elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişjojobet girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiswinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

request hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

tlcasino

bets10

jojobet

sonbahis

betmoney

realbahis

jojobet giriş

nerobet

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

imajbet

matbet

grandpashabet

meritking

casibom

sekabet

xleet

marsbahis

royalbet

otobet

kingroyal

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

grandpashabet

Sweet Bonanza

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

betsmove giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

matbet giris

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

marsbahis

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

ప్రతీకారం వీడి పరస్పర మైత్రి

పరస్పర ప్రతీకార సుంకాల హెచ్చింపులతో ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళ పరుస్తున్న అమెరికా, చైనా అధినేతల మధ్య దక్షిణ కొరియా లోని బుసాన్ వేదికగా భేటీ జరగడం అనూహ్య పరిణామం. ఆరేళ్ల తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. బుసాన్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను ఒప్పందం కుదుర్చుకున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్‌లో తాను చైనా పర్యటిస్తానని, ఆ తరువాత జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఉంటుందని ప్రకటించారు. నిన్నమొన్నటివరకు శత్రువులుగా కత్తులు నూరుకున్న అగ్రనేతలు ఇద్దరూ దోస్తీ కావడం మంచి పరిణామమే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇంకా తనదారిలోకి సరిగ్గా రావడం లేదని, అందుకని చైనాతో స్నేహం పెంచుకుంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావచ్చన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఈ విషయాలేవీ ప్రస్తావనకు రాకుండా కేవలం వాణిజ్య అంశాలపైనే వీరు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే షట్‌డౌన్‌లో నడుస్తోన్న అమెరికా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ట్రంప్ ప్రస్తుత ప్రధాన లక్షంగా కనిపిస్తోంది.

అధిక సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడంతో చైనా కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దశలో ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అయితే ట్రంప్ చెప్పే దానికి, చేసే దానికి మధ్య ఉన్న అవాంతరాలను ఎదుర్కోవడానికి ప్రపంచం అలవాటుపడిన తరుణంలో ఆందోళనలకు కొంత విరామం కలిగి ఉండవచ్చు. అన్ని సమస్యలు క్లుప్తంగా పరిష్కరించబడతాయని నమ్మడమంటే ఈసారి ట్రంప్ తన మాటలను చేతలతో నిరూపించడానికి మొగ్గు చూపిస్తుండడమే కావచ్చు. చైనాపై అమెరికా విధించిన సుంకాలు 10 శాతం వరకు తగ్గుతాయని ట్రంప్ ప్రకటించారు. 57 శాతం నుంచి 47 శాతానికి సుంకాలు తగ్గుతాయి. దీనికి బదులుగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఏడాది కాలం వరకు ఆంక్షలను తొలగించింది. దీంతో సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తూ, ప్రపంచ వాణిజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన వాణిజ్యయుద్ధం ముగింపు ప్రారంభమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అమెరికాతో ఒప్పందానికి అన్ని దేశాలు సన్నద్ధం కావడానికి లేదా వారి ఎగుమతి గమ్యస్థానాలను గుర్తించడానికి అవకాశాలు కలగవచ్చు. గత ఆరు నెలలుగా ట్రంప్ చపలమైన ఇష్టాయిష్టాలు, ఊహాగానాలతో అధిక సుంకాలు, ప్రతీకార సుంకాలతో ఆర్థిక వాణిజ్య లావాదేవీలు ప్రపంచ దేశాల్లో అస్తవ్యస్తమయ్యాయి. చైనా, బ్రెజిల్ తోపాటు భారత్‌కూడా దీనికి బాధితురాలైంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా ఖజానాను నింపుతుండడం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి దోహదం చేస్తోందని భారత్‌పై విచక్షణారహితంగా ట్రంప్ నిందారోపణ చేయడం తీవ్రంగా కొనసాగుతోంది. అందువల్ల భారత్ కూడా అమెరికా నుంచి అత్యధిక సుంకాల బాధితురాలు కావలసి వస్తోంది. అందుకనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలన్న డిమాండ్ ట్రంప్ నుంచి పదేపదే వస్తోంది. ఈ మేరకు రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులకు కూడా బ్రేక్ పడినట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

