elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Sweet Bonanza

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

madridbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

matbet

kingroyal

madridbet

kingroyal

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

చిరుకు ఊరట

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉ ల్లంఘనలు, పరువు నష్టం చర్యలు జరిగితే, సం బంధిత పౌర, ఫౌజ్‌దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్‌లో పేర్కొ న్న పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి, సంస్థ అయి నా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర గుర్తించిన వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం  వినియోగించడాన్ని సిటీ సివిల్ న్యాయస్థానం నిషేధించింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో ఎవరైనా వ్యక్తి, సంస్థ ద్వారా జరిగే ట్రోలింగ్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం, అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హెచ్చరించింది.

తన పేరు, చిత్రం, ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేథస్సు (ఏఐ) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడాన్ని ఆపివేయాలని చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ ఆయన పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేకుండా వినియోగం, తదితర చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రధానంగా డిజిటల్, ఏఐ వేదికల ద్వారా జరిగే వాణిజ్య దోపిడి, తప్పుడు ప్రతిరూపణలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది. ఈ నిషేధాజ్ఞ ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ అయిన మెగాస్టార్, చిరు, అన్నయ్య ఆయన స్వరం, చిత్రంతో పాటు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత, వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అందరూ ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అంబేద్కర్ మార్గంలో ‘కోటా’ కొట్లాట

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయినప్పటికీ సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇతర వెనకబడిన కులాలకు సమాన అవకాశాల కల్పనలో పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ జనాభా ప్రకారం వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. అగ్రకులాలు అదనపు హక్కుల పొందగా ఓబీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పావులుగా మారుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై పార్టీల స్పందనే ఇందుకు నిదర్శం. స్థానిక సంస్థల్లో 42 బీసీ రిజర్వేషన్ల అమలుకై తెచ్చిన జీవో 9కు కోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రంలో అక్టోబర్ 18న బీసీ రిజర్వేషన్ సాధనకు బీసీ సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్యర్యంలో బంద్ ప్రకటించారు.

దీనికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు పలికాయి. పొలిటికల్ మైలేజ్ కోసం పరస్పర రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యాయి. అసలు 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన పరిష్కారం చూపాలనే నిబద్ధత ఏ పార్టీకి లేదని అర్థమవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. కానీ సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో 50శాతం పరిమితిని విధించింది. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు తలుచుకుంటే ఈ పరిమితిని తొలగించలేరా?. అసలు అడ్డుకునేది ఎవరు? న్యాయ స్థానాలా? న్యాయ బద్దతలేని విధానాలా?.. ఆలోచన చెయ్యాలి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.

డా. బి.ఆర్. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాదు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతిలోనూ ప్రధాన పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే, సాహూ మహారాజ్ వంటి వెనకబడిన వర్గ ఉద్యమ నేతల ఆలోచనలను అంబేద్కర్ స్వీకరించి, వాటిని భారత రాజ్యాంగంలో ప్రతిబింబింపజేశారు. ఓబీసీలు తమతో కలిసి రానప్పటికీ అంబేద్కర్ వారికి సమాన న్యాయం, విద్యాఅవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం రావాలని పట్టుదలగా ప్రయత్నించారు. రౌండ్ టేండ్ సమావేశాల్లో ఆయన వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. రాజ్యాంగంలో 340వ అధికరణాన్ని చేర్చించారు. దీంతో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమనమైంది. ఈ అధికరణ ఆధారంగా ఓబీసీల జాబితా రూపొందించి, వారికి రిజర్వేషన్లు కల్పించటానికి ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ బాధ్యత ఏర్పడింది. ఈ క్రమంలో కాక కలేల్కర్, బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కారణంగానే బీసీల రిజర్వేషన్ల కొంతమేర చట్టబద్ధమైనవి. స్వాతంత్య్రం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ తొలి కేబినెట్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు.

