Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

హైకోర్టు తీర్పు తర్వాతే.. స్థానికంపై నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్‌లకు సంబంధించి వచ్చేనెల 03వ తేదీన హైకోర్టులో కేసు ఉ న్నందున ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా 07వ తేదీన మరోసారి కేబినెట్ భేటీలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై ని ర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను సైతం ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సిఎం రేవంత్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పంచాయతీ రా జ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ ఆ మోదించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, సిఎం రేవంత్ ఇప్పటికే సం తకం చేశారు. దానికి గురువారం కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు.

గవర్నర్ సం తకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. కేబినెట్ భేటీ అ నంతరం మంత్రులతో సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. రాజకీయ అంశాల గురించి వారితో ఆయన చర్చించారు. స్థా ని క సంస్థల ఎన్నికలతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులు వ్యవహారించాల్సిన తీరు గురించి సిఎం రేవంత్‌రెడ్డి వారికి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది.

1994 తర్వాత మూడో సంతానం కలిగితే

1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఎపి నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కెసిఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన గురించి పట్టించుకోలేదు.

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే, ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. తాజాగా, గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి ఆమోదం తెలిపింది.

ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయం: మంత్రి పొంగులేటి

ఈ సందర్భంగా కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

శ్రీశైలం నుంచి నల్గొండకు టన్నెల్…

నల్గొండలోని ఫ్లోరైడ్ బాధితులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అందులో భాగంగా శ్రీశైలం నుంచి నల్గొండ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించామన్నారు. నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు 44 కి.మీల టన్నెల్‌ను నిర్మించాలని గతంలో ఆమోదించామని, అందులో భాగంగానే శ్రీశైలం నుంచి నల్గొండకు తలపెట్టిన టన్నెల్‌ను పూర్తి చేయాలని ఈ కేబినెట్‌లో నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రపంచంలోనే పొడవైన ఈ ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను పునరుద్ధరించాలని, మిగిలిన సొరంగం పనులను ఆధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

ఈ గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించవచ్చని మంత్రివర్గం నిర్ణయించింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడాలని, 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

రామగుండం ప్లాంట్‌ను డిస్‌మెంటల్ చేయాలని….

1,500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజీ ప్లాంట్‌కు ఆమోదం తెలిపినట్టు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్‌ను (ఆర్‌టిఎస్‌బి 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగియడంతో దానిని డిస్‌మెంటల్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని మంత్రివర్గం సూచించింది.

4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలి

4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఆస్పత్రుల్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీనగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలు ఉండగా అక్కడ జరిగే పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది

రౌడీ షీటర్‌కు కాంగ్రెస్ టికెట్

రౌడీ షీటర్‌ను చిత్తుగా ఓడించండి

ఈ ఎన్నిక హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ కోసం గట్టిగా కృషి చేయాలి

ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలి

అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..

చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలి

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్ రావు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ నేతలతో కెసిఆర్ సన్నాహక సమావేశం

ఈ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ గుల్ల అయిందని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో గురువారం సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది. పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ మార్గనిర్దేశం చేశారు.

ఇంటింటికీ తిరిగి వివరించాలి

జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని తెలిపారు.

బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని సూచించారు. ఓటు అడగడానికి తమ ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించి ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించి వారిని ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దామని, తన ఆలోచనలను అమలు చేసినందుకు ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కెసిఆర్ అభినందించారు.

అటువంటి అత్యున్నత స్థాయి విద్యను హాస్టల్ సౌకర్యాలను అందించిన గురుకులాల్లో పిల్లలు మరణించడం దారుణం, శోచనీయమని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతిని ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కష్టకాలంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల హృదయాలను గెలవాలి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో అసహ్యం ఏహ్య భావం నిండి ఉందని, మోసపోయామనే కోపంలో ప్రజలు ఉన్నారని కెసిఆర్ అన్నారు. సక్కదనంగ నడిసే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నామనే బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో స్పష్టతతో ఉన్నదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ చేసిన మోసం పట్ల రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలుపును ఇప్పడికే ప్రజలు ఖాయం చేశారని చెప్పారు.

భారీ మెజారిటీ సాధించడం కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పని చేయాలని, అందుకు డివిషన్ల వారీ క్లస్టర్ల వారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి హృదయాలను గెలవాలని వివరించారు. అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే తీరుగా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలని అన్నారు.

రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు

జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు. జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో 5లక్షల మందికి ఉపాధి

 2030 నాటికి సాధించడమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్

లక్షకోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే టార్గెట్

త్వరలో అందుబాటులోకి సమగ్ర లైఫ్‌సైన్స్ పాలసీ

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్‌లో ఇండియా నుంచి హైదరాబాద్‌కు మాత్రమే చోటు

 ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం

 ‘ఆస్ బయోటెక్ 2025’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ ’ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

250 బిలియన్ డాలర్లకు చేర్చేలా

భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2024 -2025లో తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా జాతీయ సగటు కేవలం 7.6 శాతం మాత్రమే ఉందన్నారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ ని అందుబాటులోకి తెస్తామన్నారు.

భారత్ నుంచి హైదరాబాద్ మాత్రమే

ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు దక్కిందన్నారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన మన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, వరల్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే ‘బయో-డిజిటల్’ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు.

మా నినాదం ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’

మా నినాదం మేడిన్ ఇండియా కాదు..ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ‘ఎకో సిస్టం’ తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్- అండ్ -ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ , దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్‌టెక్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్, హెల్త్‌టెక్, ఏపీఐ బల్క్ డ్రగ్ ఉత్పత్తి, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్‌లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్స్ , గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్,అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ‘విక్టోరియా -తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’ కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూధన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

లిక్కర్ దందాకు కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం

మన తెలంగాణ/హైదరాబాద్ : లిక్కర్ దందా, అవినీతి, దోపిడీలకు కల్వకుంట్ల కుటుంబం పేటెంట్ అని, రాజకీయ పబ్బం గడిపేందుకు కెటిఆర్ ఆరాటపడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ విఆర్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పం దించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నా యకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై పరువు నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. కెటిఆర్ రాజకీయ రంగు పులుముతూ పబ్బం గడుపుతున్నారని, కెటిఆర్ మతిస్థిమితి ఉండే మాట్లాడుతున్నార అని ఆయన ప్ర శ్నించారు. నా చరిత్ర కెటిఆర్‌కు తెలియదా అని ఆయన పేర్కొన్నారు. ఓడిపోయి పదవి ఇస్తానన్న వద్దన్నానని సొంత ఖర్చులతో పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడినా వ్యక్తినని ఆయన గుర్తు చేశారు. శవాల మీద పే లాలు ఏరుకున్న చందంగా అమరుల త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చారని ఆయన బిఆర్‌ఎస్‌పై ధ్వజమొత్తారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నిక లబ్ధికోసం బిఆర్‌ఎస్ నాయకులు బట్టకాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. ఎన్నిక ఏదైనా బిఆర్‌ఎస్‌కు పుట్టగతి ఉండదని, మసిపూసి మారేడుకాయ చేసే బిఆర్‌ఎస్ నైజాన్ని ప్రజలు పసిగట్టారని మంత్రి జూపల్లి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష రూపాయలకు కారు అమ్ముకునే స్థాయి నుంచి నేడు వేల కోట్లకు పడగలెత్తిన బిఆర్‌ఎస్ నాయకులు తనను, సిఎం రేవంత్‌ను వేలు ఎత్తి చూపే స్థాయికి ఎదిగారా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. సొంత చెల్లి లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే ఢిల్లీలో బిజెపి పార్టీ వద్ద మోకరిల్లి మీరు చేసిన పని ప్రజలకు తెలియదా అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

అధికారిగా విధులు నిర్వర్తించడంలో రిజ్వీ విఫలం

సంపాదన కోసం తాను ఏనాడు ఆశ పడలేదని, ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడటం మంత్రిగా తన బాధ్యత అని జూపల్లి తెలిపారు. అధికారిగా విధులు నిర్వర్తించడంలో రిజ్వీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రిజ్వీ విఆర్‌ఎస్‌ను ఆమోదించ వద్దని తాను సిఎస్‌కు లేఖ రాసిన విషయం నిజమేనని మంత్రి జూపల్లి ఒప్పుకున్నారు.

