Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

holiganbet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

betebet

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

bettilt

interbahis

kingroyal

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

madridbet

kingroyal

meritking

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

madridbet

kingroyal

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

meritking

grandpashabet

süratbet

meritking

jojobet

meritking

kingroyal

madridbet

meritking

kingroyal

madridbet

kingroyal

meritking

bets10

meritking

జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యే అవగాహన ఒప్పందం కుదిరిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు  యుసఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో కిషన్ రెడ్డి పాతయాత్ర చేశారు. . బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

యుపిలో రైలు ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులు మృతి

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ ప్రాంతం చునార్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. 13309 అనే నంబర్ గలం చోపాన్-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ప్రయాణికులు రాంగ్ వేలో పట్టాలపై వెళ్తుండగా 12311 అనే నంబర్ గల నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికి కూడా పట్టాలపై నుంచి దాటడంతోనే ఈప్రమాదం జరిగింది. ప్రయాణికుల నిర్లక్షమే వారి ప్రాణాలు తీసింది. 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు… కుషాయిగూడలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుషాయిగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడంతో ఆటో డ్రైవర్ మీన్‌రెడ్డి(32) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి పట్టుబడ్డాడు. అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ పిఎస్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు మంటలు ఆర్పేసి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మీన్‌రెడ్డిని దమ్మాయిగూడా వాసిగా పోలీసులు గుర్తించారు. ఆటోను వేరే ఓనర్ నుంచి అద్దెకు తీసుకొని మీన్‌రెడ్డి నడుపుతున్నాడు. శవ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలించారు. పోలీసుల దురుసు ప్రవర్తనే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 120 వచ్చిందని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

వందేమాతరం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం

భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధారణ భారతీయులను సైతం భావోద్వేగంతో ఉర్రూతలూగించి, స్వతంత్ర సమరం వైపు నడిపించి, విప్లవకారులు నవ్వుతూ ఉరికంభంల వైపు తీసుకెళ్లి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసేందుకు స్ఫూర్తి ఇచ్చిన అసాధారణమైన గేయం ‘వందేమాతరం’. ఇప్పటికి కూడా భాష, ప్రాంతం, మతం, కులం, వర్గం వంటి అన్ని విభేదాలతో సంబంధం లేకుండా భారతీయులు అందరికీ ఉత్తేజం కలిగించే గీతం ఇది. భారత మాతను ఇంతకన్నా ఘనంగా కీర్తించి, సమర్పించుకొనే గేయం మరొకటి లేదని చెప్పవచ్చు. ఇది మన దేశ జాతీయ గేయం. దీన్ని 1875లో నవంబరు 7న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ కూర్చారు. ఆయన రచించిన బెంగాలీ నవల ‘ఆనంద్ మఠ్’లో ఈ గేయాన్ని పొందుపరిచారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవం ఈ ఏడాది నవంబరు 7న మొత్తం దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ రోజున ఒక నిర్ణీత సమయంలో దేశ ప్రజలు అందరూ ఈ గేయాలాపన జరపాలని కేంద్ర ప్రభుత్వం పిలుపిచ్చింది. ఈ వేడుకను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు, నేడూ కోట్లాదిమంది భారతీయులను ఏకం చేస్తున్న వందేమాతరం పాట స్వాతంత్య్ర సమరయోధుల నినాదం, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నిరసనలు, సమావేశాలు, కాంగ్రెస్ సమావేశాల ద్వారా ప్రతిధ్వనించింది. ప్రజలలో అంతులేని ధైర్యం, ఐక్యతలను సూచిస్తుంది.

స్వేచ్ఛ కోసం తహతహలాడే ప్రతి భారతీయ హృదయాన్ని కలుపుతుంది. చరిత్రపుటల్లోకి వెళితే 1769 నుంచి 1773 మధ్యకాలంలో బంగాల్‌లో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి బంగాల్ ప్రాంతం భౌగోళికంగా చాలా పెద్ద పరిణామంలో ఉండేది. తూర్పు భారత్‌లోని పలు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ కూడా అప్పటి బంగాల్‌లోనే భాగంగా ఉండేవి. ప్రత్యేకించి 1770లో కరువుతో బంగాల్ ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో దాదాపు కోటి మందికిపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో 1770 నుంచి 1775 వరకు బ్రిటీష్ పాలకులు, భూస్వాములపై హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ పాలకులకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆహార గోదాములు, కోశాగారాలు, సంపన్న ఉన్నతాధికారుల ఇళ్లపై తిరుగుబాటుదారులు దాడులు చేశారు.

అక్కడి నుంచి సేకరించిన డబ్బు, ధాన్యాలను పేదలకు పంచారు. ‘ఆనంద్ మఠ్’ నవలను బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ రచించేందుకు హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటు ఉద్యమమే స్ఫూర్తిని ఇచ్చింది. దేశభక్తిని, జాతీయతా వాదాన్ని రగిల్చేలా సాగిన ఆ ఉద్యమ ఘటనల గురించి ‘ఆనంద్ మఠ్’ నవలలో కళ్లకుకట్టేలా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. బంగాలీ భాషలోని ఈ నవలలోనే వందేమాతర గేయం ఉంది. ‘ఆనంద్ మఠ్’ నవల 1882లో ప్రచురితమైంది. ‘వందేమాతరం’ అంటే ‘మాతృభూమికి నమస్కారం’ అని అర్థం. ‘ఆనంద్ మఠ్’ రచన ద్వారా ఆధునిక భారతీయ నవలా సాహిత్యానికి బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ బలమైన పునాదులు వేశారు. సామాజిక, కుటుంబ, చారిత్రక అంశాలపైనా ఆయన పలు నవలలు రాశారు.

‘ఆనంద్ మఠ్’ లోని వందేమాతర గేయమే బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌కు విశేషమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. 1905లో జరిగిన బంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి కూడా వందేమాతర గేయమే స్ఫూర్తిని ఇచ్చింది. అది భారతీయులందరి మదిలో దేశభక్తి భావాన్ని రగిల్చింది. బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ 1838 సంవత్సరం జూన్ 26న కోల్‌కతా సమీపంలోని నహాతీ పట్టణంలో జన్మించారు. ప్రఖ్యాత కోల్‌కతా యూనివర్శిటీ తొలి గ్రాడ్యుయేట్లలో ఆయన కూడా ఒకరు. 1858లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. లా కోర్సు చేసిన అనంతరం బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌కు బ్రిటీష్ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా ఉద్యోగం వచ్చింది. దాదాపు 30 ఏళ్లపాటు (1891 వరకు) ఆయన ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగారు. అయినప్పటికీ జాతీయతా వాదంతో రచనలు చేయడాన్ని బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ ఆపలేదు. బ్రిటీష్ ప్రభుత్వ సర్వీసులో ఉండగానే వందేమాతర గేయంతో కూడిన ఆనంద్ మఠ్ నవలను రాయడం, ప్రచురించడం జరిగాయి.

మన భారత దేశానికి, యావత్ భారతీయులకు గొప్ప గేయాన్ని అందించి 1894 ఏప్రిల్ 8న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ తుదిశ్వాస విడిచారు. 1950 జనవరి 24 న భారత రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1950లో దీనికి జాతీయ గీత హోదాను ఇచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇది కీలక పాత్ర పోషించిందని, ‘జన గణ మన’తో సమానంగా దీనిని గౌరవించాలని అప్పట్లో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్‌ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రంతో పాడి వినిపించారు. పాట లోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు. అందుకనే దూరదర్శన్‌లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు ‘గాడ్ సేవ్ అవర్ క్వీన్’ ను బ్రిటిష్ ఇండియా జాతీయ గీతంగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ అనధికారికంగానే జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందింది.

1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని పఠించిన తర్వాత దీనికి ప్రాముఖ్యత లభించింది. మాతృభూమికి ఉత్తేజకరమైన గీతం, ఇది ఇలా ఉంటుంది. వందేమాతరం! సుజలం, సుఫలం, మలయజ శీతలం, సస్యశ్యామలం, మాతరం! వందేమాతరం! బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. మొదటిస్థానం ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవ గీతానికి దక్కింది. విప్లవ నాయకుడు అరబిందో ఘోష్ 1909 1910 మధ్య కాలంలో ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన రాసిన కవితా ఇలా ఉంది, అమ్మా, నేను నీకు నమస్కరిస్తున్నాను! నీ ఉప్పొంగే ప్రవాహాలతో సమృద్ధిగా, నీ పండ్ల తోట మెరుస్తున్న ప్రకాశవంతంగా, ఆనందపు గాలులతో చల్లగా, ఊగుతున్న చీకటి పొలాలతో, శక్తి యొక్క తల్లి, స్వేచ్ఛా తల్లి!

1906లో పాథే ఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామఫోన్ రికార్డుగా తెచ్చింది! ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజులు పారిస్‌లోనే ఉండిపోయింది. 1966 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన తొలి యోధుడు కుదిరామ్ బోస్. బ్రిటిష్ మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్టయ్యా డు. 1908, ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి, ‘నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?’ అని అడిగాడు.

తల అడ్డంగా ఊపి, ‘వందేమాతరం!’ అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరామ్. అప్పటికి అతని వయసు పద్దెనిమిదేళ్లే! ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే కోల్‌కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. అందరి నినాదం వందేమాతరం. ‘దేశభక్తి… భారత మాత పట్ల ప్రేమ… ఇది మాటలకు అతీతమైన భావోద్వేగం అయితే, వందేమాతరం అనేది ఆ అమూర్త భావనకు స్పష్టమైన స్వర రూపాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల దాస్యం వల్ల బలహీనపడిన భారతదేశంలోకి కొత్త జీవితాన్ని నింపడానికి బంకిం చంద్ర ఛటోపాధ్యాయ్ దీనిని స్వరపరిచారు(రాశారు). వందేమాతరం 19వ శతాబ్దంలో రాయబడి ఉండవచ్చు, కానీ దాని ఆత్మ వేల సంవత్సరాల నాటి భారతదేశపు అమర చైతన్యంతో ముడిపడి ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా, పెరుగుతున్న సామాజిక విభజనల మధ్య, పౌరులు ఈ పాట స్ఫూర్తిని స్వీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కోరారు. ‘భారతదేశ దేశభక్తి నిఘంటువులో అంతర్భాగంగా, ‘వందేమాతరం’ స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది. పత్రికా, సాహిత్యంలో శాశ్వత వారసత్వాన్ని పొందింది’ అని కొనియాడారు.

– చలసాని నరేంద్ర

– 98495 69050

ప్రమాద భారతం!

తెలుగు రాష్ట్రాలను ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది. 2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు ఎంతో మందికి కలిసి వచ్చిందో తెలియదు గానీ, అనేక కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు వరుస విషాద ఘటనల్లో పదుల సంఖ్యలో అమాయకులు బలైపోయారు. మొత్తం వంద మందికిపైగా ప్రాణాలు ఇలాంటి దుర్ఘటనలకు బలయ్యాయి. నిర్లక్ష్యం, విధుల్లో వైఫల్యం లేదా కేవలం ప్రమాదాలు.. కారణం ఏదైనా సరే, సంభవించిన మరణాలు మాత్రం అత్యంత బాధాకరం. కనీసం ఐదుగురి కంటే ఎక్కువ మరణాలు సంభవించిన ప్రధాన దుర్ఘటనలు పది ఉన్నాయి. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటతో విషాదాల పరంపర మొదలైంది. ఏకాదశి పర్వదినం సందర్భంగా దర్శన టిక్కెట్లు తీసుకోవడానికి బైరాగి పట్టెడ వద్ద క్యూ లైన్‌లోకి ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువకు అనుసంధానంగా దోమలపెంట వద్ద నిర్మిస్తున్న టన్నెల్‌లో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. మట్టి పెళ్లలు పడిపోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఊపిరాడక సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ప్రమాద తీవ్రతకు ధ్వంసమైంది. మార్చి 28న ఒంగోలు తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోయింది. మొత్తం 12 మందితో వెళ్లిన బోటు తిరగబడి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఏప్రిల్ 29న సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మే 18న హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌస్‌లో ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 17 మంది ఆహుతైపోయారు. మృతుల్లో ఎనిమిదిమంది చిన్నారులు, నలుగురు వృద్ధులు ఉండడం అత్యంత విషాదకరం.

జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలంలోని పాశమైలారంలో ఉన్న సికాచి పరిశ్రమలో రియాక్టర్ పేలింది. భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి.పేలుడు ధాటికి రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 46 మంది దుర్మరణం పాలవ్వగా, 30కి పైగా క్షతగాత్రులయ్యారు. జూన్ 14న అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తాపడింది. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉండగా, ఎనిమిది మంది మృతి చెందారు. కర్నూలు హైవేపై తెల్లవారుజాము 3:00 గంటల ప్రాంతంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొని అగ్నిప్రమాదానికి కారణమైంది. మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాట మాటల్లో వర్ణించలేనిది. రైలింగ్ ఊడిపడటంతో భక్తులు ఒక్కసారిగా కిందపడిపోయారు.

ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆలయంలో భద్రతా చర్యలు లేకపోవడం ఈ ఘటనకు కారణమైంది. నవంబర్ 3న చేవెళ్ల దగ్గరలోని మీర్జాగూడ వద్ద ఘోరం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్‌టిసి బస్సు, ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. స్పాట్‌లో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఈ విషాదంలో విద్యార్థులు, మహిళలు ఎక్కువగా చనిపోయారు, వారిలో రెండు నెలల పసికందు కూడా ఉంది. బంధువుల రోదనలతో చేవెళ్ల ఆస్పత్రి ప్రాంగణమంతా గంభీరంగా మారింది. ఈ వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మరో వైపు భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని కేంద్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలవారీగా రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 8,276 రోడ్డు ప్రమాదాలు జరిగి, దేశంలో ఏడో స్థానంలో నిలవగా, తెలంగాణలో 8,103 ప్రమాదాలు జరిగి ఎనిమిదో స్థానంలో ఉంది. మరణాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 3,806 మంది, తెలంగాణలో 3,508 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి.

– ఐనం ప్రసాద్

98489 28787

చేతి వేళ్లకు గాయమైన సెమీస్, ఫైనల్ లో రిచా ఆడింది: కోచ్ శంకర్

హైదరాబాద్: భారత మహిళజట్టు వన్డే వరల్ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ ముద్దాడింది. రెండు విజయాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడంతో మరో బ్యాటర్ రిచా ఘోస్ చేసిన పరుగులు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 133.52 స్ట్రైక్‌రేటుతో 235 పరుగులు చేసింది. సెమీస్, ఫైనల్‌లో ఆమె బ్యాటింగ్ చేసిన తీరు అబ్బురపరిచింది. ఈ సందర్భంగా రిచా చిన్ననాటి బ్యాటింగ్ కోచ్ శంకర్ పాల్ మీడియాతో మాట్లాడారు. సెమీ ఫైనల్‌కు ముందు రిచా వేలుకు గాయమైందని కోచ్ శంకర్ తెలిపారు.

నొప్పి తట్టుకుంటేనే బ్యాటింగ్ చేసిందని కొనియాడారు. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యం విధించిన కూడా 16 బంతుల్లో 26 పరుగులు చేసి జెమీమాపై ఒత్తిడి లేకుండా చేసిందన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో రిచా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, 24 బంతుల్లో 34 పరుగులు చేసిందని శంకర్ పేర్కొన్నారు. చివర ఓవర్లలో దూకుడిగా ఆడి పరుగులు చేయడమే తన ప్రధాన కర్తవ్యం అని రిచా తెలిపింది. తనకు బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా ఫినిషింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టానన్నారు. ఎక్కువ స్ట్రైక్‌రేటు రోటేట్ చేయడంతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచానని వివరణ ఇచ్చాడు. మా కోచ్ అమోల్ మజుందార్ జట్టులో ఒక్కోక్కరికి ఒక్కో రోల్ కేటాయించారని రిచా తెలియజేశారు. తన వరకు వచ్చేసరికి నిర్భయంగా ఆడడంతో పాటు భారీ షాట్లు ఆడమని చెప్పారన్నారు.

