elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmoveteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabet

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

ఒటిటిలోకి ధనుష్ లేటెస్ట్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా హౌస్‌ఫుల్ బోర్డులు పెడతారు. ఇటీవలే ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి తండ్రి వారసత్వంగా ఇడ్లీ దుకాణం నడిపే వ్యక్తిగా ధనుష్ ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో సినిమాను వీలైనంత త్వరగా సినిమాను ఒటిటిలోకి తీసుకువస్తున్నారు. అక్టోబర్ 29వ తేదీన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఒటిటి సంస్థ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. నిత్యమేనన్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించగా.. రాజ్‌కిరణ్, సత్య రాజ్ కీలక పాత్రలు పోషించారు.

మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలి: జగన్

అమరావతి: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రయాణికుల సజీవదహనం అత్యంత విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ ట్వీట్ చేశారు. 

శ్రీను వైట్ల కొత్త సినిమా.. ఈసారైనా హిట్ కొడతారా.?

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీను వైట్ల. కానీ, గత కొంతకాలంగా ఆయన హిట్‌లకు దూరమయ్యారు. ఎంతో నమ్మకంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇఫ్పుడు శ్రీను వైట్ల మరో మంచి స్క్రీప్ట్‌తో రెడీగా ఉన్నారని సమాచారం. తనదైన శైలీలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆయన ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.

ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతో ఇష్టమైన శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని.. ఇప్పటికే శ్రీను వైట్ల.. శర్వాకి కథ చెప్పగా.. ఆ కథ ఒకె అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భోగట్టా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని టాక్. ప్రస్తుతం ‘భోగి’, ‘బైకర్’ సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన హీరోగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘నారి నారి నడుమ మురారి’ సినిమా సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది.

బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ : పొన్నం

హైదరాబాద్: బస్సుల్లో భద్రతాచర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తెలంగాణ, ఎపి, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామని, బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య అనారోగ్య పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని పూర్తి వివరాలు వచ్చాక ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 

లద్దాఖ్ ఉద్యమంపై నిఘా ఎందుకు?

లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రజా పోరాటాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఉద్యమ నేతలను జాతీయ భద్రత నెపంతో అక్రమంగా కేసులు బనాయించి నిర్బంధించడం తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. ఈ ఆందోళనలు సెప్టెంబర్ 24న హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. ఈ హింసాకాండకు పర్యావరణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ సూత్రధారి అన్న ఆరోపణలతో అరెస్టు చేసి రాజస్థాన్ లోని జోథ్‌పూర్ జైలులో నిర్బంధించారు. అంతేకాదు ఆయన భార్య గీతాంజలి ఆంగ్‌మోపై కూడా తీవ్ర నిఘా కొనసాగిస్తుండడం కేంద్ర ప్రభుత్వ దమననీతికి తార్కాణం. ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా, ఎక్కడికీ వెళ్లనీయకుండా దర్యాప్తు సంస్థలు నీడలా వెంటాడుతున్నాయి.

జోథ్‌పూర్ జైలులో ఉన్న తన భర్త వాంగ్‌చుక్‌ను కలుసుకోవడానికి ఆమె వెళ్లినప్పుడల్లా లేనిపోని ఇబ్బందులను సృష్టించడం పరిపాటిగా సాగుతోంది. అక్టోబర్ 7, 11 తేదీల్లో జోథ్‌పూర్ వెళ్లినప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు, రాజస్థాన్ పోలీసులు ఏ విధంగా నిబంధనల చట్రంలో ఇరికించారో, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలా ఆటంకం కలిగించారో అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకు విన్నవించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విమానాశ్రయం నుంచి తాను బయటకు రాగానే దర్యాప్తు అధికారులు నేరుగా తనను తమ కారులో జైలు సూపరింటెండెంట్ ఆఫీసుకు తీసుకెళ్లారని, ఆ కారు కిటికీలకు తెల్లటి తెరలు కప్పి ఉంచారని ఆరోపించారు. తన భర్తతో మాట్లాడుతున్నంత సేపు ఇద్దరు ఆఫీసర్లు అక్కడే కూర్చుని అంతా ఆలకిస్తుంటారని ఇలా ప్రతిసారీ జరుగుతోందని ఆమె ఆరోపించారు.

తాను భర్తతో ఏం మాట్లాడుతున్నానో ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించవలసిన తమ హక్కుకు విరుద్ధంగా వారు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు. ఈ చర్యలన్నీ ఆర్టికల్ 19 (స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ హక్కు), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు) లను ఉల్లంఘించడమే అవుతుందని ఆమె సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశారు. జోథ్‌పూర్‌లో తాను ఎవరినీ కలియనీయకుండా నేరుగా రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చి, రైలెక్కించడం దగ్గరనుంచి వచ్చే స్టేషన్ వరకు ఎస్కార్ట్ ఉంటోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో తన బస నుంచి ఎక్కడకు వెళ్లినా కారు వెంబడిస్తుందని, దాంతోపాటు మోటారు సైకిల్‌తో మరొకరు అనుసరిస్తుంటారని ఈ విధంగా నిఘా వెంటాడడం ఎంతవరకు న్యాయం? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఓ భారతీయ స్వేచ్ఛా పౌరురాలిగా నాకు నచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు జోథ్‌పూర్‌కు వెళ్లే హక్కు నాకుంది.

రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నా భర్తను కలుసుకునే హక్కుంది. తాను ఉగ్రవాదినా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే గీతాంజలి ఆంగ్‌మో ఆరోపణలన్నిటినీ యథాప్రకారం నిరాధారమైనవిగా లదాఖ్ కేంద్ర ప్రాంత హోమ్ డిపార్ట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతున్నాయి. పర్యావరణ ఉద్యమనేత సోనమ్ వాంగుచుక్‌ను అరెస్టు చేయడం సరిహద్దులో అత్యంత సున్నితమైన రీజియన్ లద్దాఖ్‌లో పరిస్థితి మరింత క్షీణించడానికి దారి తీస్తోంది. రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌ను అనుసంధానించి లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రభుత్వ హోదా కల్పించాలన్న డిమాండ్లతో లద్దాఖ్ లోని పౌర సంఘాలు సాగిస్తున్న ఆందోళనలకు వాంగ్‌చుక్ ప్రధాన కారకుడని కేంద్రం వాదిస్తోంది. వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడానికి కేంద్రం ఉపక్రమించడం ఏమంత తెలివైన పని కాదని, వాస్తవాలకు విరుద్ధం గా ఉంటోందని తెలుస్తోంది. లేహ్ లోని స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్)పై దర్యాప్తులు సాగిస్తున్నారు.

ఆ స్కూల్‌కు వాంగ్‌చుక్ సహ సంస్థాపకులు అయినప్పటికీ, ఆ సంస్థ యాజమాన్యంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్రం ఆ సంస్థకు సంబంధించిన ఎఫ్‌సిఆర్‌ఎ (ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టం) లైసెన్సును రద్దు చేసింది. పూర్వపు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చిన వారిలో వాంగ్‌చుక్ ఒకరు. దీనివల్ల లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా వస్తుందని, రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌ను చేర్చడం వల్ల లద్దాఖ్ సహజ సంస్కృతి, వారసత్వాలకు రక్షణ కలుగుతుందని వాంగ్‌చుక్ ఆశించారు. కనీసం ఆరో షెడ్యూల్‌నైనా కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం బహిరంగంగా హామీ ఇచ్చింది.

కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను విభజించిన తరువాత జరిగిన పరిణామాలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక పద్ధతులను అవలంబించడానికి దారి తీశాయి. స్థానిక జనాభాను దూరం చేస్తున్నారన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో కేంద్రం తాత్కాలిక ఒప్పందానికి వచ్చి గత మే 27న ఆయా గ్రూపులతో చర్చలు ప్రారంభించినా అస్పష్టమైన కారణాలు బయటపడ్డాయి.కేంద్రంపై అసమ్మతి వర్గాల అపనమ్మకం స్పష్టమైంది. వాంగుచుక్ జోథ్‌పూర్ జైలులో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చర్చలు కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాఖ్ ప్రతినిధులైన లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) పాల్గొన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ సహా అరెస్టు అయిన ముఖ్యమైన నాయకులను వెంటనే విడుదల చేయాలని లద్దాఖ్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ చర్చలు ఇంకా ఎటూ తేలలేదు. మరోసారి చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

గాజా వలె కాదు ఉక్రెయిన్

గాజా యుద్ధం “ముగిసిపోయిం”దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారో లేదో, ఇక ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ముగింప జేయగలరని భావించారు పలువురు. ఆ మేరకు పాశ్చాత్య మీడియాలో కొన్ని వ్యాఖ్యానాలు కూడా వెలువడ్డాయి. ఒక యుద్ధం ఆగినపుడు ఆ వాతావరణంలో ఇటువంటి ఆలోచనలు కలగటం సహజం. పైగా, ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎప్పుడు ఏ దేశాధినేత చేయని విధంగా బహిరంగంగా, తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్న రోజులవి. చివరకు తనకు ఆ బహుమతి రాకపోవటం ఒకటి కాగా, అసలు గాజా యుద్ధం నిజంగా ఆగినట్లేనా అనే సందేహాలు ఏర్పడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. గాజా అన్నది కేవలం గాజా ప్రాంతానికి పరిమితమైన ప్రశ్న కాదు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌ను కూడా కలుపుకొన్న విస్తృతమైన పాలస్తీనా విషయమది.

ఇజ్రాయెల్ హమాస్ మధ్య తీవ్రమైన సాయుధ ఘర్షణలు గాజాలో జరిగినందున చర్చ అంతా గాజా గురించి జరిగింది. అమెరికా అధ్యక్షుని 20 అంశాల ప్రాతిపదికగా జరిగింది కాల్పుల విరమణే తప్ప యుద్ధ విరమణ కాదు. అయినప్పటికీ పాశ్చాత్య మీడియా ఆ విధంగా ప్రచారం చేసింది. అదట్లుంచి, ఆ 20 అంశాల ప్రణాళిక అయినా సమస్యకు చిరకాల పరిష్కారం చూపగలది కాదు. ఆ అంశాలను ఒక్కొక్కటిగా, జాగ్రత్తగా పరిశీలించినపుడు, వాటిలో చిక్కులమారివి అనేకం కనిపిస్తాయి. ప్రస్తుత కాల్పుల విరమణ అన్నది తాత్కాలికమైన తొలి దశ కాగా, దాని అమలు అయినా ఎంత సజావుగా జరగవచ్చుననే సందేహాలు వెంటనే తలెత్తాయి. అందుకు తగినట్లే ఇజ్రాయెల్ తమ బందీలను విడుదల చేయించుకున్నదో లేదో గాజాపై ఏదో ఒక సాకు చెప్తూ తిరిగి దాడులు ఆరంభించింది. సహాయ సరఫరాలకు ఆటంకాలు కల్పించటం మొదలు పెట్టింది. తాము, ఇజ్రాయెల్ కలిసి హమాస్‌ను నాశనం చేయగలమంటూ బెదిరింపులు జారీ చేయటం ఆరంభించారు ట్రంప్.

పరిస్థితి మామూలు అంశాలలోనే, కొద్ది వారాలలోనే ఈ విధంగా పరిణమిస్తున్నపుడు, 20 అంశాల ప్రణాళికలో గల కీలక అంశాల అమలు దశకు వెళ్లినపుడు ఏమి జరగవచ్చుననే భయాలు కలుగుతున్నాయి. ఆ కీలక అంశాలలో బయటి వారితో తాత్కాలిక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, తాత్కాలిక శాంతి భద్రతల వ్యవస్థ ఏర్పాటు, గాజా అభివృద్ధికి బయటివారే ప్రణాళిక రచనచేసి అమలు పరచటం వంటివి ఉన్నాయి. ఇక సమస్య అంతటికీ మౌలిక అంశమైన స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు సంబంధించి గల మాటలను గమనిస్తే, అసలు ఆ ఉద్దేశమైనా ఉందా లేదా అనిపిస్తుంది. పాలస్తీనా ఏర్పాటుకు ఎంత మాత్రం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే నేటికీ ప్రకటిస్తుండటం, ఆ విషయమై ట్రంప్ మౌనాన్ని గమనించినపుడు ఎవరికీ అసలా నమ్మకమే ఏర్పడటం లేదు. ఇదంతా చూసినపుడు, అమెరికా ఇజ్రాయెల్‌ల ఉమ్మడి ప్రణాళిక గాజాను, వెస్ట్ బ్యాంక్‌ను క్రమంగా స్వాధీనపరచుకుని, నెతన్యాహూ అంటున్నట్లు గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయటమనే అభిప్రాయం కలుగుతుంది. అందువల్ల, గాజాలో జరిగింది యుద్ధ విరమణ కాదు గదా కనీసం కాల్పుల విరమణ అని కూడా నిజమైన అర్థంలో అనలేము. ఇక రాగల రోజులలో ఏమి జరగవచ్చునన్నది వేచి చూడవలసిందే.

ఇదంతా అట్లుంచితే, అమెరికా శిబిరపు దృక్కోణం నుంచి చూసినపుడు గాజా, ఉక్రెయిన్ పరిస్థితుల మధ్య పోలికలు, తేడాలు రెండూ కనిపిస్తాయి. ఆ శిబిరపు సామ్రాజ్యవాద ప్రయోజనాల దృష్టా వ్యూహాత్మక అంశాలు రెండు చోట్లా ఉన్నాయి. పాలస్తీనా అన్నది పశ్చిమాసియాలో మధ్యధరా సముద్ర తీరాన ఉంది. భౌగోళిక వ్యూహాల రీత్యా అది కీలక ప్రదేశం. అదిగాక ఆ ప్రాంతమంతటా అపారమైన ఇంధన నిక్షేపాలున్నాయి. యూరప్‌ను ఆఫ్రికా, ఆసియాలలో అనుసంధానం చేసే సూయెజ్ కాల్వ ఉంది. కనుకనే బ్రిటిష్ వలస రాజ్యం అక్కడ తమ పాగా వేసేందుకు ఇజ్రాయెల్‌ను సృష్టించింది. అమెరికా సామ్రాజ్యవాదం, యూరప్‌లు అందుకు జత చేరాయి. అప్పటి నుంచి పాలస్తీనాను ప్రత్యక్షంగా, ఆ ప్రాంతంలోని అనేక అరబ్ రాజ్యాలను పరోక్షంగా తమ చెప్పుచేతలలో ఉంచుకుంటూ వస్తున్నాయి. అక్కడి వారికి కొరకరాని కొయ్యగా మిగిలింది ఇరాన్ ఒక్కటే. దానితోపాటు వివిధ తిరుగుబాటుదార్ల సంస్థలు.

ఈ నేపథ్యాన్నంతా చూసినపుడు అమెరికన్ శిబిరానికి గాజాగాని, వెస్ట్ బ్యాంక్ గాని వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనవో గ్రహించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో హమాస్ రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై జరిపిన ఆకస్మిక దాడి యావత్ అమెరికన్ శిబిరాన్ని, దానికి అనుబంధంగా మారిన అరబ్ రాజ్యాలను పెద్ద కుదుపు కుదిపింది. ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్ కాలంలో ఉండిన పాన్ అరబిజం ఆయన మరణం తర్వాత సమసిపోగా, ఆ తర్వాత నుంచి అమెరికాను అనుకూలంగా మారిన అరబ్ రాజ్యాలు తద్వారా ఇజ్రాయెల్‌తో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకోసాగాయి. కొందరు ఆ పని చేసి, మరికొందరు కూడా చేయనుండగా చోట చేసుకున్న హమాస్ దాడితో వారు వెనుకడుగు వేయవలసి వచ్చింది.

గాజాపై ఇజ్రాయెల్ మారణకాండ ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ సంస్థలలో, ప్రపంచ దేశాలలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనగా, ఆ స్థితి నుంచి బయటపడటం అమెరికా శిబిరానికి అవరసమైంది. దానితో, పాలస్తీనా దేశం ఏర్పాటు ఉద్దేశమైతే ఇప్పటికీ లేదు గాని, ఏదో ఒక విధంగా ప్రస్తుత క్లిష్ట స్థితిని తప్పించుకోజూసారు. ఆ విధంగా, 20 అంశాల ప్రణాళిక పేరిట మభ్యపెట్టే పథకం ఒకటి తయారు చేసారు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, గాజా ఒక చిన్న ప్రాంతం, హమాస్ ఒక పరిమిత శక్తి, అరబ్ రాజ్యాలకు చిత్తశుద్ధి లేకపోవటం అనే వాటిని అనువుగా చేసుకుని అమెరికా తన జిత్తులమారి వ్యూహాన్ని అమలుకు తేగలిగింది. ఆ విధంగా మొత్తం పశ్చిమాసియాలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను నిలబెట్టుకోగలుగుతున్నది. ఆ పని తేలికగానూ జరుగుతున్నది.

కాని ఉక్రెయిన్ పరిస్థితి అటువంటిది ఎంత మాత్రం కాదు. పాశ్చాత్య ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ కీలక స్థానం తక్కువ అనలేము. ఇంకా చెప్పాలంటే పశ్చిమాసియా కన్న ఎక్కువ. ఎందుకంటే అక్కడికి పొరుగున తమ పోటీదారులు, బద్ధశత్రువులు, దీర్ఘకాలిక సవాలుగా నిలిచేవి అయిన రష్యా, చైనాలున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా ప్రపంచాధిపత్యానికే సవాలు అన్నదగ్గవి లేవు. కాని ఉక్రెయిన్‌కు తూర్పున రష్యా, చైనాలు ఉన్నాయి. అందువల్ల ఆ సవాలు అతి తీవ్రమైనది. ఉక్రెయిన్ సమస్య గాజా వంటిది కాదనటం అందువల్లనే.

గాజాకు, వెస్ట్ బ్యాంక్‌కు భిన్నంగా రష్యా, చైనాలు అతి విశాలమైనవి. మహా శక్తివంతమైనవి. ఆ రెండింటి నాయకత్వాలు పటిష్టమైనవి. రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ బలం ఎందుకూ కొరగాదు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌ల ఆయుధ, ఆర్థిక సహాయాలు ఉండి కూడా నిలవలేకపోతున్నది. భూభాగాలను క్రమంగా కోల్పోతుండగా సైన్యాన్ని నష్టపడుతున్నది. అమెరికా, యూరప్‌తోడు నిలవకపోతే ఎన్నడో ఓడిపోయేది. రష్యాపై అమెరికా, యూరప్‌లు వందలాది ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించినా ఫలితం ఉండటం లేదు.

ఇతరత్రా ఏ హెచ్చరికలూ పనిచేయటం లేదు. ఉక్రెయిన్‌ను మరింత ఆధునికమైన ఆయుధాలు ఇవ్వగలమని పాశ్చాత్య దేశాలు ప్రకటించినపుడల్లా రష్యా సరికొత్త ఆయుధాలను రంగంలోకి తెచ్చి ప్రయోగిస్తున్నది. అణ్వస్త్రాలను ఉపయోగించే ఉద్దేశమైతే లేదు గాని, అవసరమైతే ఆ పని చేయగలమని పలుమార్లు హెచ్చరించింది. అందుకు అనుగుణంగా తమ అణ్వస్త్ర ప్రయోగ విధానాన్ని ఇప్పటికే సవరించింది కూడా. గత విధానం ప్రకారం, ఒకవేళ శత్రువు దాడి తన ‘ఉనికికే’ ముప్పు కలిగించినట్లయితే ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు ఉపయోగిస్తారు. సవరించిన విధానం ప్రకారం ఒకవేళ తమ ‘సార్వభౌమత్వానికి, భౌగోళిక సమగ్రతకు.. తీవ్రమైన ప్రమాదం’ కలిగితే ఉపయోగిస్తారు. బైడెన్ అధ్యక్షునిగా ఉన్నపుడు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేసే ప్రతిపాదన చేయగా పుతిన్ తమ విధానాన్ని ఆ విధంగా మార్చారు. దానితో బైడెన్ క్షిపణులు ఆగిపోయాయి. అదే విధంగా ట్రంప్ గత వారం సరఫరా చేయగలమన్న తొమాహాక్ క్షిపణులు.

ఇటువంటివి అనేకం పరిగణనలోకి తీసుకున్నందువల్లనే, ఉక్రెయిన్ సమస్య గాజా వంటిది కాదని అనవలసి వస్తున్నది. అమెరికా శిబిరం ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంత భయపెట్ట జూసినా, ఉక్రెయిన్‌కు సహాయపడుతూ యుద్ధాన్ని ఎంతకాలం కొనసాగించినా, హమాస్ వలె రష్యాను ఏదో ఒక ఉపాయంతో లొంగదీయటం అసంభవం. ఇది గత మూడేళ్ల యుద్ధకాలంలో ఉక్రెయిన్, అమెరికా, యూరప్‌లకు బాగా బోధపడిన విషయమే, అందువల్ల ఆ శిబిరం వాస్తవాలను అంగీకరిస్తూ రష్యాతో రాజీపడటం మినహా గత్యంతరం లేదు. విచిత్రమేమంటే ఈ మాట ట్రంప్‌కు సరిగానే అర్థమైంది. భేషజాలకు పోతున్నది ఉక్రెయిన్, వారి యూరోపియన్ మిత్రులే.  

– టంకశాల అశోక్ (దూరదృష్టి) 

– రచయిత సీనియర్ సంపాదకులు

దళపతులుగా దళితులు ఎదగాలి

దేశంలో జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, అణగారినవర్గాలను అణగాదొక్కే ప్రయత్నాలు, అమాయక బహుజనులపై రాక్షసతత్వం నాటి కన్నా నేడే ఎక్కువగా కనబడుతున్నది. డా. అంబేద్కర్ కాలంలో అంటరానితనం, కులవివక్ష లాంటి మానసిక దాడులుండేవి. నేటి స్వాత్రంత్య్ర భారతంలో వాటితోపాటు భౌతిక దాడులనూ చూస్తున్నాం. దేశంలో ప్రతి రోజు సాధారణ దళిత ప్రజలపై ఎక్కడోచోట ఏదో ఘటన నమోదవుతున్నది. ఇప్పుడు ముఖ్యవ్యక్తులపై దాడులతో ఆధిపత్య కులాల అధిపత్యాన్నిచాటే సంఘటనలు చూడాల్సిన దౌర్భాగ్యం నెలకొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటుదాడి, ఐపిఎస్ పురాన్ కుమార్ కులవివక్ష ఘటనలు ఇలా అనేక ఘటనలు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి. దళితుల ప్రాణాలకు రక్షణ లేదు, దళిత బాలికల, మహిళలపై లైంగిక హింసలు, వారి మానవ విలువలకు లెక్కే లేకుండా పోతుంది.

అందుకే దళితశక్తి దళపతి రూపం దాల్చాలి. బాబా సాహెబ్ మార్గంలో నడిచే విద్యావంతులు, మేధావులు నాయకులుగా తయారవ్వాలి. మానవులను జంతువులుగా చూసే క్రూరమృగాలను రూపుమాపి, మానవత్వమే అసలైన మతం అని చాటి చెప్పి శాంతి మార్గంలో నడిపించే దళపతులుగా ఎదగాలి. ఆనాడు దళితుల హక్కులకై, అసమానతలపై, కులవివక్షకు వ్యతిరేకంగా సుదీర్గ కాలం పాటు పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ నేడు లేరు. నేడు కుల వివక్ష దారుణాలు విచ్చలవిడిగా పెరిగిపోయిన దారుణాలు చూస్తుం టే నాయకత్వ పటిగల అభినవ అంబేద్కరులు ప్రతిచోట పుట్టాలని దళిత వర్గం ఎదురు చూస్తున్నది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలిలో ఒక దళిత యువకుడిని మూకుమ్మడిగా కొట్టి చంపిన వీడియో వైరల్ అవడంతో ఆ రాష్ట్రం మొత్తం అట్టుడుకిపోయింది.

ఇలా చెప్పుకుంటూపొతే దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దళితులు వేరే కులం వారితో పెళ్లి చేసుకున్న సంఘటనల్లో అబ్బాయి, అమ్మాయి అనే తేడా చూడకుండా బట్టలూడదీసి, గుండు గీయించి దాడిచేసే అఘాయిత్యాలను, కొన్ని వికృత చేష్టలను చూస్తే ఒళ్ళు జుగుప్సాకరంగా మారుతుంది. 2022లో మధ్యప్రదేశ్ లో దళిత దంపతులను కొడుకుతో సహా కాల్చి చంపారు. 2025 ఆగస్టులో తమిళనాడులో దళిత పాఠశాల విద్యార్ధిపై మరో వర్గ ముగ్గురు విద్యార్థులు కలిసి కేవలం కుల కారణంగా కత్తులతో దాడి చేయడం దిగ్భ్రాంతికర విషయం. నిన్నగాక మొన్న అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 16 ఏళ్ల దళిత బాలిక అయిదుగురి చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురికావడం ఆమె కుటుంబంలో రక్తం మరిగేలా చేసిందేమో కానీ సమాజంలో కొందరికి చీమకుట్టినంత బాధకూడా కలగక పోవచ్చు! మరో సంఘటనలో మధ్యప్రదేశ్‌లో (2025 మార్చి నెల) ఓ దళిత వరుడు పెళ్ళికి గుర్రంపై వెళ్లినందుకు రాళ్ళతో కొట్టి చంపారు.

మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి వేడుకలలో శబ్దం పెంచి డిజె పాటలు పెట్టారని ఒకేసారి 40 మంది దాడి చేసి రాళ్ళతో కర్రెలతో దాడులు చేసి పెళ్ళి జరగకుండా ఊర్లోకి రానివ్వలేదు. ఇలా చెప్పుకుంటూపోతే వందల వేల ఉదాహరణలు దేశంలో ప్రతి రాష్ట్రం లో చోటు చేసుకుంటున్నాయి. దళితులపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన దేశంమొత్తంలో నమోదైన అట్రాసిటీ కేసులు చూసినట్లయితే 2020లో 50 వేలు, 2021లో 50,744, 2022లో 57428 నమోదైనట్లు అధికారిక నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అధికంగా, తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. మరీ వీటిని ఆపేదెవారు? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత రక్షణ కల్పించినప్పటికీ రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు! దళితులతోపాటు మైనారిటీలపైనా దాడులు జరుగుతున్నాయి. వీటిని ఆపేదెవరు, పరిష్కారం ఎక్కడ? దేశం శాంతి మార్గంలో నడిచేదెప్పుడు, కుల మతాల మంటలు ఆరేదెప్పుడు.? ముందుకు వచ్చే నాయకులెవ్వరు? దళితుల కోసం, పీడిత వర్గాల కోసం పోరాటం చేయడానికి ‘చేగువేరా’ జార్జిరెడ్డి లాంటి నాయకులు మళ్ళీ ఎప్పుడు పుడుతారో అని ఎదురు చూస్తుందీ సమాజం.!

– సయ్యద్ జబి, 9949303079

విషాదాలతో వెలవెలబోయిన దీపావళి

అక్టోబర్ 20న సాయంత్రం భారతదేశం అంతటా దీపావళి వెలుగులు విరజిమ్ముతుండగా, ఆనందాల పండుగ మరో సారి పొగ కమ్ముకుంది. చాలా కాలంగా వేడుగలకు ప్రతీకగా నిలుస్తున్న టపాకాయలు, బాణాసంచా, ఆరోగ్యం, పర్యావరణం, ఎన్నికల అవకాశవాదంపై జాతీయ చర్చలలో కేంద్రాలుగా మారాయి. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎఒఐ) ప్రతిదినం ప్రమాదకర స్థాయిని దాటి హెచ్చుతోంది. సుప్రీం కోర్టు నిర్ణీత గంటల్లో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్లను అమ్మకాలను అనుమతించడం వల్ల నిబంధనలు అమలు క్లిష్టంగా మారింది. అసోంలో సంబరాలు లేవు. రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. గాయకుడు జుబీన్ గార్గ్ మృతికి ప్రజలు సామూహిక సంతాపం ప్రకటించడంతో ఈ ఏడాది దీపావళికి బాణాసంచా కాల్చరాదని ప్రతినబూనారు. ఈ పండుగ కేవలం టపాసులు కాల్చడానికే పరిమితం కాలేదు. మతపరమైన సానుకూలతకోసం ఉపయోగించుకునే రాజకీయాలు, దీర్ఘకాలిక మనుగడ కంటే స్వల్పకాలిక ఆర్థిక లాభాలకు కక్కుర్తిపడే వారి అంతరాలను బహిర్గతం చేసే యుద్ధభూమిగా మారింది.

ఢిల్లీలో విషపూరిత దీపావళి, బిజెపి పాలనకు సవాల్ ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం ఏటా భయంకరమైన ఓ బెడద. శీతాకాలం దగ్గరపడేకొద్దీ కమ్మేసే పొగమంచు, పొరుగు రాష్ట్రాల నుంచి కాల్చే చెత్త, వ్యవసాయ వ్యర్థాలవల్ల వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, వీటికితోడు బాణాసంచాల ద్వారా పెరిగే విషపూరిత మిశ్రమాలు వేలాదిమంది ఉసురును తీస్తోంది. ప్రతి ఏడాది దీపావళి సీజన్‌లో శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆస్పత్రుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుప్రీంకోర్టు అక్టోబర్ 2025లో ఇచ్చిన ఆదేశం ప్రకారం దీపావళి నాడు సాయంత్రం 6-9 గంటల మధ్య కొన్ని ప్రదేశాల్లో రాత్రి -10 గంటల వరకూ పర్యావరణ అనుకూల (కాలుష్యం తగ్గించే) గ్రీన్ క్రాకర్లను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది.

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) వెలుపల పూర్తిగా విషేధాన్ని విధిస్తుంది. ఇది బాణాసంచాపై పూర్తి నిషేధం కాదు. జాగ్రత్తలతో కూడిన ఆదేశం. అమ్మకాలు అధికార అవుట్‌లెట్‌లకే పరిమితం చేశారు. బాణాసంచా కాల్చుకునే సమయాన్ని పరిమితం చేశారు. అమలు బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులపై ఉంటుంది. దీనికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మద్దతు ఇస్తుంది. అయినా, 2025 ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన బిజెపి నేతృత్వంలోని పాలనా యంత్రాంగంపై పెద్ద బాధ్యతే ఉంది. 1998 తర్వాత ఢిల్లీలో బిజెపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ హామీతో ముందుకు వచ్చింది. కానీ, కాలుష్య నియంత్రణ చర్యలపై ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. జాతీయ ట్రాక్ రికార్డు తరచు ప్రజారోగ్యం కంటే, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధానమే ఇప్పుడు సమస్య అయింది. గ్రీన్‌క్రాకర్స్‌కు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసర్చ్ (సిఎస్‌ఐఆర్) సర్టిఫికేషన్ లేకపోవడం వ్యవస్థాగత వైఫల్యాన్ని వెల్లడిస్తోంది. ప్రతి బ్యాచ్‌ను ప్రమాణీకరించడానికి ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు అవసరం.

కానీ, చాందీనీ చౌక్, సదర్ బజార్ అంతటా నకిలీవస్తువులను అమ్మకందార్లు విక్రయిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ సవాల్ కేవలం లాజిస్టికల్ మాత్రమే కాదు. రాజకీయమైనది. కేంద్రం, రాష్ట్రస్థాయి లో బిజెపి పర్యావరణ విధానాలను దారుణంగా మారుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. హస్టియో అరండ్ వంటి జీవవైవిధ్యంగల కీలక ప్రాంతాలలో బొగ్గుగనుల తవ్వకాలకు అనుమతిలు ఇవ్వడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వరకు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దశాబ్దికాలంగా వాతావరణం కన్నా, పారిశ్రామిక లాబీలకే ప్రాధాన్యత ఇస్తోంది.హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉన్నా పంటలను తగులబెట్టడాన్ని అరికట్టడంలో వైఫల్యం, బిజెపి పాలిత ఢిల్లీకి సంకటంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేకతగా చిత్రీకరించిన బిజెపి, ఇప్పుడు ఇరకాటంలోపడింది.

పార్టీ ఈ మధ్య చేస్తున్న ప్రచారాలు, దాని పర్యవేక్షణలో వెలవెలబోతున్నాయి. దీపావళికి సంబంధించి దాని నినాదాలకు, దాని చర్యలకు మధ్య వైవిధ్యం తేటతెల్లమవుతోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు మధ్య మెరుగైన పాలన అందించాల్సిన బాధ్యత బిజెపిపైనే ఉంది. ఈ దీపావళి రోజున, ఆనంద్ విహార్, ద్వారక వంటి కీలక ప్రాంతాల్లో అర్ధరాత్రికి వాయు నాణ్యత స్థాయి 400 ప్లస్‌కు దిగజారిందని అంచనా. నిజమైన పరీక్ష ఇప్పుడే ఎదురయింది. రాజధానిలో గస్తీకి తగినంతమంది పోలీసులను నియమించారా. సిపిసిబి రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ కాలుష్యనియమాలు ఉల్లంఘించేవారిని సమర్థంగా గుర్తించాయా. నిర్దిష్ట సమయంలోనే బాణాసంచా కాల్చాలన్న ప్రచారం, కాలుష్యం వల్ల అనర్థాలను తెలుపుతూ, స్కూళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, లేజర్ షోల వంటివి చాలా కీలకం. అయినా, పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల తగులపెట్టడం వల్ల అంతర్రాష్ట్ర కాలుష్య నియంత్రణకు కేంద్రం గట్టిచర్యలు తీసుకోని పక్షంలో కేంద్రం వైఫల్యం తీవ్ర పరిణామాకు దారితీస్తుంది.

అసోం రాజకీయ ప్రతిఘటనల మధ్య జుబీన్ గార్గ్ సంతాపం ఢిల్లీ రాజధానిలో ఊపిరి సలపని పరిస్థితి ఉంటే, ఈశాన్య రాష్ట్రాల బలహీన పర్యావరణ వ్యవస్థలు దీపావళి వేడుకలను భిన్నంగా కోరుకుంటున్నాయి. బ్రహ్మపుత్ర వరద మైదానాలు, తూర్పు హిమాలయాలతో కూడిన అసోం ముప్పులోఉన్న జీవవైవిధ్యానికి ప్రతీక. అసోంలో గాలి నాణ్యత ఢిల్లీ కన్నా చాలా మెరుగ్గా, శుభ్రంగా ఉన్నా, బయోమాస్ ధ్వంసం, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దును వచ్చే పొగమంచుకు ఇబ్బందుల పాలవుతున్నది. ఈ ప్రాంతంలో సమాజాలు దీపావళిని బిహు సంప్రదాయంలో కలుపుతూ బాణాసంచా కంటే నూనె దీపాలు మట్టి దీపాలతోనే పండుగ జరుపుకునేందుకు ఇష్టపడతాయి. పర్యావరణ పరిరక్షణలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రయోజనంకోసం హిందూ పండుగలను ఉపయోగించుకోవడం దారుణం. దీపావళి, చీకటిపై వెలుగుకు ప్రతీకగా నిలవడంతో పార్టీ సాం సృ్కతిక జాతీయవాదంలో ఓ ఆసరాగా మారింది. ఢిల్లీలో ఆప్ అధికారంలోఉన్నప్పుడు చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేక చర్యగా బిజెపి ప్రచారం చేసింది.

అసోంలో బిశ్వశర్మ టపాకాయల అమ్మకందారుల పై చూపుతున్న ప్రేమ కాలుష్యాన్ని పెంచి పోషించే పారిశ్రామికవేత్తలతో ఆయన అనుబంధాన్ని చూపుతున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా సాగుతున్న వ్యూహం. బిజెపి అధికారంలో ఉన్న దశాబ్దకాలంలో పారిశ్రామిక ఉద్గారాల అనుమతులు 30% పెరిగాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డేటా చెబుతోంది. బిజెపికి పౌరుల ఆరోగ్యంపట్ల, పర్యావరణ సమతుల్యతపట్ల శ్రద్ధ లేదని, గిరిజనులు వ్యతిరేకిస్తున్నా,ఒడిశాలో నియమగిరి కొండలలో బాక్సైట్ గనుల తవ్వకాలకు ఈ మధ్య అనుమతి ఇవ్వడం ద్వారా రుజువైంది. మతపరమైన దోపిడీ లోతుగా సాగుతోంది. నిషేధాలను హిందూ విశ్వాసాలపై దాడిగా చిత్రీకరించడం ద్వారా బిజెపి, ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలలో ఓట్లను సంపాదించడానికి పడుతున్న ఆందోళనను చూపుతోంది.

భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. హిందువులే కాదు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా పంచుకునే దీపావళి సార్వత్రిక ఆనందాన్ని విషపూరితం చేయకూడదు ప్రజా సంతాపాన్ని కించపరచకూడదు. ఈ దీపావళి పరివర్తనపరమైన మార్పునుకోరుతోంది. అందరి సహకారం వల్లనే ఢిల్లీలో పర్యావరణపరమైనవిజయం ఆధారపడిఉంది. బాణాసంచా రియల్ టైమ్ పేలుళ్లను గుర్తించేందుకు ఆప్ 11 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యవేక్షించే డ్రోన్‌లను మోహరించాలని కోరుతోంది. కానీ కేంద్రం పంటల వ్యర్థాల ధ్వంసం అరికట్టేందుకు ఉపగ్రహ ట్రాకింగ్, రైతులకు సబ్సిడీలతో రాజధాని వ్యాప్తంగా గడ్డినిషేధాలను అమలు చేస్తున్నది. పౌరులసహకారం అన్నిటికన్నా అవసరం. ఉల్లంఘనలను గుర్తించేందుకు మొబైల్ యాప్‌లు, కాలుష్యనియంత్రణపై అవగాహన కల్పించేందుకు పాఠశాల డ్రైవ్‌లు, లేజర్‌షోలు వంటి పర్యావరణ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం అవసరం. 

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

ఉన్నట్ట మరి లేనట్ట..

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ‘ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్‌ను రిలీజ్ చేశారు హీరో శ్రీకాంత్. ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్ ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. ఎస్‌పి చరణ్, శృతిక సముద్రాల గాత్రాలు మైమరపించాయి. ఈ సాంగ్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి లేనట్ట సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఆర్పీ పట్నాయక్ ఎంతో బాగా కంపోజ్ చేశారు. త్రినాధ్, సాహితీ జోడి చాలా బావుంది. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీవిష్ణుకు జోడీగా..

హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో క్రేజీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు. జి నిర్మిస్తుండగా హేమ, షాలిని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించనున్నారని మేకర్స్ ప్రకటించారు. ఆమెకు బర్త్ డే విషెష్ అందిస్తూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగనుంది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు.