elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

bets10

casinolevant

casinolevant

casinolevant

casinolevant

nesinecasino

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

meritking

madridbet

kingroyal

pusulabet giriş

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

వారంలో డిసిసి అధ్యక్షులు

మన తెలంగాణ/హైదరాబాద్: నెలాఖరులోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సూచనప్రాయంగా చెప్పారు. శనివారం ఢిల్లీలో కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీ నాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, సం ఘటన్ సుజన్ అభియాన్‌కు చెందిన పలువురు పరిశీలకులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నందున జిల్లా పార్టీలు బలోపేతంగా ఉండాల్సిన అవశ్యకత గురించి

సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. అం దుకు కెసి వేణుగోపాల్ స్పందిస్తూ సాధ్యమైనంత త్వర గా నియమించాలన్న ఆలోచనతో ఉన్నామని, దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల జిల్లాల కమిటీల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావచ్చందని, వాటితో పాటు తెలంగాణ డిసిసి  అధ్యక్షులనూ నియమిస్తామని వివరించారు. ఏఐసిసి నియమించిన ఇరవై రెండు మంది పరిశీలకులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలే కాకుండా స్థానికంగా ఉండే వివిధ సంఘాలతో, స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల అభిప్రాయలను సేకరించారని కెసి వేణుగోపాల్ తెలిపారు.

అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తమకు సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇందులో కొన్ని జిల్లాల్లో మూడు పేర్లు ఉంటే, మరి కొన్ని జిల్లాల్లో ఐదు, ఆరు పేర్లతో కూడిన జాబితాలను అందజేశారని ఆయన తెలిపారు. మూడు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సిందిగా వారికి అందజేసిన మార్గదర్శకాల్లో చెప్పామని, అయితే బలమైన నాయకులు, ఉండడం, మహిళలు, సామాజిక సమతుల్యత కోసం ఐదు, ఆరు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పారని ఆయన తెలిపారు. వీటిని మరోసారి పరిశీలించి, వడపోసి మూడు పేర్లతో తుది జాబితాను సిద్ధం చేసి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందు పెట్టి ఖరారు చేస్తామని ఆయన వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తమ పరిశీలకులు ఎవరి వత్తిళ్ళకు లొంగకుండా జాబితాలు సిఫార్సు చేశారని ఆయన చెప్పారు.డిసిసి అధ్యక్షులుగా ఉన్న వారు తిరిగి పోటీ చేయరాదన్న నియమం ఉండడం ఒక రకంగా మంచిదేనని, దీని వల్ల పార్టీలో కొత్త ఇంకా యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, ముఖ్య నేతలంతా హస్తినలోనే..

ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితర ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. బిసి రిజర్వేషన్ల కోసం తాము చేసిన కృషిని, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని వివరించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి, ఏఐసిసి అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అందజేస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఏఐసిసి ముఖ్య నేతలతోనూ మంతనాలు జరిపే అవకాశం ఉంది.

అధిష్టానానికి సమాచారం ఇచ్చాం..ః భట్టివిక్రమార్క

ఇదిలాఉండగా కెసి వేణుగోపాల్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో అధిష్టానానికి సమాచారం అందించామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే గ్రామ, వార్డు స్థాయి నుంచీ కమిటీల ఎంపికను పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సేవలో నిమగ్నం అయ్యేలా చూస్తామన్నారు.

చివరి వన్డేలో భారత్ ఘన విజయం

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో గెలుపొంది పరువు నిలుపుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్నందుకుంది. దాంతో సిరీస్ 2-1తో ఆసీస్ కైవసమైంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ 121 నాటౌట్(125 బంతుల్లో 13×4, 3×6) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 74 నాటౌట్(81 బంతుల్లో 7×4) అజేయ అర్థశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మా థ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం..

స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు శుభారంభం దక్కింది. శుభ్‌మన్ గిల్(24) త్వరగానే ఔటైనా… తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. 63 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు.