1951లో ఆయన మహిళలకు వారసత్వం, సమాన హక్కులు కల్పించాలనీ‘హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అంబేద్కర్ 1951 అక్టోబర్ 10న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం కూడా తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఈ వాస్తవం బీసీ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనంతరం అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిపి ఒక శక్తిగా ఎదగడం అవసరమని భావించారు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ వేదికల ద్వారా దళితులు, బీసీలు, మహిళలు సమాన హక్కులు కోసం పోరాడారు. నేడు దేశంలో బీసీల సంక్షేమానికి అంబేద్కర్ దిక్సూచి. కావున ఇప్పుడు బీసీ విముక్తికి చారిత్రకంగా మహనీయుల పోరాటాలు పాఠం కావాలి.

అంబేద్కర్ తర్వాత ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించిన కాన్షీరాం సైతం ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. 1980 సంవత్సరంలో మండల్ కమిషన్ ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై కాన్షీరాం డిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల ధర్నా చేశారు. అప్పుడు వి.పి సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఈ విధంగా కాన్షిరాం బీసీ రిజర్వేషన్ ఉద్యమం దేశంలో విప్లవం సృష్టించింది. ఆ దిశగా మరో స్వాభిమాన బీసీ ఉద్యమం బయలుదేరాలి. ఈ క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బాలగోని బాలరాజు గౌడ్, పొన్నం దేవరాజ్ గౌడ్, జి.కిరణ్ కుమార్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఈ సమితి బీసీ కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమం చేపడుతున్నారు. ఈ నెల24న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహించారు. తదుపరి బీసీ చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. బీసీ సంఘాలతో పాటు ఇతర కుల సంఘాలు ఈ సమితికి తోడై దేశవ్యాప్త ఉద్యమంగా మారాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాలంతా తరతరాలుగా అగ్రకుల పాలకుల దోపిడికి గురయ్యారు. ఈ క్రమంలో 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బలగాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించాలి. ఇందుకై వారిని పూలే, అంబేద్కర్, కాన్షీరాం దారిలో నడిపించడానికి డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆలోచన నుంచీ మార్చు 31, 2025న బిసి,ఎస్సీ,ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి(జాక్) ఆవిర్భవించింది. దీని ఆధ్వర్యంలో అదిలాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14 2025 న లక్ష కిలో మీటర్ల రథయాత్ర ప్రారంభమైనది. ఇది అట్టడుగు వర్గాల సమస్త రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే.. రాజ్యాధికారం కోసం ధర్మ యుద్ధం చేస్తున్నది. ప్రజా సమస్యలపై సింహ గర్జన చేస్తున్నది. ఈ యాత్ర అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇది ప్రత్యామ్నాయ ప్రతిపక్షమై సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నది.

దీనిలో భాగమైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి.చిరంజీవులు గారు బీసీల చైతన్యానికి కృషి చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య బీసీల న్యాయపోరాటాలకు ప్రేరణ ఇచ్చారు. ఈ త్రిమూర్తులు అగ్రకుల పార్టీలకు అభిముఖంగా అంబేద్కర్ మార్గంలో నడుస్తూ పీడిత వర్గాల విముక్తికి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. బీసీ ఉద్యమానికి కథానాయకులై నడిపిస్తున్నారు. వీరికి తోడుగా వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు, కుల సంఘాలు కలిసి వస్తున్నారు. గతంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 10వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల కులాల వాటానడుగుతూ రాజ్యాధికార స్పృహ రగిలించారు. ఇదే నేటి బీసీల సంఘటిత మహోద్యమానికి కారణమైనది. 

కళాత్మక సమరశీలి సత్యన్న

కళ కళ కోసం కాదు ప్రజల కోసమే అన్నట్లుగా ఆట-పాటలనే ఆయుధంగా చేసుకొని నిరంతరం ప్రజా ఉద్యమ పంథాలో కొనసాగిన కళాత్మక సమరశీలి కామ్రేడ్ సత్యన్న. భూక్య సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్నగా పేరు గడించిన సత్యన్న పేరుకు తగ్గట్టుగానే జీవితాంతం ఎత్తిన ఎర్రజెండాను దించలేదు. నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని వీడలేదు. పెద్దన్నగా పెద్దరికంతో కూడిన హుందాతనం ఆయన సొంతం. అందరి కోసం నేను అన్నట్లుగా జీవించేవారు. మే 18,1963 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి గ్రామంలో భూక్యా రాములు-తిరుపతమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించిన భూక్యా సత్యనారాయణకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. భూక్యా సత్యన్న జీవనోపాధిరీత్యా యుక్త వయసులోనే మహబూబాబాద్ కు వలస వచ్చారు. ఆ సమయంలో మహబూబాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలో ఎగురుతున్న ఎర్రజెండా రెపరెపలకు ముగ్దుడై ఎర్ర జెండా ఎత్తి పట్టి పోరాట బాట పట్టారు.

మానుకోట ప్రాంతంలో కామ్రేడ్ ధర్మన్న సహచరునిగా ప్రజా ఉద్యమంలో కొనసాగారు. ప్రజా పోరాట తత్వాన్ని అలవర్చుకున్న భూక్యా సత్యన్న తన స్వగ్రామమైన కాకరవాయి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ నిర్మించి ఎర్రజెండా ఎగురవేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమ ప్రజా కళాకారులతో జతకట్టి ఉద్యమ పాటల పల్లకి ఎత్తుకున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం, విశ్వ సమాజం తదితర ప్రజా సంఘాలలో చేరి, ప్రజా ఉద్యమకారునిగా, ప్రజా కళాకారునిగా పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఖమ్మం జిల్లా సాంస్కృతిక విభాగం కో కన్వీనర్‌గా ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో విస్తృతమైన కళా ప్రదర్శనలు ఇచ్చారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వ సమాజం వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది రచయిత విశ్వ జంపాల సహచరత్వంలో తెలంగాణ, సామాజిక న్యాయ ప్రజా పోరాటాల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రజా కళాకారుడుగా కాలుకు గజ్జ కట్టి గోసి గొంగడేసి కైగట్టి పాట పాడుతూ తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దరన్నను అనుకరిస్తూ ఆడుతూ పాడుతూ ప్రజలను ఆకట్టుకునేవారు. ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రజా యుద్ధనౌక గద్దరన్న, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్న ప్రతి కళా ప్రదర్శనలో, సమావేశాల్లో విధిగా పాల్గొనేవారు. వృత్తిరీత్యా బిల్డింగ్ నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. మహబూబాబాద్ పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న అనేక పోరాటలలో సైతం పాల్గొని ప్రజా పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

ప్రజా ఉద్యమ వేదికల మీద రొమ్ము విరిచి, గుండెలు బాదుకుంటూ పేదల ఆకలి కేకల బాధలను పోరాట పాటలుగా వినిపించేవారు. సత్యనారాయణకు భార్య సీతాదేవి పెద్ద కూతురు విశాల, చిన్న కూతురు విమల, కుమారుడు విక్రమ్ ఉన్నారు. మంచికి మారుపేరు, సహానశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది, అందరికీ ఆదర్శంగా నిలచిన కామ్రేడ్ భూక్య సత్యన్న గుండె పోటుతో తెలంగాణ బీసీ బంద్ రోజున ది.18.10.2025న అకాల మరణం చెందారు. ఎందరో కవులు కళాకారులు ఉద్యమకారుల సాన్నిహిత్యం పొంది, వారి సహచరునిగా తన పాద ముద్రలను వదిలి వెళ్లారు. ప్రజా కళాకారునిగా, ప్రజా ఉద్యమకారునిగా కామ్రేడ్ భూక్యా సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్న ఆలోచన విధానాన్ని ఆయన మహోన్నత ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి.

(27.10.2025న మహబూబాబాద్‌లో జరగనున్న కామ్రేడ్ భూక్య సత్యన్న సంస్మరణ సందర్భంగా)

విశ్వ జంపాల అడ్వకేట్ (విశ్వ సమాజం వ్యవస్థాపకులు)

77939 68907

వారంలో డిసిసి అధ్యక్షులు

మన తెలంగాణ/హైదరాబాద్: నెలాఖరులోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సూచనప్రాయంగా చెప్పారు. శనివారం ఢిల్లీలో కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీ నాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, సం ఘటన్ సుజన్ అభియాన్‌కు చెందిన పలువురు పరిశీలకులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నందున జిల్లా పార్టీలు బలోపేతంగా ఉండాల్సిన అవశ్యకత గురించి

సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. అం దుకు కెసి వేణుగోపాల్ స్పందిస్తూ సాధ్యమైనంత త్వర గా నియమించాలన్న ఆలోచనతో ఉన్నామని, దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల జిల్లాల కమిటీల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావచ్చందని, వాటితో పాటు తెలంగాణ డిసిసి  అధ్యక్షులనూ నియమిస్తామని వివరించారు. ఏఐసిసి నియమించిన ఇరవై రెండు మంది పరిశీలకులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలే కాకుండా స్థానికంగా ఉండే వివిధ సంఘాలతో, స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల అభిప్రాయలను సేకరించారని కెసి వేణుగోపాల్ తెలిపారు.

అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తమకు సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇందులో కొన్ని జిల్లాల్లో మూడు పేర్లు ఉంటే, మరి కొన్ని జిల్లాల్లో ఐదు, ఆరు పేర్లతో కూడిన జాబితాలను అందజేశారని ఆయన తెలిపారు. మూడు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సిందిగా వారికి అందజేసిన మార్గదర్శకాల్లో చెప్పామని, అయితే బలమైన నాయకులు, ఉండడం, మహిళలు, సామాజిక సమతుల్యత కోసం ఐదు, ఆరు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పారని ఆయన తెలిపారు. వీటిని మరోసారి పరిశీలించి, వడపోసి మూడు పేర్లతో తుది జాబితాను సిద్ధం చేసి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందు పెట్టి ఖరారు చేస్తామని ఆయన వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తమ పరిశీలకులు ఎవరి వత్తిళ్ళకు లొంగకుండా జాబితాలు సిఫార్సు చేశారని ఆయన చెప్పారు.డిసిసి అధ్యక్షులుగా ఉన్న వారు తిరిగి పోటీ చేయరాదన్న నియమం ఉండడం ఒక రకంగా మంచిదేనని, దీని వల్ల పార్టీలో కొత్త ఇంకా యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, ముఖ్య నేతలంతా హస్తినలోనే..

ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితర ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. బిసి రిజర్వేషన్ల కోసం తాము చేసిన కృషిని, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని వివరించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి, ఏఐసిసి అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అందజేస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఏఐసిసి ముఖ్య నేతలతోనూ మంతనాలు జరిపే అవకాశం ఉంది.

అధిష్టానానికి సమాచారం ఇచ్చాం..ః భట్టివిక్రమార్క

ఇదిలాఉండగా కెసి వేణుగోపాల్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో అధిష్టానానికి సమాచారం అందించామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే గ్రామ, వార్డు స్థాయి నుంచీ కమిటీల ఎంపికను పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సేవలో నిమగ్నం అయ్యేలా చూస్తామన్నారు.

చివరి వన్డేలో భారత్ ఘన విజయం

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో గెలుపొంది పరువు నిలుపుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్నందుకుంది. దాంతో సిరీస్ 2-1తో ఆసీస్ కైవసమైంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ 121 నాటౌట్(125 బంతుల్లో 13×4, 3×6) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 74 నాటౌట్(81 బంతుల్లో 7×4) అజేయ అర్థశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మా థ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం..

స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు శుభారంభం దక్కింది. శుభ్‌మన్ గిల్(24) త్వరగానే ఔటైనా… తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. 63 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు.

రోడ్డున పడవద్దు: కెసి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కెసి వేణుగోపాల్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడినట్లు మీడియాలో, ప్రధానంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చిందని ఆయన అన్నట్లు సమాచారం. కాగా, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కల్పించుకుని అటువంటిదేమీ లేదని, మంత్రి కొండా సురేఖకు జిల్లాలోని ఇరువురు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం కారణంగా వివాదం చెలరేగిందని, అదంతా సమిసిపోయిందని వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏదైనప్పటికీ భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా చూడాలని,

సమన్వయం లేక రోడ్డున పడరాదని కెసి వేణుగోపాల్ వారితో అన్నారని సమాచారం. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ బలంగా ఉందన్న అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయరాదని ఆయన సూచించారు. మంత్రుల మధ్య విభేదాలు ఏమీ లేవని, తామంతా కలిసే ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వివరించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండే ఒకటి, రెండు పత్రికలే ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం వల్ల అపొహలకు, గందరగోళానికి దారి తీసినట్లు సమాచారం. ఒక పార్టీకి చెందిన పత్రిక కాబట్టే తప్పుడు కథనాలతో గందరగోళం సృష్టిస్తున్నదని ఆయన వివరించారని తెలిసింది.

త్వరలో కొత్త ఫీజులు ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ క ళాశాలలకు 202528 కాలానికి కొత్త ఫీజుల ఖరారు వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇంజనీరిం గ్, వృత్తి విద్యా కళాశాలల ఫీజులపై శనివారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) సమావేశం జరిగింది. సోమవారం మరోసారి నిర్వహించి ఫీజులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ తర్వాత ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ సారి ఫీజుల పెంపు భారీగా ఉండకపోవచ్చనీ ర్యాంకింగ్, న్యాక్, పరిశోధనలు తదితర నూతన కొలమానాల ఆధారం గా ఫీజులు నిర్ణయించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నా యి. ఇంజినీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి

టిఎఎఫ్‌ఆర్‌సి ఇప్పటికే ప్రాథమికంగా ఫీజులపై ఓ నిర్ణ యం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఫీజులపై విస్తృత కసరత్తులు చేశారు. టిఎఎఫ్‌ఆర్‌సి అధికారులు దాదాపు 160 కళాశాలల ప్రతినిధులతో పునర్విచారణ సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొత్త ఫీజులు ఖరారు చేశారు. దీని ప్రకారం అధిక శాతం కళాశాలలకు స్వల్పంగా, కొన్నింటికి గరిష్ఠంగా 20 నుంచి 30 శాతం మించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కళాశాలలు తమ ఫీజు ఖరారులో అన్యాయం జరిగిందని న్యాయస్థానానికి వెళ్లినా, శాస్త్రీయ ఆధారాలు చూపేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తె లుస్తోంది. మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, బి.ఇడి, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజులను సవరించాల్సి ఉంటుంది. ఆయా కళాశాలల ఆదా య, వ్యయాలను పరిశీలించి సాధారణంగా టిఎఎఫ్‌ఆర్‌సి కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది.

ఈ ప్రక్రియలో భాగంగా ఈసారి విద్యా నాణ్యత కోసం ఆయా కళాశాలల్లో అంతర్గత నాణ్యత పెంపు విధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థులకు, సిబ్బందికి ముఖగుర్తింపు హాజరు, పా రదర్శకత, జవాబుదారీతనం కోసం వేతనాలు తదితర వాటి చెల్లింపునకు ఆధార్ అధీకృత విధానం, పరిశోధనలు,స్టార్టప్ లు, పరిశోధన పత్రాలు, జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. గ తంలో కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టిఎఎఫ్‌ఆర్‌సికి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. 

‘గెలుపు’ రాజకీయాల్లో సానుభూతి సయ్యాట!

రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉండే కాలంలో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే ఆయన లేదా ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీకే ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని వదిలేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ మృతి చెందిన ఆ నేతకు గౌరవంగా నివాళులు అర్పించేవారు. క్రమక్రమంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అనే మాట అంతరించిపోయి బద్ధ శత్రువులు మిగిలారు. ఇటీవలి కాలంలో, అవి జాతీయ రాజకీయాలైన, ప్రాంతీయ రాజకీయాలైనా అన్ని పార్టీలు ఒకరినొకరు శత్రువులుగానే పరిగణిస్తూ ఉండటం చూస్తున్నాం.

ఇప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు పోటీని ‘స్పోర్టివ్’గా తీసుకోవడం మానేశాయి. అవతలి పక్షాన్ని ఓడించి తామే గెలవాలన్న పట్టుదల పెరిగింది. ఇది యుద్ధంలో శత్రువులు ఎంత మందినైనా చంపి విజయం సాధించాలన్న రాజ్యకాంక్ష వంటిది. అది ఇప్పుడు మనకు ఎల్లెడలా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఉచ్చనీచాలు మరిచిపోయి, స్థాయిని విస్మరించి అవతలిపక్షం వారిని అవమానించే విధంగా మాట్లాడటం, ప్రకటనలు చేయడం పరిపాటి అయింది. ఈ పక్షం ఆ పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అట్లానే తయారవుతున్నాయి. ఇక ఎన్నికల అప్పుడు సరే సరి. పోటీలు పడి వ్యక్తిగత విమర్శలు, అవతలి వారి వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని స్థితి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరపవలసిన అవసరం ఏర్పడింది. నిజానికి ఇది పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం. దీని పరిధిలో జూబ్లీహిల్స్ లేకపోవడం ఓ విచిత్రం. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా ఈ ఉపఎన్నిక జరపవలసి వచ్చింది. గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై పార్టీ మారి భారత రాష్ట్ర సమితిలో చేరి ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి.

