elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

deneme bonusu

బీహార్ రాజకీయాల్లో కొత్తనీరు

1970వ దశకంలో మార్పు కోసం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దేశంలోని యువతలో ఓ నూతన భావావేశం రగల్చడంతో జాతీయ రాజకీయాలే పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా కుంచించుకు పోతూ రావడమే కాకుండా, మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలోనే కాకుండా అనేక పెద్ద రాష్ట్రాలలో కూడా ఏర్పడుతూ వచ్చింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో నూతన నాయకత్వంను కూడా బీహార్‌లో ప్రారంభమైన యువత ఉద్యమం కారణమైంది. అయితే, అప్పటి నుండి బీహార్ రాజకీయాలు మాత్రం, ముఖ్యంగా గత 35 ఏళ్లుగా కేవలం ఇద్దరు నాయకుల చుట్టూ పరిమితం అవుతూ వస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లలో ఎవ్వరో ఒకరు లేకుండా అక్కడ ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా 20 ఏళ్లుగా ఎన్నికల్లో ఎవ్వరు గెలుపొందినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం నితీశ్ అన్న విధంగా బీహార్ రాజకీయాలు మారుతూ వచ్చాయి.

ఇప్పుడు మొదటిసారిగా బీహార్ రాజకీయ మార్పు వైపు ప్రయాణిస్తున్నట్లు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి వెల్లడిస్తున్నది. లాలూ ప్రసాద్ ఇప్పటికే ఎన్నికల రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక నితీశ్ కుమార్‌కు సైతం దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఆయనలో భరోసా కనిపించడం లేదు. ‘జంగిల్ రాజ్’ గా ముద్రపడిన లాలూ ప్రసాద్ కుటుంబం నుండి బీహార్‌కు విముక్తి కలిగిస్తాననే నినాదంతో 2005 లో అధికారంలోకి వచ్చిన ఆయన శాంతిభద్రతలు, మహిళలకు రక్షణ, నేరస్థులను కట్టడిచేయడం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం వంటి సదుపాయాలు కల్పించడంలో పేరొందారు. బహుశా దేశం మొత్తం మీద మహిళా ఓటర్ల మద్దతుతో సుదీర్ఘకాలం రాజకీయాలలో నెట్టుకు వచ్చిన నేత ఆయనే అని చెప్పవచ్చు. 2020 బీహార్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్‌డిఎ కేవలం .03% ఓట్ల తేడాతో మహాఘట్‌బంధన్‌ను ఓడించింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు సైతం ఎన్‌డిఎకు సంతృప్తికరంగా లేవు. అందుకనే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంతోనే గతంలో మాదిరిగా నితీశ్ కుమార్‌ను పక్కకు నెట్టే సాహసం బిజెపి చేయలేకపోతుంది. గతంలో ఎల్‌కె అద్వానీ హయాంలో రామ్ విలాస్ పాశ్వాన్‌ను, మోడీ హయాంలో చిరాగ్ పాశ్వాన్‌ను ప్రయోగించి నితీశ్‌ను కట్టడి చేసే విఫల ప్రయత్నం చేశారు.

మొదటిసారిగా బీహార్ లో ఆధిపత్యం కోసం యువ నాయకత్వం పోటీపడుతున్నది. తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్, ముఖేష్ సహాని లేదా ప్రశాంత్ కిషోర్ వంటి వారు బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్‌ను ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవంక, ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రకటించారు. బీహార్ రాజకీయాలలో తమకంటూ ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేని బిజెపి చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహిస్తున్నది. ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచే ప్రయత్నం చేశారు. అతని బలానికి మించి 29 సీట్లు అతని పార్టీకి కేటాయించింది. ఇక మొన్నటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీలకు సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ తానే స్వయంగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. రెండేళ్లపాటు పాదయాత్ర ద్వారా ప్రజలలో బలమైన ముద్ర వేయించుకొనే ప్రయత్నం చేశారు. తన పార్టీ గెలిస్తే 150 సీట్లు, లేకపోతే 10 లోపు సీట్లు మాత్రమే పొందుతుందంటూ ‘గాలివాటం’పైన ఆధారపడుతున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఒక విధంగా ఎన్నికలకు రెండు నెలల ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘ఓటరు అధికార్ యాత్ర’కు విశేషమైన స్పందన లభించింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సంకేతాలు లభించాయి. కాంగ్రెస్ తన ఇండియా కూటమి భాగస్వాములతో కలిసి మద్దతును ఏకీకృతం చేయాలని లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, ఎంకె స్టాలిన్ లతో సహా కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఆ తర్వాత రెండు నెలలపాటు రాహుల్ గాంధీ బీహార్ వైపు చూడలేదు. మరోవంక, సీట్ల సర్దుబాటులో ప్రతిపక్ష కూటమి చతికలపడింది. అధికారికంగా సీట్ల సర్దుబాట్ల గురించి ప్రకటించలేకపోయారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించడం ద్వారా ఎన్‌డిఎ కూటమిని ఆత్మరక్షణలో పడవేశారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్ కుమార్ ను ఎన్నికల అనంతరం వదిలివేసి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు వైపు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికలకు నితీశ్ కుమార్ నేతృత్వంలో వెడుతున్నామని చెబుతూనే ఎన్నికల అనంతరం ఎన్‌డిఎ ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్ష కూటమి ప్రకటించగానే ఆత్మరక్షణలో పడిన బిజెపి సైతం నితీశ్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పక తప్పలేదు. ఆ మరుసటి రోజే బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం బిజెపి శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలనే పట్టుదల వారిలో ఉంది. అదే విధంగా జెడియు శ్రేణులలో సైతం బిజెపి పట్ల సానుకూలత కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల మధ్య ఓట్ల మార్పిడి ఏమేరకు సవ్యంగా కొనసాగుతుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా బీహార్‌లో కులాల ప్రాతిపదికనే పార్టీల బలాలు ఆధారపడి ఉన్నాయి. 57 శాతం మంది పార్టీ, అభ్యర్థ్డిని కాకుండా కులాన్ని చూసి ఓటు వేస్తారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖేష్ సహానిని ఉపముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా బాగా వెనుకబడిన వర్గాలలో బిజెపి మద్దతుకు గండికొట్టే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నితీశ్ పాలనలో కొంతకాలంగా శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారడం, అభ్యర్థుల ఎంపిక రెండు ప్రధాన కూటమిలలో సైతం గందరగోళాలకు దారితీయడం, బిజెపి ప్రచారం చేస్తున్న ‘జంగిల్ రాజ్’ (లాలూ కుటుంబం పాలన) గురించి ఏమాత్రం తెలియని ఓ కొత్త తరం ఓటర్ల ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారడం వంటి పరిణామాలు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నాయి. వాస్తవానికి బీహార్ లో పట్టు సంపాదించుకోవడం కోసం ప్రధాని మోడీ 2014 నుండే విశేషంగా కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టారు. అయినప్పటికీ బలమైన నాయకత్వం బిజెపికి లోపించడంతో బీహార్ లో గట్టి పట్టు సంపాదించుకోలేకపోతుంది. నితీశ్ లేకుండా బిజెపిని బలోపేతం చేయడంకోసం ప్రయత్నించారు. అయితే, అటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు నితీశ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి ప్రభావం చూపుతారని ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. దేశంలో ఎన్నికల గందరగోళాన్ని మొదట అర్థం చేసుకున్న కొద్దిమందిలో కిషోర్ కూడా ఉన్నారు. ఇప్పుడు నాయకుడిగా కూడా, అతను చాలా తక్కువ సమయంలోనే పార్టీని నిర్మించాడు. ఎంతగా అంటే అతను ఇప్పుడు 243 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాడు. అయితే, జన్ సురాజ్ అభ్యర్థులలో ముగ్గురిని ఉపసంహరించుకోవాలని బిజెపి బలవంతం చేసిందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి కండలవీరులను ఉపయోగించుకునేవారు. తర్వాత, చాలా మంది కండలవీరులు తామే రాజకీయ నాయకులుగా మారారు. అదే విధంగా, రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చే కొంతమంది వ్యాపారవేత్తలు కూడా విధానాలను నేరుగా ప్రభావితం చేయడానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యూహకర్త ఎందుకు రాజకీయ నాయకుడిగా మారలేరు? అనుకుంటూ ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.

