elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXM

పాక్‌తో ముక్కోణపు సిరీస్ రద్దు

అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారివైమానిక దాడులకు పాల్పడింది. అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్‌లో దాడులకు తెగబడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారని అఫ్ఘాన్ స్థాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి) పేర్కొంది. దీంతో నవంబర్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలబడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మృతి చెందిన క్రికెటర్లకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘పాక్ వైమానిక దాడిలో పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన క్రికెటర్లు మృతి చెందారని, దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు చనిపోగా.. అందులో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారని. ఫ్రెండ్లీమ్యాచ్ ఆడేందుకు పాక్టికా ప్రావిన్స్ రాజధాని శరణకు వెళ్లిన ముగ్గురు క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూర్ తిరిగి సొంత ప్రాంతానికి వస్తుండగా ఈ దాడిలో మృతి చెందారు’ అని తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ దాడికినిరసనగా వచ్చే నెలలో జరుగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించాం’ అని స్పష్టం చేసింది.

బుల్లెట్ కన్నా .. బ్యాలెట్ గొప్పది: వెంకయ్య నాయుడు

‘బుల్లెట్ కన్నా .. బ్యాలెట్ గొప్పది’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నక్సల్స్ తమ వాదనను బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఇటీవల నక్సల్స్ పెద్ద ఎత్తున లొంగిపోవడం శుభపరిణామమని ఆయన తెలిపారు.ప్రజ్ఞాభారతి అధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో బహుముఖ ప్రజ్ఞాశాలి త్రిపురనేని హనుమాన్ చౌదరికి పంచ నవతి జన్మదినం సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాన్ని వెంకయ్య నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకుని ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోవడం సంతోషకరమని అన్నారు. బుల్లెట్ కన్నా, బ్యాలెట్ శక్తివంతం అని ఆయన తెలిపారు.

కాబట్టి వారి వాదాన్ని బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసి వారి వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి మద్దతు కోరాలని ఆయన చెప్పారు. తుపాకి సంస్కృతితో సాధించేది ఏమీ లేదని ఆయన తెలిపారు. మావోయిస్టుల వ్యవహారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని ఆయన వివరించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, కుటుంబ వ్యవస్థ మన బలం అని ఆయన తెలిపారు. స్నేహ సంపద, కుటుంబ సభ్యులతో గడిపి సమయమే గొప్ప సంపద అని ఆయన చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుఓవడానికి యువతరం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, దానిని ఎవరికి ఆపడం సాధ్యం కాదన్నారు.

హనుమాన్ చౌదరికి జీవన సాఫల్య పురస్కారం అందజేయడం చాలా సంతోషంంగా ఉందన్నారు. హనుమాన్ చౌదరి భారత టెలికాం రంగానికి అందించిన సేవలు నిరుపమానమైనవని అన్నారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొలి చైర్మన్‌గా, టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు. అందరికీ ఆదర్శప్రాయులని ఆయన ప్రశంసించారు. మన పెద్దల స్పూర్తిని యువతరం అందిపుచ్చుకుని నవ భారత నిర్మాణంలో చోదక శక్తులు కావాలని ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.ప్రజ్ఞా పురస్కారాలు అందుకున్న నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్‌ను, కల్లోల భారతం పుస్తక రచయిత కోవెల సంతోష్ కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజ్ఞాభారతి సంస్థ తీసుకున్న చొరవలో ‘లోక్ మంథన్’ కార్యక్రమం మహోన్నతమైందని, తాను ఎంతో అభిమానించేదని ఆయన తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు అవగాహన కల్పించడంలో విజయవంతమైందని ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ నందకుమార్, ప్రజ్ఞా భారతి అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సాధనలో టీచర్లది కీలక పాత్ర: కల్వకుంట్ల కవిత

టీచర్లకు ఇవ్వాల్సిన పిఆర్‌సితో పాటు పెండింగ్ డి.ఎలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. టీచర్ల గురించి గొప్పగా మాట్లాడే సిఎం కనీసం వారికి సమయానికి జీతాలు కూడా చెల్లిచంటం లేదని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్(టిజెటిఎఫ్)ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ లోగోను శనివారం జాగృతి కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన 12 ఏళ్ల క్రితం నాటిదేనని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు సమయం వచ్చిందన్నారు.

జయశంకర్ సార్ నా ఫేవరేట్ టీచర్

తన ఫేవరేట్ టీచర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో ఆయన మనందరికీ టీచర్ మాదిరిగా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వం నిర్భంధం ఉన్న సరే తెలంగాణ మ్యాప్, ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించి భావజాల వ్యాప్తికి కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి టీచర్ల సమస్యలపై పోరాటం చేయటం మనందరి బాధ్యత అని కవిత అన్నారు. టిజెటిఎఫ్ టీచర్ల సమస్యలపై పోరాడుతుందన్నారు.

నా కొడుకు వయసు చిన్నది…ఇప్పుడే రాజకీయాలు లేవు

బిసి బంద్ కార్యక్రమంలో తన కుమారుడు పాల్గొనటంపై కవిత స్పందించారు. కేవలం సామాజిక బాధ్యత నేర్పే క్రమంలోనే తన కుమారుడిని బిసి బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. బిసిల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామంటే తాను పోరాటంలో పాల్గొంటానని అన్నారని తెలిపారు. మన ఇంటి నుంచే సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశంతోనే బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. తన కొడుకు వయసు చిన్నది అని, ఇప్పుడే రాజకీయాలు ఏమీ లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కోటరీపై కొండా సురేఖ వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని కవిత అన్నారు. నా కోటరీతోనే డీల్ చేయటమే నాకు కష్టమవుతుందని… సంబంధం లేని అంశంపై ఏమీ మాట్లాడలేనని అన్నారు. కార్యక్రమంలో టిజెటిఎఫ్ అధ్యక్షులు మోరం వీరభద్రరావు, అడ్‌హక్ కమిటీ సభ్యులు ఘనపురం దేవేందర్, జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతి రావు, ఎం. కవిత, సుజాత, ఉపాధ్యాయులు ఈరవేణి రాజ్ కుమార్, విష్ణువర్ధన్, దుర్గములత, ఎస్ ఆర్ సతీష్ కుమార్, కే గంగరాజు, కోటగిరి గంగా ప్రసాద్, కంచరి రవికుమార్, చిట్యాల సుజాత, నాగమల్ల ఉమాదేవి, జీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

క్రెడిట్‌కార్డులకు ఇక కాలం చెల్లు

వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే ఇప్పుడున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉనికిలో ఉండకపోవచ్చునని సౌత్ ఆసియా మాస్టర్‌ కార్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) గౌతమ్ అగర్వాల్ తెలిపారు. ఓ మోస్తరు ఆదాయ వర్గాలు, ఉద్యోగస్తులు, ప్రత్యేకించి యువ ఐటి ఉద్యోగులు విరివిగా ఈ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ అత్యధికంగా డిజిటల్ రూపంలో ఉంటుంది. కార్డుల రూపంలో చెల్లింపుల దశ ఉండదేమో, మన ఆలోచనలకు అనుగుణంగా తక్షణ చెల్లింపుల క్రమంలో ఇకపై ఇప్పటి క్రెడిట్ కార్డుల చెల్లింపుల దశ మారుతుందని న్యూఢిల్లీలో జరుగుతోన్న ఎన్‌డిటీవీ సమ్మిట్ 2025లో ఆర్థిక లావాదేవీల విషయాల విశ్లేషణ దశలో అగర్వాల్ చెప్పారు. భారతదేశంలో ఆర్థిక వ్యవహారాలు, ప్రత్యేకించి చెల్లింపుల ప్రక్రియలో అత్యంత వేగవంతంగా మార్పులు ఉంటున్నాయి.

ఇంతకు ముందు రూపాయల్లో చెల్లింపులు ఉండేవి. వీటి స్థానంలో క్రమేపీ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదంతా కూడా మానసిక చైతన్యస్రవంతికి సంబంధించిన వ్యవహారం కానుంది. ఈ క్రమంలో చెల్లింపుల విషయంలో మార్పులు అనూహ్యం అన్నారు. మొత్తం మీద భారత్ ప్రపంచంలోనే అత్యధిక అధునాతన చెల్లింపుల వ్యవస్థగా నిలిచింది. ఇందులో సందేహం లేదు. విస్తరిస్తున్న డిజిటల్ ప్రక్రియ, ఇందులో ఇమిడి ఉంటోన్న అత్యంత తేలికైన లావాదేవీల వ్యవహారాలతో జనం ప్రత్యేకించి భవిష్య తీరుతెన్నుల వైపు మొగ్గుచూపే వారు క్రెడిట్ కార్డులు , లేదా డెబిట్ కార్డుల దారిని వీడుతారని అగర్వాల్ విశ్లేషించారు. పైగా క్రెడిట్ కార్డుల చెల్లింపుల క్రమంలో తలెత్తే తాత్కాలిక ప్రయోజనంతో పోలిస్తే ఆ తరువాత తలెత్తే ఆర్థికపరమైన చిక్కులు, పొందిన దాని కంటే ఎక్కువ చెల్లింపుల స్థాయిలో భారం వంటి అనుభవాలతో జనం పాత బాట వీడి వేరే రూపంలో చెల్లింపులకు దిగే వీలుందని విశ్లేషించారు. 

సాగర్‌లో ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్‌ను సందర్శించారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్లే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నేరుగా స్థానిక లాంచీ స్టేషన్‌కు బయలుదేరి నాగార్జునకొండను సందర్శించి అక్కడ పురావస్తు శాఖ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడి బుదుడి విశేషాలు తెలుసుకున్నారు. సాయంత్రం తెలంగాణ పర్యాటక శాఖ విజయ విహార్ గెస్ట్ హౌస్‌లో బస చేసి ఆదివారం ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనాన్ని సందర్శించి ఆదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ బయలుదేరనున్నారు. కాగా, ఎపి గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

యువకుడి ప్రాణం తీసిన ఫైనాన్స్ వేధింపులు

 ఫైనాన్స్ వేధింపులు ఒక యువకుడి నిండు ప్రాణాలు బలిగొన్నాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట అర్బన్ మండలం, ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, 3 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి అవసర నిమిత్తం సిద్దిపేటకు చెందిన చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో ఏడు లక్షల 12 వేల రూపాయల రుణంగా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా ఇఎంఐలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో రెండు ఇఎంఐలు పెండింగ్ కావడంతో గత 5 రోజుల నుండి ఫైనాన్స్ నిర్వాహకులు అతనికి ఫోన్ చేయడం, ఇంటికి వస్తుండడం, ఎక్కడైనా పనికి వెళ్తే అక్కడికి వెళ్లి వేధించేవారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు..కొంత ఇబ్బంది ఉంది.. డబ్బులు రాగానే చెల్లిస్తాం.. అని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల 16వ తేదీసాయంత్రం ఫైనాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లుపల్లి గ్రామానికి వచ్చి ఇంటి వద్ద కూర్చొని ‘డబ్బులు ఇస్తేనే వెళ్తాం.. లేదంటే నువ్వు చచ్చినా వెళ్లం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఐరేని మల్లేశం ఇంటి నుండి వెళ్లిపోయి తమ వ్యవసాయ బావి శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో మిస్టర్ టి అనే పేరుతో టీ స్టాల్ పెట్టి కొంత ఆర్థికంగా ఇబ్బంది కావడంతో ఫైనాన్స్ కట్టడం ఆలస్యమైందని, ఎంత చెబుతున్నా వినకుండా ఫైనాన్స్ వారు అనేక రకాలుగా మానసికంగా హింస పెట్టడం వలన మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి దుర్గయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫైనాన్స్ కంపెనీపై కూడా సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. ఫైనాన్స్ వేధింపులకు మరికొందరు బలికాకుండా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

మహారాష్ట్రలోని నందూర్భార్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. చాంద్సైలి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బాధితులంతా దడ్గావ్ తాలూకా లోని అస్లి వద్ద అష్టంబ (అశ్వత్థామ ) రుషి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఏటా దీపావళి సందర్భంగా ఈ తీర్థయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీపం లోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు నందూర్బార్ తాలూకా లోని ఘోటానే నివాసితులుగా సమాచారం. 

గరీబ్థ్ రైలులో మంటలు.

 పంజాబ్ లోని అమృత్‌సర్ నగరం నుంచి శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో బయలుదేరిన అమృత్‌సర్‌సహర్సా గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శిర్హింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జి19 ఎసీ బోగీలో మొదట పొగలు రావడాన్ని జీఆర్‌పి అధికారి ఒకరు గుర్తించారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు బోగీ లోని చెయిన్ లాగి రైలును ఆపేశారు. ఆ తరువాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ఈలోగా మంటల్లో చిక్కుకుని బోగీ మొత్తం తగలబడి పోయింది. సమీపం లోని మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించి అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయమైందని రైల్వేబోర్డు ప్రకటించింది. కాలిన గాయాలైన మహిళను (32) ఫతేగఢ్ సాహిబ్ లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు శిర్హింద్ జీఆర్‌బీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్‌లాల్ తెలిపారు. 

కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపుల్లేవు: అక్కినేని అమల

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున ఇంట ఇటీవల కాలంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో హీరోయిన్ శోభిత దూళిపాళను చైతన్య వివాహం చేసుకోగా… ఈ ఏడాదే ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైనబ్ రివ్జీను అఖిల్ పెళ్లాడారు. దీంతో కొత్త కోడళ్ల రాకతో అక్కినేని వారి ఇల్లు కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో కోడళ్లతో తన అనుబంధం గురించి నాగార్జున సతీమణి అమల మాట్లాడుతూ తమ ఇంటికి కోడళ్లు శోభిత, జైనబ్ రావడంతో తనకు గర్ల్ సర్కిల్ ఏర్పడిందని అన్నారు. వాళ్లు ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తారని, వాళ్ల వల్లే జీవితం సరికొత్తగా మారిందని చెప్పారు. కోడళ్లతో ఉన్నప్పుడు భలే సరదాగా ఉంటుందని, ఇక వాళ్ల వ్యక్తిగత విషయాల్లో తాను తలదూర్చనని తెలిపారు. అలాగే ఇంట్లో వాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపులేమీ తనకు లేవని అమల చెప్పారు. వాళ్లు తమ తమ రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉండడం వల్ల తనకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కోరుకోనని తెలిపారు.