ప్రస్తుతం ఆయన సతీమణి సునీత భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే యువ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా లంకల దీపక్ రెడ్డిని పోటీలోకి దింపింది. ఇక్కడ అంత ప్రాముఖ్యం లేకపోయినా ఒక విషయం సరదాగా అయినా గుర్తు చేసుకోవాలి. ఈ ముగ్గురు అభ్యర్దులూ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీతో సంబంధం ఉన్న వారే. ముందే చెప్పుకున్నట్టు బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీత భర్త మాగంటి గోపినాద్ మొదట తెలుగు దేశం శాసన సభ్యుడే కాగా బీజేపీ ప్రస్తుత అభ్యర్థి రాజకీయ ప్రస్తానం కొంత కాలం చంద్రబాబు నాయుడు పార్టీలోనే.

ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను 2019కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో పార్టీలో చేరడానికి శ్రీశైలం యాదవ్ తీసిన ఊరేగింపును ఆనాటి హోంమంత్రి ఏ. మాధవ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కూడా. ఆరోజుల్లో అది పెద్ద చర్చనీయాంశం కూడా అయింది. సరే ఇప్పుడిక్కడ ఆ పార్టీకి పెద్ద ప్రాముఖ్యత లేదనుకోండి, అయినా మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చాను, సెల్ ఫోన్ నేనే తెచ్చాను అన్న చందంగా అన్ని పార్టీల అభ్యర్ధులను నేనే తెచ్చాను అని కూడా చంద్రబాబు చెప్పుకోగలరు.

ఇక ప్రస్తుతానికి వొస్తే, సానుభూతి పవనాలు వీచి తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం, ఈ రెండేళ్లలో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అన్న అభిప్రాయంతో తమ గెలుపు తధ్యమని అభిప్రాయంలో బిఆర్‌ఎస్ ఉంటే, ఉప ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన ఫలితాలనిస్తాయని ఒక అభిప్రాయంతో పాటు తాము వెనుకబడిన తరగతుల 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి చూపిన చొరవ, చిత్తశుద్ధి పనిచేసే తాము నియమించిన యువ బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం అని భావిస్తున్నది అధికార కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లలో దాదాపు 1,20,000 ఓట్లు మైనారిటీలవి ఉండడం, ఈసారి మజిలీస్ పార్టీ పోటీ చేయకుండా అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం కూడా తనకు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్న పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చునని అభిప్రాయం సర్వత్ర ఉన్నది.

సరిగ్గా మరో రెండు వారాలకు ఎన్నిక జరగనున్న ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పక్షాలు పట్టుదలగా పనిచేయడానికి కారణాలు ఉన్నాయి. వాటిని గురించి చర్చించే ముందు ప్రత్యర్థులు శత్రువులుగా మారి పోటీలు పడుతున్న ఈ తరుణంలో ప్రజలలో సానుభూతి అనే అంశం అంతగా ప్రభావం చూపడం లేదని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు వివిధ కారణాల చేత ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జనం భిన్నమైన ఫ లితాలని రాజకీయ పక్షాలకు రుచి చూపించారు. 2016 లో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో, ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం బీఆర్‌ఎస్ పరమయింది. అట్లాగే పాలేరులో కూడా కాంగ్రెస్ స్థానం బీఆర్‌ఎస్ వశమైంది. ఇక్కడ సానుభూతి పనిచేయలేదు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి టిఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికై మంత్రి అయ్యారు. 2019లో లోకసభకు ఎన్నికైన కారణంగా ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినందు వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు.