ఒక దశలో బీహార్‌లో పికె కింగ్ మేకర్ కాబోతున్నారని చాలామంది భావించారు. 8 నుండి 10 శాతం ఓట్లతో ఆయన మద్దతు లేకుండా ఎన్నికల అనంతరం ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చని కూడా అంచనా వేశారు. అయితే, ఎప్పుడైతే తాను సొంతంగా ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని ప్రకటించారో అప్పటి నుండి ఆయన ప్రాధాన్యత తగ్గుతున్నట్లు సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. ఆయనకు లభించే ఓట్లు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, ఎన్నికల వ్యూహకర్తగా మీడియాలో సంచలనాలకు పేరొందిన ప్రశాంత్ కిషోర్ గురించి బీహార్‌లో సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే మొదట్లో నరేంద్ర మోడీ, తర్వాత ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకె స్టాలిన్ వంటి విభిన్న నేతలకు ఎన్నికల ప్రచార వ్యూహాలు జరిపించారు. రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడం ఆయన మార్క్ ప్రచారంగా పేరొందింది. ప్రజాక్షేత్రంలో ఏనాడూ విశ్వసనీయ నేతగా గుర్తింపు పొందలేకపోవడమే కాకుండా ఆయన పనిచేసిన నాయకుల వైరుధ్యం గమనిస్తే ఆయనకు సైద్ధాంతిక నిబద్ధత కూడా లేదని స్పష్టం అవుతుంది.

మరోవంక, వివాదాస్పదంగా మారిన ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) రాజకీయంగా బిజెపికి ఏమాత్రం ప్రయోజనం కలిగిస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. 65 లక్షల మంది ఓటర్లను తొలగించగా, వారిలో తమ మద్దతు దారులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ స్థానిక నేతలే వాపోతున్నారు. ఒక విధంగా ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్ కు సవాల్ అని చెప్పవచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా మెజారిటీ తీసుకు రావడంలో విఫలం చెందారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సాధించిన విజయాలలో సైతం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పట్టుదల కారణంగా ఎక్కవు లాగా భావిస్తున్నారు. బీహార్ లో బిజెపిని గెలిపించలేకపోతే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

– చలసాని నరేంద్ర, 98495 69050

ఆగి ఉన్న కార్గో బస్సును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కార్గో బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ప్రజాధనం దుర్వినియోగమా?

భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ -ప్రభుత్వ సంబంధాలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక దర్యాప్తు నివేదికలో మోడీ ప్రభుత్వం అదానీ గ్రూపును ఆదుకోవడానికి ప్రజానిధులను ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, అమెరికా లాంటి విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిన సమయంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) నుంచి దాదాపు 3.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33000 వేల కోట్ల రూపాయలు) అదానీ సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రభుత్వం ఒక ప్రైవేటు సమూహానికి అనుకూలంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. ఈ విషయం భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా అదానీపై అమెరికాలో జరుగుతున్న దర్యాప్తుల నేపథ్యంలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. 2023 లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ సంస్థల్లో స్టాక్ మానిప్యులేషన్, ఆర్థిక అవకతవకలు ఉన్నాయని పేర్కొంది.

దీంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. ఇప్పుడు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ (డిఒజె), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసిసీ) అదానీపై మరిన్ని ఆరోపణలు చేశాయి. 2024 నవంబర్‌లో వెలువడిన ఇండిక్ట్‌మెంట్ ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ప్రాజెక్టుల కోసం భారత అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ లంచాలను దాచి, అమెరికా పెట్టుబడిదారుల నుంచి 2 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ఇంకా 2025 అక్టోబర్ నాటికి భారత అధికారులు అమెరికా సమన్లు అందించడంలో విఫలమయ్యారని ఎస్‌ఇసి కోర్టుకు తెలిపింది. ఇవి అదానీ గ్రూపు ఆర్థిక స్థితిని మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ నివేదిక మరింత ఆసక్తికరం. మే 2025 లో ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతిఆయోగ్, ఎల్‌ఐసి సమన్వయం తో ఒక ప్లాన్ రూపొందించారని అది పేర్కొంది.

