StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbahiscasinobahiscasino girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişkalebetkalebet girişbetlikekalebetmasterbettingrinabettrendbetrealbahislivebahislordbahispashagaminghazbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

şanscasino

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

wbahis

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betebet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

matbet

holiganbet

vdcasino giriş

perabet

perabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

jojobet giriş

matbet

matbet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet resmi adres

wbahis

Casibom

wbahis

wbahis

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

wbahis

grandpashabet

piabet

pusulabet

grandpashabet giriş

casibom

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

matbet

matbet giriş

sekabet giriş

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

piabellacasino

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

casibom giriş

casibom

padişahbet

vdcasino

betovis

betasus

berlinbet

casinowon

suratbet

süratbet

betcio

mislibet

casinolevant

casinowon

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

sonbahis

padişahbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

meritking

casinolevant

galabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

betcio

jojobet

Sweet Bonanza

bahiscasino

bahiscasino giriş

masterbetting

masterbetting giriş

winxbet

winxbet giriş

Sugar Rush 1000 Oyna

cratosroyalbet

kalebet

kalebet giriş

spinco

marsbahis

grandpashabet

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

casibom giriş

teosbet

lunabet

Hiltonbet giriş

vdcasino

matbet

kralbet

vdcasino

prizmabet

wbahis

betsilin

marsbahis

Hacklink panel

Hacklink satın al

meritking

marsbahis

నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు…

హైదరాబాద్: నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరించారు. పోలీసులు కోర్టు నుంచి అందరిని బయటికి పంపించి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయిస్తున్నారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఆవరణంలో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

ఖమ్మంలో ఎసిబికి చిక్కిన ఆర్ఐ

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎసిబికి ఆర్ ఐ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ పది వేలు లంచం తీసుకుంటుండగా డిఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో ఆమెను ఎసిబి అదికారులు పట్టుకున్నారు. కారేపల్లిలో ఇంటి వద్ద ఆర్ఐను అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐ ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో కూడా కామేశ్వరీ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 

విద్యుత్ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితి దయనీయం : కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ లో విద్యుత్ కు రూ.21 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, కేటాయించిన బడ్జెట్ తో విద్యుత్ బకాయిలు తీర్చే పరిస్థితి లేదని అన్నారు. విద్యుత్ ఉచిత పథకాలకు కూడా బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని, విద్కుత్ కు సంబంధించి పాత బకాయిలపై దృష్టి పెట్టలేదని కిషన్ రెడ్డి తెలియజేశారు. విద్యుత్ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీలో భాగంగా లక్ష్యాలు ఘనంగా ఉన్నాయని విమర్శించారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి

శీతాకాలం వచ్చిందంటే ఉత్తరభారతం ఊపిరి సలపలేక ఉక్కిరిబిక్కిరి అవుతుండడం ఏటా పరిపాటి అవుతోంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడుతున్నాయి. దీనికి తోడు పొగమంచు దట్టంగా వ్యాపించడంతో కళ్లకు దారి కనిపించక అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క మంగళవారం (16.12.2025 ) రోజునే ఉత్తరభారతంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి 25 మంది మృతి చెందడం అత్యంత శోచనీయం. పొగమంచు వల్లనే విమాన సర్వీస్‌లు ఆగిపోవడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. సోమవారం ఉత్తరభారతంలో మొత్తం 300 విమాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 131 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ శీతాకాలంలో గ్యాస్ ఛాంబర్‌గా మారిపోతోంది. వృద్ధులు, పిల్లలు అస్వస్థులవుతున్నారు. ఎక్కడా లేని అనారోగ్యం ఢిల్లీలో కనిపిస్తోంది.

వైద్య చికిత్స కావాలంటే ఢిల్లీ నగరాన్ని విడిచిపెట్టి మరెక్కడికైనా వెళ్లిపోండని వైద్యులు సిఫార్సు చేస్తున్నారంటే ఇది ఢిల్లీ పాలనపై హేయమైన ఆరోపణగానే భావించాలి. గాలిలో కాలుష్యానికి కారణమయ్యే వివిధ రకాల వాయువులు, రసాయనాల మిశ్రమాన్ని ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎంపి)గా పేర్కొంటారు. దేశంలో సగటున క్యూబిక్ సెంటీమీటర్‌కు ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎంపి) 2.5 మైక్రోగ్రామ్స్ గాను, గాఢత 54.4 మైక్రోగ్రామ్ గాను సాగుతోంది. కానీ సోమవారం ఢిల్లీలో సరాసరి వాయు నాణ్యత 427 వరకు సూచించగా, మంగళవారం నాటికి 381 వరకు తగ్గి కొంత మెరుగు కనిపించింది. అయినా ఇంకా ‘వెరీ పూర్’ కేటగిరిలోనే ఢిల్లీ వాయు నాణ్యత కొనసాగుతుండడం గమనార్హం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గాలి నేలను తాకి కాలుష్యాలను వెదజల్లుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, రసాయన వాయువులు, పంట వ్యర్థాల దహనాలు, నిర్మాణాల దుమ్ముధూళి ఇవన్నీ ఏటా ఢిల్లీని శీతాకాలంలో నివసించలేని నగరంగా మారుస్తున్నాయి.

దీనికి పరిష్కారం అసాధ్యమేమీ కాదు. పాలక వర్గాలు కొన్ని చర్యలు తీసుకుంటే ఈ కాలుష్య భూతాన్ని అరికట్టవచ్చు. ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం ఢిల్లీకి కాలుష్య నివారణ మార్గదర్శకాలను దశల వారీగా అందించడానికి సంసిద్ధమైంది. చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని’గా రికార్డుకెక్కినప్పటికీ దశాబ్ద కాలం లోనే ఆ అపఖ్యాతి నుంచి బయటపడగలిగింది. చైనా, భారత్ ఈ రెండు దేశాలు కాలుష్యంతోపాటు విపరీత నగరీకరణతో పోరాడుతున్నాయని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ పేర్కొనడం గమనార్హం. స్వచ్ఛమైన గాలిని పొందడం రాత్రికి రాత్రి సాధ్యం కాదు. కానీ దశలవారీగా తగిన నియంత్రణ చర్యలు చేపడితే సత్ఫలితాలు లభిస్తాయి. ఈ మేరకు జింగ్ కొన్ని సూచనలు చేశారు. యూరో 6 నిబంధనల ప్రకారం బిఎస్ 6 ప్రమాణాలు పాటించాలని ఆమె సూచించారు.

అత్యధిక కర్బన ఉద్గారాలను వెదజల్లే పాత వాహనాలను దశల వారీగా తొలగించడం, వాహనాల పెరుగుదలను నియంత్రించడం, వాహనాల నంబర్ ప్లేట్ చివరి అంకె ఆధారంగా సరిసంఖ్య, బేసిసంఖ్య చూసి వారం లోని నిర్దిష్ట రోజుల్లో మాత్రమే వాటిని నడపడానికి అనుమతించడం, ప్రమాణాల ప్రకారం బస్సుల నిర్మాణం జరిగేలా చూడడం ఇవన్నీ తక్షణ అవసరాలని ఆమె సూచించారు. సంప్రదాయ ఇంధనం వాహనాలకు వినియోగించకుండా మెథేన్, సిఎన్‌జి, హైడ్రోజన్ వంటి హరిత ఇంధనం వినియోగించాలన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. ఖాళీ అయిన ఫ్యాక్టరీలను పార్కులుగా, వాణిజ్య జోన్లుగా, సాంస్కృతిక, సాంకేతిక హబ్‌లుగా తీర్చి దిద్దాలి. దీనికి ఉదాహరణగా చైనాలో షౌగాంగ్ అనే పరిశ్రమల కాంప్లెక్సును 2022 నాటి శీతాకాల ఒలింపిక్ క్రీడోత్సవాల ప్రాంగణంగా వినియోగించారు. బీజింగ్‌లో జనం రద్దీని తగ్గించడానికి హోల్‌సేల్ మార్కెట్లను, లాజిస్టిక్ హబ్స్‌ను, కొన్ని విద్య, వైద్య సంస్థలను నగరానికి దగ్గరగా వేరే చోటకు తరలించారు.

బీజింగ్ నుంచి సాధారణ ఉత్పత్తి, తయారీ సంస్థలను హెబెయి ప్రావిన్స్‌కు తరలించినప్పటికీ, అత్యున్నత పరిశోధన, అభివృద్ధి, సేవా రంగాలను బీజింగ్ పొందగలిగింది. 2013 లో చైనా కాలుష్య నివారణకు ఐదేళ్ల జాతీయ కార్యాచరణ ప్రణాళిను అమలు చేయడం ప్రారంభించింది. బీజింగ్‌లో బొగ్గుతో మండే బాయిలర్‌లను మూసి వేయించింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించింది. హరిత ఇంధనం వాహనాలను పరుగెత్తించింది. పెట్రోలు, డీజిల్ వంటి కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధనానికి స్వస్తి పలికింది. కొన్నేళ్ల పాటు కఠినంగా వీటిని అమలులోకి తేవడంతో విజయం సాధించింది. ఇప్పుడు చైనా దౌత్య కార్యాలయం ఈ చర్యలను సూచించడం ఢిల్లీ స్వాగతించవలసిందే. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు విన్న ఈ సూచనలు అమలు లోకి తీసుకు రావడమే అగ్నిపరీక్ష. వీటిలో కొన్నైనా ఢిల్లీ పాలక వర్గాలు అమలు చేయగలిగితే కొంతవరకు విజయం సాధించగలుగుతారు. దేశంలో బిఎస్ 6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలను, తయారీని 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే సుప్రీం కోర్టుకు విన్నవించినా ఎంతవరకు ఇది అమలైందో మనకు తెలిసిందే. 

ప్రసంగాలు అర్థవంతం.. పనితీరు ప్రశంసనీయం

పార్లమెంట్‌లో తన పనితీరుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దాదాపు అన్ని రాజకీయ పక్షాల నుండి అభినందనలు అందుకుంటున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ కన్నా ఆమె పరిణితితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతుంది. మరోవంక రాహుల్ గాంధీ నాయకత్వం పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుండే విముఖత వ్యక్తం అవుతున్నది. ఈ పరిణామాలు రాహుల్ గాంధీలో అసహనాన్ని పెంచుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందీలో ఆమె ప్రసంగాలు అర్థవంతంగా ఉంటున్నాయని, ప్రభుత్వ విధానాలపై సున్నితంగా విమర్శలు చేస్తూనే బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని, పైగా నిర్మాణాత్మక సూచనలు కూడా చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. ఆమె ఏ అంశంపై ప్రసంగం చేసినా ముందుగా తగు విధంగా తయారై, నోట్స్ పట్టుకొని అందరినీ ఆకట్టుకొనే విధంగా మాట్లాడుతున్నారని అభిప్రాయం కలుగుతుంది. పైగా, ఆమె తన వయనాడ్ నియోజకవర్గానికి కేంద్రం సహాయం కోరుతూ అమిత్ షా, జెపి నడ్డా వంటి సీనియర్ కేంద్ర మంత్రులను కలవడం, హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో చురుకైన సభ్యురాలుగా వ్యవహరించడం గమనిస్తుంటే రాహుల్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టం అవుతుంది. పైగా, సమావేశాలలో పార్టీలకు అతీతంగా తోటి ఎంపిలతో స్నేహపూర్వకంగా సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు.

అందుకు పూర్తి విరుద్ధంగా, రాహుల్ సాధారణంగా అధికార పార్టీ నేతలపట్ల కఠినంగా, దూరంగా ఉంటారు. రాష్ట్రాల నుండి సొంత పార్టీ నేతలకు సైతం ఆయన అందుబాటులో ఉండటం లేదు. ఆయనను కలవాలంటే ఆయనకు సన్నిహితులైన కొందరు నాయకులను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్ లేవనెత్తే అంశాలపై ప్రభుత్వం నుండి తీవ్రమైన దాడులు ఎదురు కావడమే కాకుండా ఇండియా కూటమి పక్షాల నేతల నుండి కూడా సంఘీభావం ఎదురు కావడం లేదు. చివరకు సొంత పార్టీ నేతలు సైతం పట్టించుకోవడం లేదు. అదానీ, -అంబానీ గుత్తాధిపత్యం లేదా ‘ఓటు చోరీ‘ గురించి ఆయన పల్లవి అయినా, ఆయన సమస్యల ఎంపిక అయినా గందరగోళంగా ఉంటుందని, లోతుగా పరిశోధన చేస్తున్నట్లు ఉండటం లేదని, అప్రయత్నంగా ప్రభుత్వంపై పరుషంగా చేస్తున్న పలు విమర్శలు కాంగ్రెస్ పార్టీనే ఆత్మరక్షణలో పడవేస్తున్నవని పలువురు సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత, ట్రంప్ కారణంగా భారతదేశం లొంగిపోయిందని రాహుల్ ప్రధాని నరేంద్ర మోడీని ఎగతాళి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను ‘చనిపోయినట్లు’ అమెరికా అధ్యక్షుడు చేసిన వర్ణనను ఆమోదిస్తూ విమర్శలు గుమ్మరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఎగతాళి చేసే హడావుడిలో జాతీయవాద భావాలను కించపరుస్తున్నామనే అంశాన్ని రాహుల్ మర్చిపోయారని కాంగ్రెస్ వర్గాల నుండే అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మరోవైపు, ఆపరేషన్ సిందూర్‌పై తన పార్లమెంటు ప్రసంగంలో ప్రియాంక సంయమనంతో, ఉగ్రవాదులు బైసరన్ లోయలోకి ప్రవేశించడానికి అనుమతించిన భద్రతా లోపాలకు ఎవరైనా జవాబుదారీగా ఉండాలని అంటూ సంబంధిత అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శిస్తూనే దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రతిపాదనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అంటూ సున్నితంగా ప్రశ్నించారు. పైగా, పేరు మార్చడం వల్ల కొత్తగా స్టేషనరీ, బోర్డుల ముద్రణకు అదనపు ఖర్చు తప్ప ప్రయోజనం ఏముంటుందని ఎద్దేవా చేశారు.

రాహుల్ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా సాధారణంగా సౌమ్యులైన కాంగ్రెస్ సీనియర్ నేతలలో సైతం అసహనాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే ఆమెను చూస్తుంటే ఇందిరా గాంధీ గుర్తు వస్తుందని అనుకుంటున్న కాంగ్రెస్ యువ నేతలకు ప్రియాంక గాంధీలో మరో అవకాశం కనిపిస్తోంది. రాహుల్ నిశితంగా తరచూ విమర్శలు కురిపించే బిలియనీర్ గౌతమ్ అదానీతో బహిరంగంగా సహవాసం చేస్తున్నట్లు కనిపించడానికి కూడా పలువురు కాంగ్రెస్ నేతలు వెనుకాడటం లేదు. భోపాల్‌లో జరిగిన అదానీ కంపెనీ డైరెక్టర్ వివాహానికి దిగ్విజయ్ సింగ్ హాజరు కాగా, సుశీల్ కుమార్ షిండే తన సొంత మనవరాలి వివాహంలో వివాదాస్పద పారిశ్రామికవేత్తతో కలిసి ఫోజులిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీలు, అంబానీలు ఇద్దరితోనూ ఒప్పందాల కోసం వెంటపడుతున్నారు. కాంగ్రెస్ మిత్ర పక్ష ఎంపిలైన సుప్రియా సులే, మహువా మొయిత్రా బిజెపి ఎంపి కంగనా రనౌత్‌తో కలిసి మాజీ కాంగ్రెస్ సభ్యుడు, బిజెపి ఎంపి నవీన్ జిందాల్ కుమార్తె వివాహంలో బాలీవుడ్ పాట ‘దీవాంగి దీవాంగి’కి వేదికపై నృత్యం చేశారు.

తాజాగా బీహార్‌లో ఇండియా కూటమి ఘోర వైఫల్యానికి రాహుల్ గాంధీ కారణం అంటూ ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే అయితే ఎన్నికల తర్వాత సోనియా గాంధీని కలిసి రాహుల్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొడుకును మందలించమని కోరినట్లు తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్, ఆయన చుట్టూ ఉన్న బృందం దుందుడుకు చర్యల కారణంగానే కాంగ్రెస్‌తో పాటు, మిత్రపక్షాలు నష్టపోయిన్నట్లు ఖర్గే స్పష్టం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని ఎంతో కష్టపడి ‘ఇండియా కూటమి’ లోకి తీసుకు వస్తే వెళ్లిపోయేటట్లు చేశారని కూడా వాపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో జాతీయ స్థాయి నాయకత్వ సంక్షోభాన్ని ఎత్తిచూపినందుకు ఒడిశాలో పార్టీ సీనియర్ నేత మొహమ్మద్ మోకిమ్‌ను ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాల’ కారణంగా పార్టీ నుండి బహిష్కరించారు.