2020లో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణిస్తే ఆయన సతీమణిని బీఆర్‌ఎస్ పోటీకి నిలిపినా అక్కడ అనూహ్యంగా ప్రజలు బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించారు. దుబ్బాకలో సానుభూతి పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పక్షమే గెలుస్తుందన్న వాదన కూడా పటాపంచలైంది. ఇక 2021లో నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య మరణిస్తే ఆయన కుమారుడు నగేష్ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే జనం ఓట్లు వేసి గెలిపించారు. ఇట్లా దుబ్బాక నాగార్జునసాగర్‌లలో ఫలితాలు పూర్తి భిన్నంగా రావడానికి ఇతరేతర కారణాలు ఉంటాయి.

అదే సంవత్సరంలో హుజరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక గురించి, ఆ వెనువెంటనే 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌ను అకారణంగా, అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించడం, పార్టీ నుండి వెలివేయడం, అవినీతి కేసులు పెట్టడం వంటివి చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయాన్ని వ్యతిరేకించి హుజరాబాద్ ప్రజలు బిజెపి టికెట్ తెచ్చుకున్న ఈటెల రాజేందర్‌ను గెలిపించారు. దళిత బంధు వంటి బీఆర్‌ఎస్ జిమ్మిక్కులు కూడా అక్కడ పని చేయలేదు. బిజెపి ఘనత కంటే ఈటెల రాజేందర్‌కు ప్రజలలో ఉన్న వ్యక్తిగత పలుకుబడి, కేసీఆర్ నిర్ణయాల పట్ల పెరిగిన వ్యతిరేకత బాగా పనిచేసాయి.

అదే మునుగోడు దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి ప్రజలు బిఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. అయితే మునుగోడులో భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ ఒకసారి తన సహజ మిత్రులని కౌగిలించుకొని భవిష్యత్తులో ఇంకెప్పుడు వారితో మిత్రత్వం వదులుకోబోనని కెసిఆర్ బోలెడు వాగ్దానాలు చేసిన కారణంగా ఆ పార్టీకి సంబంధించిన పదివేల ఓట్లు పడి అంతే తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థి బయటపడి కెసిఆర్, బీఆర్‌ఎస్ పరువు దక్కినట్టు అయింది . హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు సానుభూతి పనిచేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అది ఏ మాత్రం సాయం చేయలేదు.

ఇక ఈ క్రమంలో జరిగిన చివరి ఉప ఎన్నిక 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే మరణించిన గడ్డం సాయన్న కూతు రు లాస్య నందిత ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎ మ్మెల్యేగా గెలిస్తే ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మ రణించాక ఆమె సోదరి నివేదితని పోటీకి నిలిపితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ సానుభూతిని కాదని అధికారం గెలిచింది. ఓ పక్క 2023లో అధికారం కోల్పోయి, 2024లో ఒక్క లోక్‌సభ స్థానం గెలుచుకోలేకపోయిన బిఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్ ఓటమి మూలి గే నక్క మీద తాటి పండు పడ్డ సామెతగా తయారైంది.

ఇక ఎవరి బలం ఎంతో స్పష్టంగానే ఉన్న సమయంలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు పట్టుదలకు పోతున్నాయి అంటే, బీఆర్‌ఎస్‌కు ఇద అగ్ని పరీక్ష వంటిది. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ చుట్టుపక్కల గల నగర నియోజకవర్గాలన్నీ గెల్చుకున్నది. అధికారంలోకి వొచ్చాక కాంగ్రెస్ ఇది దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం దాని చుట్టూ చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అయితే పార్టీ మనుగడ కష్టం కాబట్టి జూబిలీహిల్స్‌ను నిలుపుకోవాలన్న పట్టుదల బీఆర్‌ఎస్‌ది. స్థానిక ఎన్నికల ముంగిట్లో జూబ్లీహిల్స్ గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుందన్న ఆలోచన కాంగ్రెస్‌ది.

వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా సర్

న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఎ న్నికల ఓటర్ల జాబితాల స వరణ(సర్)ను ఎన్నికల సంఘం వచ్చే వారం నుం చి ఆరంభించనుంది. వ చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పా టు పది నుంచి 15 రాష్ట్రాలలో తొలుత సర్ ప్రక్రియ చేపడుతారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాల సవరణ కీలకం కానుంది. ఇక ఎప్పటి నుంచి ఈ సవరణల ప్రక్రియ ఆరంభమవుతుందనేది ఎన్నికల సంఘం నవంబర్ తొలివారంలో ప్రకటిస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లేదా జరగాల్సిన చోట్ల సర్ నిర్వహించడం లేదు. మిగిలిన రాష్ట్రాలలోసర్ ఆ తరువాతి దశల్లో చేపడుతారు.

ఓటర్ల జాబితా సవరణల ద్వారా ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేందుకు దారి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల సంఘం రెండు సార్లు రాష్ట్రాల ఇసిలతో సమావేశం జరిపింది. క్షేత్రస్థాయిలో సాధకబాధకాలను తెలుసుకుంది. సర్ విషయంలో వివాదాలకు తావులేకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు , పౌరులు తమకు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎన్నికల సంఘం పిలుపు నిచ్చిం ది. ఇంతకు ముందటి ఓటర్ల జాబితాల తుది ఫైళ్లను ఎన్నికల సంఘం ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వీటి ప్రాతిపదికననే ఓటర్ల జాబితాలో సవరణకు వీలేర్పడుతుందని అధికారులు తెలిపారు. బీహార్ సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పుడు ఎటువంటి వివాదాలకు తావులేకుం డా చూసుకునేందుకు సిద్ధం అయింది. 

అంగన్‌వాడీలో త్వరలో భారీగా భర్తీలు

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నియమితులైన సూపర్‌వైజర్లంతా త మ వృత్తి ధర్మాన్ని నిబద్దతతో పాటించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శా ఖ మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తే మీ చే తుల్లో ఉన్నందున మీ వృత్తి ధర్మం ప్రజల ఆశలు, అవసరాలకు తగినట్టుగా ఉండాలని కొత్త సూపర్‌వైజర్లకు మంత్రి మార్గదర్శనం చేశారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క శనివారం స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి చ్చేసిన మంత్రి సీతక్క,

మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తో కలిసి కొత్తగా నియమితులైన సూపర్వైజర్లను అభినందిస్తూ, వేల మందితో పో టీ పడి మీరు సాధించిన ఈ కొలువులు మీ కష్టానికి ప్రతిఫలం. మీ నిరీక్షలు ఫలించాయి, మీ ఉద్యోగ కలలను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ఒక్కో సూపర్‌వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని, ఎక్కడా చిన్న లోపం లేకుం డా ఆయా కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పౌష్టికాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్య ను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. మ హిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అం గన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె అన్నారు.

తెలంగాణ నుంచే అంగన్వాడీ కేంద్రాలకు బీజం పడింది

ఐసిడిఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ గారు ప్రాణం పోశారని అ న్నారు. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయని గుర్తు చేశారు. 1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని అన్నారు. అంగన్వాడీ హెల్పర్ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈ రోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువేనని తెలిపారు. ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలని సీతక్క పేర్కొన్నారు. అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయని వివరించారు. చిన్నారుల కోసం 57 రకాల ఆటవస్తువులు,

యూనిఫాంలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాం. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని తెలిపారు. నియామక పత్రాలు అందుకునే సమయంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటు ంబ సభ్యులు, పిల్లలను హత్తుకొని ఆనంద భాష్పాలు కార్చారు. వారి కళ్లల్లో ప్రతిఫలించిన ఆనందం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, మంత్రి సీత కనితిత్వంలోని మహిళా సంక్షేమ శాఖ పనితనానికి నిదర్శనంగా నిలిచింది.

పటిష్టమైన సమాజం అంగన్వాడీల్లోనే నిర్మితమవుతుంది

మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ పటిష్టమైన సమాజం అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. మహిళల కు పెద్దదిక్కుగా ఉన్న సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండటం ఆ శాఖలోని సిబ్బంది అదృష్టమని పేర్కొన్నారు. సీతక్క స్ఫూర్తితో సూపర్వైజర్లంతా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నియామక పత్రాలు అందుకు న్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూపర్వైజర్లు విధి నిర్వహణలో అత్యంత నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు.