Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

jojobet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

holiganbet

interbahis

kingroyal

tlcasino

Holiganbet

betplay

holiganbet

బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ మూవీ.. ‘జటాధర’

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అర్ణు అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. ‘బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ఈ కాలంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో -దెయ్యం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, శివుడు గురించి కథలు… ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి… అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. -ఈ సినిమాలో ఘోస్ట్ హంటర్‌గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం వుండదు. దేవునిపై నమ్మకం వుంటుంది. సైన్స్ ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది. బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది. సోనాక్షి చాలా అద్భుతమైన నటి. సినిమాలో ధనపిశాచి పాత్రలో తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -శిల్పా శిరోద్కర్ శోభ అనే పాత్రలో కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. ఇక నెక్స్ రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా వుంది. ఇప్పుటి వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి” అని అన్నారు.

నేడు బీహార్ తొలి దశ పోలింగ్

ఈసారి 121 స్థానాలలో ఓటు

ఎన్‌డిఎ, ఇండియా కూటమి హోరాహోరీ

గంగా దక్షిణ ప్రాంతపు 18 జిల్లాల్లో బ్యాలెట్

సిఎం అభ్యర్థి తేజస్వీకి కీలక పరీక్ష

పాట్నా: ఎన్‌డిఎ, ఇండియా కూటమి మహాఘట్‌బంధన్ నడుమ తీవ్ర ఉత్కంఠతను రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నేడు ( గురువారం) జరుగుతుంది. ఈ తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలలో అర్హులైన ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా గంగా దక్షిణ ప్రాంతంలో విస్తరించుకుని ఉండే ఈ పోలింగ్‌లో ఇంతకు ముందటి ఫలితాల క్రమంలో మహాఘట్‌బంధన్‌కు ఆధిక్యత అవకాశం ఉంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్‌డిఎ అతిరధ మహారధులు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు తమ దృష్టిని కేంద్రీకరించారు. దీనితో ఓటు ఫలితం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ పలు రాజకీలక సమీకరణలు, సామాజిక పరిస్థితులు గెలుపోటములను ఖరారు చేస్తాయి.

ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్‌బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్‌డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్‌కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్‌తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది.

ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో హైదరాబాద్ ఎంపి , మజ్లిస్ నేత అసదుద్దిన్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను దింపారు. ఇవి ఇండియా కూటమి ఓట్లను చీలుస్తాయనే ఆందోళన సంబంధిత పార్టీల నేతలలో ఉంది. ఈసారి పోలింగ్‌లో నితీశ్ కుమార్ కేబినెట్‌లోని 16 మంది మంత్రుల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రత్యేకించి రాఘోపూర్,మహూవా , ఛాప్రాల్లో పోటీ నువ్వానేనాగా ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు జరిగే తొలి విడత పోలింగ్ 18 జిల్లాలకు విస్తరించుకుని ఉంది.

ఈసారి పోలింగ్‌లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి. 

పేదరిక నిర్మూలనలో కేరళ ఆదర్శం

సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించడం దేశానికే ఆదర్శాన్ని చాటుతోంది. తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇదే సాఫల్యమైన కేరళ అసలు స్టోరీగా అభివర్ణించారు. అనేక రంగాల్లో కేరళ అభివృద్ధి సాధించడం ద్వారా ‘కేరళ మోడల్’ అన్న పేరు బాగా ప్రసిద్ధి చెందిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పటికే దేశం లో, పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించబడడం గమనార్హం. పేదరిక కుటుంబాలను గుర్తించడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వివిధ ఏజెన్సీల సహకారంతో ప్రణాళిక రూపొందించింది. స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో సామాజిక భాగస్వామ్యానికి ప్రణాళికలో చోటు కల్పించింది.

2021 మేలో రాష్ట్ర ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్‌ట్రీమ్ పోవెర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇపిఇపి) ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఇటీవల సవరించిన అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం రోజుకు మూడు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే వ్యక్తులను తీవ్ర పేదరికంతో ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ లెక్కన కేరళ ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికతో పేదరికాన్ని తగ్గించగలిగింది. 1973 74లో 59.8% వరకు ఉన్న పేదరికం 201112 నాటికి 11.3 శాతానికి తగ్గింది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవెర్టీ ఇండెక్స్ 2023లో దేశం మొత్తం మీద అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా సూచించింది. కేరళ జనాభాలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే బహుముఖ పేదరికంలో ఉన్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయ తలసరి పేదరికం 14.96% కన్నా చాలా తక్కువ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా స్వీయ నమోదుపై ఆధారపడకుండా ప్రత్యేకంగా దాదాపు 4 లక్షల ఎన్యూమరేటర్లను నియమించింది. వీరికి స్థానిక పాలనా సంస్థలతోపాటు కుడుంబశ్రీ వర్కర్ల సహాయం కూడా అందించింది.

అనేక స్థాయిల్లో మధింపు జరిగిన తరువాత 64,006 అతి పేద కుటుంబాలకు చెందిన 1,03,099 మంది పేదలను గుర్తించింది. వీరిలో చాలా మందికి కనీస ధ్రువీకరణ పత్రాలు లేవు. నాలుగు అంశాల ఆధారంగా వీరి పేదరికాన్ని గుర్తించారు. వారు తింటున్న ఆహారం, ఆరోగ్య ప్రమాణాలు, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, వారి చదువు తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ అందేలా చేశారు. 4000 కుటుంబాలకు 5422 ఇళ్లు కట్టించి ఇచ్చారు. మరో 5522 ఇళ్లను తిరిగి నిర్మించారు. 1500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిల స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 2 లక్షల వంతున సహాయం అందించారు. పేదరికం నుంచి ఒకసారి విముక్తి కల్పించడమంటే అన్ని సమస్యలు వారికి వెంటనే పరిష్కారమైనట్టు కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడం ఎప్పటికీ అంతం కాని పని. రాష్ట్రప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన ఆదర్శనీయమైన పద్ధతిలో కొనసాగించడంలో అసలు ఉద్దేశం కటిక పేదరికం మళ్లీ ఏర్పడకూడదని, కొత్తగా ఏ కుటుంబం పేదరికంలో పడకూడదని.. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికే ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

విద్య, ఆరోగ్య రంగాల్లోనూ స్థానిక ప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం చేరుకుంది. ఆరోగ్య భద్రత విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి సమయంలో శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో ప్రతివెయ్యి కాన్పులకి 28 వరకు ఉండగా, కేరళలో వెయ్యి కాన్పులకు 5 మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో భారీ పరిశ్రమలు అంటూ లేవు. అయినా మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగానే కేరళ ఉంటోంది. పేదరిక నిర్మూలన నిరంతర కార్యక్రమమని, 2026 మార్చి నాటికి పేదరికం 0.002 శాతానికి చేరేలా ప్రయత్నిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.

అయితే కేరళ నమూనాను విమర్శించేవారు కూడా ఉన్నారు. అభివృద్ధి విషయంలో స్తబ్ధత నెలకొందని, నిరుద్యోగం పెరుగుతోందని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సాక్షాలన్న విమర్శలు వస్తున్నాయి. పేదరిక నిర్మూలన గణాంకాలు ఉత్త బోగస్ అని కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షం ఆక్షేపిస్తోంది. ఈ విమర్శలను సవాలుగా తీసుకొని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సాంకేతిక హరిత ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగాన్ని తొలగించడానికి విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధిని చేపట్టింది. దేనికీ రాజీపడని ప్రగతిశీల పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండిటినీ సమతుల్యం చేసుకోగలదని ‘ఇపిఇపి’ నిరూపిస్తోంది. సమాజం నడిపించే ఈ నమూనా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేరళ స్టోరీ దేశం మొత్తంమీద ఆదర్శవంతమే కాక, విస్తృతంగా అనుసరించేలా ప్రచారం చేయదగిందనే చెప్పవచ్చు.  

నేడు భారత్, ఆస్ట్రేలియా నాలుగో టి20.. ఇరు జట్లకు కీలకం

క్వీన్స్‌లాండ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్‌లాండ్ వేదికగా కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. తొలి టి20 వర్షార్పణం అయ్యింది. రెండో పోటీలో ఆస్ట్రేలియా, మూడో టి20లో టీమిండియా జయకేతనం ఎగుర వేశాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 11తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఇలాంటి స్థితిలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కిందటి టి20లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియా కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇరు జట్లలోనూప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్‌తో పాటు ఇప్పటి వరకు ఆడిన రెండు టి20 మ్యాచుల్లోనూ గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. గిల్ వరుస వైఫల్యాలు జట్టును కలవరానికి గురి చేస్తోంది. అభిషేక్ రెండో టి20లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. మూడో టి20లో బాగానే ఆడినా భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో వాషింగ్టన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయం సాధించి పెట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. జితేశ్ కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. తిలక్‌వర్మ, సూర్యకుమార్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలుపే లక్షంగా..

మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్‌ను ఓడించాలనే లక్షంతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. కానీ కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మూడో టి20లో టిమ్ డేవిడ్, స్టోయినిస్, మాథ్యూ షార్ట్ తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు బ్యాట్‌ను ఝులిపించాలనే కసితో ఉన్నారు. హెడ్, మార్ష్, ఇంగ్లిస్, డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, షార్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాతో పోరు భారత్ అంత తేలికేం కాదనే చెప్పాలి.

మనోళ్ల చేతిలో ట్రంప్ ఢమాల్

న్యూయార్క్ : అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఎదురు దెబ్బ తిన్నారు. షాక్ కు గురయ్యారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లిం డెమోక్రాట్లు జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి ఆయనకు తొలి రాజకీయ ఓటమిని చవిచూపారు. రాజకీయ కాక పుట్టించి, న్యూయార్క్ నగరం, సిన్సినాటి, వర్జీనియాలో అధికవోట్లను అగ్రశ్రేణి డెమోక్రాట్లు – జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి గెలుచుకున్నారు. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ భారతీయ – అమెరికన్ తల్లి మీరా నాయర్ దంపతుల బిడ్డ. కాగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికైన గజాలా హష్మీ భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలోని మలకపేట కు చెందిన వారు కావడం విశేషం. ఇక అఫ్తాబ్ పురేవాల్ తండ్రి పంజాబీ, తల్లి టిబెటన్ కు చెందిన వారు. జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ భారతీయ ప్రముఖ చిత్ర నిర్మాత, అతని తండ్రి మహ్మద్ మమ్దానీ పూర్వీకులు గుజరాత్ కు చెందిన వారే.

మహ్మద్ మమ్దానీ ప్రముఖ రచయిత, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లిం గా, భారతీయ సంతతి వ్యక్తిగా జోహ్రాన్ కొత్త రికార్డు సృష్టించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సహా పలు ఎన్నికల్లో డెమోక్రాట్స్ కు వరుసగా ఓటమి ఎదుర్కొంటున్న సమయంలో ఈ విజయాలు కొత్త జీవం పోశాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఎన్నికల రేస్ లో వ్యక్తిగతంగా లేకపోయినా, ఆయన ప్రభావం, నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. న్యూయార్క్ లో జహ్రానీ మమ్దానీ చేతిలో ఓడిపోయిన ఇండి పెండెంట్ అభ్యర్థి ఆండ్రూ క్యూమోను ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు. ఆయన న్యూయార్క్ మాజీ గవర్నర్ కూడా. ఒక దశలో ట్రంప్ మమ్దానీ మేయర్ గా గెలిస్తే, ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని బెదిరించారు కూడా. ఇక వర్జీనియాలో 61 ఏళ్ల గజాలా హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికల్లో గెలిచి మరో చరిత్ర సృష్టించారు. ఆ పదవికి ఎన్నికైన భారతీయ -అమెరికన్, మొదటి ముస్లిం మహిళ కూడా. హష్మి రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్ పై విజయం సాధించారు.

సిన్సినాటి మేయర్ గా ఎన్నికైన అఫ్తాబ్ పూరేవాలా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి కోరీ బౌమాన్ ను ఓడించి రెండోసారి ఆ పదవి చేపట్టారు. కోరీ బౌమాన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ సవతి సోదరుడు. ట్రంప్ సన్నిహితుడు. ఈ ఎన్నికలు ట్రంప్ పనితీరు పట్ల మెజారిటీ ఓటర్ల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. వర్జీనియా తో సహా చాలా స్టేట్ లలో సగం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓటుతో ట్రంబ్ కు ఘాటైన మెసేజ్ పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, సుంకాలు వలస విధానాలను ఓటర్లు తిరస్కరిస్తున్నట్లు కన్పిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మూలాలు ఉన్న ముగ్గురు ముస్లిం అభ్యర్థులు ముఖ్యంగా డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీ జోరుకు బ్రేక్ వేశారు. ఇది 2026 మధ్యంతర, 2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిక్యానికి ఏ విధంగా దెబ్బకొడుతుందో చూడాలి..

జోహ్రాన్ మమ్దానీ

జనవరి 1న న్యూయార్క్ మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రులు భారతదేశంలో మూలాలు కలిగిన వారు. మమ్దానీ ఉగాండాలోని కంపాలా లో జన్మించారు.ఆయన బాల్యం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సాగినా, 7 ఏళ్ల వయస్సులో న్యూయార్క్ నగరానికి చేరారు.

కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు 2018 లో అమెరికన్ పౌరసత్వం పొందారు. మమ్దానీ భార్య రామా దువాజీ సిరియన్ – అమెరికన్ కళాకారిణి, ఈ ఏడాదే వారి వివాహం జరిగింది. న్యూయార్క్ లోని క్వీన్స్ లో కలిసి ఉంటున్నారు. 34 ఏళ్ల మమ్దానీ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు డెమోక్రటిక్ సోషలిస్ట్. జూన్ లో డెమోక్రటిక్ ప్రైమరీలో ఆండ్రూ క్యూమోను ఓడించారు.

గజాలా హష్మీ హైదరాబాదీయే

గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో పాతబస్తీ ప్రాంతంలోని మలక్‌పేటలో తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. నాలుగేళ్ల వయసులోనే తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా హష్మీ అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా, జార్జియా సదరన్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ కోర్సు చదివారు. గజాలా హష్మి వర్జీనియాకు తొలి ఇండియన్ – అమెరికన్, ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆమె రిచ్మండ్ కు చెందిన రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించారు. హష్మి ప్రస్తుతం స్టేట్ సెనెటర్. సౌత్ రిచ్మండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించి వర్జీనియా రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. హష్మి 4 ఏళ్ల వయస్సులో తన కుటుంబంతో సహా భారతదేశం నుంచి అమెరికాకు చేరారు. ఆమె జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ బిఏ, ఎమోరీ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందారు.

అఫ్తాబ్ పురేవాల్

భారతీయ సంతతికి చెందిన సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ (43) గతంలో 2021లో నగరానికి తొలిసారి ఆసియా – అమెరికన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండో సారి మేయర్ గా ఎన్నికయ్యారు. పురేవాల్ తల్లిదండ్రులు ఒహియోకు వలస వచ్చిన వారు. ఆయన తండ్రి పంజాబ్ కు చెందిన వారు. పురేవాల్ కు చిన్ననాటి నుంచి రాజకీయాలంటే మక్కువ . విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదిగారు.

సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టాపొందిన పురేవాల్ 2008 లో వాషింగ్టన్ డిసి కి చేరుకుని అక్కడ ఓలా సంస్థలో పనిచేశారు. తర్వాత అమెరికా న్యాయశాఖలో అటార్ని ప్రత్యేక అసిస్టెంట్ గా పని చేశారు. 2016లో రాజకీయ కెరీర్ ప్రారంభించారు.

మాజీ ప్రెసిడెంట్ ఒబామా శుభాకాంక్షలు

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా డెమోక్రటిక్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వారి విజయం భవిష్యత్ లో డెమోక్రటిక్ పార్టీ విజయాలకు నాంది కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

హష్మీకి సీఎం రేవంత్, కెటిఆర్ అభినందనలు

 వర్జీనియా గవర్నర్‌గా హైదరాబాదీ గజాలా హష్మీ – ఎన్నిక కావడం పట్ల సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఆమె తొలి ముస్లిం మహిళగా రికార్డు పొందారని, అమెరికాలో గవర్నర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా హష్మీ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పారు. –

అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు సత్తా చాటారని, అందులో భాగంగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ ఘన విజయం సాధించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు పేర్కొన్నారు. 

బీహార్ ఓటరు ఎటువైపు?

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పుర పాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వే షన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్‌షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకు న్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి.  

అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్‌జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలో పు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే.  

బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్‌డిఎ, రాహుల్ గాంధీ, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ల నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం కాగా, మలి విడత 122 స్థానాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోనే ఎన్‌డిఎ ఎన్నికలకు వెళుతుండగా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభృతులు బీహార్ అంతటా కలియదిరిగి మహాఘట్‌బంధన్‌కు ఓటేస్తే 1990 నుండి 1995 వరుకు సాగిన లాలూ, రబ్రీదేవిల నాటి ఆటవిక పాలన, నేరాలు, ఘోరాలు మళ్ళీ వస్తాయని, బీహార్ అంధ యుగాలలోకి వెళుతుందని, డబుల్‌ఇంజిన్ సర్కార్ లాభాలు, సుపరిపాలన కావాలంటే మళ్ళీ నితీశ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి పట్టం కట్టాలని పిలుపు ఇచ్చారు.

బిజెపి, ఆర్‌జెడి, ఎల్‌జెపి, హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్ సుమతా పార్టీలు పంచ పాండవుల వలె రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని హామీ ఇచ్చారు. కాగా రాహుల్, తేజస్విల నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూడా ఈసారి ఎలాగైనా ఎన్‌డిఎను చిత్తుచేసి, బీహార్‌ను చేజిక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. నితీశ్ వయోభారం, అనారోగ్యంవల్ల పాలన చేసే స్థితి లేరని, నేరాలు పెరుగుతున్నాయని, అందరి భాగస్వామ్యంతో బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువకుడైన్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లాలూ తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1990లో తేజస్వి పురిటి పొత్తిళ్లలోని 4 నెలల పసికందు. ఢిల్లీలో 9వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన తేజస్వి 2020 ఎన్నికలలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకర్షించినా మహాఘట్ బంధన్ 110 స్థానాలకు పరిమితమైనది. ఆర్‌జెడి 75 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. మజ్లిస్ పార్టీ వేరుగా పోటీ చేసి ఆరు స్థానాలు గెలిచి అనేక చోట్ల మహాఘట్‌బంధన్ విజయావకాశాలు దెబ్బ తీసింది. ఈ ఎన్నికలలో కూడా 30 స్థానాలకు పోటీకి దిగింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టేసి పలువురు అభ్యర్థులతో తాను పోటీ చేయకుండా జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు.

ఒక్కసీటు గెలిచే వీలున్నా బహుముఖ పోటీల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు దెబ్బతీయగలరని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వేషన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్‌షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకున్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. వీరికి తోడు హిందూస్తాన్ అవామీ మోర్చా దళిత ఓట్లు, లోక్ సమతా పార్టీ ఓట్లతో కలిపి దాదాపు 38 శాతం ఓట్లున్నాయి. మహాఘట్ బంధన్‌కు బలమైన యాదవ, ముస్లిం (14 శాతం, 17 శాతం ముస్లిం) 32 శాతం ఓట్లున్నాయి. అయితే అధికారంలోకి ఈ ఓట్లు చాలవని గుర్తించి తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల ముందు ఎన్‌డిఎను వీడిన నిషదుల వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) నేత ముకేశ్ సహానీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ప్రచార సభలకు వెంటబెట్టుకొని వెళుతున్నారు.

ఓటర్లలో 4.5 మత్స్యకారులున్నారు. వారిలో మల్లా ఉపకులానికి 2.6 శాతం ఓట్లున్నాయి. ముకేశ్ సహాని మల్లనే. గత ఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలిచి ఉంటే తేజస్వికి ముఖ్యమంత్రి పీఠం దక్కేది. సీమాంచల్‌లో మజ్లిస్ పార్టీ మహాఘట్‌బంధన్‌ను దెబ్బ తీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌కు 37.23 శాతం ఓట్లు రాగా, ఎన్‌డిఎకు 37.26 శాతం అంటే కేవలం 12,700 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీహార్‌లో దాదాపు 20 శాతం దళితులున్నారు. మహా దళితులు, చిరాగ్ పాశ్వాన్ ఎన్‌డిఎకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో రూ. పదివేలు జమచేసి, మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తామని నితీశ్ ప్రభుత్వం వారి జేజేలు అందుకుంది. మహిళల ప్రాధాన్యత గుర్తించిన తేజస్వి మహాఘట్‌బంధన్ అధికారంలోకివస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, సంక్రాంతి పండుగకు రూ.30 వేలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తామని పోటీ హామీ ఇచ్చి అధికార కూటమిలో గుబులు రేపారు.

అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్‌జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలోపు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి జెడియుపై కత్తి గట్టిన చిరాగ్ ఎల్‌జెపి ఈసారి అధికార కూటమిలో చేరగా, గతంలో ఎన్‌డిఎలో ఉన్న ముకేశ్ సహానీ ఈసారి మహాఘట్‌బంధన్‌తో జట్టు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కులాలు, ఉపకులాల ప్రాబల్యం, ఆ చైతన్యం ఎక్కువగా ఉన్న బీహార్‌లో పార్టీలు ఓట్ల కోసం అలవిగాని హామీలు ఇచ్చాయి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మరో కోటికి పైగా ఉద్యోగాల కల్పనకు రూ. 6 లక్షల కోట్లు అవసరమంటున్నారు. ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌కు భారీగా నిధులు కావాలి. యువత, మహిళలను ఆకట్టుకుని అధికారంలోకి రావాలని యువకుడైన తేజస్వి ఆశ. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి ఉత్తరాదిలో సత్తాచాటాలని మోడీ యత్నం. తేజస్వి తేజస్సు వెలుగుతుందా లేక మోడీ, నితీశ్‌ల ప్రభావం కొనసాగుతుందా అనేది 7.45 కోట్ల బీహార్ ఓటర్లు తేల్చనున్నారు.

పతకమూరు దామోదర్ ప్రసాద్

94409 90381

వలసలపై అమెరికన్ల గురివింద నీతి

వలసలపై అమెరికాలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యతిరేకత చాలా చిత్రమైనది. నిజానికి వలసలపై వారి వైఖరి, ధోరణిపై అర్థమే లేదు. అమెరికన్లు అంతా ఇలాగే లేరు కాని, ప్రస్తుతం ఈ ధోరణిదే ఆధిపత్యం. వలసలపై మాట్లాడే చర్చించే నైతిక అర్హతలు ప్రస్తుతం అమెరికన్లుగా చలామణి అవుతున్న వారికి కనీస మాత్రంగా కూడా లేవు. చదువు, బతుకు దెరువు కోసం ఇతర దేశాలనుంచి అమెరికాకు వలస వచ్చిన విద్యార్థులు, యువతపై తీవ్రమైన వ్యతిరేకత, కోపం, ద్వేషం వ్యక్తం కావడం చాలా చిత్రమైన సంగతి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దొరవారు ఈ నినాదంపైనే గద్దెనెక్కారు. ఆయనతో సహా వలసలను వ్యతిరేకిస్తున్న వాళ్లు తన మూలాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే వారి నోరు పెగిలే అవకాశం ఏమాత్రం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయి ఒక్కరికి కూడా మాటపెగలదు. 90 శాతానికి పైగా ప్రస్తుత అమెరికన్ పౌరుల మూలాలు అమెరికా భూభాగం వెలుపలివే. వీరెవ్వరు కూడా అమెరికా భూమి పుత్రులు ఎంత మాత్రంకారు. ఎక్కువగా యూరోపియన్ దేశాలకు చెందిన వీళ్ళ తాతలు, ముత్తాతలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి యూరప్ దేశాలకు చెందిన వారు.

దాదాపుగా వీళ్లంతా తెల్లతోలు కలిగిన ప్రజలే. ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లతోలు ప్రజలు వారంతట వారుగా అమెరికాకు వచ్చిన వారు కాదు. బలవంతంగా తీసుకు రాబడిన వారే ఇప్పటి అమెరికన్ నల్లజాతీయులు. యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తెల్లతోలు యూరోపియన్లు తమ వ్యక్తిగత సేవలు, ఆక్రమించిన వ్యవసాయ భూముల్లో వెట్టి కూలీలుగా పని చేయడానికి ఆఫ్రికా నుంచి బలవంతంగా బానిసలుగా తరలించబడిన వారే నల్లజాతీయులు. అసలైన భూమి పుత్రులు, నిజమైన అమెరికన్లు కేవలం రెడ్ ఇండియన్ల మాత్రమే. స్థానికులు, భూమి పుత్రులు అయిన ఈ రెడ్ ఇండియన్లు ఇప్పుడు అమెరికాలో కడు దయనీయ జీవితాలను వెళ్ల బుచ్చుతున్నారు. కేవలం కూలీలుగా, నాల్గవ తరగతి ఉద్యోగులుగా మాత్రమే వీళ్లు బతుకులను వెళ్లదీస్తున్నారు. వారి భూములు, అడవులను ఆక్రమించిన తెల్లతోలు యూరోపియన్లు మాత్రం ఆధిపత్యం చేస్తూ అమెరికన్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్లుగా చలామణి అవుతున్న వారిలో 90 శాతం వాళ్లే.

ఇలాంటి వారికి ప్రస్తుత వలసలను ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే వారిది గురివింద తన కింది నలుపును కనపడనీయకుండా దాచుకొని నేను ఎర్రని దాన్ని, అందమైన దాన్ని అని విర్రవీగే గురివింద నీతి మాత్రమే అవుతుంది. అలాంటి వలస మూలాలున్న తెల్లతోలు అమెరికన్లు ఇప్పుడు చదువు కోసం, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, యువతపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి ఉపాధికి అడ్డుపడుతున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఆ ధోరణిని రాజకీయ అస్త్రంగా మార్చుకున్న రిపబ్లికన్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో ఏకంగా గద్దెనే స్వాధీనం చేసుకోగలిగింది. దీంతో ఇటీవల కాలంలో ఆ నేల వెలుపలి నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు.

నిజానికి అమెరికాలో ఉపాధి పొందగలుగు తున్నది అత్యంత ప్రతిభావంతులైన యువత మాత్రమే. స్థానిక అమెరికన్లు ఇతర దేశాల యువత ప్రతిభతో పోటీ పడలేని ఫలితంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నారనేది సత్యం. స్వయం కృషి, ప్రతిభలతో మాత్రమే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే విదేశీ విద్యార్థులపై ఇలాంటి ధోరణి వ్యక్తం కావడం న్యాయమైతే కాదు. వ్యక్తమవుతున్న వలస వ్యతిరేక ధోరణి కారణంగా అమెరికా వెలుపల ఉన్న వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎంతో మానసిక క్షోభకు లోనవుతున్నారు. అమెరికా వెళ్లడం చదువుకోవడం, ఉపాధి సంపాదించడం అంత సులభమైన పని ఏమీకాదు. ఎంతో ప్రయాసతో కూడుకున్నది. డబ్బుతో ముడిపడింది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అక్కడికి వెళ్లడానికి అర్హులు. తమ తమ దేశాల్లో మంచి ర్యాంకులతో రాణించి, అవసరమైన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తరువాత మాత్రమే అమెరికాకు వెళ్లే అనుమతి పత్రమైన వీసాను పొందగలుగుతారు. అంతేకాదు, ప్రతిభ మాత్రమే చాలదు.

ఒక్కొక్క విద్యార్థి కనీస పక్షంగా రూ. 50 లక్షలు ఖర్చు చేయగలిగేతే తప్ప అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్‌ఎస్) పొందలేరు. అలా పొందిన డిగ్రీతో అక్కడ ఉపాధి పొంది చదువు కోసం చేసిన రూ. 50 లక్షల అప్పును క్రమంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరిన తరువాత కొంత మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. ఇలా అక్కడికి వెళ్లిన ప్రతిభావంతులైన యువత మేధోశ్రమ ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. అమెరికన్ యువతలో మేధస్సు, ప్రతిభా సామర్థ్యాలు ఉండి ఉంటే విదేశీ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు కదా. ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి వలస వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది అక్కడి తెల్ల తోలు అహంకారం. ఈ ధోరణి తోడుగా అధ్యక్ష దొరవారు చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ విదేశీ యువతకు పెద్ద ప్రతిబంధకాలుగా మారిపోయాయి.

ఈ వలస వ్యతిరేక ధోరణి ప్రబలిపోయిన ఫలితంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు అడుగంటాయి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ (ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్లో స్తంభన) నడుస్తున్నది. 35 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతున్నది. షట్‌డౌన్ ఫలితంగా ఇప్పటికే ఎన్నో బిలియన్ల డాలర్లను అమెరికా కోల్పోయిందని అమెరికా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న ట్రంప్ మూర్ఖ ధోరణి కారణంగా షట్‌డౌన్ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి అమెరికాలో ఇప్పుడున్నది. ఈస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం సైతం ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే ఆయన గద్దెపై కూర్చొని తొమ్మిది నెలలు గడిచిపోయాయి. మరో 40 నెలల పాటు ఆయనకు పాలనా అధికారం ఉంటుం ది. ఆయన తీరు ఇంకా ఇలాగే కొనసాగితే 250 యేళ్ల మేధస్సు, శ్రమల ఫలితంగా నిర్మించబడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పాలిట ట్రంప్ భస్మాసురుడిగా మారిపోతాడని కూడా అంటున్నారు. ఎంఎజిఎ/ మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్) నినాదం అర్థం లేనిదై పోవడం ఖాయం అని చెబుతున్నారు.

వలస వెళ్లిన చోటు అమెరికా అయినా, యూరప్ దేశాలు అయినా, పెట్రోలియం వనరులు అధికంగా లభించే అరబ్ దేశాల్లోనైనా శ్రమించి నాలుగు డబ్బులు సంపాదించవలసిందే తప్ప మరోమార్గం మాత్రం లేదు. తాను ఉన్న చోట లభించే వేతనం కంటే కొంత మెరుగైన వేతనం, ఇంకొంత మెరుగైన జీవితం లభించే ప్రాంతానికి వలస వెళ్లడానికే ఏ మనిషిఅయినా మొగ్గుచూపుతాడు. దాన్ని తప్పుగా చూడడం, అభ్యంతరం వ్యక్తం చేయడం అనుచితం. మానవ సమాజాలు దేశాలుగా మారిన తరువాత ఏ దేశానికి ఆ దేశం కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, చట్టాలు ఏర్పరచుకున్నాయి. వాటిలో భాగమే వీసాల లాంటి అనుమతి పత్రాలు. అలాంటి అనుమతి పత్రాలను ఒక్కో దేశం ఒక్కో రీతిలో తమ తమ దేశాల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్నాయి. తమ దేశ ఆర్థిక, సాంకేతిక అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల పౌరులను రప్పించే, ఆకర్షించే అనేక ప్రయత్నాలను చాలా దేశాలు చేశాయి. అలా అనేక దేశాల మేధస్సును విస్తృతంగా ఆకర్షించింది అమెరికా. అలా అనేక దేశాల జాతుల ప్రజల రెండున్నర శతాబ్దాల నిరంతర శ్రమ, కృషి, మేధస్సుల వల్ల మాత్రమే నేటి అమెరికా నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక దేశాల ప్రజల వలసల శ్రమతో మాత్రమే ఆధునిక అమెరికా నిర్మాణం సాధ్యమైందనేది అందరూ అంగీకరించవలసిన సత్యం. నేటి అమెరికా అనేది ఎంతమాత్రం ఒక ఒకే ఒక్క జాతి సమూహం ఎంతమాత్రం కాదు. భిన్నజాతుల మిశ్రమం అయిన నానా జాతి సమితి లాంటి ఒక సంకరజాతి మానవ సమూహమే నేటి ఆధునిక అమెరికా. అలా అమెరికా ఒక గొప్ప దేశంగా మారిపోయింది. 

గోవర్ధన్ గందె

93470 56621

అవినీతికి అడ్డుకట్ట సాధ్యమేనా?

భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడబలుక్కొని దేశాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. దృఢమైన గొలుసులా ఏర్పడి సొంత ఆస్తులను గుట్టలుగా పోగు చేసుకుంటున్నారు. వీరి ధనదాహం, అధికార అహం వల్ల దేశంలో వంద కోట్లకు పైగా సామాన్యుల జీవితాలు కష్టాల ఊబిలోకి జారుతున్నాయి. పని చేసి పెట్టేందుకు లంచంకోసం చేయి చాచే ఉద్యోగి ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాడు. వ్యాపారి మోసాలు మాత్రం సామాన్యుడి కంటికి అగపడవు. ఇక రాజకీయ నాయకుడు పెద్ద మాయలోడు. వారి సంపాదన అండర్ గ్రౌండ్ డ్రైనేజిలా ఎటునుంచి ఎటు వెళుతుందో అంతుపట్టదు. ఉద్యోగి పట్టుబడితే కష్టాలే. వ్యాపారి నష్టపోతే తిప్పలే. నాయకుడు ఓడిపోయినా దివాళా తీయడు. ఈ పోలిక ఆధారంగా దేశ సంపద, పౌరుడి శ్రమ ఈమేరకు ఎవరి జేబులోకి వెళుతుందో ఊహించవచ్చు.

ఈ మూడింటిలో అత్యంత బలమైనది వ్యాపార వర్గమే. ఒక రకంగా రాజకీయ, ఉద్యోగ వర్గాలు వ్యాపారికి ఊడిగం చేసేవే. వ్యాపారులు ఇచ్చే విరాళాలు రాజకీయ పార్టీలకు ఇంధనంలా పనికొస్తాయి. ఒక పరిశ్రమ తమ రాష్ట్రానికి రావడానికి పాలకులు పడే ఆరాటం చూస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. మంత్రులను తమ కనుసన్నలపై ఆడించే వ్యాపారుల ఇంటి గేటు తాకడానికి కూడా అధికారులు వణికిపోతారు. ప్రభుత్వ బ్యాంకుల్లోంచి తీసుకొన్న వేల కోట్ల అప్పును గుర్తుచేయడానికి కూడా అధికారికి సాహసమే కావాలి. బ్యాంకుల్లోని ప్రజల పొదుపు సొమ్మును వేల కోట్ల దాకా ఎగ్గొట్టిన మన వ్యాపారులు విదేశాలకు వెళ్లి రాజాల్లా బతకగలరు. ఆ అప్పులకు మాఫీ చేస్తున్నట్లు మంత్రులతో ప్రకటనలు ఇప్పించగలరు. రాజకీయ, వ్యాపార వర్గాల చెప్పుచేతల్లో నడిచేవారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. ప్రతి దొంగపనిని చూసీచూడనట్లు ఉన్నందుకు వీరి టిప్పు వీరికి అందుతుంది. రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, పబ్బుల నుండి పోలీసులకు, మున్సిపాలిటీకి, కార్మిక, వాణిజ్య పన్నుల శాఖలకు నెలవారీగా లంచం సొమ్ము టంచనుగా అందుతుంది. పరిశ్రమల, వ్యాపారుల అక్రమ దందాలు ఎలాంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగడానికి ఎన్నో విభాగాల తనిఖీ అధికారులకు లంచం ముడుతుంది. డిపార్ట్‌మెంట్ వారీగా అందిన సొమ్ము హోదాల క్రమంగా జేబులోకి చేరుకుంటుంది. ఇలా నిశ్శబ్దంగా రోజుకు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. రోజుకు సగటున లక్ష రూపాయలు ఇంటికి తీసికెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రాష్ట్రంలో వేలల్లో ఉంటారు.

మాఫియాలో బ్లాక్ మనీ, స్మగ్లింగ్, హత్యలు ఉంటాయి. లంచగొండి వ్యవస్థ కూడా వైట్ కలర్ మాఫియానే. వారానికి ఒకరిద్దరు లంచగొండి అధికారులు అవినీతి శాఖకు చిక్కుతున్నారనే వార్తలు కనబడుతుంటాయి. అవినీతి నిరోధక శాఖ బాగా పనిచేస్తుందని చర్చ సాగుతుంది. వాస్తవానికి ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి స్పందిస్తుంది. ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. అవినీతి నిరోధక స్టేషన్ మాత్రం ఎక్కడా కనబడదు. ఆ సిబ్బంది కూడా అందులోనే ఉంటే బయట బోర్డుపెట్టాలి. దాని మార్గం విడిగా ఉండాలి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ కనబడేలా పెట్టినట్లు లంచాలు అడిగే ఆఫీసుల వద్ద ఎసిబి కౌంటర్లు పెట్టాలి. ఈ వ్యవస్థ లేకపోవడం వల్లనే తమను లంచం అడిగారని ఆ శాఖ దృష్టికి తీసుకువెళ్లే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. సిబ్బంది కోరిన ప్రకారం సమర్పించుకొని తమ పనులు పూర్తి చేసుకొని బయట పడడానికే జనం ఇష్టపడుతున్నారు.

చాలా సందర్భాల్లో అధికారుల అత్యాశే విషయం ఎసిబి దాకా వెళ్లేలా చేస్తుంది. బిల్లు మంజూరుకు అధికారి లక్ష డిమాండ్ చేస్తాడు. అంత ఇవ్వలేము, 70 వేలతో సరిపెట్టుకోండి అని వేడుకుంటారు. ససేమిరా కుదరదు. లక్ష ఇవ్వాల్సిందే అని అధికారి మొండికేస్తాడు. చిర్రెత్తిన లబ్ధిదారు ఎసిబిని ఆశ్రయిస్తాడు. శ్రమలేకుండా ఎసిబి వారికి ఓ చేప పడుతుంది. దానికో వార్త. ఇదేం పెద్ద నేరమన్నట్లు ఉద్యోగి దర్జాగా ఫోటోకి పోజు ఇస్తాడు.లంచం తీసుకోవడం తప్పు అనే భావన సమాజంలోంచి ఎగిరిపోయింది. బాధితుల ఫిర్యాదుపైనే కాకుండా, ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి కూడా అవినీతి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుంది. ఆ ఉద్యోగులకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని లెక్కలేసి మరీ చెబుతుంది. మిగతా వారికి అక్రమాస్తుల లేవా అంటే వారికీ ఉన్నాయనే సమాధానం వస్తుంది. చాలా డిపార్ట్‌మెంట్లు పూర్తిగా అవినీతిలో మునిగేవే. వాటిపై చర్యలు తీసుకుంటే ఆఫీసులే ఖాళీ అవుతాయి. జైళ్లు సరిపోవు. బలమైన ఈ చక్రవ్యూహంలో సామాన్యుడు సర్దుకు బతకడమే తప్ప మరో మార్గం లేదు.

  బి.నర్సన్, 9440128169

కాంగ్రెస్ అంటే ముస్లింలు

మన తెలంగాణ/హైదరాబాద్ : “మీకు చేతనైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినవీన్ కుమార్‌ను ఓడించండి…”అని సిఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, కెసిఆర్ ఒకవైపు, తాను, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాం ధీ, మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు నిలబడ్డామని అన్నారు. కాంగ్రెస్ అం టేనే ముస్లింలని, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సిఎం రేవంత్ రోడ్-షో నిర్వహించారు. షేక్‌పేట డివిజన్‌లో జరిగిన రోడ్-షోలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కౌసర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీ న్ కుమార్, స్థానిక కార్పోరేటర్ ఫరహత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిఎం షేక్‌పేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక ప్రార్థన చే శారు.

ఈ సందర్భంగా రోడ్-షోలో పాల్గొన్న వారినుద్ధేశించి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిజెపి, బిఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ సహకారం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి బిఆర్‌ఎస్ సహకరించినందువల్లే బిజెపికి ఎనిమిది సీట్లు వచ్చాయని, బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రాలేదని ఆయన తెలిపారు. అందుకే కెసిఆర్‌ను, కెటిఆర్‌ను అవినీతి కేసుల్లో బొక్కలో వేయలేదని ఆయన విమర్శించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సహా అనేక మందిపై ఈడి కేసులు పెట్టారు కానీ తండ్రీ-కొడుకును బొక్కలో వేసి, చిప్పకూడు ఎందుకు తినిపించలేదని ఆయన ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

కాళేశ్వరం అవినీతి విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే, ఒక్క రోజులోనే కెసిఆర్‌పై సిబిఐ విచారణ చేపట్టి, జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను మంగళవారం రోడ్-షోలో కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే, మా ఇంటికి వచ్చి చర్చిస్తానంటూ మళ్ళీ తనను ఎదురు ఛాలెంజ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని, గజదొంగ కెసిఆర్‌ను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌లో బిజెపికి డిపాజిట్ దక్కదన్నారు. డిపాజిట్ తెచ్చుకుంటే కిషన్ రెడ్డి గెలిచినట్లేనని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కారు టైర్లు పీకేసి గ్యారేజీకి పంపించారని, కొడితే కెసిఆర్ ఫాం హౌస్‌లో బొక్కా బొర్లా పడ్డారని అన్నారు.వేల కోట్లతో కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, కవిత వేర్వేరు చోట్ల ఫాం హౌస్‌లు కట్టుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి నేతలు బిఆర్‌ఎస్ గుర్తు అయిన కారు గుర్తుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బిజెపికే వేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. నాణేనికి రెండు వైపులా బిజెపి, బిఆర్‌ఎస్ అని ఆయన విమర్శించారు.

సర్కార్‌కు రెండు కళ్ళు..

హిందూ-ముస్లింలు తమ సర్కారుకు రెండు కళ్ళ వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అజహరుద్దీన్‌ను తన సహచర మంత్రిగా తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమి ఇబ్బంది అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ‘నీ అయ్య జాగీరు ఏమైనా అడిగామా? లేక గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భూములేమైనా అడిగామా?’ అని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా వచ్చి అడ్డు చెప్పినా అజహర్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే వాడినని ఆయన తెలిపారు. ముస్లింలకు వివిధ కార్పొరేషన్ పదవులు ఇచ్చానని, క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన వివరించారు. షెక్‌పేట్ డివిజన్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి పదిహేను వేల మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. సబర్మతి నదీ, యమునా నదీ అభివృద్ధి చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయరాదని ఆయన ప్రశ్నించారు.

ఏకగ్రీవం సంప్రదాయానికి తిలోదకాలు

ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి కెసిఆర్ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గతంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే సెంటమెంట్ ఏమీ లేదని కెసిఆర్ అభ్యర్థిని పోటీకి దించారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో కెటిఆర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌కు రాని సన్నాసులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణానగర్ నంది అవార్డులు తెచ్చింది, ఇప్పుడు ఆస్కార్ అవార్డులు తెచ్చిందని ఆయన తెలిపారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ అవార్డులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కెటిఆర్ మాత్రం గెస్ట్ హౌస్‌ల్లో సినీ నటులతో తిరిగారు తప్ప ఏనాడూ సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఈ ప్రాంతాలో ఉండే కార్మికులకు ఆరోగ్య భద్రత, జీవిత భీమా, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, లంచ్ కూడా ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టేవారు కాదన్నారు. దసరా పండుగకు ఆడబిడ్డలు వెళ్ళాలనుకుంటే ఉచితంగా వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. డ్బ్బై వేల ఉద్యోగాలు కల్పించి పత్రాలు స్టేడియంలో అందించామన్నారు.

సన్న బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు కెసిఆర్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో యాభై కోట్ల అవినీతికి పాల్పడిన కెటిఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ రోడ్-షోలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సత్తా ఎవరిదో.. చెత్త ఎవరిదో తేల్చుకుందాం

మన తెలంగాణ/హైదరాబాద్: దమ్ముంటే సిఎం రేవంత్‌రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి తా ము సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చ కు రావాలన్నారు. చర్చించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే..తమను చెప్పమన్నా స రే అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటరైనా.. గాంధీభవన్ అయినా, అసెంబ్లీలో చర్చ పెట్టినా తాము ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉ న్నామని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి నివేదికను విడుదల చే శారు. తెలంగాణ భవన్ లో నివేదికను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూ బ్లీహిల్స్‌లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశా రు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అ ర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నా రు. కానీ రేవంత్‌రెడ్డి 

మమ్మల్ని తిట్టినా తాము మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో, రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఆయన దీంతో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలి పోతుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని, తమ హయాంలో స్టార్ట్ చేసిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిందని వివరించారు. అవి కాకుండా కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత, కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని నిలదీశారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు : హైదరాబాద్‌లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారని గుర్తు చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను ప్రవేశపెట్టామని అన్నారు. ఇప్పుడు కనీసం ఒక్క ఆటోనైనా ప్రవేశపెట్టారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్‌కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్‌ఎన్‌డిపిని కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మారిస్తే ఇప్పుడు దానిని కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు : పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిదని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇళ్లను హైడ్రా పేరుతో ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మెట్రో సీఎఫ్‌వో, ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోలను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవేత్తలు పారిపోయారో చర్చకు సిద్ధమా అని నిలదీశారు. కరెంటు విషయంలోనూ కాంగ్రెస్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలిడేస్ ఉంటే తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్‌ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమానంగా చేశామని, రెండేళ్లలో రేవంత్ సర్కార్ ఒక్క ఎల్‌ఈడీ అయినా పెట్టిందా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా అని కేటీఆర్ సవాల్ విసిరారు.

ఉన్న చెట్లను నరికేశారు : కాంక్రీట్ జంగిల్‌లో కొత్తగా లంగ్ స్పేస్‌లు ఏర్పాటు చేసిన ఘనత తమదే అని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి 16వేల నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా ఉన్న చెట్లను నరికేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి హెచ్‌సియులో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలను కూడా మూడు లక్షల నుంచి 9 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలోనూ కాంగ్రెస్ పనితీరు ఏంటో కేటీఆర్ బయటపెట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పెంపొందిస్తే ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిందని, డే లైట్ మర్డర్లు పెరిగాయన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా అని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి, మోదీ మధ్య ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్- బీజేపీ జాయింట్ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తే అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని వెల్లడించారు. ఇక మైనార్టీలను అవమానించినందుకు గాను రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కెటిఆర్ హెచ్చరించారు. అటు ఫార్ములా ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినా, చార్జ్‌షీట్‌లో విషయం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమే అని..రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. దీంతో ఎవరు దొంగనో తేలిపోతుంది కదా అని చెప్పారు. ప్రతి విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.