సింథటిక్ మత్తు పదార్థం ఫెంటానిల్ తయారీకి అవసరమైన రసాయనాల సరఫరాను నివారించాలన్న అమెరికా విజ్ఞప్తిని చైనా అంగీకరించడంతో ఫెంటానిల్ విషయంలో చైనాపై ప్రతీకారంగా విధించిన 20 శాతం సుంకాల్లో 10 శాతం తగ్గిస్తానని ట్రంప్ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్, బ్రెజిల్‌తో కూడా త్వరలో వాణిజ్య ఒప్పందాలు సమంజసమైన రీతిలో కుదుర్చుకునేలా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అమెరికాకు దిగుమతి అయ్యే ఏ వస్తువులపైనయినా సరే సుంకాలు అధికంగా విధిస్తే అమెరికాలోని పౌరులు ప్రతివారూ తమ జేబులోంచి ఎక్కువగా చెల్లించుకోవలసి వస్తుందని ట్రంప్ ఇప్పటికైనా గ్రహించారా అన్న చర్చ సాగుతోంది. కెనడాపై టారిఫ్‌ల భారాన్ని రోనాల్డ్ రీగన్ వ్యతిరేకించగా, ఆ అభిప్రాయాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడానికి వీలుగా ట్రంప్ టారిఫ్ తంత్రాలు చాలావరకు ఆగిపోవాల్సి వచ్చినప్పుడు, ప్రపంచ వాణిజ్యంలో కొంత క్రమబద్ధీకరణ జరిగినప్పుడు 2026 నుంచి సజావుగా సాగుతుందని అంచనా వేయడం కష్టం.

రష్యానుంచి కొనుగోళ్లను తగ్గించడాన్ని భారత్ సమర్థిస్తోంది కాబట్టి దానికి తగ్గట్టు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలన్న తార్కిక ఆలోచతో భారత్ ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను, అమెరికా రైతులను సంతోషపెట్టడానికి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తామని చైనా బలవంతంగా అంగీకరించి ఉండవచ్చు. కానీ ఇదే విషయంలో భారత్ సందిగ్ధంలో పడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక గందరగోళం తలెత్తిన కొన్ని నెలల తరువాత అమెరికాలో పెట్రోలు ధరలు, సూపర్ మార్కెట్లలో కిరాణా సామాన్ల ధరలు బాగా తగ్గించగలిగానని ట్రంప్ తన విజయాలుగా చాటుకుంటున్నప్పటికీ, ట్రంప్ తన తీవ్ర వైఖరి నుంచి వెనక్కు తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది మంచిదే అయితే ఊదరగొట్టే చర్యలు, ప్రతీకార సుంకాల విధింపులు ఎన్ని అనుభవించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను ప్రపంచ అగ్రరాజ్యాలు రెండూ అర్థం చేసుకున్నాయి. అమెరికాకు చైనాతో ఉన్న భారీ వాణిజ్య లోటు పోరాటానికి కారణమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదం లోకి నెట్టేంత రిస్క్ వారు తీసుకోలేకపోయారు. 

కులం పునాదులు కూలాల్సిందే

‘భారత దేశంలో కులం సామాజిక సామరస్యతను పరిరక్షించడానికి ఉపయోగపడింది. అంతేకాని కులం ప్రగతి నిరోధకమైంది కాదు’ అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత నెల సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంకోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ సమస్యకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం మౌలోని డా॥ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఎందిన సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన ఒక సామాజిక సర్వేను తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో మిగతా విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ, కులంపై చేసిన వ్యాఖ్యానం కేవలం సైద్ధాంతిక సమస్య మాత్రమే కాదు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఇటువంటి వాదనలు రెండు విషయాలను మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కులం అనే సమస్యపైన ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొన్ని శక్తులు భారతదేశ వాస్తవిక స్థితిని మరుగు పరిచి, క్రమంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పట్టించుకోకపోవడం గాని, క్రమంగా వాటిని రాజ్యాంగం నుంచి తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నది.

