elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel giriş

ఏది సనాతనం.. ఏది కాదు?

సనాతన ధర్మానికి అపచారం పేరుతో ఈ మధ్య దేశంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరిన ఘటన సంచలనం అయింది. అలాంటి ఘటన జరగడం ప్రపంచంలో ఇదే మొదటి సారికాదు. 2008 లో బాగ్దాద్ లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యు బుష్ పై ఇరాకీ జర్నలిస్ట్ షూ విసిరిన ఘటన పెను సంచలనమే అయింది. అయితే రెండు వేర్వేరు సందర్భాలు. ప్రజాస్వామ్యం పేరుతో వ్యూహాత్మక చమురు క్షేత్రాలపై పట్టుకోసం ప్రాచీన నాగరికత దేశాల దోపిడీపై జరిగిన నిరసన అది. శక్తివంతమైన పశ్చిమ దేశాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాయి. ఇరాక్ పాలకులు ఒకప్పుడు వారి అనుయాయులు ప్రస్తుతం టెర్రరిజం స్పాన్సర్ గా ముద్రపడ్డారు. ఏమైనా షూ విసిరిన ఘటన రెండు సందర్భాల్లోనూ సంచలనమే. భారతదేశంలో అణగారిన వర్గాలు పేద దళితులు, ఆదివాసీలకు, ముఖ్యంగా మహిళలకు చాలాకాలం వారు హద్దు మీరకుండా చూపిన ఆయుధం షూ (చెప్పులు). దశాబ్దాలపాటు వారిని అవమానించినా, వేధించినా ఎవరికీ పట్టలేదు.

ఆ ఘటనలు నమోదు కాలేదు. అది వారి ఖర్మ, దురదృష్టంగా వదిలేశారు. అధికార స్థానంలో ఉన్న వారిపై షూ విసిరితే దేశవ్యాప్తంగా గగ్గోలు చెలరేగింది. తాజా సందర్భంలో సనాతన ధర్మ రక్షణ కోసం అదీ దళితునిపై ఓ న్యాయవాది షూ విసరడం అన్నది అర్థం లేనిది. భారత దేశంలో చాలా గ్రామాలలో ఇప్పటికీ అగ్రకులాలకు చెందినవారు దళితులైన వంటవారు వండిన మధ్యాహ్న భోజనం ముట్టడం లేదు. దళితులకు మధ్యాహ్న భోజనం వంట పని అప్పగించినందుకు నిరసనలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఏ మతం ఈ వైఖరిని ఖండించలేదు. అలాగే సమర్థించలేదు. ఇటీవలి కాలంలో సనాతన ధర్మం కొత్త యుద్ధ నినాదంగా మారింది. సంప్రదాయం పేరుతో మహిళలను జీన్స్ ధరించరాదని ఆంక్షలు పెడుతున్నారు. పితృస్వామ్య వ్యవస్థ తాబేదారులుగా మారినవారు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, తమ స్వేచ్ఛకు తామే అడ్డుపడుతున్నారు. సనాతన ధర్మ సంసృ్కతి అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ, జీన్స్ ధరించిన పురుషులే ఈ చర్యలకు దిగుతున్నారు. సనాతన ధర్మ పురుషులు జీన్స్ ధరించవచ్చని బోధించిందా.. మహిళలు జీన్స్ ధరిస్తే భయం ఎందుకు? స్వాతంత్య్ర పోరాటం జరిగిన రోజులలో బ్రిటీష్ పాలకులనుంచి స్వరాజ్యం కోసమే కాదు. కుల, మత, జాతి, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. సంకుచిత భావాలు సమసిపోయాయి.

ఇప్పుడు ఆ విశాల భావాలు, ఆశయాలు చెదరిపోయాయి. ప్రస్తుతం సామాజిక న్యాయం పేరుతో పోరాటం సాగుతున్నా గౌరవం, గుర్తింపు, రాజకీయపరమైన గుర్తింపు, హక్కుల కోసమే సాగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది తన కులాన్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి తంటాలు పడుతున్నారు. వారి దృష్టిలో సామాజిక సమానత్వానికి విలువలేదు. వివక్ష చూపడం, ఆధిపత్యం తన హక్కుగా ప్రవర్తిస్తున్నారు. సామాజికంగా అణచివేతకు గురైనవారికి రాజ్యాంగాన్ని ఆశ్రయించడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. దీంతో అగ్రకులాలు సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని గగ్గోలు చేస్తున్నాయి. సనాతన ధర్మం అంటే ఏమిటి? వేదాలలో ధర్మపై ఖచ్చిత మైన, విస్తృతమైన నిర్వచనం ఏమీ లేదు. అయితే రుగ్వేదంలో (10/ 190/11) ధర్మంను సత్యంతో కూడినదిగా పేర్కొంది. బృహదారణ్యకోపనిషత్తు, ధర్మం అంటేనే సత్యం అని నిర్వచించింది. సత్యమే గొప్పది. సత్యం కన్నా మరేమీ లేదు. యోగ వాసిష్టం కూడా సత్యమే ధర్మంగా పేర్కొంటుంది. ధర్ అన్న వ్యుత్పత్తి నుంచి ధర్మ అన్న పదం పుట్టింది. ధర్ అంటే కలిగి ఉండునది, భరించునది, సత్య శోధకులు సత్యం అంటే ధర్మం కోసం చేసే కృషిగా పేర్కొన్నారు. అంటే ధర్మం ఎవరికీ వ్యతిరేకం కాదు. ధర్మం విషయంలో ఎవరూ గొప్పకాదు.

అది అనుసరించే అందరూ గౌరవింపబడతారు. ధర్మానికి పునాది అహింస. అహింస ద్వారానే సత్యం మనుగడ సాగిస్తుంది. భిన్న పద్ధతులలో జనం వ్యవహరించేందుకు అహింస తగిన స్థైర్యాన్ని ఇస్తుంది. అయితే, తమ మతం లేదా వ్యవహారంపై ఎవరైతే అహంకారంతో వ్యవహరిస్తారో అక్కడ సత్యం తన గొప్పతనాన్ని కోల్పోతుంది. అందుకే అహింస ధర్మానికి పునాది అయింది. విష్ణు పురాణంలో (సంపుటి 1, అధ్యయనం 7)లో అహింసను సత్యంతో విడదీయరానిదిగా పేర్కొంది. అహింస అంటే హింసకు వ్యతిరేకమైనది. ఈ నేపథ్యంలో ధర్మం పేరుతో షూ విసరడం అహింసను కాలరాయడమే. మొత్తం వివాదానికి సనాతన ధర్మం కేంద్ర బిందువైంది. నిజానికి సనాతనం అంటే ఏమిటన్నదే ప్రశ్న? అథర్వణ వేదం (10/8,/201) చక్కటి నిర్వచనం ఇచ్చింది. సనాతనం అనేది శాశ్వతమైన, కాలాతీతమైన, ప్రారంభం కానీ, ముగింపు కానీ లేదని సూచిస్తుంది. పగలు, రాత్రి అనేది లేదనిగా, మార్పు లేనిదిగా పేర్కొంటుంది. అంటే సనాతనం సంప్రదాయాలకు అతీతమైనది. అంటే అది షూ విసరడానికి కానీ, జీన్స్ ధరించకుండా నిరోధించడానికి కానీ, అనుమతించదు. సనాతన అంటే ఉపనిషత్తులలో పేర్కొన్న నలుగురు సనత్ బంధువుల వంటిది. అహంకారానికి కానీ, అజ్ఞానానికి కానీ తావులేనిది. కాలానుగుణంగా పునర్నిర్వచించుకోగలిగినది. సనాతనం స్ఫూర్తిదాయకమైనది. శాస్త్రీయ విజ్ఞానం, సత్యాన్వేషణలో ఎదురయ్యే సవాళ్లను ప్రశ్నించేది. అలాంటి సనాతన ధర్మం పేరుతో షూ విసరడం దారుణాతి దారుణం. సత్యానికి తావులేని నాడు ధర్మం లేదు. సనాతనం కూడా లేనట్లే. అటువంటి దారుణాలకు పాల్పడడం ధర్మం కాదు. 

మీనాక్షి నటరాజన్

(తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్)

నెల రోజుల్లోనే ఒటిటిలోకి పవర్‌స్టార్ ‘ఒజి’

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే నెల రోజులు గడవక ముందే ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి ‘ఒజి’ ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఒటిటి సంస్థ పోస్టర్‌ని విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఒక సినిమా విషయానికొస్తే.. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌ా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 

ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో 50 శాతం దాటినప్పుడు బిసి రిజర్వేషన్లకు అడ్డంకి ఎందుకు: మంద

హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల అంశం బలహీనవర్గాల డిమాండ్ అని మంద కృష్ణ మాదిగ తెలిపారు. బిసి రిజర్వేషన్లు తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశమని, తెలంగాణ సంపూర్ణ బంద్‌తో దేశానికి సంకేతం పంపినట్లుగా ఉందని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ల కోసం చేసిన ధర్నాలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రకులాల పేదల పేరుతో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేశారని, ఇడబ్లుఎస్ రిజర్వేషన్లలో భాగంగా పది శాతం అమలు చేస్తున్నారని, అగ్రకులాల పేదల జనాభాకు మించి రిజర్వేషన్ల అమలు జరుగుతోందని మండిపడ్డారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయాయని, 50 శాతం రిజర్వేషన్లు నిబంధన బిసి ప్రజలకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో 50 శాతం దాటినప్పుడు బిసి రిజర్వేషన్ల కోసం అడ్డంకి ఎందుకు అని అడిగారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్లకు రాని అడ్డుంకులు బిసి రిజర్వేషన్లకు ఎందుకు అని నిలదీశారు. రాష్ట్రానికి ఒకతీరుగా రిజర్వేషన్ల అంశం ఉండొద్దని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పండిందన్నారు. తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని మంద కృష్ణ ప్రశ్నించారు. 

బంద్‌తో ప్రధానికి కనువిప్పు కలగాలి: మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల విషయంలో ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వరకు వెళ్దామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిసి ఐకాస నిర్వహించిన ధర్నాలో మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసి సంఘాల బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తుందని అన్నారు. ఈ బంద్‌కు ఇతర పార్టీల మద్ధతును స్వాగతిస్తున్నామని తెలిపారు. బిసి రిజర్వేషన్లను తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్రం తలుచుకుంటే ఒక్కరోజులో చట్టరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. సంపూర్ణ బంద్ వల్ల ప్రధానికి కనువిప్పు కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బిసి రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

బిసి బిల్లు బిజెపి చేతిలో ఉంది: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బిసిల బిల్లుకు మద్దతు తెలపడంతో పాటు పాస్ చేసుకోవడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో తదుపరి చర్యలు తీసుకోపోవడంతో బిసి బిల్లు అమలులో జాప్యం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించామని, శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదని, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తున్నామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు, బిసి సంఘాలు ఐక్య సమితిగా బంద్ కి పిలునిచ్చినందుకు వారికి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. బిసి రిజర్వేషన్ల కోసం తెలంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగిందని పొన్నం వివరించారు. 

ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభావం ప్రభుత్వాలపై పడడంలేదని, ముఖ్యంగా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, బిజెపి ఎంపిలంత తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా బిజెపి నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో బిసి బిల్లు కోసం కాంగ్రెస్ బాధ్యత నిర్వహించిందని, కేంద్రంలో బిజెపిపై ఉందన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ న్యాయ స్థానంలో అయినా తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల బంద్ లో పాల్గొన్న ప్రజలకు పొన్నం అభినందనలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మన పోరాటం కొనసాగాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి జెఎసి పోరాటాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.  గత రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని పొన్నం మండిపడ్డారు. 

హైదర్ గూడలో యువతితో పోకిరి అసభ్య ప్రవర్తన

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పోకిరీ రెచ్చి పోయారు. హైదర్ గూడ బస్ స్టాప్ వద్ద ఓ యువతితో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు.  ఫోన్ నెంబర్ కావాలంటూ యువతిని పోకిరి అడ్డుకున్నాడు. యువతికి పోకిరి మధ్య పెనుగులాట జరగడంతో అరగంట పాటు ఆమెను అడ్డుకున్నారు. స్థానికులు, యువతి బంధువులు గమనించి పోకిరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో పోకిరి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అమీర్ పేట్ నుండి రాజేంద్రనగర్ వరకు యువతిని పోకిరి వెంబడించారు. యువతి హైదర్ గూడ వద్ద బస్ దిగగానే ఆమె వెంట పోకిరి పడ్డాడు. యువతి భయంతో వణికి పోయింది. గత నెల రోజులుగా తన వెంట పడుతున్నాడు అంటూ రాజేంద్రనగర్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిజాయితీ లేకపోవడంతో రిజర్వేషన్లు అమలు కావడంలేదు: ఈటెల

హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు అమలు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్నీ తెలిసి కూడా బిసిలను సిఎం రేవంత్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 42% రిజర్వేషన్ల కోసం జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి శ్రేణులతో కలిసి తెలంగాణ బంద్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. బిసిలు 52 శాతం ఉంటే 42 శాతమని కాకి లెక్కలు చెబుతున్నారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైన చర్చకు సిద్ధంగా ఉన్నామని, బిసిలు యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబాలకే అధికారం ఉంటుందని ఈటెల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా ఒక్క బిసి సిఎం కాలేకపోయారని, బిజెపి నిజాయితీ ఎవరూ శంకించలేదని, స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం ఒక్కటే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి కమిషన్ వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిసి పేరుతో కమిషన్లు వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కావడంలేదన్నారు. 

యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది: రషీద్ ఖాన్

కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో  పాటు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఆప్ఘానిస్థాన్ లోని ప్రావిన్స్‌లో పాకిస్తాన్‌ వైమానిక దాడి చేయడంతో ఎనిమిది మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఆప్ఘానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వైమానిక దాడిలో కన్నుమూసిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, పాకిస్థాన్ చేసిన దాడి అత్యంత హేయమైన, అనాగరిక చర్య అని మండిపడ్డారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండా జీవితం ముగిసిందని బాధను వ్యక్తం చేశారు. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పాకిస్థాన్‌తో తలపడబోయే ట్రై సిరీస్‌తో తాము పాల్గొనబోమని వెల్లడించారు. ఆట కంటే దేశ సమగ్రత ముఖ్యమని రషీద్ ఖాన్ చెప్పారు. 

ఆ రెండు పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయి: కవిత

హైదరాబాద్‌: పదేపదే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బిసిలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా మోసాలకి అడ్డుకట్ట వేయాలని సూచించారు. బిసిల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్మించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆటోలతో ర్యాలీగా బయల్దేరారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్ టిసి బస్సులు హైదరాబాద్‌లో డిపోలకే పరిమితమయ్యాయి. రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బండ్లగూడ, హయత్‌నగర్‌, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఎంజిబిఎస్‌ ముందు బిసి సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్‌ స్టేషన్‌లో బిసి సంఘాల బైఠాయించారు. జెబిఎస్‌ దగ్గర బంద్‌లో ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి నేతలు పాల్గొన్నారు. బిసి బంద్‌తో కాకతీయ విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. 

చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టిడిపి శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా తమ వాహనాలపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మరది వైసిపి ఎంపిపి వెంకట రామిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. వైసిపి నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టొద్దని టిడిపి కార్యకర్తలు కెఇ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్క రాజు, మ‌రి కొంతమంది రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మహిళా నాయకురాలు అని చూడకుండా దాడికి పాల్పడ్డార‌ని మాజీ ఎమ్మెల్యే ఆవేద‌న వ్యక్తం చేశారు. టిడిపి గుండాలు గ్రామంలో రెచ్చిపోతూ భయబ్రాంతులకు గురిచేశారని శ్రీదేవి దుయ్యబట్టారు. తమపై దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు బయటకు రావాలంటే ప్రాణభయంతో వణికిపోతున్నారన్నారు.