రోడ్డున పడవద్దు: కెసి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కెసి వేణుగోపాల్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడినట్లు మీడియాలో, ప్రధానంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చిందని ఆయన అన్నట్లు సమాచారం. కాగా, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కల్పించుకుని అటువంటిదేమీ లేదని, మంత్రి కొండా సురేఖకు జిల్లాలోని ఇరువురు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం కారణంగా వివాదం చెలరేగిందని, అదంతా సమిసిపోయిందని వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏదైనప్పటికీ భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా చూడాలని,

సమన్వయం లేక రోడ్డున పడరాదని కెసి వేణుగోపాల్ వారితో అన్నారని సమాచారం. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ బలంగా ఉందన్న అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయరాదని ఆయన సూచించారు. మంత్రుల మధ్య విభేదాలు ఏమీ లేవని, తామంతా కలిసే ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వివరించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండే ఒకటి, రెండు పత్రికలే ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం వల్ల అపొహలకు, గందరగోళానికి దారి తీసినట్లు సమాచారం. ఒక పార్టీకి చెందిన పత్రిక కాబట్టే తప్పుడు కథనాలతో గందరగోళం సృష్టిస్తున్నదని ఆయన వివరించారని తెలిసింది.

త్వరలో కొత్త ఫీజులు ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ క ళాశాలలకు 202528 కాలానికి కొత్త ఫీజుల ఖరారు వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇంజనీరిం గ్, వృత్తి విద్యా కళాశాలల ఫీజులపై శనివారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) సమావేశం జరిగింది. సోమవారం మరోసారి నిర్వహించి ఫీజులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ తర్వాత ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ సారి ఫీజుల పెంపు భారీగా ఉండకపోవచ్చనీ ర్యాంకింగ్, న్యాక్, పరిశోధనలు తదితర నూతన కొలమానాల ఆధారం గా ఫీజులు నిర్ణయించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నా యి. ఇంజినీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి

టిఎఎఫ్‌ఆర్‌సి ఇప్పటికే ప్రాథమికంగా ఫీజులపై ఓ నిర్ణ యం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఫీజులపై విస్తృత కసరత్తులు చేశారు. టిఎఎఫ్‌ఆర్‌సి అధికారులు దాదాపు 160 కళాశాలల ప్రతినిధులతో పునర్విచారణ సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొత్త ఫీజులు ఖరారు చేశారు. దీని ప్రకారం అధిక శాతం కళాశాలలకు స్వల్పంగా, కొన్నింటికి గరిష్ఠంగా 20 నుంచి 30 శాతం మించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కళాశాలలు తమ ఫీజు ఖరారులో అన్యాయం జరిగిందని న్యాయస్థానానికి వెళ్లినా, శాస్త్రీయ ఆధారాలు చూపేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తె లుస్తోంది. మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, బి.ఇడి, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజులను సవరించాల్సి ఉంటుంది. ఆయా కళాశాలల ఆదా య, వ్యయాలను పరిశీలించి సాధారణంగా టిఎఎఫ్‌ఆర్‌సి కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది.

ఈ ప్రక్రియలో భాగంగా ఈసారి విద్యా నాణ్యత కోసం ఆయా కళాశాలల్లో అంతర్గత నాణ్యత పెంపు విధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థులకు, సిబ్బందికి ముఖగుర్తింపు హాజరు, పా రదర్శకత, జవాబుదారీతనం కోసం వేతనాలు తదితర వాటి చెల్లింపునకు ఆధార్ అధీకృత విధానం, పరిశోధనలు,స్టార్టప్ లు, పరిశోధన పత్రాలు, జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. గ తంలో కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టిఎఎఫ్‌ఆర్‌సికి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. 

‘గెలుపు’ రాజకీయాల్లో సానుభూతి సయ్యాట!

రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉండే కాలంలో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే ఆయన లేదా ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీకే ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని వదిలేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ మృతి చెందిన ఆ నేతకు గౌరవంగా నివాళులు అర్పించేవారు. క్రమక్రమంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అనే మాట అంతరించిపోయి బద్ధ శత్రువులు మిగిలారు. ఇటీవలి కాలంలో, అవి జాతీయ రాజకీయాలైన, ప్రాంతీయ రాజకీయాలైనా అన్ని పార్టీలు ఒకరినొకరు శత్రువులుగానే పరిగణిస్తూ ఉండటం చూస్తున్నాం.

ఇప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు పోటీని ‘స్పోర్టివ్’గా తీసుకోవడం మానేశాయి. అవతలి పక్షాన్ని ఓడించి తామే గెలవాలన్న పట్టుదల పెరిగింది. ఇది యుద్ధంలో శత్రువులు ఎంత మందినైనా చంపి విజయం సాధించాలన్న రాజ్యకాంక్ష వంటిది. అది ఇప్పుడు మనకు ఎల్లెడలా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఉచ్చనీచాలు మరిచిపోయి, స్థాయిని విస్మరించి అవతలిపక్షం వారిని అవమానించే విధంగా మాట్లాడటం, ప్రకటనలు చేయడం పరిపాటి అయింది. ఈ పక్షం ఆ పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అట్లానే తయారవుతున్నాయి. ఇక ఎన్నికల అప్పుడు సరే సరి. పోటీలు పడి వ్యక్తిగత విమర్శలు, అవతలి వారి వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని స్థితి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరపవలసిన అవసరం ఏర్పడింది. నిజానికి ఇది పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం. దీని పరిధిలో జూబ్లీహిల్స్ లేకపోవడం ఓ విచిత్రం. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా ఈ ఉపఎన్నిక జరపవలసి వచ్చింది. గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై పార్టీ మారి భారత రాష్ట్ర సమితిలో చేరి ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి.

ప్రస్తుతం ఆయన సతీమణి సునీత భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే యువ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా లంకల దీపక్ రెడ్డిని పోటీలోకి దింపింది. ఇక్కడ అంత ప్రాముఖ్యం లేకపోయినా ఒక విషయం సరదాగా అయినా గుర్తు చేసుకోవాలి. ఈ ముగ్గురు అభ్యర్దులూ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీతో సంబంధం ఉన్న వారే. ముందే చెప్పుకున్నట్టు బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీత భర్త మాగంటి గోపినాద్ మొదట తెలుగు దేశం శాసన సభ్యుడే కాగా బీజేపీ ప్రస్తుత అభ్యర్థి రాజకీయ ప్రస్తానం కొంత కాలం చంద్రబాబు నాయుడు పార్టీలోనే.

ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను 2019కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో పార్టీలో చేరడానికి శ్రీశైలం యాదవ్ తీసిన ఊరేగింపును ఆనాటి హోంమంత్రి ఏ. మాధవ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కూడా. ఆరోజుల్లో అది పెద్ద చర్చనీయాంశం కూడా అయింది. సరే ఇప్పుడిక్కడ ఆ పార్టీకి పెద్ద ప్రాముఖ్యత లేదనుకోండి, అయినా మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చాను, సెల్ ఫోన్ నేనే తెచ్చాను అన్న చందంగా అన్ని పార్టీల అభ్యర్ధులను నేనే తెచ్చాను అని కూడా చంద్రబాబు చెప్పుకోగలరు.

ఇక ప్రస్తుతానికి వొస్తే, సానుభూతి పవనాలు వీచి తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం, ఈ రెండేళ్లలో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అన్న అభిప్రాయంతో తమ గెలుపు తధ్యమని అభిప్రాయంలో బిఆర్‌ఎస్ ఉంటే, ఉప ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన ఫలితాలనిస్తాయని ఒక అభిప్రాయంతో పాటు తాము వెనుకబడిన తరగతుల 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి చూపిన చొరవ, చిత్తశుద్ధి పనిచేసే తాము నియమించిన యువ బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం అని భావిస్తున్నది అధికార కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లలో దాదాపు 1,20,000 ఓట్లు మైనారిటీలవి ఉండడం, ఈసారి మజిలీస్ పార్టీ పోటీ చేయకుండా అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం కూడా తనకు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్న పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చునని అభిప్రాయం సర్వత్ర ఉన్నది.

సరిగ్గా మరో రెండు వారాలకు ఎన్నిక జరగనున్న ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పక్షాలు పట్టుదలగా పనిచేయడానికి కారణాలు ఉన్నాయి. వాటిని గురించి చర్చించే ముందు ప్రత్యర్థులు శత్రువులుగా మారి పోటీలు పడుతున్న ఈ తరుణంలో ప్రజలలో సానుభూతి అనే అంశం అంతగా ప్రభావం చూపడం లేదని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు వివిధ కారణాల చేత ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జనం భిన్నమైన ఫ లితాలని రాజకీయ పక్షాలకు రుచి చూపించారు. 2016 లో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో, ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం బీఆర్‌ఎస్ పరమయింది. అట్లాగే పాలేరులో కూడా కాంగ్రెస్ స్థానం బీఆర్‌ఎస్ వశమైంది. ఇక్కడ సానుభూతి పనిచేయలేదు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి టిఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికై మంత్రి అయ్యారు. 2019లో లోకసభకు ఎన్నికైన కారణంగా ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినందు వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు.

2020లో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణిస్తే ఆయన సతీమణిని బీఆర్‌ఎస్ పోటీకి నిలిపినా అక్కడ అనూహ్యంగా ప్రజలు బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించారు. దుబ్బాకలో సానుభూతి పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పక్షమే గెలుస్తుందన్న వాదన కూడా పటాపంచలైంది. ఇక 2021లో నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య మరణిస్తే ఆయన కుమారుడు నగేష్ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే జనం ఓట్లు వేసి గెలిపించారు. ఇట్లా దుబ్బాక నాగార్జునసాగర్‌లలో ఫలితాలు పూర్తి భిన్నంగా రావడానికి ఇతరేతర కారణాలు ఉంటాయి.

అదే సంవత్సరంలో హుజరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక గురించి, ఆ వెనువెంటనే 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌ను అకారణంగా, అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించడం, పార్టీ నుండి వెలివేయడం, అవినీతి కేసులు పెట్టడం వంటివి చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయాన్ని వ్యతిరేకించి హుజరాబాద్ ప్రజలు బిజెపి టికెట్ తెచ్చుకున్న ఈటెల రాజేందర్‌ను గెలిపించారు. దళిత బంధు వంటి బీఆర్‌ఎస్ జిమ్మిక్కులు కూడా అక్కడ పని చేయలేదు. బిజెపి ఘనత కంటే ఈటెల రాజేందర్‌కు ప్రజలలో ఉన్న వ్యక్తిగత పలుకుబడి, కేసీఆర్ నిర్ణయాల పట్ల పెరిగిన వ్యతిరేకత బాగా పనిచేసాయి.

అదే మునుగోడు దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి ప్రజలు బిఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. అయితే మునుగోడులో భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ ఒకసారి తన సహజ మిత్రులని కౌగిలించుకొని భవిష్యత్తులో ఇంకెప్పుడు వారితో మిత్రత్వం వదులుకోబోనని కెసిఆర్ బోలెడు వాగ్దానాలు చేసిన కారణంగా ఆ పార్టీకి సంబంధించిన పదివేల ఓట్లు పడి అంతే తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థి బయటపడి కెసిఆర్, బీఆర్‌ఎస్ పరువు దక్కినట్టు అయింది . హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు సానుభూతి పనిచేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అది ఏ మాత్రం సాయం చేయలేదు.

ఇక ఈ క్రమంలో జరిగిన చివరి ఉప ఎన్నిక 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే మరణించిన గడ్డం సాయన్న కూతు రు లాస్య నందిత ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎ మ్మెల్యేగా గెలిస్తే ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మ రణించాక ఆమె సోదరి నివేదితని పోటీకి నిలిపితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ సానుభూతిని కాదని అధికారం గెలిచింది. ఓ పక్క 2023లో అధికారం కోల్పోయి, 2024లో ఒక్క లోక్‌సభ స్థానం గెలుచుకోలేకపోయిన బిఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్ ఓటమి మూలి గే నక్క మీద తాటి పండు పడ్డ సామెతగా తయారైంది.

ఇక ఎవరి బలం ఎంతో స్పష్టంగానే ఉన్న సమయంలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు పట్టుదలకు పోతున్నాయి అంటే, బీఆర్‌ఎస్‌కు ఇద అగ్ని పరీక్ష వంటిది. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ చుట్టుపక్కల గల నగర నియోజకవర్గాలన్నీ గెల్చుకున్నది. అధికారంలోకి వొచ్చాక కాంగ్రెస్ ఇది దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం దాని చుట్టూ చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అయితే పార్టీ మనుగడ కష్టం కాబట్టి జూబిలీహిల్స్‌ను నిలుపుకోవాలన్న పట్టుదల బీఆర్‌ఎస్‌ది. స్థానిక ఎన్నికల ముంగిట్లో జూబ్లీహిల్స్ గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుందన్న ఆలోచన కాంగ్రెస్‌ది.

వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా సర్

న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఎ న్నికల ఓటర్ల జాబితాల స వరణ(సర్)ను ఎన్నికల సంఘం వచ్చే వారం నుం చి ఆరంభించనుంది. వ చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పా టు పది నుంచి 15 రాష్ట్రాలలో తొలుత సర్ ప్రక్రియ చేపడుతారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాల సవరణ కీలకం కానుంది. ఇక ఎప్పటి నుంచి ఈ సవరణల ప్రక్రియ ఆరంభమవుతుందనేది ఎన్నికల సంఘం నవంబర్ తొలివారంలో ప్రకటిస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లేదా జరగాల్సిన చోట్ల సర్ నిర్వహించడం లేదు. మిగిలిన రాష్ట్రాలలోసర్ ఆ తరువాతి దశల్లో చేపడుతారు.

ఓటర్ల జాబితా సవరణల ద్వారా ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేందుకు దారి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల సంఘం రెండు సార్లు రాష్ట్రాల ఇసిలతో సమావేశం జరిపింది. క్షేత్రస్థాయిలో సాధకబాధకాలను తెలుసుకుంది. సర్ విషయంలో వివాదాలకు తావులేకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు , పౌరులు తమకు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎన్నికల సంఘం పిలుపు నిచ్చిం ది. ఇంతకు ముందటి ఓటర్ల జాబితాల తుది ఫైళ్లను ఎన్నికల సంఘం ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వీటి ప్రాతిపదికననే ఓటర్ల జాబితాలో సవరణకు వీలేర్పడుతుందని అధికారులు తెలిపారు. బీహార్ సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పుడు ఎటువంటి వివాదాలకు తావులేకుం డా చూసుకునేందుకు సిద్ధం అయింది. 

అంగన్‌వాడీలో త్వరలో భారీగా భర్తీలు

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నియమితులైన సూపర్‌వైజర్లంతా త మ వృత్తి ధర్మాన్ని నిబద్దతతో పాటించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శా ఖ మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తే మీ చే తుల్లో ఉన్నందున మీ వృత్తి ధర్మం ప్రజల ఆశలు, అవసరాలకు తగినట్టుగా ఉండాలని కొత్త సూపర్‌వైజర్లకు మంత్రి మార్గదర్శనం చేశారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క శనివారం స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి చ్చేసిన మంత్రి సీతక్క,

మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తో కలిసి కొత్తగా నియమితులైన సూపర్వైజర్లను అభినందిస్తూ, వేల మందితో పో టీ పడి మీరు సాధించిన ఈ కొలువులు మీ కష్టానికి ప్రతిఫలం. మీ నిరీక్షలు ఫలించాయి, మీ ఉద్యోగ కలలను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ఒక్కో సూపర్‌వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని, ఎక్కడా చిన్న లోపం లేకుం డా ఆయా కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పౌష్టికాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్య ను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. మ హిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అం గన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె అన్నారు.

తెలంగాణ నుంచే అంగన్వాడీ కేంద్రాలకు బీజం పడింది

ఐసిడిఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ గారు ప్రాణం పోశారని అ న్నారు. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయని గుర్తు చేశారు. 1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని అన్నారు. అంగన్వాడీ హెల్పర్ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈ రోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువేనని తెలిపారు. ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలని సీతక్క పేర్కొన్నారు. అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయని వివరించారు. చిన్నారుల కోసం 57 రకాల ఆటవస్తువులు,

యూనిఫాంలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాం. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని తెలిపారు. నియామక పత్రాలు అందుకునే సమయంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటు ంబ సభ్యులు, పిల్లలను హత్తుకొని ఆనంద భాష్పాలు కార్చారు. వారి కళ్లల్లో ప్రతిఫలించిన ఆనందం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, మంత్రి సీత కనితిత్వంలోని మహిళా సంక్షేమ శాఖ పనితనానికి నిదర్శనంగా నిలిచింది.

పటిష్టమైన సమాజం అంగన్వాడీల్లోనే నిర్మితమవుతుంది

మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ పటిష్టమైన సమాజం అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. మహిళల కు పెద్దదిక్కుగా ఉన్న సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండటం ఆ శాఖలోని సిబ్బంది అదృష్టమని పేర్కొన్నారు. సీతక్క స్ఫూర్తితో సూపర్వైజర్లంతా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నియామక పత్రాలు అందుకు న్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూపర్వైజర్లు విధి నిర్వహణలో అత్యంత నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు.

రష్మిక నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

శనివారం ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ నటనతో కథకు లైఫ్ ఇచ్చారు. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. నిజాయితీగా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “రష్మిక లేకుంటే ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్‘ తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ నటనతో ఆకట్టుకుంటారు”అని తెలిపారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది”అని తెలియజేశారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి. ఈ సినిమా చూశాక దీక్షిత్ ఎంత మంచి నటుడు అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రష్మిక, దీక్షిత్‌తో మంచి నటనను రాబట్టాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, విద్యా కొప్పినీడి, బన్నీ వాస్, ఎస్‌కేఎన్, కృష్ణన్ వసంత్ పాల్గొన్నారు.

మళ్లీ వస్తామో లేదో!: రోహిత్

సిడ్నీ: నేను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో వస్తామో లేదో తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ప్రతీ క్షణం అద్భుతమేనని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరివన్డేలో రోహిత్ శర్మ(121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74 నాటౌట్) అజేయ అర్థ శతకంతో రాణించాడు. మ్యాచ్ అనంరతం రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్‌కు వస్తామో లేదో తెలియదు. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను’అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డ్ తోపాటు ప్లేయర్ ఆఫ్ దిసిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ప్రదప్రర్శన గురించి మాట్లాడిన రోహిత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వార ఫలాలు (26-10-2025 నుండి 01-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. గతంలో కంటే కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీకున్న తెలివితేటలతో ఓర్పుతో సహనంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలను అని నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. సంతానం యొక్క చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కాలభైరవ రూపు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎరుపు.

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా గ్యాస్ట్రిక్ అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కళారంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా సహోద్యోగులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టమైనది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ ఈ వారం చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు విదేశాలకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఏర్పడినటువంటి అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి-ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా చెప్పుకోదగిన స్థాయిలో సమస్యలు ఏర్పడవు. ఉద్యోగ పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంత నిర్ణయాలు ఒక్కోసారి కలిసి రాకపోవచ్చు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓంనమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటక రాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే కూడా బాగుందని చెప్పవచ్చు. మీరు ఏపని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాణించ గలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ కార్తిక మాసంలో ఓం నమశివాయ భక్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.

సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులు పెడతారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఈ కార్తీకమాసంలో ఉదయం సాయంత్రం ప్రతి రోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన లాభాలకు సమానంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. దూర ప్రయాణాలలో చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ప్రతి నిత్యం ఓం నమశివాయ వత్తులతో నువ్వులనూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్.

తులా రాశి వారికి గతవారం కంటే ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు అప్లై చేసిన లోన్లు మంజూరు అవుతాయి. భూ సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. ఈ వారం పొదుపు కూడా చేయగలుగుతారు. కొంతమేరకు అప్పులను తీర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానాచలం కోరుకున్న వారికి కోరుకున్నట్టు జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్థాయి. వివాహ ప్రయత్నాలు కొంత నెమ్మదిగా జరుగుతాయి. సంతానం పట్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ దక్కుతాయి. ఈ రాశి వారికి నూతన గృహ యోగం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి మనసును అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి జాగ్రత్త వహించండి. అన్నీ నాకే తెలుసు అనే భావనను పక్కనపెట్టి స్థిమితంగా ఆలోచించడం మంచిది. లేకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి బ్యూటీషియన్స్ కి టెక్నీషియన్స్ కి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. ఈ కార్తీకమాసంలో మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ .

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు 10 శాతం కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం సరైన సమయం. అదేవిధంగా ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా కలిసివచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి జాగ్రత్త వహించండి. అదేవిధంగా విదేశీయాన సంబంధిత విషయ వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ వారికి సినీ కళా రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు సైతం మంచి లాభాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మీరు చేపట్టే ప్రతి పని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో నువ్వులు నూనెతో దీపారాధన చేయడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోకుండా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు తెలుపు.

ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. దూర ప్రాంత ప్రయాణాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. అనుకోని అవార్డ్స్ రివార్డ్స్, అతిధి మర్యాదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం ముందుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఎక్కువగా పొగిడే వారు ఉంటారు వారి పట్ల జాగ్రత్త వహించండి. పదిమందికి ఏదో విధంగా సహాయ పడాలనే ఆలోచన నెరవేరుతుంది. నూతన గృహ యోగం ఉంది రియల్ ఎస్టేట్ వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ కు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది.ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ రాశి వారిపై ఈర్షద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది దీనికోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే శని స్తోత్రం కూడా చదవండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా లేవు సొంతంగా వ్యాపారం చేసుకోవడం మంచిది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలి. లేదా ఆప్త మిత్రులు లేక స్నేహితుల సలహాలు తీసుకోవాలి. కానీ నిర్ణయంమాత్రం మీదే అయ్యుండాలి. అలాగే సంతాన సంబంధిత వ్యవహారాలు కూడా బాగున్నాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో లావాదేవీలు నిలకడగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.

కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చే వేస్తారు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ

మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఈ కాలంలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెడతారు. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

 

Wordpress Free Themes and Premium WP Plugins Download