భారతదేశంలో కులం ఎన్నో అనర్థాలకు దారి తీసిందని, మరెన్నో ఘాతుకాలు జరిగాయని, ముఖ్యంగా మనుషుల్లో ఉండాల్సిన మానవ సంబంధాలను కేవలం హెచ్చుతగ్గుల సాంప్రదాయంగా మార్చి, ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి వాడుకున్నారని చరిత్ర పొడవునా ఎన్నో రుజువులున్నాయి. భారతదేశంలో కులం అనేది లేదని, పాశ్చాత్య ఆక్రమణదారులు దీనిని సృష్టించారని మరొక ప్రచారం. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లు కళ్లు ఉన్న అంధులు తప్ప ఎక్కువ చెప్పిన ప్రయోజనం లేదు. కులం ఉనికిలో ఉన్నదని వీళ్లు అంగీకరిస్తున్నారు. అయితే ఈ కులం సామాజిక ప్రగతికి మాత్రమే ఉపయోగపడిందని వారి భావన. ఒకవేళ అదే నిజమైతే చరిత్ర పొడవునా జరిగిన ఘర్షణలు, యుద్ధాలు వీళ్లకు కనిపించలేదు.

వీళ్లు నమ్ముతున్న పురాణాలు కూడా అదే విషయాన్ని రుజువు చేయడం లేదా! భారతదేశ సాంప్రదాయానికి ప్రధాన గురువులైన వశిష్టుడు, విశ్వామిత్రుడు జరిపిన సంఘర్షణ బ్రాహ్మణ క్షత్రియ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాదా! అదే విధంగా బ్రాహ్మణ వర్గమంఆ యాగాల పేరుతో జాతి సంపదను అగ్గిపాలు చేస్తుంటే, మిగతా కులాలు, వర్గాలు తిరగబడితే, తమ మనస్సు నచ్చు గోమాంసం తినడం మానేసి మళ్లీ తమ ఆధిపత్యం కోసం ఆర్థిక దోపిడీ కోసం సాంప్రదాయాలను సృష్టించడం లేదా! భారతంలోని కథలన్నీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కొన్న క్షత్రియుల హత్యల ఉదంతాలు కావా!

అంతేకాకుండా గౌతమ బుద్ధుని మొదలుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ దాకా సాగించిన సామాజిక ఉద్యమం ఎందుకు? గురునానక్, కబీర్, జ్ఞానేశ్వర్ తుకారాం, చొక్కామేళా, గాడ్గేబాబా, జ్యోతిబా ఫూలే, సావిత్రి భాయి ఫూలేలు ఎందుకు తమ కులాధిపత్య పోరాటాలకు అంకితం చేశారు? ఇది చరిత్ర. వర్తమానంలోకి వస్తే ఇప్పటికీ దళితుల మీద ఎందుకు హత్యలు, అత్యాచారాలు, దాడులు, అవమానాలు జరుగుతున్నాయి. ఇవి సామరస్య హత్యలా, విద్వేష హత్యలా! ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో నీటి కుండను ముట్టుకున్నాడని కర్రతో కొట్టి చంపింది కూడా కుల సామాజిక సామరస్యమేనా? కీలవేణిమని, బెల్చి, కారంచేడు, చుండూరు, ఖైర్లాంజి లాంటి అతి ఘోరమైన దళితుల ఊచకోత సామాజిక సామరస్యతకు నిదర్శనమా? అయితే ఇవన్నీ తెలియక కాదు. కావాలని ఒక కుట్రపూరితమైన చర్చను లేవనెత్తుతున్నాయి. అది కూడా ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అటువంటి అభిప్రాయాన్ని అది కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టడం యాదృచ్ఛికం కాదు.

భారతదేశ సుప్రీం కోర్టుకు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. అది రాజ్యాంగ విలువలను కాపాడడం, హక్కులను రక్షించడం. అయితే ఇటువంటి వాదనలు సుప్రీం కోర్టు ముందు పెట్టడమంటే, ఎంతో మంది దార్శనికులు, రాజ్యాంగ నిపుణులు, ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నిరాకరించడమే. నిజానికి ఈ ఒక్క విషయం చాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి. ఎందుకంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తాము రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రమాణం చేస్తారు. ఈ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది.

భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పూర్తిగా భారత దేశంలో ఉన్న సామాజిక వ్యత్యాసాలు, ప్రత్యేకించి కులవ్యవస్థ, అంటరానితనం నిర్మూలన జరగాలని ఉద్దేశించినవి. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 నుంచి 21 వరకు సంపూర్ణంగా కుల అసమానతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. అదే విధంగా ఆదేశిక సూత్రాలలోని చాలా అంశాలు కుల అసమానతలను రూపుమాపడానికి ఉపయోగపడతాయని భావించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు కూడా మౌనం వహిస్తే దాని అర్థం ఏమిటో తెలియదు. ఇటు ప్రజా ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్‌లో రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా మార్చి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను పెంచి పోషించే కుల వ్యవస్థను మళ్లీ మనం తిరిగి మరింత బలం చేకూర్చినట్టవుతుంది.

అదే విధంగా కుల వ్యవస్థ వలన సామాజిక రంగంలోనే కాదు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అది మరింత పటిష్టంగా కనపడుతున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు కేవలం ఉపాధి, వ్యాపారం, వాణిజ్యం మాత్రమే కాదు కులం కూడా ఈ అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఈ రోజు దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, కార్పొరేట్లు కొన్ని కులాలకే పరిమితమవుతున్నాయి. ఆయా రంగాల్లో ఆ కులాలు ఆధిపత్యం నిరంతరం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఇందులో ఎటువంటి మార్పులు లేవు. ఈ విషయాలపైన ఎన్నో పరిశోధనలు జగిగాయి. జరుగుతున్నాయి. వ్యాపారాలు, పరిశ్రమలు కొన్ని కులాలకు డబ్బులు ఆర్జించి పెట్టి లక్షల కోట్ల అధిపతులను చేసే అదే వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కంపెనీల్లో పని చేసి ప్రాణాలు కోల్పోవడం నిమ్న కులాల వంతుగా మారింది. దానికి ఎన్నైన ఉదాహరణలు ఇవ్వవచ్చు. ఆధిపత్య కులాలు అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే, మిగతా కులాలు పేదరికంలో మగ్గుతున్నాయి.

విద్య, వైద్య సౌకర్యాలు కూడా ఎవరికి అందుబాటులో ఉన్నాయి? వరదల్లో కరువులో ఎవరు ఆకలి చావుల్లో బతుకుతున్నారు? రైతుల ఆత్మహత్యల్లో ఏ కులాలు ఉన్నాయి? ఇవన్నీ తెలియని విషయాలు కాదు. ఈ విషయాలు మాట్లాడుతున్న వాళ్లు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అయితే ఈ కుల వ్యవస్థ వల్ల అనేక సమస్యలకు, అసమానతలకు, అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న నూటికి ఎనభై శాతం మంది వివక్షకు గురవుతున్న కులాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఈ అవమానాలు, వివక్ష సమసిపోదని గుర్తించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కుల వ్యవస్థ ఈ దేశ విచ్ఛిన్నానికి కారణం కాగలదని, కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని అర్థం చేసుకోవాలి. 

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

యుద్ధోన్మాదాల మాయా ప్రపంచం

ప్రపంచ చరిత్రను తిప్పిచూసినా, యుద్ధాల జాడ కనిపిస్తుంది. కాలం మారినా, మనిషి ఆలోచన మారినా యుద్ధం అనే ఆతురత మాత్రం మానవ స్వభావంలో ఏదో మూలన దాగి ఉంది. కొన్నిసార్లు అది అహంకారంగా పుట్టుతుంది. కొన్నిసార్లు భయంగా, మరికొన్నిసార్లు ఆత్మరక్షణ అనే పేరుతో రూపం దాలుస్తుంది. దేశాల మధ్య యుద్ధాలకు ప్రధాన కారణం అధికారం మీద ఆకాంక్ష. ఒక దేశం తన ప్రభావాన్ని మరొక దేశంపై చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. సరిహద్దులు విస్తరించాలనే ఆశ, ఆర్థిక వనరులపై ఆధిపత్యం సాధించాలనే తపన, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతాలపై కన్నేయడం ఇవన్నీ యుద్ధాలకు విత్తనాలు వేస్తాయి. ఒక దేశం ప్రజాస్వామ్య మార్గంలో నడుస్తే, ఇంకో దేశం నియంతృత్వం దిశగా సాగుతుంది. ఆ విలువల మధ్య ఉన్న భిన్నతే కొన్ని సందర్భాల్లో సాయుధ ఘర్షణలకు దారితీస్తుంది. అయితే ఇవి కేవలం సిద్ధాంతాల మధ్య పోరాటం కాదు వాటి వెనుక మనుషుల భావాలు, ఆశలు, భయాలు కూడా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా యుద్ధాలను ప్రేరేపిస్తాయి. చమురు, బంగారం, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరులు ఉన్న ప్రాంతాలు ఎప్పుడూ ఆర్థిక స్పర్ధకు వేదిక అవుతాయి.

ఎవరైతే ఆ వనరులను నియంత్రిస్తారో, వారే ప్రపంచానికి నియంత్రణ కలిగి ఉంటారనే భావనతో దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబడతాయి. కానీ ప్రతి యుద్ధం వెనుక ఒక మానవ కథ ఉంటుంది. ఒక సైనికుడి కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక చిన్నారి భయం – ఇవే నిజమైన యుద్ధ దృశ్యాలు. గెలిచిన దేశమూ, ఓడిన దేశమూ చివరికి గాయాలతోనే మిగిలిపోతాయి. యుద్ధం ఎవరినీ సంతోషపెట్టదు; అది కేవలం నష్టాల పునాదిపై నిర్మితమైన విజయాన్ని మాత్రమే అందిస్తుంది. నేటి ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, యుద్ధాల రూపంమారినా వాటి మూలస్వభావం మాత్రం మారలేదు. ఇప్పుడు బాంబులు, కత్తులు కాకుండా సాంకేతిక ఆయుధాలు, సైబర్ దాడులు, ఆర్థిక ఆంక్షలు యుద్ధ రూపాలు అవుతున్నాయి. కానీ అసలు తాత్పర్యం ఒకటే ఎవరో ఒకరు గెలవాలనే మనస్తత్వం. ఇలాంటి సమయాల్లో మానవ విలువలే అసలైన ఆయుధం కావాలి. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహన – ఇవే దేశాల మధ్య శాంతి దారులు. యుద్ధం అనేది ధైర్యానికి కాదు, సహనానికి పరీక్ష. ఎవరు శాంతిని కాపాడగలరో, వారు నిజమైన వీరులు. ప్రపంచం మొత్తానికీ ఈ సత్యం ఒక జ్ఞాపకం కావాలి.

యుద్ధం ఎవరికీ లాభం కాదు; ప్రేమ, నమ్మకం, సంభాషణ – ఇవే శాశ్వత విజయ మార్గాలు. మానవతనే యుద్ధం మీద గెలిచే ఏకైక శక్తి. గత నూరేళ్ల యుద్ధగాథలు – ప్రపంచానికి ఒక నేర్చుకోదగిన పాఠం ప్రపంచ చరిత్రలో గత నూరేళ్ల కాలం అత్యంత మార్పులు, పరీక్షలు, మానవతకు గాఢమైన పాఠాలు నేర్పిన కాలంగా నిలిచింది. ఈ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాలతో మొదలై, శాంతి ప్రయత్నాలతో ముగిసిన అనుభవాల సమాహారం. యుద్ధం అనే పదం కేవలం పోరాటాన్ని మాత్రమే కాదు, మానవ మనసులోని ఆశలు, భయాలు, ఆధిపత్యం, రక్షణల మధ్య నడిచే సంఘర్షణను సూచిస్తుంది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నుంచే ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఎదుగుతున్న సమయంలో, 1914లో యూరప్ దిశగా ఒక పెద్ద మంట మొదలైంది. ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో మొదలైన ఈ ఘర్షణ, క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టుకుంది. ఆ యుద్ధంలో యూరప్ దాదాపు మొత్తం కుదేలైంది. కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. శాంతి కోసం ఏర్పడిన ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ తర్వాతి కాలంలో ప్రపంచ సహకారానికి పునాదిగా మారింది.

మొదటి యుద్ధం ముగిసి ఇరవై ఏళ్లలోపే, ప్రపంచం మరలా ఆగ్రహాగ్నిలో చిక్కుకుంది. జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల విస్తరణ వాంఛ, మరోసారి ప్రపంచాన్ని అగ్నిగుండం చేసింది. అణుబాంబులు, ట్యాంకులు, గగనయానాలు – మానవ విజ్ఞానానికి నొప్పి కలిగించే పరికరాలుగా మారాయి. చివరికి యుద్ధం ముగిసింది. కానీ ప్రపంచం రెండు శక్తులుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ దేశాలు, మరొకటి తూర్పు బ్లాక్. ఇదే కాలం లో ఐక్యరాజ్యసమితి పుట్టింది – శాంతికి పునాది వేసిన ప్రపంచ వేదికగా. 1945 తర్వాత ప్రపంచం నేరుగా యుద్ధం చేయకపోయినా, ఆలోచనల యుద్ధం కొనసాగింది. అమెరికా, సోవియట్ రష్యా మధ్య నడిచిన ప్రచ్ఛన్నయుద్ధం అనేది ఆయుధాల పోటీగా, అంతరిక్ష పోటీగా, ఆర్థిక ఆధిపత్య పోటీగా మారింది. ప్రపంచ దేశాలు ఈ రెండు శక్తుల మధ్య సంతులనం పాటించే ప్రయత్నం చేశాయి. 1950 1975 మధ్య కాలం వరకు కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి ఘర్షణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇవి కేవలం ప్రాంతీయ సరిహద్దుల పోరాటం మాత్రమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవం, స్వాతంత్య్రం కోసం జరిగిన త్యాగాల పాఠాలుగా నిలిచాయి.

మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాలు- సూయెజ్, ఇరాన్, ఇరాక్, గల్ఫ్ వంటి ఘర్షణలు చమురు ఆధారిత ఆర్థికత, భూభాగ ప్రాధాన్యం కారణంగా చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నగరాలు శిథిలమయ్యాయి, వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కానీ ఆ దేశ ప్రజల ధైర్యం, దేశభక్తి ప్రపంచానికి స్ఫూర్తి ఇచ్చింది. శాంతి కోసం వారి ప్రయత్నం మానవ విలువల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచం నేడు కూడా యుద్ధాల భయంతో పూర్తిగా విముక్తి పొందలేదు. సాంకేతిక శతాబ్దంలోనూ యుద్ధాలు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. సరిహద్దుల వద్ద తుపాకీ శబ్దాలే కాకుండా, ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులు, సమాచార మాయాజాలాలు, వ్యూహాత్మక ప్రభావ పోటీలు కూడా యుద్ధాలే అయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇంకా ఘర్షణలు ఆగలేదు; యూరప్ తూర్పు అంచుల్లో ఉక్రెయిన్ యుద్ధం నేటి మానవతకు సవాలు విసురుతోంది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనూ అంతర్గత ఘర్షణలు ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయి. శాంతి ఒప్పందాలు కుదురుతున్నా, అవిశ్వాసపు గోడలు మాత్రం ఇంకా కూలలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పుడు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉంది. యుద్ధం ఎవరికీ పరిష్కారం కాదు, శాంతి మాత్రమే మానవతకు ఆశ్రయం. ఆగ్నేయ, తూర్పు, పశ్చిమ ఏదైనా కావచ్చు, చివరికి ప్రతి మానవ హృదయంలో శాంతి అగ్ని వెలిగితేనే ఈ ప్రపంచం నిజమైన విజయం పొందుతుంది.

– చిటికెన కిరణ్ కుమార్ 94908 41284

రోహిత్ రికార్డును కొల్లగొట్టిన పాక్ బ్యాట్స్‌మెన్

హైదరాబాద్: టి20లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ రికార్డు సృష్టించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రికార్డును బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ 11 పరుగులు చేసి టి20లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. బాబర్ 123 ఇన్నింగ్స్‌లలో 39.37 సగటుతో 4234 పరుగులు చేశాడు. గతంలో రోహిత్ శర్మ 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 125 మ్యాచ్‌లలో 4188 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్, విరాట్ టి20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. టి20ల్లో నంబర్ వన్ స్థానంలో అభిషేక్ శర్మ ఇదే ఫామ్ కొనసాగిస్తే బాబర్ రికార్డు గల్లంతు కావడం ఖాయమని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 

ధాన్యం కొనుగోలు చేసి ఎగుమతి చేయాలి

మన తెలంగాణ/మోత్కూర్: వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపద్యంలో మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వారితో మాట్లాడి ఎగుమతి చేయాలని మోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ పేలాపూడి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మోత్కూర్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యపు రాశులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో కార్యదర్శి కె.వరలక్ష్మి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.

శుక్రవారం.. షుక్రియా

శుక్రవారం… ముస్లింలకు పవిత్రమైన రోజు. మంత్రి మండలిలో మైనారిటీ మినిస్టర్ లేని లోటు సరిగ్గా నమాజ్‌కు కొద్దిసేపు ముందు తీరింది. అంతేనా! మరో 10 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండగా, అక్కడి ఓటర్లలో 30 శాతం ప్రాబల్యం గల ముస్లింల దృష్టిని అకస్మాత్తుగా ఆకర్షించింది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైమింగ్ ముచ్చటేస్తోంది. నిశ్శబ్దంగా ఉండీ ఉండీ ఒక్కసారిగా గుంపగుత్త ఓట్లపై గురిపెట్టారన్నది సమయం, సందర్భం, నేపథ్యం చెప్పకనే చెబుతున్నాయి. తన మంత్రి వర్గం పాక్షిక విస్తరణ ముహూర్తంలోనూ ముస్లింల మనోభావాలను గొప్పగా పాటించారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం. మధ్యలో ఒక శుక్రవారం. తదుపరి శుక్రవారం (నవంబర్ 14, బాలల దినోత్సవం కూడా) ఓట్ల లెక్కింపు. మొత్తానికి శుక్రవారం షుక్రియాగా ఈ ఈవెంట్ నమోదైంది. జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లలో లక్షా ఇరవై వేల మంది ముస్లింలే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ తక్షణ కర్తవ్యం ఏమిటో ఈరోజు నుంచే చూస్తున్నాం! ఎఐసిసి, సిఎం మధ్య సమన్వయం భాసిల్లుతోందని మంత్రివర్గం స్వల్ప విస్తరణ రుజువు చేసింది.

మూడు ఖాళీల భర్తీకోసం వేచిచూసి విసిగిపోతున్నారు ఆశావహులు. ఎందుకు నాన్చుతూ రెండేళ్ళు వెళ్ళదీశారో వారికి ఎరుకలోకి వచ్చినట్టయింది. మనకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి ముందు ఆంధ్రాలో ప్రచారానికి బయల్దేరారు. తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసిందని తన చేతి గడియారం వంక చూసి, నిర్ధారించుకొన్నారు. హైదరాబాద్ పోవాలంటే మనకు వీసా కావాలా? అంటూ కోస్తాంధ్ర రాయలసీమ ఓట్లను ఒక్క వాక్యంతో బుట్టలో వేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలానే సైలెంట్ వ్యూహాన్ని అమలు చేసే దాకా లోకానికి తెలియలేదు. ఇప్పటికిప్పుడు ఈ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఎవరి ఊహకూ అందలేదు. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్‌లో విజయంపై గురి తప్పవద్దనే సిఎం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నారని విదితమైంది. తన రాజకీయ నిర్ణయాలను అమల్లోకి తెచ్చేదాకా రహస్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. పోలింగ్‌కు 10 రోజుల ముందు తన మంత్రి మండలిలోకి అజారుద్దీన్‌ను తీసుకోవడం ఇందుకు కొనసాగింపు.

గెలుపోటములను తీక్షణంగా డిసైడ్ చేసే స్థాయిలో మైనారిటీల ఓట్లు జూబ్లీహిల్స్‌లో ఉన్నాయి. గుంభనంగా ఉంటూ ఉంటూ ఏకంగా అజారుద్దీన్‌ను కేబినెట్ లోకి సమయానుకూలంగా చేర్చుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. ఎమ్మెల్సీ పదవి అజారుద్దీన్‌కు ఆల్రెడీ ప్రతిపాదించారు. తాను ఇక 6 నెలలలోపు ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్‌కు బెర్త్ కోసం ఎఐసిసి ఆమోదం ఉండకుండా ఉండదు. అంటే.. హైకమాండ్, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ వ్యూహాల్లో సమన్వయంతోనే ఉన్నట్లు వేరే చెప్పక్కర్లేదు. మూడు ఖాళీలకుగాను అజారుద్దీన్‌కు స్థానంతో మంత్రి మండలిలో మైనారిటీలు లేని లోటు తీర్చడం, జూబ్లీహిల్స్‌లో వారి మద్దతు కూడగట్టేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా, సమయస్పూర్తితో నిశ్చయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

సిఎం రేవంత్ రెడ్డి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు మనకు కనిపించిన 24 గంటల్లోనే మంత్రి మండలిలో మైనారిటీకి స్థానం అనే సంచలన సమాచారం దేనికదే అయినప్పటికీ… బిజెపి, బిఆర్‌ఎస్ ఎత్తుగడలకు ఏమాత్రం తక్కువ కాకుండా… అన్ని మతాలు, వర్గాల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి మామూలుగా గురి పెట్టలేదని మాత్రం తెలుస్తున్నది. నవంబర్ 9 వరకూ స్వయంగా జూబ్లీహిల్స్ ప్రచారంలో లెగ్ వర్క్, ఫీల్ వర్క్ మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట కొత్త మంత్రి అజారుద్దీన్ ఉండనుండడం రాజకీయ తెరపై సరికొత్త సన్నివేశం. జూబ్లీహిల్స్ లోనూ తన ఎత్తుగడలు క్లిక్ అయితే, సాధారణ ఎన్నికలకు ఏడాది లేదా రెండేళ్ల ముందు ఇలానే ఎవరికీ అంతుబట్టని అస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగిస్తారు.

– ఇల్లెందుల దుర్గాప్రసాద్

94408 50384

అజారుద్దీన్ కు మంత్రి వర్గంలోకి అవకాశంకల్పించడం పట్ల హర్షం

మన తెలంగాణ/మోత్కూర్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , మాజీ ఎంపి, (మాజీ క్రికెటర్) మహ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పట్ల మోత్కూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మహ్మద్ సమీర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ… గత దశాబ్దన్నార కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ లో చురుకుగా పనిచేస్తున్న అజారుద్దీన్ సేవలను గుర్తించి మంత్రివర్గంలోకి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వర్గానికి , ఎమ్మెల్యేలకు సమీర్ కృతజ్ఞతలు తెలిపారు.

‘తుంగతుర్తి ఎస్ఐ వేధింపులతోనే మా తల్లి చనిపోయింది’

సూర్యాపేట: తుంగతుర్తి ఎస్ఐ వేధించడంతోనే మా అమ్మ చ‌నిపోయిందని మృతురాలి కూతురు ఆరోపణలు చేసింది. పోలీసులు వేధించడంతోనే వెంపటి గ్రామానికి చెందిన సోమ‌ నర్సమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణల వినిపిస్తున్నాయి. దీంతో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నర్సమ్మ ఆత్మహత్యకు ఎస్సై క్రాంతి కుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. ఓ బంగారం చోరీ కేసులో ఎస్సై స్టేషన్ కు పిలిపించి వేధింపులకు దిగారని, తన తల్లి ఏ నేరం చేయలేదని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోవడంలేదన్నారు. దొంగతనం కేసులో వేలి ముద్రలు దొరికాయని తన తల్లిని భయబ్ర్రాంతులకు గురి చేశారన్నారు. చేయని నేరం ఒప్పుకోవాలని ఎస్సై ఇబ్బందులకు గురిచేయడంతో తన తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు. త‌న త‌ల్లి మృతికి కారణమైన ఎస్ఐతో పాటు గాజుల మహేందర్ పై చర్యలు తీసుకోవాలని కుమార్తె డిమాండ్ చేశారు. తమ వైపు పెద్ద మనుషులను కూడా పోలీసులు భయపెట్టారన్నారు. మా అమ్మ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకోలేదని ఎస్ఐ అన్నారని, ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రైవేటు ఆస్పత్రి నుంచి దొంగపేపర్లు తీసుకొచ్చారని ఎస్ఐ తమని తిట్టారని మీడియాకు తెలిపింది. 

యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్‌ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఈ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ “ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకుల కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. ఈ సినిమాతో 100 శాతం అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాం”అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ “ఈ సినిమా యూత్ అందరికీ నచ్చుతుంది. యూత్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా ఇది. సినిమా క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను”అని పేర్కొన్నారు. నిర్మాత బళ్లారి శంకర్ మాట్లాడుతూ “ఇది నా తొలి సినిమా. పట్నాయక్ మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిషి, తేజ మర్ని, గోపరాజు రమణ, దేవి ప్రసాద్, జగదీష్, మధుమణి, తాగుబోతు రమేష్ పాల్గొన్నారు. 

ఆటోను ఢీకొట్టిన టెంపో: ఆరుగురి పరిస్థితి విషమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటకల్ క్రాస్ దగ్గర కూలీలను తీసుకెళ్తున్న ఆటోను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.