kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetbox

హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య

హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు పరిష్కారం కాక ముందే మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్‌ఐ) సందీప్ కుమార్ మృతదేహం రోహటక్ – పానిపట్ రోడ్డులోని ట్యూబ్ వెల్ సమీపంలో లభ్యమైంది. పూరన్ కుమార్ అవినీతి కేసును అతడు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ కుమార్ మృతదేహం సమీపంలోనే పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్ ను, స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ అధికారి రికార్డు చేసిన వీడియో ను పరిశీలిస్తున్నారు. వరుసగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల ఆత్మహత్య పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్షాల వత్తిడి నేపథ్యంలో రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కపూర్ ను సెలవుపై పంపివేసింది. గతంలోనే రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ను బదిలీ చేశారు.

సందీప్ కుమార్ తన నోట్ లో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి అధికారి అని, ఆయనకు సంబంధించి చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నానని ఏఎస్ ఐ పేర్కొన్నాడు. చనిపోయే ముందు మొత్తం అవినీతి బాగోతాన్ని బయటపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ నోట్ లో పేర్కొన్నారు. తన మరణం తర్వాత నైనా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని తాను కోరుతున్నట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. పూరన్ కుమార్ అవినీతి కుటుంబాన్ని వదిలి పెట్టకూడదని, అతడు తన స్వార్థం కోసం కులరాజకీయాలను వాడుకొని, వ్యవస్థనే హైజాక్ చేశాడని నోట్ లో ఆరోపించారు.

ఆ వీడియోలో పూరన్ కుమార్ కుల రాజకీయాలు, అవినీతి తో పోలీసు శాఖనే తీవ్రంగా ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునుంచే కులరాజకీయాలను ప్రారంభించి, తన వారిని కింది ఉద్యోగులుగా నియమించుకుని పైళ్ల శోధన చేపట్టాడని సందీప్ పేర్కొన్నాడు. తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి, హింసించి డబ్బువసూలు చేసేవాడని, మహిళా పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని బెదిరిస్తూ, కొందరిపై లైంగిక వేధింపులకు గురు చేశాడని ఆ వీడియోలో ఆరోపించారు.

ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై దర్యాప్తు

అక్టోబర్ 7న 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ చండీగఢ్ లోని సెక్టార్ 11లోని తన నివాసంలోసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఏఎస్‌ఐ సందీప్ కుమార్ కూడా నేడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశం అయింది.పూరన్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రోహ్ తక్ లోని సునారియాలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్ నీత్ పూరన్ కుమార్ ఇంట్లో లేరు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలోని ప్రతినిధివర్గంలో సభ్యురాలిగా జపాన్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు.

రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కుమర్ పై వేటు

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య, అదే కేసు దర్యాప్తు చేస్తున్న మరో ఏఎస్‌ఐ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు దాడి ప్రారంభించడం, మరో పక్క పూరన్ కుటుంబసభ్యులు ఆయనను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర డిజిపీ శతృఘ్న్ కుమార్ ను సెలవులో పంపివేసింది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రోహ్ తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసింది డీజీపీని రాష్ట్రప్రభుత్వం డీజీపీ ని సెలవులోకి పోవల్సిందిగా ఆదేశించినట్లు హర్యానా ముఖ్యమంత్రి మీడీయా సలహాదారు రాజీవి జైట్లీ వెల్లడించారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్ లో డిజీపీ శతృఘ్న్ కుమార్, నరేంద్ర బిజర్నియా లు కూడా కులవివక్షతతో , తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: హరీష్ రావు

 కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయణిస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. జూన్‌లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం, సెప్టెంబర్‌లో -0.15 శాతాలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యం అని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు.

మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్

 జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. విష వాయువు పీల్చడం వల్ల తొమ్మిది మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బీహార్ ఎన్నికలు.. బిజెపిలో చేరిన 25 ఏళ్ల సింగర్

పాట్నా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో రాజకీయ పార్టీలు సన్నదమవుతున్నాయి. అలాగే, పార్టీలల్లో చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్(25) మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరింది. మధుబని జిల్లాలోని బెనిపట్టికి చెందిన ఠాకూర్ రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను గతంలో వ్యక్తం చేసింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది. 

మైథిలి ఠాకూర్ ఎవరు?

బీహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, ఆమె ఇద్దరు సోదరులతో కలిసి.. వారి తాత మరియు తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు.  భోజ్‌పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను మైథిలి పాడింది. బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకుంది. తన జానపద గీతాలతో ప్రజాదరణను సొంతం చేసుకున్న మైథిలి ఠాకూర్ ను బీహార్ ఎన్నికల సంఘం ‘స్టేట్ ఐకాన్’గా నియమించింది.

కాగా, దర్భంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే మిశ్రీ లాల్ యాదవ్ పార్టీకి అక్టోబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆరోపిస్తూ..  పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్‌కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో అలీనగర్ నుంచి మైథిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

ఆ విషయంలో కోహ్లీ నెంబర్ వన్: హర్భజన్

టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కి ఓ ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేవరెట్ క్రికెర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరిద్దరు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

‘‘ప్రస్తుత క్రికెటర్లలో ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీనే నెంబర్.1. ఆ విషయంలో అతడు మిస్టర్ పర్‌ఫెక్ట్. అతడి ఆట చూసేందుకు ఎదురుచూస్తున్నా. విరాట్ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుతున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ కొన్ని టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడు. మూడు మ్యాచుల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని ఆశిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 29 వన్డేలు ఆడి.. 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 6 అర్థ శతకాలు ఉన్నాయి. 

రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ల చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు మనోజ్ఞను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ఞ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన పై పోలసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ఞ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

‘మీసాల పిల్ల’ వచ్చేసింది.. మీరూ చూసేయండి..

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘శశిరేఖ’ అనే పాత్రలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం దసరా కానుకగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫుల్ సాంగ్ విడుదలకు మాత్రం చిత్ర యూనిట్ కాస్త ఆలస్యం చేసింది.

అయితే ఈ ఆలస్యాన్ని కూడా ప్రమోషన్ కింద వాడేసుకున్నాడు దర్శకుడు అనిల్. ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలోని బుల్లిరాజుతో ఈ పాట ఎప్పుడు వస్తుందా అంటూ ఓ ఫన్నీ వీడియోని విడుదల చేశారు. నిజానికి ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ సోమవారమే విడుదల చేస్తామని తొలుత చెప్పారు. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. కాగా, ఈ పాటని మంగళవారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇక ఈ పాటని ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ అలపించగా.. భీమ్స్ సంగీతం అందించారు. భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

బిహార్ ఎన్నికలు.. తొలి జాబితా ప్రకటించిన బిజెపి

పాట్నా: బిహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇటీవలే బిహార్‌లో ఎన్‌డిఎ పార్టీల సీట్ల పంపిణీ ఒప్పందం జరిగింది. అందులో బిజెపికి 101 స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలోకి దిగనున్నారు. మంత్రులు నితన్ నబీన్.. బాంకీపూర్, రేణు దేవీ.. బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 101 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఏజ్‌లోనూ మలైకా తగ్గట్లే.. ‘థామా’ నుంచి మరో ఐటమ్ సాంగ్

పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో వస్తున్న ఐదో చిత్రం ఇది. ఇప్పటివరకూ ఈ యూనివర్స్‌లో ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ-2’ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల తర్వాత వస్తున్న చిత్రం థామా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందనే వచ్చింది.

అంతేకాక.. సినిమా నుంచి వచ్చిన వీడియో సాంగ్స్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో రష్మిక చేసిన పాట ఒకటి కాగా, ‘దిల్‌బర్’ అంటూ సాగే పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి చిందులు వేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పాయిజన్ బేబి’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఇందులో 51 ఏళ్ల వయస్సులోనూ తన అందంతో కుర్రకారును కుదిపేస్తున్న మలైకా ఆరోరా స్టెప్పులు వేసింది. ఇది కూడా పార్టీ సాంగ్‌లానే కనిపిస్తోంది. చివర్లో మలైకాతో పాటు రష్మిక కూడా డ్యాన్స్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాను ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించగా.. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 21వ తేదీన థామా విడుదల కానుంది.