Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

Pusulabet

jojobet

pusulabet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

betzula

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

meritking

madridbet

meritking

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

మొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు

కాకినాడ వద్ద సాయంత్రం తీరం దాటే అవకాశం

ఆ సమయంలో 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు

1419 గ్రామాలపై తుఫాన్ ప్రభావం

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఎపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420 కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మొంథా తుపాను ఉత్తర – వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని చెప్పుకొచ్చారు.

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశం ఉందని వివరించారు. తుపాను తీరం దాటే సమయం లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో మంగళవారం కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు , 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ యం త్రాంగం ప్రజలతో ఉందని.. ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్, 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణలో భారీ వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, అక్టోబరు27 మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిం దని వెల్లడించారు.

రైతులకు నష్టం జరగొద్దు

 ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండండి

మొంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్: మొంథా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావర శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెండె అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేసింది

53వ సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్

న్యూఢిల్లీ: దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ కేంద్రానికి సిఫార్సు చేశారు. వచ్చే నెల 23తో గవాయ్ పదవీకాలం ముగుస్తుంది. దీనితో తన స్థానం ఖాళీ భర్తీ దిశలో సిజెఐ హోదాలో గవాయ్ సోమవారం తమ ప్రతిపాదన పంపించారు. గవాయ్ తరువాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా సూర్యకాంత్ ఉన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనకు ఈ స్థానం దక్కాల్సి ఉంటుంది. వచ్చే నెల 24న సూర్యకాంత్ ఈ పీఠం అధిరోహిస్తే ఆయన దేశానికి 53వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.

సాధారణంగా సిజెఐ నియామక ప్రక్రియలో భాగంగా పదవిలో ఉండే సిజెఐ సిఫార్సు చేసే పేరును న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని ముందు ప్రధాన మంత్రికి పంపిస్తుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు ఫైలు వెళ్లుతుంది. తరువాత నియామక ప్రకటన వెలువడుతుంది. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన సిజెఐ అయితే పదవీకాలం 15 నెలలు ఉంటుంది. ఈ మేరకు ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకూ సిజెఐగా వ్యవహరిస్తారు.

సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్‌లో మధ్యతరగతి కుటుంబంలో 1962లో జన్మించారు. ఆర్టికల్ 370 రద్దు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అవినీతి , పర్యావరణం, లైంగిక సమానత వంటి పలు కీలక తీర్పుల సంబంధిత ధర్మాసనాలలో ఒక్కరిగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల ప్రధాన తీర్పులను కొట్టివేసిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రక్రియలో కూడా ఆయన పాలుపంచుకున్నారు.

పంట కొనుగోళ్లు సాఫీగా సాగాలి

మొంథా తుఫాను ప్రభావం పడకుండా చూడాలి

రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు 

ధాన్యంతో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు

కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలి

ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు

అధికారయంత్రాంగం సమష్ఠిగా పని చేయాలి

అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష,

వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు రూ.431కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

మన తెలంగాణ / హైదరాబాద్: మొంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంథా తుఫాన్ తో తెలంగాణాలోనూ అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాన్ ప్రభావం పడకుండా చూడాలని కోరారు. వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్,కమిషనర్ గోపి,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,పౌర సరఫరాల శాఖా డైరెక్టర్ హనుమంతు కొండుబా, డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ బాయి లతో కలసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న టార్బాలిన్ లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం చెడి పోకుండా చూడాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. 30 నుండి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని, అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపి వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు.

ధాన్యం విలువ 431.09 కోట్లు 

రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు అని వివరించారు.

ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు 

కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల పై నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలన్నారు. ఇది రైతుపక్ష పాత ప్రభుత్వమని, ఏ కారణం చేత నైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీల్లో ‘జూబ్లీ’హీట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు

టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ అగ్రనేతలు మీనాక్షినటరాజన్, మహేశ్‌గౌడ్, డిప్యూటీ సిఎం భట్టి సహా

పలువురు కీలక నేతల భేటీ 

ప్రచార సరళి, ప్రసంగాలపై నేతలకు దిశానిర్దేశం

నేడు నియోజకవర్గంలో బిజెపి మహా పాదయాత్రలు

ప్రచారం మరింత ఉధృతం చేయాలని నిర్ణయం

ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్, మజ్లిస్ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం

వివిధ సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చే పనిలో బిఆర్‌ఎస్ బిజీబిజీ

డివిజన్ల వారీగా ప్రచారం, గ్రూప్ సమావేశాలతో కార్యకర్తల్లో

ఉత్సాహం నింపుతున్న గులాబీ నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తమ ఖాతా లో వేసుకోవాలని మూడు ప్రధాన పార్టీలై న కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి వ్యూహ, ప్ర తివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఇం దులో భాగంగానే సోమవారం కాంగ్రెస్, బిజెపి నేతలు ముఖ్య నేతలు సమావేశమై మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో సోమాజిగుడాలోని టూరిజం ప్లా జాలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. ఈ నెలాఖరు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే రోడ్-షో, బహిరంగ సభల నిర్వహణ, కుల సంఘాలతో వేర్వేరు సమావేశాల నిర్వహణ, పాదయాత్రలు, ఇంటింటికి ప్రచారం, ఓటర్ స్లిప్పు ల పంపిణీ, ఓటింగ్‌కు రాలేని వయోవృద్ధులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్ళేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తమ ప్రసంగాల్లో పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అభ్యర్థి విజయం సాధించడం తథ్యమని, అయితే ఘన విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కష్టపడాలని, నేతల మధ్య సమన్వయ లోపం ఉండరాదని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వారు ఆదేశించారు. ఇదిలాఉండగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సోమవారం తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ప్రచార ఏర్పాట్లపై చర్చించారు.

నేడు బిజెపి మహా పాదయాత్రలు..

మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున నిర్వహిస్తున్న ప్రచారం గురించి ప్రధానంగా చర్చించారు. ఈ ప్రచారం సరిపోవడం లేదని, ఇంకా ఉధృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వ్యూహాలను తిప్పికొడుతూ ముందుకు సాగాలని నిర్ణయించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్-మజ్లీస్ పార్టీల అనుబంధం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆ పార్టీలను ఎండగట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్-మజ్లీస్‌ల బంధాన్ని బయటపెట్టడం ద్వారా బిజెపికి లాభం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్నారు.

కదిలిన గులాబీ దండు..

ఇంకో వైపు బిఆర్‌ఎస్ నేతలు తమ సొంత సీటును కాపాడుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు వేర్వేరు డివిజన్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు కెటిఆర్ కారు దిగి ఆటోలో ఎక్కి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్లతో, కుల సంఘాలతో సమావేశమై బిఆర్‌ఎస్ గెలుపొందాల్సిన అవశ్యకత గురించి ఆయన వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన తెలిపారు. హరీష్ రావు కూడా గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇలా మూడు పార్టీలూ తమ అజెండాతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

మద్యం షాపుల డ్రా ప్రశాంతం

 2,601దుకాణాలకు లాటరీ ప్రక్రియ

19 మద్యం షాపుల డ్రా నిలిపివేత

వాటికి నవంబర్ 1నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..3న డ్రా 

మూడు షాపులను దక్కించుకున్న నర్సంపేటకు చెందిన ఓ కుటుంబం

నిర్మల్ జిల్లాలో ఓ మహిళను వరించిన రెండు దుకాణాలు 

సంగారెడ్డిలో ఏకంగా మూడు షాపులను దక్కించుకున్న ఒకే వ్యక్తి

ఒకరు 50 దరఖాస్తులు చేసినా వరించని అదృష్టం

ధర్మాపూర్‌లో ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ4 మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం నిర్వహించిన డ్రా ప్రశాంతంగా ముగిసింది. మ ద్యం షాపుల డ్రాను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. కా గా, 2, 601 మద్యం దుకాణాలకు డ్రా ప్రశాంతంగా జరగ్గా, మరో 19 మద్యం షాపుల డ్రాల ను ఎక్సైజ్ అధికారుల నిలిపివేశారు. ఆయా దు కాణాల పరిధిలోని మద్యం వ్యాపారులు సిండికే ట్ కావడం, తక్కువ దరఖాస్తులు రావడంతో 19 దుకాణాలకు సంబంధించిన డ్రాను నిలిపివేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల 50 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యక్తికి లక్కీ డ్రాలో అదృష్టం వరించకపోగా, ఒక్క దరఖాస్తు దాఖలు చేసిన వ్యాపారికి అదృష్టం వరించడం విశేషం. మద్యం షాపుల కోసం నిర్వహించిన టెండర్లలో ఓ కుటుంబాన్ని అదృష్టం వరించింది. భార్యాభర్తలిద్దరూ లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్నారు. అంతే కాదు, తమ అనుచరుడి పే రుతో వేసిన దరఖా స్తును కూడా లిక్కర్ షాపు వరించింది.

వరంగల్ రూరల్ జిల్లా వైన్స్ షాపుల లక్కీ డ్రా ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ తన పేరుతో పాటు తన భార్య సాంబలక్ష్మి, తన అనుచరుడు ప్రయణ్ పేరుతో దర ఖాస్తు చేశారు. లాటరీలో ముగ్గురి పేర్లతో మూడు షాపులు రావడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలు ఖరారు చేయగా ఆమెకు రెండు షాపులు దక్కించుకున్నది. ఆమెను ఈ సందర్భంగా లక్కీ లేడీ అంటూ అభినందించారు. సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక వ్యక్తి మూడు వైన్ షాపులు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్‌గా సంగారెడ్డి పట్టణంలోని మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.

ప్రభుత్వ పిఇటి ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు

మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో ఒక షాపు పుష్ప అనే ప్రభుత్వ పిఇటికి దక్కింది. కలెక్టర్ నిర్వహించిన డ్రాలో భూపని పుష్ప షాపు నెంబర్ 17 ను దక్కించుకున్నారు. భూపని పుష్ప ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని రాంనగర్ హైస్కూల్‌లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి షాపుల లైసెన్సుల కోస దరఖాస్తు చేసుకోవడం, షాపును పొందడానికి అనర్హులు. ఈ నేపథ్యంలో తిరిగి సదరు దుకాణానికి అధికారులు డ్రా నిర్వహించనున్నారు.

19 షాపుల డ్రా నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రా లో తక్కువగా దరఖాస్తులు వచ్చిన 19 షాపులకు అధికారులు డ్రా తీయకుండా నిలిపివేశారు. శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని మూడు, ఆదిలాబాద్‌లో ఆరు, ఆసిఫాబాద్‌లో ఏడు, భూపాలపల్లిల్లో రెండు, సంగారెడ్డిలో ఒక దఖాణానికి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రా నిలిపివేసిన 19 మద్యం షాపులకు నేటి నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ దరఖాస్తులకు నవంబర్ 3న డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు ఆయా కార్యాలయలంల్లో అధికారులు సిద్దంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. గతంలో ఇలాగే 22 షాపులకు డ్రాను వాయిదా వేసి తరువాత నిర్వహించారు.

హైదరాబాద్ జిల్లాల్లో 82 షాపులకు డ్రా

హైదరాబాద్ జిల్లాలో సోమవారం మద్యం షాపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ హరి చందన అన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండ్ పరిధిలోని 82 మద్యం షాపుల డ్రా అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సికింద్రాబాద్ 97 మద్యం షాపుల డ్రాను కలెక్టర్ హరి చందన చేపట్టారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ లోని 179 మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారా రూ. 185 కోట్లు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

179 షాపులకు ప్రశాంతంగా డ్రా : ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్

హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 179 మద్యం షాపులకు ప్రశాంతంగా డ్రాలు జరిగాయని, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిందని పేర్కోన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్‌నగర్‌లోని 138 మద్యం షాపులకు, శంషాబాద్‌లోని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మేడ్చల్‌లో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మల్కాజిగిరిలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మద్యం షాపుల డ్రాను నిర్వహించారు. కలెక్టర్లతోపాటు డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరీ, ఏఈఎస్‌లు శ్రీనివాస రావు, డిప్యూటి సూపరిండెంట్‌లు నవీన్, ఫచాజోద్దీన్, కృష్ణ ప్రియ, ఉజ్వలరెడ్డిల, స్మిత సౌజన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వీధి కుక్కల కాట్లతో దేశం పరువు పోతోంది

రెండు నెలలైనా ఇంతవరకు స్పందన లేదు

నవంబర్ 3న సిఎస్‌లు మా ముందుకు రావాలి

రాష్ట్రాలు, యుటిలకు సుప్రీం ఆదేశాలు

అవసరమైతే ఆడిటోరియంలో బహిరంగ

కోర్టు ఉత్తుత్తి మాటలు కాదు.. విచక్షణాయుత సూచనలు చేయాలని న్యాయవాదికి హితవు

ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ నుంచే అఫిడవిట్లు 

న్యూఢిల్లీ : వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తీరుపై ఘాటుగా స్పందించింది. ‘ ఇప్పుడు అక్టోబర్ 27వ తేదీ. వీధుల్లో తిరిగి కరుస్తోన్న కుక్కలతో తలెత్తుతున్న ముప్పును అరికట్టాలని పలు సార్లు చెప్పాం. ఎటువంటి స్పందన గట్రా లేదు. నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు. ఇప్పటికీ వీధి కుక్కల కాట్లు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చివరికి అవి ఇక్కడికి వచ్చిన విదేశీయులను కూడా వదలడం లేదు. దీనితో మీ మన దేశం పరువు విదేశాలలో దిగజారుతోంది. ఇదైనా తెలుసుకున్నారా? ’ అని న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వి అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. పిచ్చికుక్కల స్వైరవిహారం ఘటనల్లో రాష్ట్రాల, యుటిల ఉన్నతాధికారులకు తాఖీదులుపంపించాం. ముందు తమ వివరణలతో కూడిన అఫిడవిల్లు అడిగాం. అయితే వారేం చేస్తున్నారో తెలియదు.

ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా లేదని మందలించారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్ , ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తప్పితే ఇతర రాష్ట్రాలు, యుటిలు ఈ విషయంలో ఉలుకూపలుకూ లేకుండా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంపై తాము ఆగస్టు 22వ తేదీన వెలువరించిన ఆదేశాలను ప్రస్తావించింది. ఇప్పటికి ముచ్చటగా మూడు సమాధానాలు , చర్యలకు దిగుతామనే వివరణలు అందాయని తెలిపారు. అఫిడవిట్లు అందించకుండా తిరుగుతున్న రాష్ట్రాలు, యుటిల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంతా కూడా వచ్చే నెల 3వ తేదీన తమ ముందుకు వచ్చి హాజరు కావాలని, ఎందుకు తమ వివరణలు ఇచ్చుకోలేదనేది తెలియచేసుకుని తీరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆగస్టు 22 నాటి ఆర్డర్ పట్టించుకోరా?

ఆగస్టు 22 నాటి తమ ఆర్డర్ అంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్రాలకు , యుటిలకు నోటీసులు వెలువరించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇక సిఎస్‌లు తమ ముందుకు రావాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. పిచ్చి కుక్కల కాట్లు, వీధుల్లో అవి సైర్వవిహారం చేయడం, ఆక్సిడెంట్లకు దారితీయడం వంటి అంశాలపై కోర్టు తనకు తానుగా స్పందించిన సుమోట్ విచారణ దశలో త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. కుక్కల బెడద, దీనితో పాటు అధికారుల అలసత్వం మరో తీవ్ర సమస్య అవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకు ముందటి వరకూ ఢిల్లీ ఎన్‌సిఆర్ వరకూ పరిమితం అయి ఉన్న ఈ కేసును ఆగస్టులో న్యాయస్థానం ఇతర రాష్ట్రాలు, యుటిల పరిధికి తీసుకువచ్చింది. అక్కడ తీసుకుంటున్న చర్యల వివరాలను ఆరాతీసింది.

ఉన్నతాధికారులు పత్రికలు చదవరా? సోషల్ మీడియా చూడరా? నోటీసులు పంపించేంత వరకూ చలనం లేకుండా ఉంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు మూడు నెలలు గడిచినా ఇప్పటికీ పిచ్చి కుక్కల బెడద సాగుతోంది. అధికారుల సడీసప్పుడు లేదు. ఇక్కడికి వచ్చిన విదేశీయులపై, చివరికి ప్లే గ్రౌండ్‌లలో ప్రాక్టిస్ చేసుకునే విదేశీ ఆటగాళ్లపై కూడా కుక్కలు దాడులకు దిగాయి. మరి దేశ పరువు ఏమవుతుందనేది ఆలోచించారా? అని ఘాటుగా స్పందించారు. ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల అరాచకాలతో ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇప్పటికైనా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ముందుకు హాజరు కావాలని ఆదేశిస్తున్నట్లు సంబంధిత లాయర్లకు తెలిపారు.

ఈ సందర్భంగా ఓ లాయరు స్పందిస్తూ మూగజీవాలైన కుక్కల పట్ల క్రూరత్వం గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మరి మనుష్యులపై జరుగుతోన్న ఆటవికం సంగతి మరిచిపోతున్నారా? అని ప్రశ్నించింది. విచక్షణాయుత సూచనలు ఉంటే తెలియచేయండి, ఆచరణాత్మకం అయితేనే మాట్లాడండి. ఉత్తుత్తి మాటలు వద్దు. మీరు చెప్పేది ఏమైనా ఉంటే మేం నమ్మి ఆమోదించి , సముచితం అన్పించుకునేలా ఉండాలి అంతేకానీ పరమ చెత్త శుష్క వాదన కోర్టు ముందుకు తీసుకురాకండని మందలించారు. తాము పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని, ఏ విధంగా బెడదకు పరిష్కారం కుదర్చాలనేది ఆలోచిస్తున్నామని చెప్పారు. నవంబర్ 3న చీఫ్ సెక్రెటరీలు అంతా న్యాయస్థానానికి రావాల్సిందే. కాదు కూడదు అనుకుని రాకుండా ఉంటే ఇక తాము ఆరోజు కోర్టు విచారణను బహిరంగ స్థాయిలో ఆడిటోరియంలో నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

ఢిల్లీ, గజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్ ఇతర ప్రాంతాలలో వీధి కుక్కల బెడద తీవ్రస్థాయి దశలో ఆగస్టు 11న సుప్రీంకోర్టు తన రూలింగ్ వెలువరించింది. వీధి కుక్కలన్నింటిని ఏరి వాటికి ముందుగా వాక్సిన్‌వేసి తరువాత వదిలిపెట్టాలని పేర్కొంది. అయితే రేబిస్ సోకిన వాటికి ఇది వర్తించదని, వాటిని తగు విధంగా సంరక్షణ షెడ్లలోనే ఉంచాలని తాము సూచించామని, అంతేకానీ వాటిని కూడా ఇతర కుక్కలతో పాటు వదిలేస్తే తప్పని పేర్కొన్నారు. ఇక పిచ్చికుక్కల బెడద వీడకుండా ఉన్నందున తాము ఆగస్టు 11ప తేదీన వెలువరించిన వీధి శునకాలను ఆ తరువాత విడిచిపెట్టాలనే ఆదేశాలపై పునరాలోచించుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఎందుకంటే వ్యాక్సినేషన్ అయిన రేబిస్ కుక్కలను కూడా ఈ కుక్కలతో పాటు విడిచిపెట్టడం జరుగుతోంది. దీనితో సమస్య మొదటికి వస్తోందని వ్యాఖ్యానించారు. 

తెల్ల బంగారానికి తేమ పాట్లు

 8 నుంచి 12శాతం తేమ వరకే సిసిఐ అనుమతి

ఈ ఏడాది నిబంధనలు కఠినతరం

అకాల వర్షాలతో పత్తిలో అధిక తేమ

లబోదిబోమంటున్న రైతులు 

తేమ శాతాన్ని 17 నుంచి 18శాతం వరకు సడలించాలని డిమాండ్ 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి పండిచిన పత్తి పంట తీరా విక్రయించే సమయానికి తేమ కొర్రీలతో మద్దతు ధర లభించేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రధమార్థంలోనే ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు పలు కారణాలతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఆలస్యంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడం, మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో తేమ శాతం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం సిసిఐ కేంద్రాలకు విక్రయించేందుకు తీసుకొస్తున్న పత్తి అధిక తేమ శాతం ఉంటుంది. సిసిఐ మాత్రం 8 నుండి 12 శాతం తేమ వరకు మాత్రమే అనుమతిస్తోంది. దీంతో పత్తి రైతులకు దక్కాల్సిన మద్దతు ధర ప్రశ్నార్థ్దకంగా మారింది.

రా ష్ట్రంలో ఈ ఏడాది 43.29 లక్షల ఎకరాల్లో 24.70 లక్షల టన్నులు పత్తి దిగుమత్తి అ వుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొత్తం పత్తిలో 70 శాతం మద్దతు ధరలకు కొనుగోలు చేస్తున్నట్లు సిసిఐ వెల్లడిస్తోంది. అ యితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సిసిఐ నిబంధనల ప్రకారం తేమ శాతం రైతుల మద్దతు ధరకు అశనిపాతంలా మారింది. ఏటా పత్తి కొనుగోళ్లకు సిసిఐ తేమ విషయంలో నిబంధనలు జారీ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు వాటిని సడలిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తేమ నిబంధనలు సడలించాలని వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి వరుస విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ విజ్ఞప్తులు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి.

కాగా, రాష్ట్రానికి తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా దళారులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుని వచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు రైతులకు ఇబ్బంది కరంగా మారింది. ఈ యాప్‌లో నమోదు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య రైతులను వేధిస్తోంది. పత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర అధికారి సోమవారం ఆదిలాబాద్‌లో సందర్శించి కొనుగోళ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తేమ శాతంపై ఎదుర్కోంటున్న సమస్యలు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణ పరిస్థితుల్లో తేమ శాతం 16 వరకు వస్తోందని రైతులు వాపోతున్నారు. తేమ శాతం నిబంధన 17 నుండి 18 శాతం వరకు సడలిస్తే మద్దతు ధర లభిస్తుందని రైతుల పేర్కొంటున్నారు.

సిసిఐ నిబంధనలు ఇలా

సిసిఐ ఈ ఏడాది పత్తి కొనుగోలకు నిబంధనలు కఠినతరం చేసింది. పత్తిలో తేమ శాతం 8 నుండి 12 శాతం వరకు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అధికంగా ఉంటే కొనుగోలు చేయమని తేల్చిచెప్పింది. 8 శాతం కంటే తక్కువగా తేమ ఉంటే ప్రోత్సాహకాలు అందిస్తామని, 8 శాతం నుండి 12 శాతం మధ్య తేమ ఉంటే ధర నిష్పత్తి ప్రకారం తగ్గుతుందని తెలిపింది. 

మంగళవారం రాశి ఫలాలు (28-10-2025)

మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

మిథునం – రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ.

కర్కాటకం – మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

సింహం – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఇంటాబయటా మీదే పై చేయి ఉంటుంది.

కన్య – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

తుల – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం – ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది.

ధనున్సు – వివాదాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఉద్యోగులలో స్థాన మార్పులు వుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మకరం – ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం – జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

 

12 రాష్ట్రాలు, యుటిలలో రెండో దశ సర్

51 కోట్ల మంది ఓటర్ల హక్కు నిర్థారణ ప్రక్రియ

తమిళనాడు, కేరళ , పశ్చిమ బెంగాల్‌లో వడబోతలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితాల విడుదల

పారదర్శకత, అక్రమవలసదార్ల ఆటకట్టుకే

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ వెల్లడి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఓటర్ల జాబితా సవరణ (సర్) నెండో దశ చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సర్వంసమాయత్తం అయింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ సర్ బృహత్ విన్యాసం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) జ్ఞానేష్ కుమార్ సోమవారం తెలిపారు. నిర్ణీత ప్రకటన మేరకు ఆయన ఈరోజు సర్‌పై వివరణకు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీహార్ సర్ తరువాత జరిగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇదే. ఇప్పుడు జరిగే రెండో దశ సర్‌లో భాగంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్ , గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్‌ల్లో ఓటర్ల జాబితా వవరణలు జరుగుతాయి.

ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. వీటిలో సర్ ప్రక్రియ పట్ల ఇప్పటికే తమిళనాడు, బెంగాల్ సిఎంలు తమ వ్యతిరేకత, తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడిగా ప్రకటిస్తారని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాల పారదర్శకతనే కీలకం. న్యాయంగా ఓటు హక్కు పొందే వారికి భరోసాగా ఉండేందుకు ఈ ప్రక్రియ అని తేల్చి చెప్పారు. రెండో దశ సర్ ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీన ఆరంభం అవుతుంది. ముందుగా ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఇది డిసెంబర్ 4 దాకా ఉంటుంది. తరువాత అదే నెల 9న ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను వెలువరిస్తుంది. అభ్యంతరాలు, ఇతరత్రా విషయాలను పరిగణనలోకి తీసుకున్నతరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన తుది ఎన్నికల ఓటర్ల జాబితాలు (ఎఫ్‌ఇఆర్)లు విడుదల చేస్తారని సిఇసి చెప్పారు.

ఇక అసోంకు సంబంధించి ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం నిబంధన వర్తింపచేస్తారని తెలిపారు. అక్కడున్న పౌరసత్వ చట్టం పరిధిలో రెండు రకాల నిబంధనలు అవసరం ఏర్పడింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణ క్రమంలోనే అక్కడ పౌరసత్వ తనిఖీలు పూర్తి చేస్తారు. ఈ పరిధిలోనే అక్కడ సర్ ఉంటుంది. ఇంతకు ముందటి సర్ ఆదేశాలు మొత్తం దేశానికి సంబంధించినవని వెల్లడించారు. అస్సాంకు సంబంధించి విడిగా సర్ తేదీలను ప్రకటిస్తారు. ఇంతకు ముందు దేశంలో ఓటర్ల జాబితా సవరణలు 20022004 మధ్యలో జరిగాయి. ఇక స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే ఇది తొమ్మిదవ సర్ ప్రక్రియ అవుతుంది.

581 కోట్ల మంది ఓట్ల ఖరారు ప్రక్రియ

ఇప్పుడు చేపట్టే సర్ రెండవ దశ పరిధిలో దేశంలో మొత్తం మీద 51 కోట్ల మంది ఓటర్ల సంబంధిత ఓటు హక్కు ఖరారు ప్రక్రియగా నిలుస్తుంది. ఇందులో ప్రధానమైన ఘట్టం ఓటర్ల లెక్కింపు అంశం. ప్రాంతాల వారిగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అనేది ఆరాతీయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్లి వివరాలను తెలుసుకుంటారు. తమకు బెంగాల్ లేదా తమిళనాడు ప్రభుత్వంతో ఎటువంటి తగవు లేదని సిఇసి స్పష్టం చేశారు. అక్కడ మమత బెనర్జీ సారధ్యపు టిఎంసి సర్ అనుచితం అని, దీనితో కొన్నివర్గాల ఓట్లు గల్లంతు అవుతాయని పేర్కొంటోంది, ఇదే వాదనను ఒక్కరోజు క్రితం తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా ప్రస్తావించారు.

సర్‌కు సిబ్బంది కల్పన బాధ్యత రాష్ట్రాలదే

రాష్ట్ర ప్రభుత్వాలే విధిగా సర్ కోసం అయినా ఎన్నికల నిర్వహణకు అయినా తగు విధంగా ఉద్యోగులను తమకు కేటాయించాల్సి ఉంటుందని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అక్కడ సర్ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ వస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. అక్కడ ఇప్పటికైతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని బదులిచ్చారు. వివాదాస్పదమైన బీహార్ సర్ విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు.

ఇది కొందరు అనుకుంటున్నట్లు వివాదాస్పదం కాదు. అంతా పారదర్శకం అన్నారు. అక్కడ ఓటర్ల జాబితాల సవరణ లేదా ప్రక్షాళన పూర్తి అయింది. ముందుగా చేయాల్సిన సమీక్షలన్ని చేసిన తరువాత తుది జాబితా వెలువరించాం. ఈ మేరకు అక్కడ దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే నెలలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఈ జాబితా పరిధిలోనే జరుగుతాయని వివరించారు. రెండుదశల ఎన్నికలు నవంబర్ 4, నవంబర్ 11 తేదీల్లో జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి.

ఇప్పటి సర్ విజయవంతానికి తాము రెండు దశల్లో రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో సమావేశాలు నిర్వహించామని, వారికి ఈ విషయంలో సమాయత్తానికి ఆదేశించామని సిఇసి తెలిపారు. వారి నుంచి తగు స్పందన ఉందన్నారు. సర్ ప్రధాన ఉద్ధేశం విదేశీ అక్రమ వలసదార్లు జాబితాల్లో చేరకుండా చేసేందుకు. ఇక వారి పుట్టిన స్థలాల తనిఖీలు నిర్వహించడం, అక్రమ వలసదార్ల ఆటకట్టుకు పలు రాష్ట్రాలు తీసుకుంటున్న వేగవంతం అయిన పటిష్ట చర్యల నేపథ్యంలో సర్ ప్రక్రియ కీలకం అవుతుందని జ్ఞానేష్ కుమార్ వివరించారు.