kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxroyalbetroyalbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabet

యుద్ధం ఆపకపోతే టోమాహాక్ దాడులే.. పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్

ఉక్రెయిన్‌తో యుద్ధం తక్షణం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్దం ఆపండి లేకపోతే తాము అమెరికా దీర్ఘశ్రేణి టోమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందిస్తామని, తరువాత వారి ఇష్టం అని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరిన ట్రంప్ తమ వెంట ఉన్న మీడియాతో మాట్లాడారు. అమెరికా శక్తివంతమైన క్షిపణుల శక్తి ఏమిటనేది రష్యాకు తెలిసిందే అని, యుద్ధం సమసిపోవల్సి ఉంది. లేకపోతే తాము వేరే విధంగ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తమ నుంచి ఉక్రెయిన్‌కు అత్యంత కీలక ఆయుధాలు అందుతాయని పరోక్షంగా తెలిపి, రష్యా అధినేత పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారు. తమ క్షిపణి చాలా శక్తివంతం. దీని దెబ్బతినకుండా రష్యా వ్యవహరిస్తుందనే తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో అంతకు ముందు మాట్లాడారు. ఈ దశలోనే ఈ మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌కు పంపిచేందుకు మాట ఇచ్చినట్లు వెల్లడైంది. రష్యా వైపు ఈ క్షిపణులు దూసుకువెళ్లాలని పుతిన్ కోరుకుంటున్నాడా? లేదనే అనుకుంటున్నాను. ముందుగా యుద్దం ఆగిపోవాలి.

నానా విధాలుగా తాను పుతిన్‌కు నచ్చచెపుతున్నానని, ఇక ఈ మిస్సైల్ తమ దూకుడుకు మరో అడుగు అని అనుకున్నా ఫర్వాలేదని ట్రంప్ మీడియాతో చమత్కరించారు. ట్రంప్ ప్రస్తావించిన క్షిపణులు గరిష్టంగా 2500 కిలోమీటర్ల దూరం వరకూ, శబ్ధవేగాన్ని మించి దూసుకువెళ్లుతాయి. భూమికి అతి తక్కువ దూరం నుంచి వెళ్లగలిగే వీటిని నౌకల నుంచి చివరికి జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే శక్తిసామర్థాలు సంతరించుకుని ఉన్నాయి. 

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు ఆబ్కారీ శాఖకే వెళ్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. షాపు దక్కకుంటే డబ్బు తిరిగి వచ్చేలా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. లిక్కర్ పాలసీపై జారీ చేసిన జివొ 93ను కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

సత్వర న్యాయమే లక్షంగా క్రిమినల్ చట్టాలు: అమిత్ షా

జైపూర్ ః దేశంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ లా చట్టాలు న్యాయ లక్షంతో కూడుకున్నవే, అంతేకానీ శిక్షలే ప్రధాన ఉద్ధేశంతో ఉండేవి కావని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను 21వ శతాబ్ధంలో భారీ స్థాయిలో సంస్కరించే దిశలోనే ఈ మూడు చట్టాలు రూపొందాయి. అమలులోకి వచ్చాయని వివరించారు.కేంద్ర హోం మంత్రి సోమవారం జైపూర్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మూడు చట్టాల సమగ్ర స్వరూపం తెలిపే ఎగ్జిబిషన్‌ను ఆరంభించిన క్రమంలో ఆయన మాట్లాడారు. నూతన చట్టాల పరిధిలో జరిగే కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ పద్థతుల గురించి ఆయన వివరించారు.

ఇంతకు ముందటి చట్టాల పరిధిలో కేసుల విచారణకు 25 నుంచి 30 ఏండ్ల వరకూ కాలం పట్టేది. పైగా అనేక రకాల వేధింపులు, చివరికి కక్ష సాథింపు చర్యలు కూడా చోటుచేసుకునేవి. తీర్పులు లేకుండానే అనేకులు ఏళ్ల తరబడి జైలులో మగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకువచ్చిన చట్టాలతో పరిస్థితి మారింది. సరళీకృతంగా సత్వరంగా సంబందితులకు న్యాయం దక్కుతుందని వివరించారు. ఈ కొత్త చట్టాలు పాత చట్టాలలోని అంశాలను పోలుస్తూ సశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఈ చట్టాలపై అవగావహన విషయంలో తొలి ప్రక్రియగా నిలిచింది. న్యాయవ్యవస్థలో ఉన్న పద్దతులతో జనం ఎక్కువగా ఈ వ్యవస్థ పట్ల నిట్టూర్పులకు గురికావడం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయాలను సరిదిద్దడం ద్వారా అందరికి న్యాయం సకాలంలో అందేందుకు మార్గాలు ఏర్పడ్డాయని వివరించారు.

ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

జెరూసలెం : గాజా ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ ‘ మెడల్ ఆఫ్ ఆనర్ ’ ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్టు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్టు తెలిపారు. బందీల విడుదల చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోడానికి ట్రంప్ అర్హుడని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లోనే కాకుండా మధ్య ప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని కొనియాడారు. 

నకిలీ మద్యం కేసులో వెలుగులోకి కీలక విషయాలు,,

జోగి రమేష్ ఇచ్చిన రూ.3 కోట్ల ఆఫర్‌కు ఆశపడే ఇదంతా చేశా

ఎ1 నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావు వాంగ్మూలం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో బయటపడ్డ నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసిపి నేత జోగి రమేష్ చేసి న కుట్ర వల్లనే ఇదంతా జరిగిందని కేసులో ఎ1 నిందితుడుగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు బయట పెట్టారు. జోగి రమేష్ ఇచ్చిన మూడు కోట్ల రూపాయల ఆఫర్‌కు ఆశపడే ఇదంతా చేశానని జనార్దన్ రావు చెబుతున్నారు. వైసిపి హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశా మని జనార్దన్ రావు వెల్లడించారు. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించాలని సూచించారని పోలీసులకు తెలిపారు. ఒక వేళ దొరికతే ప్రభుత్వంపై బురద చల్లవచ్చని తంబళ్లపల్లె నుంచే ప్రారంభించాలని సూచించారన్నారు. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారని జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందన్నారు. పైవారి ఆదేశాలతోనే నీకు ఈ పని అప్పగిస్తున్నా అని జోగి రమేష్ నాతో చెప్పారని జనార్దన్ రావు చెప్పారు. జనార్దన్ రావు వీడియో సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యం కేసును సిబిఐకి ఇవ్వాలని వైసిపి నేతలు ఆందో ళనలు చేశారు. అదే రోజు అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లయింది. మరో వైపు ప్రభుత్వం నకిలీమద్యం కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో మల్లికా గార్గ్, రాహుల్ దేవ్ శర్మ వంటి సీనియర్ ఆఫీసర్లతో ఈ సిట్‌ను నియమించారు. నకిలీ మద్యం సూత్రధారుల్ని గుర్తించి శరవేగంగా నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించారు. మరో వైపు ఎపి ప్రభుత్వం సురక్ష యాప్ తీసుకు వచ్చింది. మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి బాటిల్ పైా క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే మద్యం ఉత్ప త్తి కంపెనీ సహా మొత్తం సమాచారం వచ్చేలా ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం ఎక్కడా అమ్మకుండా చూసేందుకు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా నకిలీ మద్యం కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పించారు.

భారత్‌పై జంట సెంచరీలు.. 51 ఏళ్ల రికార్డు తిరగరాశారు..

న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. ఐదో రోజు భారత్ మరో 58 పరుగులు సాధిస్తే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను వైట్ వాష్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల కనబరిచిన పోరాట పటిమకు క్రికెట్ లోకం ఫిదా అయింది. ముఖ్యంగా ఫాలో ఆన్‌లో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు క్యాంప్‌బెల్, హోప్‌ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఓ రికార్డును సాధించారు.

మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఈ జంట 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు. 1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఒకే టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్‌) గార్డన్‌ గ్రీనిడ్జ్‌ (107), క్లైవ్‌ లాయిడ్‌ (163) సెంచరీలు చేశారు. మళ్లీ ఇప్పుడు క్యాంప్‌బెల్, హోప్‌లు ఈ ఫీట్‌ని పునరావృతం చేశారు. ఇలా భారత గడ్డపై వెస్టిండీస్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది మూడోసారి. తొలుత 1948-49లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎవర్టన్‌ వీక్స్‌ (101), క్లైడ్‌ వాల్కాట్‌ (108) సెంచరీలు చేశారు.

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టుకు నిజాం వారసులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి భూముల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తుండగా తాజాగా మరొ మలుపు చోటు చేసుకుంది. కంచగచ్చిబౌలిలో ఉన్న 2,725 ఎకరాల 23 గుంటల భూమికి నిజమైన యజమాని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని ఆయన వారసులు తాజాగా ఆరోపిస్తున్నారు. అసఫ్ జాహి రాజవంశ వారసులు కంచగచ్చిబౌలిలోని 2,725 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సుమోటో రిట్ పిటిషన్‌లో తమను చేర్చుకోవాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే చట్టపరమైన నోటీసులు జారీ చేశామని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఆపడానికి న్యాయపరమైన జోక్యాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని 25,26 సర్వే నెంబర్లలోని కంచ గచ్చిబౌలి భూమి 2725 ఎకరాల 23 గుంటలు కలిగి ఉంది, ఇది చారిత్రాత్మకంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు చెందినదని వారు పేర్కొన్నారు. తొమ్మిదవ నిజాంగా నియమించబడిన, అసఫ్ జాహి కుటుంబ వ్యవహారాల సంరక్షకుడు రౌనఖ్ యార్ ఖాన్ కంచ గచ్చిబౌలి భూమి పూర్వీకులు భారతదేశానికి చేసిన సేవకు చిహ్నం అని అభివర్ణించారు. ముత్తాత ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్, తాత ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, 1965 యుద్ధంలో ప్రజల కోసం విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు ఆయన వివరించారు. నిజాం వారసుల హక్కుగా భూములను రక్షించడం ద్వారా నిజాం వారసత్వాన్ని గౌరవించాలన్నారు. ఈ పోరాటం అభివృద్ధి ముసుగులో చరిత్ర చెరిపివేయకుండా కాపాడటం కోసమని రౌనఖ్ యార్ ఖాన్ స్పష్టం చేశారు.