నిజాంను అల్లాడించిన నల్లా నరసింహులు

తెలంగాణ స్వాతంత్య్రోద్యమ పుటల్లో శాశ్వతంగా చెరగని అక్షరాలతో నిలిచిపోయిన పేరు నల్లా నరసింహులు. అణచివేత, దోపిడీ, బానిసత్వం నిండిన నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాడిన మహావీరుడు ఆయన. ఆయన జీవితం ప్రజాస్వాతంత్య్రం కోసం అహర్నిశలు నడిచిన త్యాగయాత్ర. ప్రజల విముక్తి కోసం శస్త్రం ఎత్తి, న్యాయంకోసం గొంతుఎత్తిన ఆ ధీరుని పోరాట చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గాథలో ఒక అజేయ అధ్యాయం. 1940 దశకంలో తెలంగాణ ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. భూస్వాములు, దేశముఖ్‌లు, సర్దేశ్‌ముఖ్‌లు, దేశాయిలు, రజాకార్లు కలిసి ప్రజలపై అమానుష దోపిడీ సాగించారు. రైతులు తమ కష్టార్జిత పంటను భూస్వాముల కడుపు నింపేందుకు మాత్రమే పండించేవారు. నిజాం పాలనలోని 7430 గ్రామాలు ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ కింద ఉండగా, రైతు కేవలం కూలీగా, బానిసగా మిగిలిపోయాడు. ఈ అన్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పెల్లుబికిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజాచరిత్రలో గొప్ప మైలురాయి అయింది. ఈ మహా సమరానికి దళ నాయకుడిగా ముందుండి పోరాడిన యోధుడు నల్లా నరసింహులు. నల్లా నరసింహులు 1926 అక్టోబరు 2న తెలంగాణలోని కడవెండి, జనగామ జిల్లా, దేవరుప్పులలో జన్మించారు.

జనగామ ప్రాంతంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసి భూస్వామ్య వ్యవస్థకు గట్టి ప్రతిఘటనగా నిలిచారు. ప్రజలలో ధైర్యం నింపి రజాకార్లపై, దోపిడీదారులపై గెరిల్లా దాడులు నిర్వహించారు. నరసింహుల కేక దోపిడీదారుల పాలనకు ఇక అంతం! అని అణగారిన ప్రజల గుండెల్లో మంటగా మండింది. ఆ కాలంలో తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం విస్తరిస్తున్నది. ఆంధ్ర మహాసభ అనే వేదిక ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి నేతలు ప్రజలను సంఘటితం చేశారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామగ్రామంలో కమిటీలు, దళాలు ఏర్పాటయ్యాయి. నరసింహులు ఈ పోరాటానికి తమ జీవితం అంకితం చేశారు. జనగామ తాలూకాలోని గ్రామాల్లో ఆయుధ దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించారు.

భూస్వాములు, రజాకార్లు, నిజాం సైన్యం ఈ మూడింటి మధ్యలో ప్రజల పక్షాన నిలిచిన నరసింహులు శత్రువుల నిద్రను చెడగొట్టారు. 1947 సెప్టెంబర్ 11న ఆయన స్వగ్రామమైన కడవెండి నుంచే మొదటి తిరుగుబాటును ప్రారంభించి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు యుద్ధభేరీగా మారి తెలంగాణ అంతటా విప్లవ జ్వాలలు వ్యాపించాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆయన ఆదేశాలపై ఎర్రజెండాల కింద పోరాట రంగమయ్యాయి. వేల ఎకరాల భూములు భూస్వాముల పంజానుండి విడిపించబడి, దున్నేవాడికే భూమి హక్కు! అన్న నినాదం ప్రతిధ్వనించింది. సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా, నరసింహులు అనేకసార్లు అరెస్టుకాబడి చిత్రహింసలు అనుభవించారు. మూడుసార్లు ఉరిశిక్ష విధించబడ్డా ఆయన ధైర్యం ఒక్క క్షణం తగ్గలేదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలు, భారత ట్రేడ్ యూనియన్ సంఘాల ఆందోళనల ఫలితంగా ఆయన ఉరిశిక్ష చివరి నిమిషంలో నిలిపివేయబడింది. నల్లగొండ జైలులో బంధితుడిగా ఉన్న నరసింహులను చూడటానికి వచ్చిన యూనియన్ సైనిక జనరల్ జె.ఎస్. చౌదరికి జిల్లా ఎస్.పి. ధన్‌రాజ్ నాయుడు పరిచయం చేస్తూ ఈయనే తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు అని చెప్పడం చరిత్రలో నిలిచిపోయింది.

1948లో ‘పోలీస్ యాక్షన్’ అనంతరం కమ్యూనిస్టులపై నిషేధం విధించబడింది. నెహ్రూ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో అనేక మంది నేతలు అణచివేతకు గురయ్యారు. నరసింహులు వంటి యోధులు అరణ్యాలలో ఆశ్రయం పొందారు. చివరికి 1951 అక్టోబరులో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమిస్తున్నట్లు ప్రకటన చేయడంతో ఉద్యమం చల్లారిపోయింది. అయినా నరసింహులు పోరాట భావజాలాన్ని విడిచిపెట్టలేదు. 1959 జనవరి 26న దీర్ఘ నిర్బంధ జీవితం ముగించి ఆయన తిరిగి స్వేచ్ఛా లోకంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదల హక్కుల కోసం ఆలోచనాత్మకంగా పనిచేశారు. నల్లా నరసింహులు పేద పద్మశాలి కుటుంబంలో జన్మించి చేనేత పనిని జీవనాధారంగా చేసుకున్నారు. ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు మాత్రమే చదివినా ప్రజల బాధలను అర్థం చేసుకున్న చైతన్యవంతుడు.