పార్టీ పునరుజ్జీవనం కోసం లోతైన నిర్మాణాత్మక, సంస్థాగత, సైద్ధాంతిక పునరుద్ధరణకు పిలుపు ఇవ్వడంతో పాటు ఖర్గే వంటి వృద్ధతర నేతలను పక్కన పెట్టి ప్రియాంకకు జాతీయ నాయకత్వం ఇవ్వాలని సూచిస్తూ నేరుగా సోనియా గాంధీకి లేఖరాయడం సహజంగానే పార్టీ నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. పార్టీ తనపై చర్య తీసుకుంటుందని తెలిసి కూడా మోకిమ్ ఉద్దేశపూర్వకంగానే ఆ విధమైన విమర్శలు చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ ‘దారో మత్’ అని అంటారు. పార్టీని ప్రభావితం చేసే సమస్యలను ఎత్తిచూపుతూ సోనియా గాంధీకి లేఖ రాయడానికి నేను ఆయన నినాదం నుండి ప్రేరణ పొందాను. పార్టీ దానిని అంగీకరించలేదు. నన్ను కాంగ్రెస్ నుండి బహిష్కరించింది. నేను ఇంకేమీ చెప్పలేను’ అని మోకిమ్ తన బహిష్కరణ తర్వాత నిస్సహాయతను వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి రాసిన తీవ్రమైన లేఖలో, మోకిమ్ తప్పుడు నాయకత్వ ఎంపికలు, అగ్ర నాయకత్వం- కార్యకర్తల మధ్య దూరం పెరగడం, యువతతో కనెక్ట్ కాలేకపోవడం కారణంగానే కాంగ్రెస్ వరుసగా దెబ్బలు తింటున్నట్టు వివరించారు. పలు రాష్ట్రాల్లో పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయాలపై, మోకిమ్ మాట్లాడుతూ ‘లోతైన సంస్థాగత డిస్‌కనెక్ట్’ ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

మల్లికార్జున్ ఖర్గే (83) వయస్సును ఉదహరిస్తూ ఆయన నాయకత్వాన్ని మోకిమ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని మూడు సంవత్సరాలుగా కలవడానికి తాను చేసిన విఫల ప్రయత్నాన్ని కూడా మోకిమ్ ఈ సందర్భంగా ఎత్తి చూపారు. అందుకు అడ్డుగా నిలబడుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు ఇష్టమైన వారిని తప్ప దగ్గరకు రానీయడంలేదని విమర్శించారు. శశిథరూర్ వంటి నాయకులు దూరంగా ఉండడానికి సైతం వేణుగోపాల్ వంటి వారనే అభిప్రాయం బలపడుతుంది. అటువంటి నేతలతో రాహుల్ నేరుగా చర్చించే ప్రయత్నం చేయకపోవడం పార్టీ నాయకత్వంలో అగాథాన్ని పెంచుతుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు సుదీర్ఘకాలం ప్రయత్నించి, విఫలమైన ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం కాంగ్రెస్ ధోరణితో విసుగు చెందే పార్టీకి దూరం అయ్యారు. ప్రజలతో సంబంధం లేని నాయకులను దగ్గరకు చేర్చుకుని, ప్రజలను ప్రభావితం చేయగల వారిని దూరంగా పెడుతూ ఉండటం కారణంగానే కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో అనేకమంది రాహుల్ గాంధీ పట్ల ఇటువంటి అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి వంటి నాయకులే ఆయనను అత్యవసరం అనుకున్నప్పుడు కూడా కలవలేకపోతున్నారు. గతంలో సోనియా గాంధీ సారథ్యం వహించినప్పుడు ఆమె తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అందరి అభిప్రాయాలు వినేందుకు ప్రయత్నించేవారు.

– చలసాని నరేంద్ర

98495 69050

ఆసిఫాబాద్ లో పత్తి చేనులోకి దూసుకెళ్లిన బస్సు

ఆసిఫాబాద్: ఆర్‌టిసి బస్సు పత్తి చేనులోకి దూసుకెళ్లిన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలిలో జరిగింది. ఆర్‌టిసి బస్సు పరందోలి గ్రామ శివారులో అదుపుతప్పి పత్తిచేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆర్‌టిసి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో పోలీసులు బస్సును పక్కకు తొలగించారు. 

వలసదారులకు మానవ హక్కులు వర్తించవా?

మానవ వలసలు ఒక ప్రమాదకర అంతర్జాతీయ సమస్యగా రోజు రోజుకు ప్రపంచ మానవాళిని వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 2014 నుంచి నేటి వరకు కనీసం 70,000 మంది వలసదారులు తమ ప్రాణాలను కోల్పోయారని లేదా ఆచూకీ తెలియకుండా పోయిందని, వాస్తవానికి ఈ సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉండవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కొక్క వలసదారుల మరణాలు ఒక్కో కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చిందని గమనించాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో మానవ వలసలు క్రమంగా పెరగడం రానున్న కాలంలో ఒక భయానక మానవీయ సంక్షోభంగా మారనుందని స్పష్టం చేస్తున్నారు. దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, విపత్తులు, వాతావరణ ప్రతికూల మార్పులు, నిరంకుశ పాలనలు, ఆహార అభద్రత, మానవీయ సంక్షోభాలు, ఆర్థిక అసమానతలు లాంటి పలు కారణాలు వలసదారుల సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా వలసదారుల వేదనలు పెరగడం, వలసల వరదలు పారడం, వలసదారుల కన్నీటి తుపానులు ప్రవహించడం చూశాం.

ఇజ్రాయెల్ – పాలస్తీనా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధాలు, బంగ్లాదేశ్‌లో అంతర్గత రాజకీయ సంక్షోభం, ప్రకృతి విపత్తులు, ఆకలి కేకలు వంటి కారణాలతో మానవ వలసల వరదలు పారడం, ఇరుగు పొరుగు దేశాల్లోకి లేదా సురక్షిత ప్రాంతాల్లోకి శరణార్థులుగా చేరడం, యుద్ధాలు లేదా అల్లరులతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇండ్లు వదిలి వలసదారులు పట్టడం చూశాం. వలసదారుల శ్రమ శక్తి, నైపుణ్య లక్షణాలు, ఆవిష్కరణ ఆలోచనలు, ఔత్సాహిక ప్రవృత్తులు నేటి సమాజానికి ఎంతో ఉపకరిస్తాయని మరువరాదు. వలసదారులతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి కనిపిస్తుందని, వారికి అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడతారని తెలుసుకోవాలి. మిలియన్ల కొద్దీ వలసదారుల తమ గృహాలను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు పరుగులు తీయడాన్ని ఒక అమానవీయ చర్యగా భావించిన ఐరాస సభ్యదేశాలు 2000 నుంచి ప్రతి ఏటా 18 డిసెంబర్ రోజుల అంతర్జాతీయ వలసదారుల దినం లేదా ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

వలసదారులపట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు సమాధానాలు, వారి దయనీయ పేదరికాలు, సమ్మిళిత అభివృద్ధి ఆశయాలు, వలసదారుల పరిరక్షణ పాలసీలు, వారి భద్రత, వారి శాంతి సురక్షలు, మానవీయ హక్కుల కల్పనలు, ఆకలి చావులను అడ్డుకోవడం, గౌరవంగా జీవించే హక్కులను కల్పించడం, స్వేచ్ఛను కలిపించడం, వివక్ష కోరల్లో చిక్కడం, హింసలపాలు కావడం, మానవ అక్రమ రవాణా వలలో చిక్కడం, వారి అభిప్రాయాలు, కన్నీళ్లకు విలువ లేకపోవడం లాంటివి పలు అంశాలను చర్చించి సరైన సమాధానాలు వెతకడానికి ఈ వేదికలు ఉపకరిస్తున్నాయి. అంతర్జాతీయ వలసదారుల దినం- 2025 ఇతివృత్తంగా నా విజయ గాథ: సంస్కృతి, అభివృద్ధి (మై గ్రంట్ స్టోరీ: కల్చర్స్ అండ్ డెవలప్‌మెంట్) అనబడే అంశాన్ని ప్రచారం చేయడం జరుగుతోంది. వలసదారుల శ్రమదోపిడీ ఒక ప్రధాన సమస్యగా మారడం విచారకరం.

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాలు, వ్యాపారాలు, నైపుణ్య రంగాల్లో బీహార్, యుపి, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలసలు రావడం చూస్తున్నాం. నిస్సహాయ పరిస్థితుల్లో కుటుంబాలు లేదా వ్యక్తులు పలు కారణాలతో తమ గృహాలను వదిలి ఇతర దేశాలకు లేదా ప్రాంతాలకు వెళ్లడాన్ని మానవ వలసలుగా పిలుస్తారు. భారత్ లాంటి దేశాల్లో పని, ఆహార భద్రత, పేదరికం లాంటి కారణాలతో పట్టణాలు లేదా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం చూస్తున్నాం. బలవంతంగా అయినా లేదా మరో దారిలేనపుడు వలసలు పెరుగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, పర్యావరణ కారణాలతో భారతదేశంలో వలసలు కనిపిస్తున్నాయి.2011 వివరాల ప్రకారం భారత దేశవ్యాప్తంగా 45.6 కోట్ల మంది ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు వలసలు వెళ్లారని, వీరిలో 54 శాతం మంది పట్టణాలకు వలసలు వెళ్లినట్లు తెలుస్తున్నది.

యుపి, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి దాదాపు 88% ఇతర రాష్ట్రాలకు వలసల వరదలు పారడం చూస్తున్నాం. వలసదారుల సమస్య ఫలితంగా పౌరసమాజంపై సానుకూల, ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, జనాభా పరమైన, సామాజిక, పర్యావరణ కోణాల్లో పలు సమస్యలు లేదా అనుకూల ఫలితాలు గమనించవచ్చు. మానవ హక్కులను కోల్పోవడం, సామాజిక అభద్రత, కనీస అవసరాల కొరత, గౌరవమైనా పని దొరక్కపోవడం, వైద్య ఆరోగ్య అభద్రత, కనీస వేతనాలు దొరక్కపోవడం, మురికివాడల్లో జీవనాలు లాంటి పలు సమస్యలు వలసదారులు వేధిస్తున్నాయి. వలసదారులు మన లాంటి సాధారణ మానవులే అని, వారికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని తెలుసుకొని వారిని మన సమాజంలో భాగంగా చూసుకుందాం, మానవీయ విలువలను కాపాడుదాం. 

– డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

– ౯౯౪౯౭౦౦౦౩౭

( నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం)

గుడిహత్నూర్ మండలంలో ఎస్ఐని రాళ్లతో కొట్టి….

గుడిహత్నూరు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొండి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఐపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.  ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, గుంపులుగా ఉన్న వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మావల ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  పోలీసు జీపును గ్రామస్తులు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

రూపాయి పతనం..సామాన్యుడికి కష్టకాలం

రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికన్ డాలర్‌తో పోల్చిచూస్తే రూపాయి విలువ చరిత్రాత్మకంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ తొలిసారిగా అమెరికన్ డాలర్‌కు ప్రతిగా 91 రూపాయల మార్కులు దాటి ముందుకు వెళ్ళింది. డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి విలువ తొలిసారి 91.075 వద్ద ట్రేడ్ అయింది. దీంతో మొదటిసారి రూపాయి విలువ ఒక అమెరికన్ డాలర్‌కు 91 మార్కును టచ్ చేసింది. అయితే గడచిన పది ట్రేడింగ్ సెషన్లలో గమనించినట్లయితే రూపాయి విలువ 90 నుంచి 91 పడిపోయినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ విపణిలో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతుంది. గత వారం కూడా భారీగా పడిపోయినా ఆఖరులో పుంజుకోగా, ఇప్పుడు మళ్లీ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్, బాండ్స్ విక్రయిస్తుండటం, అమెరికాతో ట్రేడ్ డీల్ ఒక కొలిక్కిరాకపోవడం వంటివి కారణంగా కనిపిస్తున్నాయి. వాణిజ్య లోటు పెరగడం అంటే భారత్ ఎక్కువగా ఎగుమతులు చేసే దాని కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటాయి.

ఇది డాలర్ డిమాండ్ పెంచి రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి పతనం అవుతుంటే మనకు దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. తద్వారా ధరలు పెరుగుతాయి. ఇది సామాన్యుడిపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత కరెన్సీ రూపాయి అమెరికన్ డాలరుతో పోలిస్తే భారీగా పడిపోతోంది. గత కొంత కాలంగా తగ్గుతూనే ఉన్న మన మారకం విలువ మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే రూ. 90.70 మార్కు దాటి సరికొత్త జీవన కాల కనిష్ఠ స్థాయిని తాకింది. గత వారం కూడా ఒక దశలో 90.50 మార్కు దాటి గురు, శుక్రవారాల్లో కాస్త పుంజుకొని 90 మార్కు దిగువకు చేరింది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు రెండూ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా అమెరికా- భారత్ ట్రేడ్ డీల్ సహా వాణిజ్య లోటు పెరగడం, అంతర్జాతీయ విపణిలో డాలర్ డిమాండ్ పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తుండటం వంటివి రూపాయి పతనానికి దారితీస్తున్నాయి. రూపాయి భారీ పతనంతో ఈ ఏడాదిలో ఆసియాలో వరస్ట్ పెర్ఫామర్‌గా రూపాయే ఉండటం గమనార్హం.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 5.5 శాతం తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాల్ని 50 శాతానికి పెంచడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికా సుంకాల వల్ల మన ఎగుమతులు ప్రభావితం అయ్యాయి. అదే సమయంలో డాలర్ విలువ పెరుగుతుండటం వల్ల దిగుమతులు భారం అవుతున్నాయి. ఈ సుంకాలను తగ్గించుకునేందుకు భారత్-, అమెరికా చాలా కాలంగా చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ ఇది ఎప్పుడు కుదురుతుందో ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. ఒకవేళ ఒప్పందం కుదిరినా భారత్‌పై సుంకాల్ని తగ్గించేందుకు అమెరికా అంగీకరిస్తుందో లేదో చూడాలి. దీనికి తోడు అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. 2025లోనే ఇప్పటివరకు చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారతీయ స్టాక్స్‌ను అమ్మేశారు. పోర్ట్‌ఫోలియో అవుట్ ఫ్లోస్‌లో ఇదో రికార్డు.

ఒక్క డిసెంబర్ నెలలోనే 500 మిలియన్ డాలర్లకుపైగా విలువైన బాండ్లను విక్రయించారు. విదేశీ పెట్టుబడులు తరలి వెళ్లడం వాణిజ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలోనే రూపాయి విలువ తగ్గుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడుతోంది. కానీ రూపాయి అంతకన్నా ఎక్కువ బలహీనపడటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది అని చెప్పవచ్చు. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా కాస్త ఆందోళన తగ్గించే అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే రూపాయి విలువ తగ్గే కొద్దీ చమురు కోసం ఎక్కువ డాలర్లు భారత్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన నేపథ్యంలో తక్కువ డాలర్లకే ఆయిల్ లభిస్తుంది. రూపాయి విలువ తగ్గినట్లయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఖర్చు పెరుగుతుంది.

అలాగే భారత్ పలు విదేశీ బ్యాంకుల నుంచి, ఇతర దేశాల నుంచి గనుక అప్పులు తీసుకున్నట్లయితే వాటిపై చెల్లించే వడ్డీ డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్లకోసం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుం ది. తద్వారా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇది నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ట్యూషన్ ఫీజును వారు డాలర్లలో చెల్లించాలి. రూపాయి బలహీనపడితే ఖర్చు పెరుగుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు అధికం కావడంతో వాణిజ్య లోటు పెరగడం కూడా రూపాయి పడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతి చేసే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. తద్వారా వాణిజ్య లోటు పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు.

– ఇస్కా రాజేష్‌బాబు

93973 99298

ప్రియుడిపై కేసు నమోదు…. ఉరేసుకున్న ప్రియురాలు

హనుమకొండ: ప్రియుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని మనస్థాపంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనూష హైదరాబాద్‌లో ఐటి కంపెనీలో జాబ్ చేస్తోంది. వరంగల్ జిల్లాలో కాశీబుగ్గకు చెందిన గుర్రపు పవన్‌ను గాఢంగా ప్రేమించింది. ఈ విషయం కూడా తల్లి రమాదేవికి కూతురు అనూష తెలిపింది. పవన్‌పై హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ప్రియుడిపై కేసు నమోదు కావడంతో ప్రియురాలు మానసికంగా కుంగిపోయింది. తన ప్రియుడిపై కేసు నమోదైందని పలుమర్లు తల్లి వద్ద కూడా కూతురు వాపోయింది. మనస్థాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.