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: మహేష్ కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రిజరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై మంతనాలు జరిపారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇటీవల ఖర్గే బెంగళూరులో అనారోగ్యానికి గురైనందున పరామర్శించేందుకు ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఖర్గే పూర్తిగా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను, న్యాయ పోరాటాల గురించి ఖర్గేకు వివరించానని చెప్పారు.

ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఖర్గే అభినందించారని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన జివోపై రాష్ట్ర హైకోర్టు ‘స్టే’ విధించినందున దీనిపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ‘స్టే’ను తొలగించాల్సిందిగా సుప్రీంను కోరుతూ సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వివరించారు. హైకోర్టులో జరిగిన విషయాలు, సుప్రీంలో దాఖలు చేయనున్న పిటిషన్ గురించి ఖర్గేకు వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్‌లో తమ పార్టీలోని పలువురు ముఖ్య నాయకులు కూడా ఇంప్లీడ్ కానున్నారని ఆయన చెప్పారు.

సమాచార లోపంతో సమస్య..

మంత్రుల మధ్య తలెత్తిన వివాదాల గురించి విలేకరులు ప్రశ్నించగా, చిన్న సమాచార లోపంతో తలెత్తిన సమస్యే తప్ప ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఓ కుటుంబంలా అందరూ కలిసి ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో అందరమూ చర్చించి పరిష్కరించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

ప్రపంచానికి మరింత మంది ట్రంప్‌లు కావాలి..

జెరూసలెం : ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బెంజమిన్ నెతన్యాహు సర్కారు ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ కనేసేట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రపంచానికి ట్రంప్ లాంటివారు మరింత మంది కావాలని ఆకాంక్షించింది. వచ్చే ఏడాది ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తామని తెలిపింది. ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో కలిసి జెరూసలెంలోని చట్టసభకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ చట్టసభ్యులు అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు.

కాల్పుల ఒప్పందం చేసినందుకు గాను రెండున్నర నిమిషాలు పాటు లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్పీకర్ అమిర్ ఒహనా మాట్లాడుతూ బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్‌ను యూదు ప్రజలు వేల సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని కొనియాడారు. శాంతి స్థాపన కోసం ఆయన చేస్తున్నంతగా ఎవరూ చేయడం లేదని అన్నారు. దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న ట్రంప్ లాంటి నేతలు ప్రపంచానికి మరింతమంది కావాలని అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులు మరెవరూ లేరని తెలిపారు. వచ్చే ఏడాది నోబెల్ పురస్కారం కోసం అన్ని దేశాలూ ట్రంప్ పేరు ప్రతిపాదించేలా తాము కృషి చేస్తామన్నారు.

ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తి ట్రంప్

అనంతరం నెతన్యాహు ప్రసంగిస్తూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని ఇంత వేగంగా దృఢ నిశ్చయంతో కదిలించిన ట్రంప్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. యుద్ధం ముగిసేలా గాజా ఒప్పందం చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి స్థాపనకోసం తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

బహుమతిగా బంగారు పావురం

అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ కొంతసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు అపురూప కానుక ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్‌నకు బంగారు పావురాన్ని బహుమతిగా అందజేశారు. 

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

స్టాక్‌హోమ్ : ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిటర్ హౌవీట్, ఫిలిప్ అఘియన్‌లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కించుకున్నారు. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిపై పరిశోధనకు ముగ్గురికి ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. అమెరికా నుంచి ఓయెల్ మోకిర్, ఫ్రాన్స్ నుంచి ఫిలిప్ అఘియోన్, కెనడా నుంచి ఫిటర్ హోవిట్‌లకు 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సంయుక్తంగా పొందారు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు జోయెల్ మోకిర్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికి గాను మిగిలిన ఇద్దరు ఫిటర్‌హౌవీట్, ఫిలిప్ అఘియన్‌లకు నోబెల్ ప్రకటించారు.

ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆవిష్కరణల ద్వారానే దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని నిరూపించారు. ప్రభుత్వాలు పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెంచితే , ఆవిష్కరణలు వేగంగా జరుగుతాయని వీరి అధ్యయనం చూపించింది. మార్కెట్ పోటీ, మేధో సంపత్తి హక్కులు, విద్యాసంస్థల బలోపేతం, వంటి అంశాలు ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని వీరు వివరించారు.

ఓఈసీడీ, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ పరిశోధనల ఆధారంగా తమ విధానాలను మలచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా నోబెల్ ఫౌండేషన్ కమిటీ మాట్లాడుతూ ఆవిష్కరణల ప్రేరణతో ఆర్థిక వృద్ధిని సాధించగలమన్న సిద్ధాంతాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించారు. ఇది ఆర్థిక విధానాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుంది. అని వివరించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.