భార్య వజ్రమ్మతో కలిసి జీవితాంతం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. ఆయన తన చివరి వరకు కూడా పోరాట మిత్రులను, రైతాంగ యోధులను స్మరించుకుంటూ ప్రజా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ గడిపారు. 1993 నవంబర్ 5న ఆయన జీవన యాత్ర ముగిసింది. కానీ ఆయన త్యాగం, ధైర్యం, ప్రజా సంకల్పం తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. వేలాది మంది వీరుల త్యాగానికి ప్రతీకగా, పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన విజయానికి చిహ్నంగా ఆయన పేరు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నల్లా నరసింహుల జీవితం ఒక పాఠం. స్వేచ్ఛ అనేది ఇచ్చేది కాదు, పొందేది. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యమే నిజమైన విముక్తి శక్తి. తెలంగాణ రైతాంగ పోరాటం, భూస్వామ్య వ్యవస్థ కూల్చివేత, పేదల భూ హక్కుల సాధనలో ఆయన చూపిన త్యాగపథం తరతరాలకు మార్గదర్శకం. నవంబర్ 5 నల్లా నరసింహుల వర్ధంతి రోజున ఈ ప్రజా వీరుడిని స్మరించుకుంటూ తెలంగాణ నేల తన గర్వకారణాన్ని మరలా గుర్తు చేసుకుంటుంది. ఆయన త్యాగజ్వాల ఎప్పటికీ మసకబారదు. ఆ జ్వాలే తెలంగాణ ప్రజా చైతన్యానికి చిరస్ఫూర్తి.

– రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

ఈ కథ మట్టి నుంచి వచ్చింది

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి ’రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ “ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డులు ఈ సినిమాకు వస్తాయి”అని పేర్కొన్నారు.

నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ “ప్రేమ చాలా ప్రమాదకరమైనది, అది సింహాసనం ఎక్కిస్తుంది, శిలువనూ వేయిస్తుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమా కథ దర్శకుడి ఊహలోనుంచో, పుస్తకాల నుంచో, కల్పన నుంచో రాలేదు. ఈ మట్టి నుంచి వచ్చింది. రాజు, రాంబాయి ప్రేమే ఈ సినిమాను నిలబెడుతుందని నమ్ముతున్నా”అని అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ “ఒక్క డైలాగ్, ఒక్క పాట కోసం ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ పాట ఇదే”అని తెలియజేశారు. డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “ప్రేమికులు ఈ సినిమాను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. సినిమా చూస్తున్న వాళ్లకు వాళ్ల ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పాట ఎంత బాగుందో సినిమా అంత బాగుంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక, సాయికృష్ణ, నితిన్, హీరో అఖిల్ ఉడ్డెమారి, హీరోయిన్ తేజస్వినీ రావ్, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, మిట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, రాహుల్ మోపిదేవి, నల్లగొండ గద్దర్ నర్సన్న పాల్గొన్నారు.

కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు రంగారెడ్డి వాసులు మృతి

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా హల్లిఖేడ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. వ్యాను-కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పురం గ్రామానికి చెందిన వాసులు నవీన్(40), రాచప్ప(45), కాశీనాథ్(60)గా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లవస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఫ్రెండ్‌షిప్ మెలోడీ

కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్ జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా మీరేలే సాంగ్ లాంచ్ చేశారు. సయ్యద్ కమ్రాన్ ఈ సాంగ్‌ని ఫ్రెండ్ షిప్ మెలోడీగా కంపోజ్ చేశారు. హరీష్ రెడ్డి ఉప్పుల రాసిన సాహిత్యం ఫ్రెండ్స్ మధ్య భావోద్వేగాన్ని చూపించింది. జిగ్రీస్ సినిమా ఫ్రెండ్‌షిప్, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. జిగ్రీస్ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.