హోలోగ్రాం టెండర్‌లను పిలవడంలో రిజ్వీ అలసత్వం

ఆబ్కారీ శాఖలో హోలోగ్రాంకు సంబంధించి 2014లో ఒక కంపెనీకి అనుమతి ఇచ్చిందని మంత్రి జూపల్లి తెలిపారు. 2014 నుంచి 2019 వరకు అదే అగ్రిమెంట్‌ను పొడిగించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైతం ఇదే విధంగా కొనసాగుతుండంటలో ఆ కంపెనీని మార్చాలని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశానని మంత్రి జూపల్లి తెలిపారు. ఇలా అగ్రిమెంట్ పొడిగించడంతో ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు నష్టం వస్తుందని, దీంతో పలుమార్లు హోలోగ్రాంకు సంబంధించి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి జూపల్లి తెలిపారు. దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హోలోగ్రాం, నకిలీ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందని, దీంతో వాటిని పరిష్కరించాలని రిజ్వీని ఆదేశించానని మంత్రి జూపల్లి తెలిపారు. అయినా రిజ్వీ ఈ విషయంలో స్పందించలేదని, విధుల్లో నిర్లక్షం వహించారని మంత్రి జూపల్లి ఆరోపించారు.

రిజ్వీ ఆలస్యంతో ప్రభుత్వానికి రూ.230 కోట్ల నష్టం

దీంతో పాటుగా డిస్టిలరీ పాలసీలపై సంబంధిత మంత్రికి అధికారం ఉంటుందని, డిస్టిలరీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ సమకూరుతుందని సదరు ఫ్యాక్టరీలకు సంబంధించిన ఫైల్ వెంటనే పెట్టాలని రిజ్వీని ఆదేశిస్తే దానిపై ఆయన కొన్నినెలల పాటు ఆలస్యం చేశారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆ ఫైల్‌ను కేబినెట్‌కు పంపారని, మీరు కూడా పంపాలని రిజ్వీ తనకు సూచించారని, అయితే గత ప్రభుత్వ కేబినెట్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు తాను అడిగానని వాటికి సంబంధించిన సమాచారాన్ని రిజ్వీ ఇవ్వకపోగా ప్రభుత్వాన్ని, తనను తప్పుదారి పట్టించారని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు బార్ లీజు లైసెన్స్‌ల పొడిగింపు ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ.230 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. అధికారులు విధులు నిర్వర్తించకుండా అడ్డుపడితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రికి ఉంటుందని ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సిఎస్‌కు లేఖ రాశానని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు కోరితే కొత్త పార్టీ

 ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

ఈనెల 25న నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ ప్రారంభం

ప్రజల అభిప్రాయం తెలుసుకుంటా..

యాదాద్రి ప్రాశస్తాన్ని కాపాడేలా ప్రభుత్వం ప్రయత్నించాలి 

శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న కవిత

మన తెలంగాణ/యాదగిరిగుట్ట: ఒక రాజకీయ పార్టీ పెడితే తన కోసం కాదని..ప్రజలకు మేలు జరగాలని, ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని ఎంఎల్‌సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఈనెల 25 నుం చి దాదాపు నాలుగు నెలల పాటు ‘జనం బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగాకొత్త రాజకీయ పార్టీపై ప్రజల అభిప్రాయం తె లుకుంటానని అన్నారు.

మొన్న తిరుపతి, ఈరోజు యాదగిరిగుట్టకు వచ్చామని, ‘జనం బాట’కు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు కావాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ‘జనం బాట’ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. ‘జనం బాట’లో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటానని అన్నారు. ఈనెల 25న తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచే జనం బా ట కార్యక్రమం ప్రారంభమవుతుందని, 33 జిల్లాల్లో 4 నెలల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి జిల్లాలో రెండు రోజు ల పాటు ఉండి అక్కడి మేధావులు, విద్యావంతు లు, రైతులు, యువత, మహిళలను కలుసుకొని స మస్యలు తెలుసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలు కోరుకుంటే త ప్పకుండా పార్టీ పెడతానన్నారు. పార్టీలు ఉండడం కాదని, వాటితో ప్రజలకు మేలు జరగాలని అ న్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకే ‘జనం బాట’ కార్యక్రమం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ యాదాద్రిని మహాద్భుతంగా పునర్నిర్మించారని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా యాదాద్రి ప్రాశస్తాన్ని కాపాడే విధంగా ప్రయ త్నం చేయాలని హితవు పలికారు. యాదగిరిగుట్ట వస్తుంటే దారిపొడవునా విచిత్రమైన హోర్డింగ్‌లు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించి ఆలయానికి సంబంధించిన హోర్డింగ్‌లు మాత్రమే పెట్టాలని సూచించారు. మళ్లీ యాదగిరిగుట్టను సందర్శిస్తానని, అప్పుడు ఇప్పటి సమస్యలపై వివరంగా మాట్లాడుతానని అన్నారు.

167 ఓపెన్ ప్లాట్‌లకు ఈ వేలం

 ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విక్రయం

 రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడ, తొర్రూర్, మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి ప్రాంతాల్లోని రాజీవ్ స్వ గృహ కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 167 ఓపెన్ ప్లాట్‌లకు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ -వేలం నిర్వహించనున్నారు. తొర్రూర్‌లో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్‌గూడలో 200 నుంచి -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, బహదూర్‌పల్లిలోని 200 నుంచి 1,000 చదరపు గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ -వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగ వేలం నిర్వహించగా ప్రస్తుతం ఈ–వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. కుర్మల్ గూడ, బహదూర్ పల్లిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ అక్టోబరు 27వ తేదీ కాగా, అక్టోబరు 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నాం సమయాల్లో ఈ-వేలం నిర్వహించనున్నారు. 

నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ రెడీ

 30 విభాగాలతో రోగులకు సేవలు

కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో వైద్యం

రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్ :సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్)లో నెల రో జుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. గురువారం వైద్య ఆ రోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, హై దరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, అదన పు కలెక్టర్ జి . ముకుంద రెడ్డి, రహదారులు , భ వనాల శాఖ చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వర్ రెడ్డి,లింగారెడ్డి, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ మేనేజర్లు జి ఏ కే స్వామి నాయుడు, వి.శ్రీనివాసరావులతో కలిసి సనత్ నగర్ టిమ్స్ తో పాటు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ ప్రాంతాన్ని, టిమ్స్‌లో నిర్మాణం పూర్తయిన భవనాలు, వైద్య పరికరాల అమరికలను పరిశీలించారు.

టిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులను నిర్మిస్తున్న ఎంఈఐ ఎల్ ప్రా జెక్ట్ విభాగం అధ్యక్షుడు కే గోవర్ధన్ రెడ్డి నిర్మా ణం వివరాలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ సనత్ నగ ర్ టిమ్స్ ప్రారంభానికి 15 రోజుల్లో సిద్ధం అవుతుందన్నారు. ప్రారంభ తేదీని త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. నెల రోజుల్లో ఇక్కడి నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభం అవుతాయని స్ప ష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ఇ క్కడ సేవలు అందించటంతో పాటు నిర్వహణ కూ డా ఉంటుందని చెప్పారు. టిమ్స్ నిర్మాణానికి ఎ లాంటి నిధుల కొరత లేదని, ప్రభుత్వం నెల వా రీ నిధులు విడుదల చేస్తుందని వెల్లడించారు. తెలంగాణాలో నిర్మిస్తున్న టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య, వైద్యేతర సిబ్బంది నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంటోందని వివరించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. 

ప్రైవేట్ స్కూల్‌లో ప్రాణాలు హరీ

 హన్మకొండ నయీంనగర్ స్కూల్‌లో వరుస మరణాలు

గురువారం ‘బ్రెయిన్‌డెడ్’తో నాల్గో తరగతి విద్యార్థి మృతి

బాలుడి మరణంపై తల్లిదండ్రుల అనుమానాలు

న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ఆందోళన

 గత నెలలోనే హార్ట్‌ ఎటాక్‌తో ఓ విద్యార్థి మృతి

మనతెలంగాణ/హన్మకొండ: హనుమకొండ నయీంనగర్‌లో గల తేజస్వి ప్రైవేట్ స్కూల్‌లో ఒ క విద్యార్థి గురువారం అనుమానాస్పద రీతిలో మ రణించాడు. ఈ పాఠశాలలో విద్యార్థుల వరుస మ రణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నెల రోజుల కిందట ఒక విద్యార్థి ఆడుకుంటూ కింద పడి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడం తో భారీ ఎత్తున బంధువుల వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను మరువక ముందే ఇదే పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న బానోతు సు జిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే కింద ప డ్డాడు. స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారిని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది.

అయితే, ఆ విద్యార్థిని పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడని నిర్ధారించారు. ఈ విషయం తెలిసి బాధిత వి ద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జురుగకుండా పోలీసు లు స్కూల్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆసియాన్ సదస్సుకు వర్చువల్‌గా హాజరు

న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. బదులుగా వర్చువల్‌గా పాల్గొంటారని అధికారికంగా ప్రకటించారు. మోడీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ఫోన్‌లో ఆత్మీయ సంభాషణ అనంతరం , మోడీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్‌షిప్ అభించినందుకు అభినందించారు.

ఆసియాన్ కూటమిలో భారత్‌తోపాటు అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, తదితర దేశాలు చర్చల్లో పాల్గొననున్నా యి . మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ , వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. షెడ్యూల్ సమస్యల వల్లనే మోడీ ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ మోడీ భేటీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్లయింది.

రిజ్వీ ప్రకంపనలు

 సిఎం, డిప్యూటీ సిఎంతో మంత్రి జూపల్లి భేటీ

రిజ్వీ వ్యవహారశైలిపై ఫిర్యాదులు 

సిఎంను కలిసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ

రాజకీయ వేడి సృష్టించిన వివాదం

రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శలు 

సిఎం అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో రిజ్వీ బలి అయ్యారని ఆరోపణ

రాష్ట్రంలో రేవంతుద్దీన్ సర్కార్: బిజెపి రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. గురువారం ప్రజా భవన్‌లో భట్టిని కలిసిన జూపల్లి రిజ్వీపై తాను రాసిన లేఖ, తాజా పరిణామాల గురించి వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమ పరిధి దాటి వ్యవహారించారని మంత్రిగా తన ఆదేశాలను ఎక్సైజ్ కమిషనర్ కూడా పట్టించుకోలేదని భట్టికి వివరించినట్లుగా సమాచారం. సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌అలీ ముర్తజా రిజ్వీ వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

వ్య క్తిగత కారణాలు చూపుతూ రిజ్వీ విఆర్‌ఎస్ తీసుకోగా, రిజ్వీ అవినీతిపరుడైన అధికారి అని ఆయనపై విచారణ చేపట్టాలని సిఎస్‌కు జూపల్లి రా సిన లేఖ బహిర్గతం కావడంతో ప్రతిపక్షాలు ఈ సంఘటనను అస్త్రంగా మలుచుకోవడంతో ప్రభు త్వం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడింది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎం రేవంత్‌ను కూడా కలిసి తన శాఖలో జరిగిన పరిణామాల గురించి ఆయనకు వివరించినట్టుగా తె లిసింది. అయితే, సిఎస్‌కు రాసిన లేఖ, దానిలో అంశాల గురించి మంత్రి జూపల్లి పేర్కొన్నట్టుగా సమాచారం. ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు తన ఆదేశాలను తరువాయి 8లో