిన బాధ్యత బిజెపిపైనే ఉంది. ఈ దీపావళి రోజున, ఆనంద్ విహార్, ద్వారక వంటి కీలక ప్రాంతాల్లో అర్ధరాత్రికి వాయు నాణ్యత స్థాయి 400 ప్లస్‌కు దిగజారిందని అంచనా. నిజమైన పరీక్ష ఇప్పుడే ఎదురయింది. రాజధానిలో గస్తీకి తగినంతమంది పోలీసులను నియమించారా. సిపిసిబి రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ కాలుష్యనియమాలు ఉల్లంఘించేవారిని సమర్థంగా గుర్తించాయా. నిర్దిష్ట సమయంలోనే బాణాసంచా కాల్చాలన్న ప్రచారం, కాలుష్యం వల్ల అనర్థాలను తెలుపుతూ, స్కూళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, లేజర్ షోల వంటివి చాలా కీలకం. అయినా, పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల తగులపెట్టడం వల్ల అంతర్రాష్ట్ర కాలుష్య నియంత్రణకు కేంద్రం గట్టిచర్యలు తీసుకోని పక్షంలో కేంద్రం వైఫల్యం తీవ్ర పరిణామాకు దారితీస్తుంది.

అసోం రాజకీయ ప్రతిఘటనల మధ్య జుబీన్ గార్గ్ సంతాపం ఢిల్లీ రాజధానిలో ఊపిరి సలపని పరిస్థితి ఉంటే, ఈశాన్య రాష్ట్రాల బలహీన పర్యావరణ వ్యవస్థలు దీపావళి వేడుకలను భిన్నంగా కోరుకుంటున్నాయి. బ్రహ్మపుత్ర వరద మైదానాలు, తూర్పు హిమాలయాలతో కూడిన అసోం ముప్పులోఉన్న జీవవైవిధ్యానికి ప్రతీక. అసోంలో గాలి నాణ్యత ఢిల్లీ కన్నా చాలా మెరుగ్గా, శుభ్రంగా ఉన్నా, బయోమాస్ ధ్వంసం, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దును వచ్చే పొగమంచుకు ఇబ్బందుల పాలవుతున్నది. ఈ ప్రాంతంలో సమాజాలు దీపావళిని బిహు సంప్రదాయంలో కలుపుతూ బాణాసంచా కంటే నూనె దీపాలు మట్టి దీపాలతోనే పండుగ జరుపుకునేందుకు ఇష్టపడతాయి. పర్యావరణ పరిరక్షణలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రయోజనంకోసం హిందూ పండుగలను ఉపయోగించుకోవడం దారుణం. దీపావళి, చీకటిపై వెలుగుకు ప్రతీకగా నిలవడంతో పార్టీ సాం సృ్కతిక జాతీయవాదంలో ఓ ఆసరాగా మారింది. ఢిల్లీలో ఆప్ అధికారంలోఉన్నప్పుడు చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేక చర్యగా బిజెపి ప్రచారం చేసింది.

అసోంలో బిశ్వశర్మ టపాకాయల అమ్మకందారుల పై చూపుతున్న ప్రేమ కాలుష్యాన్ని పెంచి పోషించే పారిశ్రామికవేత్తలతో ఆయన అనుబంధాన్ని చూపుతున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా సాగుతున్న వ్యూహం. బిజెపి అధికారంలో ఉన్న దశాబ్దకాలంలో పారిశ్రామిక ఉద్గారాల అనుమతులు 30% పెరిగాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డేటా చెబుతోంది. బిజెపికి పౌరుల ఆరోగ్యంపట్ల, పర్యావరణ సమతుల్యతపట్ల శ్రద్ధ లేదని, గిరిజనులు వ్యతిరేకిస్తున్నా,ఒడిశాలో నియమగిరి కొండలలో బాక్సైట్ గనుల తవ్వకాలకు ఈ మధ్య అనుమతి ఇవ్వడం ద్వారా రుజువైంది. మతపరమైన దోపిడీ లోతుగా సాగుతోంది. నిషేధాలను హిందూ విశ్వాసాలపై దాడిగా చిత్రీకరించడం ద్వారా బిజెపి, ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలలో ఓట్లను సంపాదించడానికి పడుతున్న ఆందోళనను చూపుతోంది.

భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. హిందువులే కాదు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా పంచుకునే దీపావళి సార్వత్రిక ఆనందాన్ని విషపూరితం చేయకూడదు ప్రజా సంతాపాన్ని కించపరచకూడదు. ఈ దీపావళి పరివర్తనపరమైన మార్పునుకోరుతోంది. అందరి సహకారం వల్లనే ఢిల్లీలో పర్యావరణపరమైనవిజయం ఆధారపడిఉంది. బాణాసంచా రియల్ టైమ్ పేలుళ్లను గుర్తించేందుకు ఆప్ 11 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యవేక్షించే డ్రోన్‌లను మోహరించాలని కోరుతోంది. కానీ కేంద్రం పంటల వ్యర్థాల ధ్వంసం అరికట్టేందుకు ఉపగ్రహ ట్రాకింగ్, రైతులకు సబ్సిడీలతో రాజధాని వ్యాప్తంగా గడ్డినిషేధాలను అమలు చేస్తున్నది. పౌరులసహకారం అన్నిటికన్నా అవసరం. ఉల్లంఘనలను గుర్తించేందుకు మొబైల్ యాప్‌లు, కాలుష్యనియంత్రణపై అవగాహన కల్పించేందుకు పాఠశాల డ్రైవ్‌లు, లేజర్‌షోలు వంటి పర్యావరణ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం అవసరం. 

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

ఉన్నట్ట మరి లేనట్ట..

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ‘ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్‌ను రిలీజ్ చేశారు హీరో శ్రీకాంత్. ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్ ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. ఎస్‌పి చరణ్, శృతిక సముద్రాల గాత్రాలు మైమరపించాయి. ఈ సాంగ్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి లేనట్ట సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఆర్పీ పట్నాయక్ ఎంతో బాగా కంపోజ్ చేశారు. త్రినాధ్, సాహితీ జోడి చాలా బావుంది. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీవిష్ణుకు జోడీగా..

హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో క్రేజీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు. జి నిర్మిస్తుండగా హేమ, షాలిని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించనున్నారని మేకర్స్ ప్రకటించారు. ఆమెకు బర్త్ డే విషెష్ అందిస్తూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగనుంది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. 

జనసేన కార్యకర్తపై టిడిపి శ్రేణుల దాడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై టిడిపి నేతలు దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు షాపులోని సామాన్లను బయటపడేశారు. తమకు రూ.30వేలు అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలని సాంబశివరావును టిడిపి నేతలు బెదిరించారు. జనసేన నాయకుడు ఎందుకు చెల్లించాలని టిడిపి నేతలను ప్రశ్నించాడు. దీంతో సాంబశివరావుపై టిడిపి నేతలు దాడికి పాల్పడ్డారు. రూ.3 వేల అద్దె చెల్లించాల్సిన షాప్ కి నెల నెల రూ.30 వేలు చెల్లించాలని టిడిపి నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. రోజు రోజుకు టిడిపి నేతల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని సాంబశివరావు భార్య రమ్య ఆరోపణలు చేశారు. జనసేన లేకుండానే టిడిపి ప్రభుత్వంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎంఎల్ఎ దాడి చేయమంటనే సాంబశివరావుపై టిడిపి నేతలు దాడి చేశారని రమ్య ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఒకేసారి డబ్బులు చెల్లిస్తామని, లేకపోతే అధికారులు మా షాపు సీజ్ చేస్తారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థానిక రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వాలంటే ఎలా? కుదురుతుందని ప్రశ్నించారు. షాపు తాళాలు టిడిపి తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం: 25 మంది సజీవహదనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. టేకూరు సమీపంలో ఉల్లిందకొండ వద్ద ప్రైవేటు టావల్స్ బస్సుకు మంటలు అంటుకోవడంతో 25 మందికిపైగా మృతి చెందారు. ఈ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో చిక్కుకున్న మరో 17 మంది ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.  డిడి 01 ఎఎన్ 9190 అనే నంబరు గల కావేరీ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసకుుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారని, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం. 

హైకోర్టు తీర్పు తర్వాతే.. స్థానికంపై నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్‌లకు సంబంధించి వచ్చేనెల 03వ తేదీన హైకోర్టులో కేసు ఉ న్నందున ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా 07వ తేదీన మరోసారి కేబినెట్ భేటీలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై ని ర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను సైతం ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సిఎం రేవంత్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పంచాయతీ రా జ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ ఆ మోదించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, సిఎం రేవంత్ ఇప్పటికే సం తకం చేశారు. దానికి గురువారం కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు.

గవర్నర్ సం తకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. కేబినెట్ భేటీ అ నంతరం మంత్రులతో సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. రాజకీయ అంశాల గురించి వారితో ఆయన చర్చించారు. స్థా ని క సంస్థల ఎన్నికలతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులు వ్యవహారించాల్సిన తీరు గురించి సిఎం రేవంత్‌రెడ్డి వారికి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది.

1994 తర్వాత మూడో సంతానం కలిగితే

1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఎపి నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కెసిఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన గురించి పట్టించుకోలేదు.

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే, ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. తాజాగా, గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి ఆమోదం తెలిపింది.

ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయం: మంత్రి పొంగులేటి

ఈ సందర్భంగా కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

శ్రీశైలం నుంచి నల్గొండకు టన్నెల్…

నల్గొండలోని ఫ్లోరైడ్ బాధితులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అందులో భాగంగా శ్రీశైలం నుంచి నల్గొండ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించామన్నారు. నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు 44 కి.మీల టన్నెల్‌ను నిర్మించాలని గతంలో ఆమోదించామని, అందులో భాగంగానే శ్రీశైలం నుంచి నల్గొండకు తలపెట్టిన టన్నెల్‌ను పూర్తి చేయాలని ఈ కేబినెట్‌లో నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రపంచంలోనే పొడవైన ఈ ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను పునరుద్ధరించాలని, మిగిలిన సొరంగం పనులను ఆధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

ఈ గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించవచ్చని మంత్రివర్గం నిర్ణయించింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడాలని, 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

రామగుండం ప్లాంట్‌ను డిస్‌మెంటల్ చేయాలని….

1,500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజీ ప్లాంట్‌కు ఆమోదం తెలిపినట్టు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్‌ను (ఆర్‌టిఎస్‌బి 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగియడంతో దానిని డిస్‌మెంటల్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని మంత్రివర్గం సూచించింది.

4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలి

4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఆస్పత్రుల్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీనగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలు ఉండగా అక్కడ జరిగే పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది

రౌడీ షీటర్‌కు కాంగ్రెస్ టికెట్

రౌడీ షీటర్‌ను చిత్తుగా ఓడించండి

ఈ ఎన్నిక హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ కోసం గట్టిగా కృషి చేయాలి

ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలి

అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..

చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలి

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్ రావు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ నేతలతో కెసిఆర్ సన్నాహక సమావేశం

ఈ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ గుల్ల అయిందని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో గురువారం సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది. పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ మార్గనిర్దేశం చేశారు.

ఇంటింటికీ తిరిగి వివరించాలి

జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని తెలిపారు.

బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని సూచించారు. ఓటు అడగడానికి తమ ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించి ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించి వారిని ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దామని, తన ఆలోచనలను అమలు చేసినందుకు ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కెసిఆర్ అభినందించారు.

అటువంటి అత్యున్నత స్థాయి విద్యను హాస్టల్ సౌకర్యాలను అందించిన గురుకులాల్లో పిల్లలు మరణించడం దారుణం, శోచనీయమని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతిని ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కష్టకాలంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల హృదయాలను గెలవాలి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో అసహ్యం ఏహ్య భావం నిండి ఉందని, మోసపోయామనే కోపంలో ప్రజలు ఉన్నారని కెసిఆర్ అన్నారు. సక్కదనంగ నడిసే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నామనే బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో స్పష్టతతో ఉన్నదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ చేసిన మోసం పట్ల రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలుపును ఇప్పడికే ప్రజలు ఖాయం చేశారని చెప్పారు.

భారీ మెజారిటీ సాధించడం కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పని చేయాలని, అందుకు డివిషన్ల వారీ క్లస్టర్ల వారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి హృదయాలను గెలవాలని వివరించారు. అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే తీరుగా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలని అన్నారు.

రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు

జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు. జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో 5లక్షల మందికి ఉపాధి

 2030 నాటికి సాధించడమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్

లక్షకోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే టార్గెట్

త్వరలో అందుబాటులోకి సమగ్ర లైఫ్‌సైన్స్ పాలసీ

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్‌లో ఇండియా నుంచి హైదరాబాద్‌కు మాత్రమే చోటు

 ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం

 ‘ఆస్ బయోటెక్ 2025’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ ’ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

250 బిలియన్ డాలర్లకు చేర్చేలా

భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2024 -2025లో తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా జాతీయ సగటు కేవలం 7.6 శాతం మాత్రమే ఉందన్నారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ ని అందుబాటులోకి తెస్తామన్నారు.

భారత్ నుంచి హైదరాబాద్ మాత్రమే

ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు దక్కిందన్నారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన మన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, వరల్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే ‘బయో-డిజిటల్’ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు.

మా నినాదం ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’

మా నినాదం మేడిన్ ఇండియా కాదు..ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ‘ఎకో సిస్టం’ తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్- అండ్ -ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ , దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్‌టెక్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్, హెల్త్‌టెక్, ఏపీఐ బల్క్ డ్రగ్ ఉత్పత్తి, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్‌లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్స్ , గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్,అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ‘విక్టోరియా -తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’ కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూధన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

లిక్కర్ దందాకు కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం

మన తెలంగాణ/హైదరాబాద్ : లిక్కర్ దందా, అవినీతి, దోపిడీలకు కల్వకుంట్ల కుటుంబం పేటెంట్ అని, రాజకీయ పబ్బం గడిపేందుకు కెటిఆర్ ఆరాటపడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ విఆర్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పం దించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నా యకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై పరువు నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. కెటిఆర్ రాజకీయ రంగు పులుముతూ పబ్బం గడుపుతున్నారని, కెటిఆర్ మతిస్థిమితి ఉండే మాట్లాడుతున్నార అని ఆయన ప్ర శ్నించారు. నా చరిత్ర కెటిఆర్‌కు తెలియదా అని ఆయన పేర్కొన్నారు. ఓడిపోయి పదవి ఇస్తానన్న వద్దన్నానని సొంత ఖర్చులతో పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడినా వ్యక్తినని ఆయన గుర్తు చేశారు. శవాల మీద పే లాలు ఏరుకున్న చందంగా అమరుల త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చారని ఆయన బిఆర్‌ఎస్‌పై ధ్వజమొత్తారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నిక లబ్ధికోసం బిఆర్‌ఎస్ నాయకులు బట్టకాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. ఎన్నిక ఏదైనా బిఆర్‌ఎస్‌కు పుట్టగతి ఉండదని, మసిపూసి మారేడుకాయ చేసే బిఆర్‌ఎస్ నైజాన్ని ప్రజలు పసిగట్టారని మంత్రి జూపల్లి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష రూపాయలకు కారు అమ్ముకునే స్థాయి నుంచి నేడు వేల కోట్లకు పడగలెత్తిన బిఆర్‌ఎస్ నాయకులు తనను, సిఎం రేవంత్‌ను వేలు ఎత్తి చూపే స్థాయికి ఎదిగారా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. సొంత చెల్లి లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే ఢిల్లీలో బిజెపి పార్టీ వద్ద మోకరిల్లి మీరు చేసిన పని ప్రజలకు తెలియదా అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

అధికారిగా విధులు నిర్వర్తించడంలో రిజ్వీ విఫలం

సంపాదన కోసం తాను ఏనాడు ఆశ పడలేదని, ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడటం మంత్రిగా తన బాధ్యత అని జూపల్లి తెలిపారు. అధికారిగా విధులు నిర్వర్తించడంలో రిజ్వీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రిజ్వీ విఆర్‌ఎస్‌ను ఆమోదించ వద్దని తాను సిఎస్‌కు లేఖ రాసిన విషయం నిజమేనని మంత్రి జూపల్లి ఒప్పుకున్నారు.

హోలోగ్రాం టెండర్‌లను పిలవడంలో రిజ్వీ అలసత్వం

ఆబ్కారీ శాఖలో హోలోగ్రాంకు సంబంధించి 2014లో ఒక కంపెనీకి అనుమతి ఇచ్చిందని మంత్రి జూపల్లి తెలిపారు. 2014 నుంచి 2019 వరకు అదే అగ్రిమెంట్‌ను పొడిగించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైతం ఇదే విధంగా కొనసాగుతుండంటలో ఆ కంపెనీని మార్చాలని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశానని మంత్రి జూపల్లి తెలిపారు. ఇలా అగ్రిమెంట్ పొడిగించడంతో ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు నష్టం వస్తుందని, దీంతో పలుమార్లు హోలోగ్రాంకు సంబంధించి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి జూపల్లి తెలిపారు. దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హోలోగ్రాం, నకిలీ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందని, దీంతో వాటిని పరిష్కరించాలని రిజ్వీని ఆదేశించానని మంత్రి జూపల్లి తెలిపారు. అయినా రిజ్వీ ఈ విషయంలో స్పందించలేదని, విధుల్లో నిర్లక్షం వహించారని మంత్రి జూపల్లి ఆరోపించారు.

రిజ్వీ ఆలస్యంతో ప్రభుత్వానికి రూ.230 కోట్ల నష్టం

దీంతో పాటుగా డిస్టిలరీ పాలసీలపై సంబంధిత మంత్రికి అధికారం ఉంటుందని, డిస్టిలరీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ సమకూరుతుందని సదరు ఫ్యాక్టరీలకు సంబంధించిన ఫైల్ వెంటనే పెట్టాలని రిజ్వీని ఆదేశిస్తే దానిపై ఆయన కొన్నినెలల పాటు ఆలస్యం చేశారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆ ఫైల్‌ను కేబినెట్‌కు పంపారని, మీరు కూడా పంపాలని రిజ్వీ తనకు సూచించారని, అయితే గత ప్రభుత్వ కేబినెట్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు తాను అడిగానని వాటికి సంబంధించిన సమాచారాన్ని రిజ్వీ ఇవ్వకపోగా ప్రభుత్వాన్ని, తనను తప్పుదారి పట్టించారని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు బార్ లీజు లైసెన్స్‌ల పొడిగింపు ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ.230 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. అధికారులు విధులు నిర్వర్తించకుండా అడ్డుపడితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రికి ఉంటుందని ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సిఎస్‌కు లేఖ రాశానని మంత్రి స్పష్టం చేశారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download