Latest News
ఆత్మహత్యల తెలంగాణను..అన్నపూర్ణగా మార్చింది కెసిఆర్: హరీష్ రావు
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిరసనలు
కెసిఆర్ దసరా శుభాకాంక్షలు
రేపు కొండారెడ్డిపల్లిలో సిఎం దసరా వేడుకలు
పైరసీపై యుద్ధం.. ఐబొమ్మ సంచలన ప్రకటన..
సినిమాలు, ఒటిటి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా థియేటర్లో రికార్డ్ చేసే వారితో పాటు.. సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఐబొమ్మ వెబ్సైట్పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్సైట్ కోసం పని చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిహార్, ఉత్తర్ప్రదేశ్లలో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్న గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్సైట్ తెలుగులో ఓ ప్రకటనను వెలువరించింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీ ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొంది. దీని వల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్య తరగతివాడే బాధపడుతున్నాడని తెలిపింది. కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డు చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్సైట్లపై దృష్టి పెట్టాలని సూచించింది. తాము ఏ దేశంలో ఉన్న భారత దేశం, అందులోనూ తెలుగు వారి గురించి ఆలోచిస్తామంటూ చెప్పింది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
వినాయకుడిపై ఒట్టు.. ‘మాస్ జాతర’ వచ్చేది అప్పుడే..
మాస్ మహరాజ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర’. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా ఓ ఫన్నీ వీడియోతో ఈ చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ వీడియోలో రవితేజను హైపర్ ఆది సినిమా విడుదల తేదీ గురించి పలు మార్లు అడగటం.. దానికి రవితేజ సమాధానం చెప్పడం చూడొచ్చు. ఆఖరిగా వినాయక చవితి కూడా అయిపోయింది అంటూ వినాయకుడి విగ్రహంతో ఆది వస్తాడు.. అయితే ఆ వినాయకుడిపై ప్రమాణం చేస్తూ.. అక్టోబర్ 31వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు రవితేజా ప్రకటిస్తాడు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్కి మంచి ప్రేక్షకాదరణ లభించింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ‘మాస్ జాతర’ సినిమా చెప్పిన టైమ్కి విడుదలై.. ప్రేక్షకులకు జాతర చూపించాలని కోరుకుంటున్నారు.
శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యం
కాన్పూర్: ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీం ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యతో కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్, ప్రియాన్ష్ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 413 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్లో శ్రేయస్ 110, ప్రియాన్ష్ 101 పరుగులు చేయగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్ (56), రియాన్ పరాగ్ (67), బదోని (60) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలింగ్లో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలో వికెట్ తీశారు.
పెళ్లి పీటలు ఎక్కనున్న తెలుగు హీరో.. అధికారిక ప్రకటన
హైదరాబాద్: అల్లు వాళ్లింట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ‘మా తాతగారు అల్లు రామలింగయ్య పుట్టిన రోజున నా హృదయానికి ఎంతో చేరువైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31వ తేదీన నాకు నయనిక అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగనుంది. ఈ మధ్యే మరణించిన మా నాన్నమ్మ నాకు పెళ్లి చేయాలని ఎప్పుడు కోరుకునేది. నా మా మధ్య లేకపోయినా.. మా ఈ కొత్త ప్రయాణంలో ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నా’’ అని శిరీష్ ఎక్స్లో పేర్కొన్నాడు.
శిరీష్ వివాహం గురించి గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. అయితే శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకొనే నయనిక గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.