Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

bahislion

Marsbahis

1xbet

vbet

olabahis

betmoon

betmoon

holiganbet giriş

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

sekabet

sekabet

vdcasino giriş

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

matbet

bets10

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

meritking

1xbet

padişahbet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

betasus

bahiscasino

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

betlike

vdcasino

ultrabet

tlcasino

galabet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinoas

berlinbet

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

grandpashabet

casibom

ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దూకుడు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ టీం దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు విచారణకు మరో వారం గడువు పెంచ డంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును శనివారం సిట్ టీం విచారించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్‌లో విచారించారు. నూతన సిట్ టీం ఏర్పాటుతో బషీర్ బాగ్‌లోని సిసిఎస్‌లో విచారిం చారు. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను సిపి సజ్జనార్ పరిశీలించారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనే అంశం పైన ప్రధానంగా దృష్టి సారించారు. విచారణ అనంతరం ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వసతి ఏర్పాటు చేసి విచారించారు.

తాజాగా సిట్ కార్యాలయం మార్చేందుకు కార్యా చరణ చేస్తున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ఐపిఎస్ స్థాయి హోదాలో పని చేయడంతో అదే స్థాయి ఐపిఎస్ అధికారులతో విచారణ ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీస్ రిపోర్ట్ విచారణలో కీలకం కానుంది. మరో ఆరు రోజుల పాటు సిట్ బృందం ప్రభాకర్‌రావును విచారించనుంది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసంతో పాటు మొబైల్, ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని ప్రభాకర్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. వారం రోజుల విచారణ అనంతరం ఆ రిపోర్టును సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమర్పించ నుంది. ఈ వారం రోజుల విచారణలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

29నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?

రేపు మంత్రులతో ముఖ్యమంత్రి సమాలోచనలు

పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై సభలో చర్చ 

ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టే యోచన 

సహకార ఎన్నికలపైనా ప్రకటన వెలువడే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఈ నెల 22న మంత్రులతో సమావేశమై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించాక తేదీలను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్‌లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తోన్నటు ్టఈ వర్గాల సమాచారం. పైగా అసెంబ్లీ సమావేశాలను ఎలాగు ఆరు నెలలలోపు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేసినట్టు అవుతుంది, అలాగే బిసి రిజర్వేషన్లపై చర్చించాకే ఎన్నికలకు వెళ్లినట్టు ఉంటుందని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అపవాదు ప్రభుత్వం పై పడకుండా వీటిపై విపక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు అవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు ఇదే సమావేశాలలో ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులు ప్రతిపాదించవచ్చని సమాచారం. ఈ విషయాలన్ని కూడా 22న మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారని చెబుతున్నారు.

రిజర్వేషన్లను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ తిరస్కరించడంతో ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లను కల్పించడమా? లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అనే అంశంపై కూడా సభలో చర్చకు పెట్టనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఏ విధంగా ముందు కెళదామని విపక్షాల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటే విమర్శలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

కాగా, గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మొత్తం ఏడు ఆర్డినెన్స్‌లను తేగా అందులో రెండు జిహెచ్‌ఎంసి చట్ట సవరణలు. అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం. వేతనాల చట్ట సవరణ. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 

సారొస్తున్నారు సరే…?

2023 నవంబర్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చ నీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్‌లోకి ఆయన వచ్చింది లేదు.

ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ బిఆర్‌ఎస్‌కు చేసిన నష్టం ఏమిటో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థ మవుతున్నది. ఈ రెండేళ్లలో బిఆర్‌ఎస్ ఎన్నికల లో ఓడిపోవడమే కాకుండా ఇంటా బయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది శాసనసభ్యులతో పాటు జిహెచ్‌ంఎసి మేయర్ వలస పోయారు. వాటికంటే ప్రధానమైనది కేసీఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లి పోయాక కూడా బిఆర్‌ఎస్‌కి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? 

ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నార ని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్ని హిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయ త్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడా నికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది.

తెలంగాణలో గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించిన ఉత్సాహభరితమైన మూడ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్న తరుణంలో నేడు కెసిఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలుసుకోవడానికి వస్తుండటం విశేషం. రెండు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడినప్పుడు కెసిఆర్ మళ్లీ బయటకు వస్తున్నారన్న విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావిస్తే ‘ఆయన అధికారంలో ఉండగానే ఎదుర్కొని ఓడించాం.. ఇప్పుడు అది పెద్ద విశేషం కాదు’ అన్నారు.

2023 నవంబర్ లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కెసిఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చనీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్ లోకి ఆయన వచ్చింది ఎప్పుడూలేదు.

శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఈ రెండేళ్లలో ఓ రెండు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటికంటే ముందు అత్యంత కీలకమైన లోకసభ ఎన్నికలు జరిగాయి. నిన్నగాక మొన్న గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా ముగిసినా వీటిల్లో ఎక్కడ కెసిఆర్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నది లేదు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి తనకింది నాయకులు అందరికీ దిశానిర్దేశం చేస్తే చేసి ఉండవచ్చు. పైన పేర్కొన్న అన్ని ఎన్నికల్లో కూడా, గ్రామపంచాయతీలు మినహాయిస్తే, భారత రాష్ట్ర సమితి ఘోర వైఫల్యం చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. అత్యంత కీలకమైన సందర్భాలలో కూడా ఆయన మౌనంగానే ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కెసిఆర్ రాజకీయాలను దగ్గరినుండి చూసినవాళ్లకు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు.

ఈ రెండు సంవత్సరాలూ బయటకు రాకుండా తెరవెనకే ఉండిపోవడం కూడా కెసిఆర్ రాజకీయ వ్యూహంలో భాగమే అని ఆయన సమర్థకులు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమ కాలంలో కూడా ఆయన ఈ వ్యవహారశైలి చూశాం. కొన్ని సందర్భాల్లో కెసిఆర్ బయట కనిపించకపోతే ‘ఇదేమిటి, నాయకుడు బయటికి రాకుంటే ఎలా? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో’ అన్న విమర్శ వినిపించేది. మళ్ళీ హఠాత్తుగా ఆయన బయటకు వచ్చేవారు. కెసిఆర్ ఒక విషయాన్ని నమ్ముతుంటారెమో బహుశా. అస్తమానం జనంలో కనిపిస్తూ ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుంది కాబట్టి అవసరమైనప్పుడే బయటికి రావాలన్నది ఆయన ఆలోచన కావచ్చు.

కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ భారత రాష్ట్ర సమితి పార్టీకి చేసిన నష్టం ఏమిటో ఆయన పార్టీ నాయకత్వానికి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థమవుతున్నది. ఈ రెండేళ్లలో భారత రాష్ట్ర సమితి ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా ఇంటాబయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది పార్టీ శాసనసభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ప్రతిష్ఠాత్మకమయిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వలసపోయారు. వాటికంటే ప్రధానమైనది కెసిఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లిపోయాక కూడా భారత రాష్ట్ర సమితికి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? కవిత పార్టీలో ఉన్నప్పుడు జరిగిన నష్టం ఆమె మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం. కవిత తీహార్ జైల్లో కొన్ని మాసాలు గడిపి బయటికి వచ్చిన కొద్దికాలంలోనే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపట్ల కినుక వహించడం, తిరుగుబాటు చేయడం, సస్పెండ్ కావడం అక్కడి నుండి దాదాపు ప్రతిరోజూ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, గతంలో పార్టీ అధికారంలో ఉండగా జరిగాయంటున్న అవినీతి కార్యక్రమాల గురించి ఆమె చేస్తున్న ప్రకటనలు మామూలుగా తీసిపారేయవలసినవి కావు.ఈ నష్టం జరగకుండా నివారించడానికి కెసిఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? కవిత చేస్తున్న ఆరోపణలు, దానికి బదులుగా ఆమెమీద కొందరు భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ప్రత్యారోపణలలో వాస్తవం ఎంత ఉంది అన్నది అలా ఉంచితే ఈ క్రమంలో జరుగుతున్న నష్టం మాత్రం చిన్నది కాదు. కెసిఆర్ ఎందుకు దీన్ని నివారించాలేనంత అశక్తులు అయిపోయారు? కవిత ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు మీద, సీనియర్ నాయకుడు హరీశ్ రావు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న విమర్శలలో వాస్తవం ఎంత ఉంది అనేది అలా ఉంచితే దానివల్ల పార్టీకి నష్టం జరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని నివారించే లేదా ఇదంతా జరిగిపోయాకనైనా చక్కదిద్దే స్థితిలో కెసిఆర్ లేరా!

భారత రాష్ట్ర సమితి పగ్గాలు కెసిఆర్ చేతుల్లో లేకపోతే ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో జరపబోతున్న సమావేశంవల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎన్నికలొచ్చినప్పుడే బయటకు రావాలని ఆయన అనుకుంటున్నారా? రాష్ట్రసాధన కోసం ఇంత పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, తొమ్మిది సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా తనను ఓడించారని ప్రజలమీద అలిగి ఆయన బయటకు రావడం లేదా? ఇది వెనకటికి చెప్పిన ముతక సామెతలాగా ఉంది. చెరువు మీద అలిగితే ఎవరికీ నష్టం?

ఇవాళ తన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత కెసిఆర్ వచ్చే మూడు సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్ని నడుపుతారా లేక మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళిపోతారా అన్నది శేష ప్రశ్న. అందుకు కారణం గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో.. ముఖ్యంగా పార్టీ రజతోత్సవం జరిగిన సమయంలో కెసిఆర్ మళ్ళీ చురుగ్గా రాజకీయ క్షేత్రంలో నిలబడతారని ప్రచారం జరిగింది కానీ షరామాములే. భారత రాష్ట్ర సమితికి అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కూడా కెసిఆర్ అయిన కారణంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించాలని పార్టీకి సంబంధించిన వారు ఆశిస్తారు. కనిపించకపోతే బయటివారు విమర్శిస్తారు. చూస్తూనే ఉన్నాం కదా, అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాలు విసురుతూ ఉంటారు.. ‘కెసిఆర్ ను శాసనసభకు రమ్మనండి అన్ని విషయాలు చర్చిద్దాం’ అని. రేవంత్ రెడ్డి సవాలును భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు, కెసిఆర్ అభిమానులు తేలిగ్గా కొట్టిపారేయవచ్చుగాక, కానీ జనం దృష్టిలో మాత్రం రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు పడుతున్నాయి.

ఇవాళ జరగబోయే సమావేశంలో కెసిఆర్ ఏ అంశాలు చర్చించబోతున్నారు? తన పార్టీ ప్రజాప్రతినిధులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అనే విషయాలు కూడా బయట చర్చనీయాంశాలయ్యాయి. ప్రభుత్వపక్షమే అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారం మొన్న ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో 33% పంచాయతీలను భారత రాష్ట్ర సమితి, బిజెపి దక్కించుకున్నాయి. ఇందులో బిజెపిని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజెపి నాయకులు తమ పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నా, అందులో సింహభాగం భారత రాష్ట్ర సమితికే దక్కిన విషయం అందరికీ తెలిసిందే. పైగా పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగినవి కాదు. దీని తర్వాత జరిగే ఎన్నికలు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీల గుర్తులు మీద జరిగేవి. కాబట్టి పంచాయతీలు ఇచ్చిన ఉత్సాహంతో వీటిలో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయబోతున్నారా కెసిఆర్?

అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో తన తర్వాత కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు కె.టి.రామారావు, హరీశ్ రావులకు రానున్న మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలలో బాధ్యతలను పంచే ఆలోచన కూడా కెసిఆర్ చేస్తున్నారని వినికిడి. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల బాధ్యతలు కెటిఆర్‌కు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల ఎన్నికల బాధ్యతలు హరీశ్ రావుకు అప్పగించి సమాన స్థాయి కల్పిస్తారని ప్రచారం. ఇదే కాకుండా ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడానికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోవాలని జరిగిన ఉద్యమంలోని మూడు ప్రధాన అంశాల్లో అత్యంత కీలకమైనవి నీళ్లు, నిధులు, నియామకాలు ఆ తర్వాతనే. మరి ఇంత ముఖ్యమైన అంశంలో చంద్రబాబు తన అధికారాన్ని, సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నీళ్లు తరలించుకుపోతానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఊరికే ఉంటుందా? తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు వత్తిడికి లొంగి తెలంగాణకు ద్రోహం చేసే సాహసం చేస్తుందా?.

దేవులపల్లి అమర్

ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు బలం

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు ఉన్న అతిపెద్ద బలం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వసుధైక కుటుంబకం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచనని, ఇది నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని ఆమె తెలిపారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన “భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు” అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ సమాజం అనేక మార్పులకు లోనవుతోందన్నారు. ఈ మార్పులతో పాటు మనమూ మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, మానవీయ విలువల క్షీణత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉందన్నారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాదని మనం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతర్గత స్థిరత్వం, భావోద్వేగ మేధస్సు, విలువలతో కూడిన జీవన విధానం అత్యంత అవసరమని తెలిపారు. 

నేడు తెలంగాణ భవన్‌కు కెసిఆర్

మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ కార్యవర్గ సంయుక్త భేటీ

సాగునీటి హక్కుల కోసం కెసిఆర్ సమరశంఖం

రెండేళ్ల కాంగ్రెస్ పాలన, హామీల అమలుపై చర్చ

పంచాయతీ ఎన్నికల ఫలితాలు,

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపైనా సమీక్ష

సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చ

గ్రేటర్, స్థానిక సంస్థల ఎన్నికలపై

అనుసరించాల్సిన వ్యూహాలపై

పార్టీ శ్రేణులకు కెసిఆర్ దిశానిర్ధేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలా రోజుల విరామం తర్వాత ఆదివారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ పాలన తీరు, ఇచ్చిన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనున్నట్లు తెలిసింది.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టిఎంసిలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టిఎంసిలు ఇస్తే చాలని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బిఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడుతుంది. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బిజెపి ఎంపీలు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని బిఆర్‌ఎస్ భావిస్తోంది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరన్నట్లుగా ఉందని బిఆర్‌ఎస్ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బిజెపి చేస్తున్న అన్యాయాన్ని కానీ., కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బిజెపి విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కెసిఆర్ భావిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి అని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి అని పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదు అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టిఎంసిలు ఒప్పుకోవడం అనేది ఘోరం, దుర్మార్గం… కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు అని పార్టీ స్పష్టం చేసింది. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను ఆదివారం నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నారు.

పార్టీ బలోపేతంపైనా కెసిఆర్ దృష్టి

బిఆర్‌ఎస్ పార్టీ ప్రక్షాళన, సంస్థాగత బలోపేతంపైనా అధినేత కెసిఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత పార్టీ అధినేత తెలంగాణ భవన్‌కు వస్తుండటంతో బిఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కెసిఆర్‌కు ఘనంగా ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ సాధించిన ఫలితాలతో పాటు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలను కూడా కెసిఆర్ సమీక్షించే అవకాశం ఉంది.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 33 శాతం సీట్లు సాధించడం పట్ల అధినేత సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అయితే తక్కువ సర్పంచి స్థానాలు గెలిచిన జిల్లాల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు పక్కనబెట్టి అందరూ సమన్వయం పనిచేయాలని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసే అందరికీ మంచి అవకాశాలు వస్తాయని పార్టీ శ్రేణులను దిశానిర్ధేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనుసంరించాల్సిన వ్యూహాలపై అధినేత కెసిఆర్ బిఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై ఆదివారం జరిగే సమావేశంలో లోతుగా చర్చించనున్నారు.

నందినగర్ నివాసానికి చేరుకున్న కెసిఆర్

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శనివారం నగరంలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరగనున్న పార్టీ శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ శనివారం మధ్యాహ్నం ఎర్రవల్లి నివాసం నుంచి నగరంలోని నందినగర్ నివాసానికి వచ్చారు.

అసెంబ్లీ నూతన కార్యదర్శిగా తిరుపతి

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ నూతన కార్యదర్శిగా ఆర్. తిరుపతి నియమితులయ్యారు. రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న తిరుపతిని అసెంబ్లీ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శనివారం జివో విడుదల విడుదల చేశారు. ఇదిలాఉండగా ఇప్పటి వరకు అసెంబ్లీ, కౌన్సిల్ (శాసనపరిషత్తు) కార్యదర్శిగా ఉన్న డాక్టర్ వి. నరసింహా చార్యులును కౌన్సిల్ కార్యదర్శిగా నియమిస్తూ అదే జివోలో ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత జిల్లా జడ్జి (లీగల్ అధికారి) స్థాయి అధికారిని నియమించడం గమనార్హం. గతంలో 1971 సంవత్సరంలో లీగల్ అధికారి శంకర్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

అద్భుతమైన యాక్షన్, డ్రామా, వార్‌తో..

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తు న్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఫిక్షనల్ క్యారెక్టర్‌తో కథ…

1948లో జరిగే కథ ఇది. యాక్షన్, డ్రామా, వార్… అన్ని చాలా గ్రాండ్‌గా ఉంటాయి. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలా మందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ని సృష్టించి ఈ కథని చూపించడం జరిగింది. సినిమాలో నా క్యారెక్టర్ పూర్తిగా హైదరాబాదీ. ఆ యాస స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది.

అద్భుతమైన యాక్షన్…

ఈ సినిమా కోసం పీటర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్‌లో నాకు కొన్ని గా యాలు కూడా అయ్యాయి. ఇండియాకి స్వా తంత్య్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్‌కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. డైరెక్టర్, స్వప్న, ఆర్ డైరెక్టర్ తోట ప్రతిదీ రీసె ర్చ్ చేశారు. ఆ కాలంలో ఎలా ఉండేవారు అనేదాన్ని డైరెక్టర్ ప్రతీది శ్రద్ధ తీసుకుని చేశారు.

ప్రతి పాత్రకి ప్రాధాన్యత…

కోవై సరళ నాన్నగారితో కూడా చాలా సినిమాలు చేశారు. చాలా అద్భుతమైన టైమింగ్ వున్న నటి. ఇందులో కళ్యాణ్ చక్రవర్తిది బైరాన్ పల్లి గ్రామంలో ఒక నిజమైన పాత్ర స్ఫూర్తితో రాసుకున్న క్యారెక్టర్. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. సినిమాలో బైరాన్ పల్లి గ్రామంలోని ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ప్రారంభం, ముగింపు ఉంటుంది.

బలమైన సబ్జెక్టుతో…

-హాలీవుడ్‌లో ‘స్పైడర్ మ్యాన్’ లాంటి సినిమాలు దాదాపు 3000 కోట్లు పెట్టి తీస్తారు కానీ అం దులో ఒక కొత్త నటుడు ఉంటాడు. ఖర్చు పెట్టే ది సినిమా మీద. ఇక ఈ సినిమాలో బలమైన సబ్జెక్టు ఉంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టారు.

చాలా మంచి వినోదం…

ఇందులో హీరో, హీరోయిన్‌ల మధ్య డ్రామా అనే కాన్సెప్ట్‌తో చాలా మంచి వినోదం ఉంటుంది. అనస్వర మలయాళంలో దాదాపు 25 సినిమాలు చేసింది. సినిమాలో తన పాత్రలో చాలా బలమైనది. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయి.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్తగా…

ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో కొత్త మిక్కీ జే మేయర్‌ని చూస్తారు. యాక్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంటుంది.

వార ఫలాలు (21-12-2025 నుండి 27-12-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా రావలసినటువంటి లాభాలు అందుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతాన సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొంత వరకు బాగుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార పరంగా మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసికంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొదుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని మరియు కాలభైరవ అష్టకం చదవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్.

వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం మారే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఖర్చులు అధికంగా రాబడి తక్కువగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. స్కాలర్షిప్స్ లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అప్పు ఇస్తే తిరిగి రాదు. అప్పు తీసుకోవడం కూడా కలిసి రాదు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వాహనయోగం ఉంది. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రే.

మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది విషయాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ మారాలి అని ఆలోచన వస్తుంది. ఉద్యోగ పరంగా మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ధ్యానం చేయండి దైవ నామస్మరణ ఎక్కువగా చేయండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ తీసుకుంటారు. ఆరోగ్య పరంగా చిన్నచిన్నఇబ్బందులు ఉంటాయి. జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. మంగళవారం మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు కాషాయం.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. అమ్మకాలు కొనుగోలులో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. సంతానం యొక్క చదువుపై శ్రద్ధ వహించాలి. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోర్టుకు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్టాక్ మార్కెట్ కి స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి ఫార్మా రంగంలో ఉన్న వారికి సినీ కళారంగాలలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య త్రీ కలిసివచ్చే రంగు లైట్ ఎల్లో.

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా బాగుంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి పేరు ప్రఖ్యాతలు మాత్రం బాగుంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. పది రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అవసరం. స్నేహితులకి చెడు అలవాట్లకి దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీ తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కాలం ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఆశలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులు ఏకముఖి రుద్రాక్షలు ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు గ్రే.

తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా మనశ్శాంతి లోపి స్తుంది. వ్యాపారంలో ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విషయంలోనైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో శుభకార్యాలకు ప్రస్తావన ఉంటుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఫలితాలు బాగుంటాయి. చదువుపై శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు అందుకుంటారు. భూమి కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు గ్రీన్.

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. బంధు వర్గంలో నరదిష్టి అధికంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడమే మంచిది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. నూతన కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు లభిస్తాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్.

ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. కెరియర్ పరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గో సేవ చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రుణాలు చాలా వరకు తీరుస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా లభిస్తుంది. రాజకీయరంగంలో ఉన్న వారికి నూతన పదవులు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. నూతన పనులను కొంతకాలం వాయిదావేస్తారు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున నలుపు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. సినీ కళారంగాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా కాలం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. మీ జీవిత ఆశయం నెరవేరుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కెరియర్ పరంగా బాగుంటుంది. ఉద్యోగ విషయంలో అధికారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. గృహంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. గతవారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించండి. నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు తెలుపు.

 

కలర్‌ఫుల్ బర్త్ డే గ్లింప్స్

కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్షకుల మన్నలు అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి అపళ్ల జోడీ మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ కోన వెంకట్ ఈ క్రేజీ కాంబోని తీసుకొస్తున్నారు. కావ్య, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాతలు. శనివారం పుట్టినరోజుని జరుపుకుంటోన్న శ్రీదేవికి బర్త్‌డేను మరింత కలర్‌ఫుల్‌గా చేయడానికి మేకర్స్ సినిమా నుంచి బర్త్ డే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాల కలయికగా రూపొందుతోన్న ఈ అందమైన కథను సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నారు.

కాజీపేట రైల్వే వర్క్‌షాప్‌కు రూ.17 కోట్లు మంజూరు

మన తెలంగాణ/హైదరాబాద్: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో రైల్వే వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్ల 3 లక్షల 75వేలు మంజూరు చేసింది, మిగిలిన పరిహారం మొత్తాన్ని మడికొండలోని శ్రీసీతా రామ ఆలయం తరపున ఆలయ ఖాతాలో జమచేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి వికాస్ రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.