అదానీ పోర్ట్ కోసం 585 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ జరిగింది. దీనిని ఎల్‌ఐసి మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసింది. ఇంకా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్ లాంటి సంస్థల్లో 3.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెంచారు. ఈ చర్యలు అదానీ గ్రూపు రుణాలు (2024లో 20% పెరిగాయి) తగ్గించడానికి సహాయపడ్డాయి. కానీ, ఇది ప్రజా నిధుల దుర్వినియోగమని విమర్శకులు అంటున్నారు. ఎల్‌ఐసికు 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్నారు. వీరు ఎక్కువగా మధ్యతరగతి, గ్రామీణ ప్రజలు. వారి పొదుపులను రిస్కీ పెట్టుబడుల్లో పెట్టడం సరికాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఎల్‌ఐసి అదానీ షేర్లలో రూ.7,850 కోట్ల రూపాయల నష్టపోయింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గేలు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం’ అని పిలుస్తున్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దర్యాప్తును ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో కూడా ఈ విషయం హాట్ టాపిక్. కొన్ని పోస్టులు మోడీ -అదానీ బంధాన్ని ‘గుజరాత్ మాఫియా’ అని వర్ణిస్తున్నాయి. మరికొన్ని ఎల్‌ఐసి పెట్టుబడులు మార్కెట్ ఆధారితమని డిఫెండ్ చేస్తున్నాయి.

అయితే, అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ‘నిరాధారం’ అని ఖండించింది. ఎల్‌ఐసి కూడా తమ పెట్టుబడులు డ్యూ డిలిజెన్స్‌తో చేస్తామని, ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదని చెప్పింది. అదానీ బాండ్లు 10- సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల కంటే 8.02 శాతం అధిక రాబడి ఇస్తున్నాయని వారు వాదిస్తున్నారు. విశ్లేషణాత్మకంగా చూస్తే ఇది భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం సమస్యను హైలైట్ చేస్తుంది. అదానీ గ్రూపు ఓడరేవులు, విద్యుత్, మౌలిక సదుపాయాల్లో విస్తరణ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. కానీ, దాని కోసం ప్రజా సంస్థలను ఉపయోగించడం సరికాదు. సెబీ హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో కొన్నింటిని తోసిపుచ్చింది. కానీ, యుఎస్ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆస్ట్రేలియా ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టీమ్ బక్లీ లాంటి నిపుణులు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం సజీవంగా ఉంది’ అని అంటున్నారు. చివరగా, ఈ వివాదం ప్రభుత్వం, కార్పొరేట్ల మధ్య సమతుల్యత గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం అయితే, అది సామాన్యులకు నష్టం. స్వతంత్ర దర్యాప్తు అవసరం, లేకపోతే ఇలాంటి సమస్యలు మరిన్ని వస్తాయి.

– కోలాహలం రామ్ కిశోర్

– 9849328496

వన్డేల్లో కోహ్లీ రూల్ నే… టి20ల్లో అతడు ఫాలో అవుతున్నాడు: కార్తీక్

హైదరాబాద్: శుభ్‌మన్ గిల్ టెస్టులో అదరగొడుతున్నాడు. వన్డేలలో కూడా పర్వాలేదనిపిస్తాడు. వన్టే, టెస్టులకు గిల్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అదనపు బాధ్యతలు రావడంతో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. టి20లకు మాత్రం వైఎస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసీస్‌లో తొలి టి20లో గిల్ బ్యాటింగ్‌లో అరదగొట్టాడు. అభిషేక్ ఔటైన తరువాత సూర్యతో కలిసి గిల్ అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ సందర్భంగా గిల్ బ్యాటింగ్ తీరును మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొనియాడారు. కెప్టెన్, వైఎస్ కెప్టెన్ పదువుల రావడంతో గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడన్నారు. టి20ల్లో ఒత్తిడి లేకుండా ఆడడం అనే గొప్ప విషయమని ప్రశంసించారు. బాధ్యతలే అతడిలో ఉత్తమ ఆటను బయటకు తీసుకొస్తున్నాయని, ఆత్మవిశ్వాసం పెరగడంతో వన్డే, టెస్టుల్లో నిలకడ పరుగులు చేస్తున్నాడని, టి20ల్లో పరుగుల మాత్రం ఆపకూడదని దినేశ్ కార్తీక్ సలహా ఇచ్చాడు. వన్డేలలో కోహ్లీ క్రీజులో ఉంటే చాలు పరుగులు వాటంతట అవే వస్తాయని, గిల్ కూడా టి20ల్లో అదే రూల్ పాలో అవుతున్నారని మెచ్చుకున్నాడు. ఆసీస్ జరిగిన టి20లో స్కోరు బోర్డు చూసే వరకు ఎన్ని పరుగులు చేశాడో తెలియదన్నాడు. వన్డేలో కోహ్లీ ఆటను టి20ల్లో గిల్ చూపిస్తున్నాడన్నారు. భారత్ బ్యాటింగ్ డెప్త్ చాలా పెద్దదిగా ఉందని, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను దాటుకొని ఓపెనర్‌గా గిల్ వచ్చాడని, టి20ల్లో ఓపెనర్‌గా రావడం అనేది కఠినమైన సవాళ్లను ఎదుర్కొవడం అని దినేశ్ కార్తీక్ ప్రశంసించారు. ఒత్తిడి అధిగమించి పరుగులు తీయడంతో పాటు ప్రతి మూడు మ్యాచ్‌లలో విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాలని దినేశ్ కార్తీక్ సూచనలు చేశాడు. 

వైద్య విద్యా విధానంలో సంస్కరణలు అవసరమేనా?

మన భారత దేశంలో వైద్య విద్యను వైద్య ప్రమాణాలను పరిరక్షించేకే ఇంతకు మునుపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఉండేది. అది మనదేశంలో వైద్య విద్యార్థుల స్థితిగతులను వారి చదువును, పేషంట్లకు లభించే ట్రీట్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించేది. అప్పుడు కూడా మనదేశంలో వైద్య విద్య చదివినా కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని అంటే అక్కడ సమానమైన పరీక్ష పాస్ అయితేనే మనవల్ని వాళ్ళు దేశాలల్లోకి అనుమతించేవారు ఎందుకంటే మన విద్య పై వారికి నమ్మకం అంతంత మాత్రమే…

తరువాత కొత్త కొత్త మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ప్రవేశపెట్టి వాటిలో ఘోస్ట్ ఫ్యాకల్టీ, ఉత్తుత్త పేషెంట్స్ ను తనిఖీలప్పుడు అక్కడ అడ్మిషన్స్ చేసి తనిఖీలు జరిగిన వెంటనే అక్కడ ఎటువంటి ప్రమాణాలు లేకపోవడం అనేది మనము ఒక 15 ఏళ్ల కింద తరచూ వార్తలలో చూసేవాళ్ళము. అయినా కానీ ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కళాశాలకు పర్మిషన్లు ఇచ్చి మనకు దాదాపుగా 85 వేల ఎంబిబిఎస్ సీట్లు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్తిగా అవినీతి ఊబిలో కూరుక పోవడం వలన దానిని సంస్కరించేకి నేషనల్ మెడికల్ కమిషన్ అని ఒక కొత్త దానిని తీసుకొచ్చారు. ఇందులో డాక్టరు, కొందరు నామినీలను ఆ కమిషన్ లో సభ్యులుగా చేర్చారు..

కానీ ఇది కొత్త సీసాలో పాత మందులాగా తయారయ్యింది. ఇప్పుడు కేవలం మెడికల్ సీట్లను పెంచడమే తమ పనిగా పెట్టుకుంది. ఆ కాలంలో నూరు సీట్లకు అడ్మిషన్లు ఇస్తే అటువంటి కళాశాలలకు 250 సీట్ల వరకు పర్మిషన్లు ఇస్తూ ఉంది. ఆ ప్రైవేట్ కళాశాలలో దానికి తగ్గట్లు ఫ్యాకల్టీ కానీ వసతులు కాని ఉండవు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు, పీజీ సీట్ల వలన వారిపైన అధ్యాపకుల దృష్టి ఉండదు. 250 మంది ఉన్న క్లాసులో ఏదో మొక్కుబడిగా పాఠం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. పర్యవేక్షణ అంత మందికి చేయడం కూడా కష్టమే? అందుకే చాలామంది క్లాసులకు కూడా గైరుహాజరు అవుతూ ఉంటారు.

క్లినికల్ మెటీరియల్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా ఉన్నా కానీ ప్రైవేట్ ఆసుపత్రులలో క్లినికల్ మెటీరియల్ అనగా రకరకాల పేషెంట్స్ రావడం రకరకాల వ్యాధులను చూడడం చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్లు చేసే సర్జరీ లాంటి బ్రాంచీలలో పీజీ సీట్లు ఎక్కువ కావడం వలన వాళ్లకు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పేషెంట్స్ వైపు నుంచి ప్రెజర్స్ కన్జ్యూమర్స్ పోరం నుంచి వచ్చేసమస్యల వలన వాళ్లతో ఇండిపెండెంట్ గా ఆపరేషన్లు చేపించాలంటే అధ్యాపకులకు చాలా కత్తితో కూడిన సాములగా ఉంటుంది.

దీనికి తోడు కొత్తగా మిక్సోపతి అని హోమియోపతి ఆయుర్వేదం డాక్టర్లకు కూడా ఎంబిబిఎస్ లో ఉండే ఔషధ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి వాళ్లను కూడా అలోపతి డాక్టర్లుగా పరిగణించే కి ఎన్ఎంసి పావులు కదుపుతూ ఉంది.

ఆల్ ఇండియా కోట వలన భారతదేశంలో ఎక్కడైనా కానీ వైద్య విద్యను అభ్యసించేకి పిజి విద్యను అభ్యసించేకి విద్యార్థులకు అవకాశం రావడం వలన ఆ ప్రదేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయి ఆపరేషన్లు నేర్చుకోవడం కూడా విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసించే సమయంలో ఒత్తిడిని ఎదుర్కో లేకపోవడం, విద్యార్థులు ఫెయిల్ అయితే విక్టిమ్ కార్డు ప్లే చేయడం వలన ఇప్పుడు ఎక్కువమందిని ఫెయిల్ అంటూ చేయడం అనేది అసలు ఉండదు. అందరిని ప్రాక్టికల్స్ లో పాస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అని అధ్యాపకులు భావిస్తారు. నిజంగా వైద్య విద్య సంస్కరణలు అవసరమే.. సీట్లు పెంచడమే కాకుండా క్వాలిటీ వైద్య విద్య పై దృష్టి పెట్టడం అవసరమే. మీరేమంటారు…

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ 

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

సాగర జలాలతో సాగు సాధ్యమేనా?

ప్రపంచంలో మంచినీటి కొరత నానాటికీ తీవ్రమవుతున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి లభ్యతను పెంచడం ఎలా అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలు, విధానకర్తల ముందున్న ప్రధాన సమస్య. 95 శాతం ఉన్న ఉప్పునీటి సముద్ర జలాలను మంచినీటిగా మార్చే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మంచినీరు, ఆహార కొరతను తీర్చవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే జలాలతో 97.43 శాతం ఉప్పునీరు కాగా, మంచినీటి లభ్యత కేవలం 2.57 శాతం మాత్రమేనని గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఈ స్వచ్ఛజలాలలో నదుల ద్వా రా లభించేది కేవలం 0.0002 శాతం మాత్రమే. ఈ పరిమిత నీటితోనే విశ్వవ్యాప్తంగా మానవులు, జంతువుల ఆకలిదప్పులు, పంటల సాగు అవసరాలు తీర్చవలసి వస్తోంది. అయితే ప్రస్తుతం 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 1000 కోట్లు దాటుతుంది. పరిమితంగా ఉన్న మంచినీటి లభ్యతను పెంచకపోతే భవిష్యత్తులో జీవావళి తీవ్ర నీటికొరతను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణంలో వస్తున్న పెనుమార్పులవల్ల దుర్భిక్షాలు, కరవులు ఏర్పడి నీటిలభ్యత తగ్గడం, దశాబ్దాల క్రితం నిర్మించిన భారీ జలాశయాలు ఒండ్రు మట్టి చేరడంవల్ల పూడికపెరిగి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు చేరకపోవడం తెలిసిందే. భారీవర్షాలు, వరదలు వచ్చినపుడు నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి వల్ల ఏటా వేల టిఎంసిలు వృథాగా ఉప్పు సముద్రాలలో కలసి పోవడం, అయినా రాష్ట్రాల మధ్య జలజగడాలు ఎడతెగకుండా కొనసాగడం, ఒక ప్రధాన ప్రాచీన పార్టీ నేతలు వాస్తవాలను గమనించకుండా 90% వాటా నీరు తమకే కావాలని కోరుతూ జాతీయ సమైక్యతకు చేటు తెస్తూ ఉండటం చూస్తున్నాం. నీటి సంక్షోభం ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ మంచినీటి వనరుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమంత ఆశాజనకంగా లేవు. రానున్న కాలంలో ఆహారం, మంచినీటి అవసరాలు మరింత పెరుగుతాయి. నీటికొరత ఉన్న ప్రాంతాలలో సేద్యానికి, మంచినీటికోసం అధికాధికంగా తోడటం వల్ల పెక్కు చోట్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి.

లభ్యమయ్యే ఉపరితల నదీ జలాల కోసం వివిధ ప్రాంతాల మధ్య ఎడతెగని వివాదాలు, వైషమ్యాలను పెంచుతున్నాయి. ప్రపంచ జనాభాలో ఇప్పటికే సగం మంది నీటికొరతను ఎదుర్కొంటున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. భారత్‌లో 60 కోట్లమంది (జనాభాలో 45%) నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విధాన నిర్ణాయక మండలి నీతిఆయోగ్ వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో నీటి అవసరాలు రెండింతలు పెరగనుండటం, మరోవైపు జలాశయాలలో పూడికపెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీటికి కటకట ఏర్పడింది. ఉప్పునీటిలో లీటరుకు టిడిఎస్ స్థాయిలు వెయ్యి మి.గ్రా కంటే ఎక్కువగా ఉండటం వల్ల అవి తాగడానికి, సేద్యానికి, పారిశ్రామిక వినియోగానికి పనికి రావనే అభిప్రాయం ఉంది. అందువల్ల అన్ని అవసరాలకు మంచినీటినే వాడటం వల్ల గిరాకీ కంటే నీటి లభ్యత తక్కువగా ఉండటంవల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి.

నీటిసంక్షోభం తీవ్రమవుతున్నా నీటి పొదుపు, పరిమితంగా ఉన్న మంచినీటి పునఃపంపిణీ గురించే మాట్లాడుతున్నారే గానీ ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోవడం లేదు. ఉప్పునీటి నుండి క్షారాన్ని యోలగించి మంచినీటిగా మార్చడం, సేద్యానికి ఎలా వాడాలి అనే దానిపైనే పరిశోధనలు సాగుతున్నాయి. వాస్తవ మేమంటే ప్రపంచ నీటిలో 98% ఉప్పునీరే. అందువల్ల అత్యాధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి పెరుగుతున్న మానవాళి అవసరాలు తీర్చే రీతిలో ప్రపంచ దేశాలు క్షార జలాలను ఎలా మార్చాలి అనే ప్రధానాంశంగా పరిశోధనలు సాగిస్తే అది ఎంతో మేలు. రక్షణ బడ్జెట్లు, ఆయుధ పోటీలు పెంచి, లాభాలు దండుకుంటున్న సంపన్న దేశాలు మానవాళికి అత్యవసరమైన మంచినీటిపై దృష్టి సారించకపోవడం తగదు. భారీ జలాశయాలలో నీటినిల్వ, నీటి ఆదాకు మాత్రమే పరిష్కారాలను పరిమితం చేశారు. ఉప్పునీటిని శుద్ధి చేసి ఆహారోత్పత్తికి, మంచినీటి సరఫరా మెరుగుకు నిర్దిష్ట ప్రయత్నాలు లేవు. ఉప్పునీరు వాడకానికి పనికి రావనే నమ్మకాలు బలంగా ఉన్నా యుగయుగాలుగా మానవాళి ఆక్షార జలాలను వాడటం తెలిసిందే. 1900 పోషకాలతో లభించే సముద్ర ఉత్పత్తులు మానవ ఆహారంలో ప్రధాన భాగం.

మన సాగరాలు, మహాసముద్రాలు ఎన్నో ఖాద్య యోగ్యమైన మొక్కలకు నెలవులు. వివిధ వర్ణాల, రకాల నాచు, ఆలగే (aalge), గవ్వలరకాలు, తూర్పు, ఆగ్నేయాసియా, పసిఫిక్ తీరదేశాల్లో ఎక్కువగా వాడే సముద్ర ద్రాక్ష తదితర మొక్కలు ఆహారంగా ఎంతో ఉపయోగమవుతున్నాయి. ఆర్థిక దృక్కోణం నుండి చూస్తే మంచినీటితో సాగయ్యే ఎన్నో పంటలను కొన్ని ప్రక్రియలతో ఉప్పునీటితో సాగు చేసే వీలుం ఉంటుందని అంటున్నారు. క్షారాన్నీ తట్టుకుని పెరిగే తుమ్మ, జమ్మి తదితర సముద్ర మాన్లు మేలి కలపగా పనికొస్తాయని చెబుతున్నారు. హాలో ఫైట్స్ ప్రత్యామ్నాయంగా వస్తున్న పంటలు వంట నూనెల ఉత్పత్తికి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా అక్కరకొస్తాయంటున్నారు. ఉప్పునీటితో పెరిగే పూవులు, ఉద్యాన పంటలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడతాయని నిపుణుల అభిప్రాయం.

క్షారాజలాన్ని మెరుగైనరీతిలో వాడితే పురోభివృద్ధి సాధ్యం కాగలదని భావన బలంగా ఉంది. ప్రపంచ జనాభాలో 38% మంది సముద్ర తీరానికి 100 కి.మీ దూరంలోనే నివసిస్తున్నందున (అంటార్కిటికా మినహా) తీరప్రాంతం 24 లక్షల కి.మీ మీరు ఉంటుంది. వాతావరణ పెనుమార్పు వల్ల సముద్రాలు చొచ్చుకువచ్చి తీర ప్రాంతాలను కలిపేసుకుంటున్నాయి. భారత ద్వీపకల్పం 11 వేల కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 972 కి.మీ సాగరతీరాన్ని కలిగి, లక్షలాది మంది కడలి పుత్రులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. వారికి మరింత మెరు గయిన జీవనోపాధుల కల్పనకు సాగరతీరాన్ని, జలాలను ఆహారోత్పత్తి, పంటల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి ఎలాంటి చర్యలు అవసరమో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా కేంద్రాల శీతలీకరణకు రోజుకు కోటి 90 లక్షల లీటర్ల నీరు అవసరమని, సాగర జలాలను శుద్ధి చేసి వాడతారని చెబుతున్నారు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సిఎం చంద్రబాబు, ఐటి మంత్రి లోకేష్ చెబుతున్నారు. సాగర జలాలను మెరుగైన రీతిలో వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి మోడీ ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలి.

– పతకమూరు దామోదర్ ప్రసాద్

94409 90381

వరంగల్ నగరాన్ని ఇంకా వీడని వరద

హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హన్మకొండ జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 412.3 ఎంఎం తీవ్రతతో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురవడంతో హన్మకొండ, వరంగల్ జిల్లా కేంద్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో అనేక కాలనీలు జలమయంగా మారాయి. వరంగల్ నుంచి ములుగు వెళ్లే రోడ్డులో వరదలు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్, హనుమకొండలో పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. బుధవారం కురిసిన వర్షానికి వరంగల్ నగరం జలదిగ్భంధంగా మారింది. వరంగల్- హనుమకొండ మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఫీట్ల రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో పాటు ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

 

యంగ్ స్టార్ మూవీలో ప్రియాంక?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాతో చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నాని ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘సరిపోదా శనివారం’తో మంచి హిట్‌ను అందుకుంది. అయితే హీరో రామ్.. కిషోర్ గోపు అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్టు సమాచారం. ఇది లవ్ అండ్ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్. సినిమాలో హీరోకి ధీటుగా హీరోయిన్ పాత్ర ఉంటుందంటున్నారు.

మణుగూరులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా… తప్పిన పెను ప్రమాదం

మణుగూరు: గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గ్యాస్ సిలిండర్ల పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అశోక్ నగర్ లో జరిగింది.  గ్యాస్ సిలిండర్ల లారీ విజయవాడ నుంచి ములుగుకు వెళ్తుండగా అశోక్ నగర్ శివార్లలో బోల్తాపడింది. వెంటనే స్థానికులు పోలీసులు, గ్యాస్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. మరో లారీలో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

యూనిక్ స్పై డ్రామా

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ మధురంగా పాడారు. దినేష్ కాకర్ల లిరిక్స్ కాన్సెప్ట్ ని చాలా ఫన్‌ఫుల్ గా చూపించాయి. 

Wordpress Free Themes and Premium WP Plugins Download