Latest News
ఫైనల్లో అదరగొట్టిన కుల్దీప్.. ఆసియాకప్లో చరిత్ర తిరగరాశాడు..
దుబాయ్: ఆసియాకప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించి భారత్ తొమ్మిదొసారి ట్రోఫీని అందుకుంది. ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. అయితే ఈ క్రమంలో కుల్దీప్ ఆసియాకప్ చరిత్రలోనే తిరుగులేని ఘనతను సాధించాడు. ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. పాక్ ఆటగాడు సైయిమ్ అయూబ్ వికెట్తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్లు శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉండేది.
మలింగ ఆసియాకప్లో 33 వికెట్లు తీశాడు. తాజాగా పాక్తో జరిగిన ఫైనల్ మ్యాచ్తో కలిసి ఈ టోర్నమెంట్లో మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసియాకప్(వన్డే, టి-20)లో 36 వికెట్లు తీసి మలింగాను అధిగమించాడు. అంతేకాకుండా ఆసియాకప్ ఒక ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీశాడు. గతంలో ఈ రికార్డు ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉండేది. తాజాగా కుల్దీప్ 17 టికెట్లు తీసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
శ్రీశైలం జలశయానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
ఈ ChatGPT prompts తో ఏదైనా భాషను 30 రోజుల్లో నేర్చుకోండి..
కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి : సివి. ఆనంద్
హైదరాబాద్: టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసి జరుగుతోందని సిపి. సివి ఆనంద్ తెలిపారు. పైరసి వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ముఠా పైరసీ వల్ల తెలుగుచిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల మేర నష్టం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి జరుగుతోందని, థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విస్తుపోయేలా డిజిటల్ శాటిలైన్ ను కూడా హ్యాక్ చేసి పైరసి చేస్తున్నారని,
పైరసి మూవీలు అప్ లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని, సింగిల్, హాట్ సినిమాల పైరసి జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. పైరసి కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మరొకరికి పంపించాడని అన్నారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ తో సినిమాను రికార్డింగ్ చేస్తారని, కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసి చేశారని చెప్పారు.
ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాను థియేటర్ లో రికార్డింగ్ చేశారని, సెల్ ఫోన్లను జేబులోగాని, పాప్ కార్న్ డబ్బాలో గానీ పెడతారని అన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందని, మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్ లో ఉండటంతో ఎవరికి అనుమానం రాదని చెప్పారు. ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని, సినిమా పైరసిలకు నెదర్లాండ్ కు చెందిన ఐపి అడ్రస్ వాడుతున్నారని పేర్కొన్నారు. పైరసి ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని, పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని నిందితులు భావించారని సివి ఆనంద్ స్పష్టం చేశారు.
నెదర్లాండ్ ఐపి అడ్రస్ తో పైరసీ: సివి ఆనంద్
హైదరాబాద్: టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసి జరుగుతోందని సిపి. సివి ఆనంద్ తెలిపారు. పైరసి వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ముఠా పైరసీ వల్ల తెలుగుచిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల మేర నష్టం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి జరుగుతోందని, థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విస్తుపోయేలా డిజిటల్ శాటిలైన్ ను కూడా హ్యాక్ చేసి పైరసి చేస్తున్నారన్నారు.
పైరసి మూవీలు అప్ లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని, సింగిల్, హాట్ సినిమాల పైరసి జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని ఆనంద్ తెలియజేశారు. పైరసి కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మరొకరికి పంపించాడని అన్నారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ తో సినిమాను రికార్డింగ్ చేస్తారని, కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసి చేశారని చెప్పారు.
ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాను థియేటర్ లో రికార్డింగ్ చేశారని, సెల్ ఫోన్లను జేబులోగాని, పాప్ కార్న్ డబ్బాలో గానీ పెడతారని అన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందని, మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్ లో ఉండటంతో ఎవరికి అనుమానం రాదని చెప్పారు. ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని, సినిమా పైరసిలకు నెదర్లాండ్ కు చెందిన ఐపి అడ్రస్ వాడుతున్నారని పేర్కొన్నారు. పైరసి ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని, పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని నిందితులు భావించారని సివి ఆనంద్ స్పష్టం చేశారు.
టీమిండియా గెలిచింది… కానీ వాళ్లను పట్టించుకోవడంలేదు: శశిథరూర్
ముంబయి: ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్లో పాక్పై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయ దుందుభి మోగించింది. ఇప్పటి ఆసియా కప్ను భారత్ తొమ్మిది సార్లు గెలుచుకుంది. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడంతో కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ తన ఎక్స్లో స్పందించారు. విజయం వరించగానే అందరూ క్రికెటర్లను ప్రశంసిస్తున్నారని, తెరవెనుక జరిగి వాటి గురించి తెలియదన్నారు. అపజయాలు వచ్చినప్పుడు కోచ్, సెలక్టర్లపై విమర్శలు వస్తాయని, విజయాలు వరించినప్పుడు వాళ్లను పట్టించుకోవడంలేదని బాధను వ్యక్తం చేశారు. అసియా కప్లో గెలవడంతో కోచ్, సెలక్టర్ల పాత్ర ఉండడంతో వారిని అభినందాద్దామని తెలిపారు.
రింకూ ఎప్పుడో చెప్పాడు.. అదే చేసి చూపించాడు
ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. తొమ్మిదోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ విజయంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్లో మరో బ్యాటర్ పేరు కూడా మారుమోగిపోతుంది. అతడే రింకూ సింగ్. హార్థిక్ పాండ్యాకు గాయం కావడంతో జట్టులోకి వచ్చి రింకూ.. మ్యాచ్ విజయానికి అవసరమైన చివరి పరుగులు చేశాడు. మొత్తం టోర్నమెంట్లో కేవలం ఒక బంతిని మాత్రమే ఎదురుకొని.. ఫోర్తో జట్టును గెలిపించాడు.
అయితే ఇక్క మరో ట్విస్ట్ ఉంది. రింకూ సింగ్ గతంలో తాను చెప్పిన విషయాన్నే ఫైనల్లో చేసి చూపించాడని యాంకర్ సంజనా గణేషన్ బయటపెట్టింది. ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి మొదలైంది. అంతకు మూడు రోజుల ముందే 6 తేదీన రింకూ సింగ్ ఫైనల్లో విన్నింగ్ రన్స్ తానే చేస్తానంటూ ఓ పేపర్ మీద రాసిచ్చాడట. ఇప్పుడు సరిగ్గా అదే జరిగిందని సంజనా వివరించింది. తిలక్ వర్మపై కూడా అప్పుడే అంచనా వేసినట్లు ఆమె పేర్కొంది. విలువైన ఇన్నింగ్స్ ఆడేస్తానని అతడు కూడా చీటీలో రాసి ఇవ్వడం గమనార్హం.
పేదలకు నాణ్యమైన భోజనం, టిఫిన్ : పొన్నం
హైదరాబాద్: ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా పేదలకు నాణ్యమైన భోజనం, టిఫిన్ అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోతీనగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్లు పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోతీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. జిహెచ్ఎమ్ సి లో 60 క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని, ఇకపై రూ.5 బ్రేక్ ఫాస్ట్ అని తెలియజేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్థానాల్లో తామే గెలుస్తామని, ఎమ్ఎయుడి, హెచ్ఎమ్ డిఎ అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివి ఉంటే తన దృష్టికి తీసుకురండని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
మెట్రో రెండో దశ పనుల్లో నిర్లక్ష్యం… బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన
రంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశను నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ధ్వంసమైన శిలా ఫలకం వద్ద బిఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి కార్తీక్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకులతో పాటు కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. మెట్రో రెండో దశ పనులను త్వరగా ప్రారంభించాలని బిఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
తొలి దశ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందడుగు వేసిన విషయం తెలిసిందే. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్అండ్టి సంస్థ చేసిన 13 వేల కోట్లు అప్పులు చెల్లించడంతో పాటు మరో రెండు వేలు కోట్లు ఎల్అండ్టికి ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.