elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbet

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, 42 శాతం బిసి రిజర్వేషన్లపై చర్చించిన మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ అనర్హతగా ఉన్న నిబంధనను మంత్రివర్గం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్నా పోటీ చేయొచ్చని చెప్పారు. ఇక, కేంద్రం సహకరించకపోయినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. నల్సార్ యూనివర్శిటీకి గతంలో ఇచ్చిన భూమి కన్నా అదనంగా మరో 7 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రంగాలకు భూములను కేటాయించాలని మంత్రివర్గం ఆమోదించిందని ఆయన తెలిపారు.

దక్కన్ కిచెన్ కేసులో వెంకటేష్, రానా లకు నాంపల్లి కోర్టు ఆదేశం

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, నిర్మాత సురేశ్ బాబుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో తప్పనిసరిగా తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నవంబర్ 14న పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేష్, రానా, అభిరామ్‌తో పాటు నిర్మాత దగ్గుబబాటి సురేష్‌పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

ఇది కేసు నేపథ్యం

దక్కన్ కిచెన్ లీజు విషయంలో హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మద్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన సంస్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో హోటల్ యజమాని కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని హోటల్ యజమాని పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని కోర్టుకు చెప్పారు. బాధ్యులపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

తెలంగాణలో 3 కొత్త వ్యవసాయ కళాశాలు..

తెలంగాణలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలు ఏర్పాటు కానున్నాయి. ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని గురువారం రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అగ్రికల్చర్ కాలేజీలను పారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లేడీ ఓరియంటెడ్ మూవీలో సంయుక్త…

మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో దాదాపు అర డజను సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఈ భామ 2023లో డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది లవ్ మీ సినిమాలో నటించినప్పటికీ అది ప్రత్యేక పాత్రలో మాత్రమే. అంటే దాదాపు రెండేళ్లుగా సంయుక్త మీనన్ నటించిన సినిమాలు రాలేదని చెప్పాలి. ఆ గ్యాప్‌ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంయుక్త మీనన్ భర్తీ చేసే విధంగా వరుసగా సినిమాలకు కమిట్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో అఖండ 2, స్వయంభూ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాను కూడా సంయుక్త చేస్తోంది.

అయితే సంయుక్త మీనన్ తెలుగులో కొత్తగా యోగి దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పింది. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన చింతకాయల రవి సినిమాకు దర్శకత్వం వహించిన యోగి మళ్లీ ఇన్నాళ్లకు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిందని, దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయిందని తెలిసింది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.

తాజాగా ఈ సినిమాకు బ్లాక్ గోల్డ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమా కథాంశం ఉంటుందట. ఈ సినిమాలో సంయుక్త మీనన్ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఆమె ఇప్పటి వరకు పోషించిన పాత్రలతో పోల్చితే ఈ సినిమాలోని పాత్ర చాలా విభిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. పైగా సంయుక్త మీనన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా బలమైన పాత్రలో కనిపించబోతుందట. బ్లాక్ గోల్డ్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో లేదా అంతకంటే ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆగస్టు 14న ‘ఫౌజీ’?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో ఒకటి ఫౌజీ. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పుడు నిర్మాతలు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాతలు… వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తారని తెలిసింది.

ఇకపోతే నిర్మాతలు ఫౌజీ సినిమాను రిలీజ్ చేయాలనుకున్న సమయంలో ప్రభుత్వ సెలవులు కూడా బాగా కలిసి వస్తాయి. ఒకవేళ ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. ఆగస్టు15 శనివారం స్వాతంత్ర దినోత్సవం హాలిడే.. అలాగే ఆగస్టు 16న ఆదివారం కావడంతో ఈ సినిమాకి వరుసగా మూడు రోజులు కలిసి వస్తాయి. అలాగే ఆగస్టు 22న వీకెండ్ శనివారం.. ఆగస్టు 23 ఆదివారం.. అలాగే ఆగస్టు 25 మంగళవారం హాలిడే.. ఆగస్టు 28 శుక్రవారం కూడా హాలిడేలు ఉన్నాయి. ఇక ఈ హాలిడేస్ అన్నీ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఆగస్టు 14న ఫౌజీ గనుక రిలీజ్ అయ్యిందంటే మాత్రం ఈ హాలిడేస్ అన్నింటిని నిర్మాతలు క్యాష్ చేసుకోవచ్చు. మరి ఈ విడుదల తేదీపై అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

చెలరేగిన ఆసీస్ ఓపెనర్లు.. 10 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు

మహిళల వన్డే వరల్డ్‌కప్.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా

విశాఖపట్నం: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా నాలుగింటిలో విజయం సాధించింది. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ నేపథ్యంలో 9 పాయింట్లతో ఆస్ట్రేలియా నాకౌట్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అలీసా హీలీ, ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. హీలీ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించింది. బంగ్లా బౌలర్లను హడలెత్తించిన అలీసా వరుస ఫోర్లతో పరుగుల వరదను పారించింది. లిచ్‌ఫీల్డ్ కూడా తన మార్క్ షాట్లతో చెలరేగి పోయింది. ఈ జోడీని కట్టడి చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హీల 77 బంతుల్లోనే 20 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు సాధించింది. చూడచక్కని షాట్లతో అలరించిన హీలీ కళ్లు చెదిరే శతకంతో జట్టుకు ఘన విజయం అందించింది. లిచ్‌ఫీల్డ్ కూడా తనవంతు సహకారం అందించింది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్ 72 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 84 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా సగానికి పైగా ఓవర్లు మిగిలివుండగానే జయకేతనం ఎగుర వేసింది.

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. సమష్టిగా రాణించిన బౌలర్లు ఏ దశలోనూ బంగ్లా బ్యాటర్లకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అలనా కింగ్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచింది. 10 ఓవర్లలో 4 మెయిడిన్‌లతో 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టింది. జార్జియా వెరెహమ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి తనవంతు పాత్ర పోషించింది. జార్జియాకు కూడా రెండు వికెట్లు దక్కాయి. మిగతా బౌలర్లలో సదర్లాండ్, గార్డ్‌నర్‌లు చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు. బంగ్లా టీమ్‌లో శోభన మోస్టరి అజేయంగా 66 పరుగులు చేసింది. ఓపెనర్ రాబ్యా హైదర్ (44) పరుగులతో తనవంతు పాత్ర పోషించింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లా ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేక పోయింది.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై కర్ణాటక కీలక నిర్ణయం

బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం గురువారం రోడ్లపై కవాతులు చేయడం, బహిరంగ ప్రదేశాలు,ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమనిబంధనలు తీసుకురావలని నిర్ణయించింది. ‘మేము ఏ సంస్థను నియంత్రించలేము. కానీ ఇకపై బహిరంగ ప్రదేశాలలో లేదా రోడ్లపై మీకిష్టమున్నట్లు చేయలేరు. మీరు ఏది చేయాలన్నా అది ప్రభుత్వం అనుమతితోనే చేయాల్సి ఉంటుంది’ అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విలేకరులతో అన్నారు.

రాష్ట్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, బయోటెక్నాలజీ మంత్రి అయిన ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు, దాని అనుబంధ సంస్థలపై నిషేధం కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల నుంచి ఆయనకు ఇటీవలే చావు బెదిరింపులు అందాయన్నది ఇక్కడ గమనార్హం.

బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడమో లేక నిషేధించడమో చేయాల్సింది ఇక ప్రభుత్వం చేతిలోనే ఉందని ప్రియాంక్ ఖర్గే అన్నారు. ‘అధికారులకు సమాచారం ఇచ్చేసి కర్రలు చేతపట్టుకుని మీరు రోడ్లపై కవాతులు చేస్తూ ‘పథ సంచలన’(మార్చ్) చేయలేరు. మేము ప్రవేశపెట్టే నియమాలకు లోబడే మీ కార్యక్రమాలుండాలి’ అని ఆయన తెలిపారు.

‘ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, అనుబంధ సంస్థలకు సంబంధించిన నియమాలను మేము తేవాలనుకుంటున్నాము. హోం శాఖ, న్యాయ శాఖ, విద్యా శాఖ జారీచేసిన మునుపటి ఆదేశాలను ఒకచోట చేర్చి కొత్త నియమాలను రూపొందిస్తాము. రాబోయే రెండు, మూడు రోజుల్లో చట్టం, రాజ్యాంగం చట్రంలో కొత్త నియమం అమలులోకి రాగలదు’ అని ప్రియాంక్ ఖర్గే క్యాబినెట్ సమావేశం తర్వాత అన్నారు.

బిజెపి అభ్యర్థి దీపక్‌రెడ్డికి బి ఫాం అందించిన రాంచంద్రరావు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు గురువారం బి ఫామ్ అందజేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో దీపక్‌రెడ్డికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాంచంద్రరావు మాట్లాడుతూ దీపక్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధిలో చేపట్టిన పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

అందుకే.. రష్యా నుంచి ఇండియా చమురు కొంటోంది: అలిపోవ్

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో రష్యా ముడిచమురు ధర చాలా చౌకగా ఉందని, తన దేశ ప్రయోజనాల దృష్టానే భారత్, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొంటోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ గురువారం ఇక్కడ అన్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఇండియా ఆపేయనుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న కొన్ని గంటలకే డెనిస్ అలిపోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారత్ మొత్తం హైడ్రోకార్బన్ దిగుమతుల్లో రష్యా ముడిచమురు వాటా దాదాపు మూడింట ఒక వంతు ఉందని అన్నారు. 

అక్రమాస్తుల కేసులో పంజాబ్ డిఐజి అరెస్టు

చండీగఢ్: అవినీతికి సంబంధించిన కేసులో పంజాబ్ పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డిఐజి) హర్చరన్ సింగ్ భుల్లార్‌ను గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్(సిబిఐ) అరెస్టు చేసింది. భుల్లార్‌ను మోహాలీలోని ఆయన కార్యాలయంలో అరెస్టు చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. 2007 ఐపిఎస్ బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన భుల్లార్ డిఐజి(రోపర్ రేంజ్)గా పనిచేస్తున్నారు.రోపర్ రేంజ్‌లో మొహాలీ, రూప్‌నగర్, ఫతేఘడ్ సాహిబ్ జిల్లాలు ఉన్నాయి. భుల్లార్ గతంలో డిఐజి(పాటియాలా రేంజ్)గా పనిచేశారు. ఆయన జాగ్రాన్, మొహాలీ, సంగ్రూర్‌లలో జాయింట్ డైరెక్టర్,విజిలెన్స్ బ్యూరో, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు.