Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

madridbet

jojobet

holiganbet giriş

ఎగిరిపడే ఖాకీల తోకలు కట్ చేస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తూ బిఆర్‌ఎస్ నాయకులను బ లవంతంగా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చుతున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కొం తమంది ఆకు రౌడీలు, గుండాలతోపాటు కొం తమంది పోలీసులు కూడా ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్ల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. 500 రోజుల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రా బోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటున్నానని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నవారిని రేవంత్ రెడ్డి కాదు,వాళ్ల తాత దిగొచ్చినా కాపాడలేరని అన్నారు. హిట్లర్ వంటి నియంతకు కూడా పతనం తప్పలేదని.. రేవంత్ రెడ్డి ఒక లెక్కనా అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కాం గ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా బిఆర్‌ఎస్ నేతల మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం ఎర్రగడ్డ డివిజన్‌లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారుకు, బుల్డోజర్‌కు జరుగున్న ఎన్నిక అని, ఈ ఎన్నికలో కారు గెలిస్తే పేదల ఇళ్లకు బుల్డోజర్ రాదు అని పేర్కొనారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కత్తి ఒకరికి ఇచ్చి తమను యుద్ధం చేయమంటే సాధ్యం కాదు అని, ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునీతను గెలిపిస్తే తాము ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ, హైడ్రా పేరు మీద వేల ఇండ్లు కూలగొట్టిందని మండిపడ్డారు. హైడ్రా భూతం, హైడ్రా రాక్షసి పోవాలంటే బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రా బుల్డోజర్ పేద వాళ్ళ ఇంటికి, బస్తీల జోలికి రావద్దంటే ఈనెల 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా ఇండ్లను కూల్చిన సందర్భంగా పేదల పడిన బాధలను కెటిఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థం అయ్యేలా ఎల్‌ఇడి స్క్రీన్‌లపై చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్లను కూలగొట్టి.. గూడు లేకుండా చేశారని పేర్కొన్నారు. హైడ్రా ప్రతాపమంతా గరీబోళ్ల మీదనే ఉంటుందని, హైడ్రా భూతం పోవాలంటే, హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

అభివృద్ధి పేరుతో మరోసారి కాంగ్రెస్ మోసానికి చేరలేపింది

అభివృద్ధి పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ మళ్లీ సిద్ధం అయ్యిందని కెటిఆర్ హెచ్చరించారు. ఇదే పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మళ్లీ మోసపోకుండా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ నెల 14న రాష్ట్రంలో పెను తుఫాను రాబోతోందని చెప్పారు. రెండేళ్లలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమయ్యారని తేల్చిచెప్పారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ అబద్దమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో కెసిఆర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇచ్చారని.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ పుడితే రూ.12 వేలు.. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందించామని చెప్పారు. అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు.

యాపిల్, గూగుల్. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయని.. వాటి ద్వారా లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని అన్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు పడిపోయాయని వెల్లడించారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆటో అన్నల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. గతంలో రెండు వేలు వచ్చే ఆదాయం.. వెయ్యికి పడిపోయిందని తెలిపారు. దీనివల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని.. మెడలో ఉన్న గొలుసులు కూడా లాక్కుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ను ఓడించడమే వీటన్నింటికి పరిష్కారమని అన్నారు. ఈ నెల 11న ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి.. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యాడ్ బ్రదర్స్ ఆ ముగ్గురే

మన తెలంగాణ/హైదరాబాద్:“అసలు ఆట ముందున్నది మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డీ&మీ బెదిరింపులకు భయపడేది లేదు..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. బ్యాడ్ బ్రదర్స్ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. కిషన్ రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎన్‌వి సుభాష్, ప్రకాష్ రెడ్డితో కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి 

పనులు చేసిందో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. అసలు ఆట ఇంకా మొదలుకాలేదని ఆయన హెచ్చరించారు. అసలు ఆట ఏమిటో తెలంగాణ గడ్డపై చూపిస్తామన్నారు. దళితులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని, మద్యం ఏరులై పారుతున్నదని, ల్యాండ్ మాఫియా, క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీ తప్ప అన్ని పార్టీలూ తిరిగారని ఆయన విమర్శించారు. బిజెపికి బలం లేకపోతే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల నేతలు తమను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిందంటే రాష్ట్రంలో సగభాగంలో తాము అధిపత్యంలో ఉన్నట్లేనని అన్నారు.

ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను లక్షంగా చేసుకుని విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్-బిజెపి కలిసి ఉందని చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ గతంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలూ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ముఖ్యమంత్రి తనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీలా అవినీతి పార్టీ కాదని, లోపల ఒకటి, బయట మరొకటి చెప్పే రకం కాదన్నారు. మడమ తిప్పని పార్టీ అని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇప్పటి వరకు చిన్న అవినీతి మరక కూడా లేదన్నారు. ఢిల్లీ స్థాయిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. బిజెపిని అడ్డుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ అందరూ ఒక్కటి కావాలని కెటిఆర్ సోషల్ మీడియా ద్వారా చెప్పారని ఆయన గుర్తు చేశారు. చీము, నెత్తురు ఉంటే మీ మాటలను నిరూపించాలన్నారు. కెసిఆర్ అవినీతి లక్ష కోట్లు కక్కిస్తా , బొక్కలో వేస్తా అన్న మీ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఫోన్ ట్యాపింగ్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

జర్నలిస్టు సంఘానికి వినతి

తెలంగాణకు తాను అణా పైసా కూడా తేలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను విమర్శించారని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ కోసం ఏమేమీ తెచ్చానో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ చర్చను జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చర్చ ట్యాంక్ బండ్‌పై లేదా సచివాలయం లేదా మరెక్కడైనా ‘సై’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ చర్చ నిర్వహించేందుకు జర్నలిస్టు సంఘం బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సంఘానికి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

రాహుల్ బాధ.. ఇసికి ‘సర్’దా!

రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత. ప్రధానమంత్రి కావలసిన నాయకుడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ప్రత్యర్థిగా నిలిచిన పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్న నాయకుడు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులనుండే ఆయన ఓట్లకు సంబంధించిన అనేక అవకతవకల మీద సీరియస్‌గా దృష్టి సారించి అధ్యయనం జరిపి పలు విషయాలు బయటికి తెస్తున్నారు.. ఒకసారి ఆటంబాబు అని, మరోసారి హైడ్రోజన్ బాంబు అని. ఈ బాంబులు ఎందుకు పేలడం లేదు? అంటే.. జనంలో ఎందుకు రావలసినంత స్పందన రావడం లేదు? స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఆయన ఆరోపణలను ఖండన ప్రకటనలతో తేలిగ్గా కొట్టిపారేస్తున్నది? నిజానిజాలను నిగ్గు తేల్చి ఆయన విమర్శలు అవాస్తవాలైతే ఎందుకు రుజువులతో జనం ముందుకు రావడం లేదు?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టు ‘రొట్టె ఎక్కువ సమయం ఒక వైపే కాలిస్తే మాడిపోతుంది. ఇంకోవైపుకు మార్చాలి’. ఆయన బహుశా మోడీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గురించి అని ఉండొచ్చు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్ గురించి అని ఉండొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యం అందరూ గుర్తించవలసిందే. ఆ లెక్కన ఎప్పుడో అప్పుడు రాహుల్ గాంధీయో, మరొకరో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండనే ఉంది. మరెందుకు రాహుల్ గాంధీ నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా జనానికి, ఎన్నికల సంఘానికి ఎక్కడం లేదు? ఆయన విమర్శలను సహేతుకంగా, శాస్త్రీయంగా, నిరాధారమైనవని నిరూపించే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా తేలికగా కొట్టిపారెయ్యడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి?

తాజాగా రాహుల్ గాంధీ గత ఏడాది హర్యానా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరిగిన అవకతవకలను గురించి మాట్లాడారు. ఆ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు పోలయ్యాయన్నది రాహుల్ ఆరోపణ. వాటి ద్వారా బిజెపి ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ ఆయన దాన్ని ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ అన్నారు. ఆయన ఓట్ల చోరీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా బీహార్ ఎన్నికలు కూడా వచ్చేశాయి. బీహార్‌లో కూడా ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటుండగానే అక్కడ మొన్న ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ కూడా అయిపోయింది. ఎల్లుండి రెండవ, చివరి విడత పోలింగ్ కూడా ముగిసిపోతుంది.

రాహుల్ గాంధీ గోడు వినడానికి, ఆయన తప్పు అని శాస్త్రీయంగా రుజువు చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌కు 73 సీట్లలో, బిజెపికి 17 సీట్లలో ఆధిక్యం వస్తే, ఇవిఎం పోలింగ్ తరువాత ఫలితాలు మాత్రం వేరుగా రావడాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. హర్యానా వ్యవహారంలో రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆయన మాటల్లోనే ‘ఎవరీ మహిళ, ఆమె పేరు ఏమిటి? ఎక్కడినుంచి వచ్చింది? అనేవీ ఎవరికీ తెలియదు. కాని ఆమె హర్యానా ఎన్నికల్లో 22 సార్లు 10 వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసింది. సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమల.. ఇలా రకరకాల పేర్లతో. తీరా ఆ ఫోటోలో ఉన్న మహిళ ఏనాడూ భారతదేశంలో అడుగు కూడా పెట్టని ఒక బ్రెజిల్ మోడల్. ఒక హిందీ సినిమా టైటిల్ ‘వో కౌన్ థీ’ తరహాలో ‘ఏ కౌన్ హై’ అని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఎన్నికల వ్యవస్థ అవకతవకల మీద చేస్తున్న మిగతా ఆరోపణలన్నీ పక్కన పెడదాం. కనీసం ఈ ఒక్క ఘటన గురించి అయినా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం బ్రెజిల్ మోడల్ లారిస్సా బొనెస్ దాకా వెళ్లింది. తన ఫోటో, అదీ ఎప్పుడో తాను 20 ఏళ్ల వయసులో ఉన్ననాటిది వాడుకుని ఇలా దొంగ ఓట్లు వెయ్యడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చెయ్యడమే కాకుండా చీదరించుకున్నారు కూడా. ప్రజలను మోసం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ‘ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనం’ అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. నిజమే, ఆ బ్రెజిల్ మోడల్ అన్నట్టుగా మనం ఏ ప్రపంచంలో అనే మాటకు ఏ కాలంలో బతుకుతున్నాం మనం అనే మాట కూడా చేరిస్తే బాగుంటుంది.

‘హెచ్‌ఫైల్’ పేరిట తమ వద్ద ఉన్న ఆధారాలను నూటికి నూరు శాతం రుజువు చెయ్యగలమని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి. ఒక్క హర్యానాలోనే కాదు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కూడా ఇదే సమస్య ఉందని రాహుల్ చెబుతున్నారు. ఎక్కడో బ్రెజిల్లో ఉన్న మహిళ ఫోటో ఉపయోగించి 10 పోలింగ్ కేంద్రాల్లో 22 సార్లు ఓటు వెయ్యడం ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే ఫోటోతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు కలిగి ఉండటం ఏమిటి? ఒకే ఇంట్లో 501 ఓట్లు నమోదై ఉండటం ఏమిటి? ఇవి అసత్యాలని రుజువు చేసే ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం వైపునుండి ఎందుకు జరగడం లేదు? ఆ పని మానేసి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నది.

2002- 2005 తరువాత ఇప్పుడు మళ్లీ రెండోసారి డూప్లికేట్, వలస వెళ్లిన, అనర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి, ఓటు అర్హతను తనిఖీ చేసే ఆలోచనతో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేసి ఓటర్ల జాబితాలను సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనతో మొదలైన కార్యక్రమం. అయితే ఈ కొత్త ‘సర్’ మీద కూడా నీలినీడలు పరచుకున్నాయి. ఈ రెండో విడత ‘సర్’.. ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చేయడం కాక ఎంపిక చేసిన ఓట్లు తొలగించే కార్యక్రమంగా తయారయిందని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి మేధావులు నెత్తీ నోరుకొట్టుకుని చెబుతున్నారు. ‘సర్’లో విధించిన నిబంధనలు చూస్తే అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యతను ఎన్నికల కమిషన్ గాలికి వదిలేసి, జాబితాలో నుండి హడావుడిగా ఓటర్లను తొలగించే పని చేస్తున్నదని వారి ఆరోపణ. తాను నిజమైన ఓటరని రుజువు చేసుకునే బాధ్యత దేశ పౌరుడి మీద వదిలెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వారు. నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్ ఫాంను నింపకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కు ప్రతి పౌరుడికీ అందేవిధంగా పని చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది.

ఓటర్ల జాబితాలను సరిచూసేందుకు సులభమైన, పారదర్శకతతో కూడిన మార్గాలు 2003 నాటి ‘సర్’, 2016 నాటి జాతీయ ఓటర్ల జాబితా సరిచేసే ప్రక్రియ వదిలేసి ఇంత జటిలమైన, పౌర ప్రయోజనాల వ్యతిరేక పద్ధతిని అనుసరించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.ఓటు హక్కు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అర్థం. ఒక రాజకీయ పక్షం పట్ల లేదా ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఆయన ఎంచుకున్న అభ్యర్థి పట్ల దేశ పౌరులు తమ భావాలను ఓట్ల రూపంలో వ్యక్తం చేసే ప్రక్రియ ఎన్నికలు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడికి/ పౌరురాలికి ఓటు హక్కు తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల వ్యవస్థ పైన ఎంత ఉంటుందో, అనర్హులు అందులోకి చొరబడకుండా చూడాల్సిన, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అదే వ్యవస్థ మీద తప్పనిసరిగా ఉంటుంది.

అటువంటి ఎన్నికల సంఘం మీద ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్న నాయకుడు నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే పిల్లలాటగా తీసి పారేయడం సమంజసం అనిపించుకోదు. అసలే ఏ ఏటికాఏడు ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత, ఏ కారణంవల్ల అయితేనేమీ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఏవగింపునకు ఇదంతా తోడయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తి గడించిన భారతదేశం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? 

రాష్ట్రంపై చలి పంజా

మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజుల వరకు రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తే, కొద్ది విరామం తరువాత రాష్ట్రంలో చలి పంజా విసరడం మొదలయింది. గత రెండు రోజులుగా చలి తీవ్రతో రాష్ట్రంలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఏవిదమయిన ఉష్ణోగ్రతలు ఉంటాయోన ని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా రా ష్ట్రంలో రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీలు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో పాటుఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్ 14.7, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, వికారాబాద్ 14.8, కొమరంభీంలో 14.8, శంకర్‌పల్లి 14.9, మొయినాబాద్ 15,

, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శేరిలింగంపలి, రాజేంద్రనగర్, హెచ్‌సీయూలో 15.3, రామచంద్రాపురం, పఠాన్‌చెరువు, బీహెచ్‌ఈఎల్‌లో 15.5, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్‌లో 15.7, చందానగర్ 15.9, బేగంపేట 16.4, మల్కాజ్‌గిరి, అల్వాల్ 17.1, గాజులరామారం 17.4, గోషామహాల్, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఆదివారం మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని డిజిడిజిఎస్ వెల్లడించింది.

మూడు రోజులు మరింత తగ్గే అవకాశం

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని టిజిడిపిఎస్ వెల్లడించింది. కొమరం భీం జిల్లాలో అత్యధికంగా 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు ఆదివారం కామారెడ్డిలో 13.7, మెదక్‌లో 14.5, రంగారెడ్డిలో 14.8, ఆదిలాబాద్‌లో 13.5, నిజామాబాద్‌లో 13.9, వికారాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర ప్లానింగ్ డెవలెప్‌మెంట్ ప్లానింగ్ సోసైటీ పేర్కొంది.

క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తుండగా పేలిన గ్యాస్ సిలెండర్

క్రషర్ యంత్రాన్ని వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలిన సంఘటనలో నలుగురు తీవ్రంగ గాయపడి చికిత్స పొందుతుండగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం. వట్టినాగులపల్లిలోని సపర్ణ క్రషర్ కంపనీలో వెస్ట్ బెంగాల్ కి చెందిన రూపం సాహు(20), చంచల్ కమ్రి (19), సూరజ్ సింగ్(25), పూర్ణతరై(21)లు పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి క్రషర్ యంత్రానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్తో వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ నలుగురిని ఉస్మానియా దవఖానకు తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వార ఫలాలు (09-11-2025 నుండి 15-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో. వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైతేతప్ప చేయకుండా ఉండటం మంచిది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఇక కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఇంట బయట కొన్ని చికాకులు ఏర్పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి కుబేర కుంకుమతో అమ్మవారిని స్వామివారిని పూజించండి. నూతనవ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్.

మిధున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరుగుతుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు. అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడతాయి. పోటీపరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సంతాన సంబంధిత విషయం వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసివచ్చే రంగు గ్రీన్.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాలల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. భూ వివాదాలు తీరుతాయి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గో సేవ చేస్తారు. ఈరాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు తెలుపు.

సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ఏ కార్యక్రమం మొదలు పెట్టిన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు స్నేహితులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు అనుకున్నట్టుగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచన నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటేతొలగిపోతాయి. ఈ రాశి వారికి సమయానికి ధనం చేతికి అందుతుంది. మీరు ప్రయత్నం పూర్వకంగా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది. పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్నపాటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపార రీత్యా రావలసిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. అదే విధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండటం మంచిది. అదేవిధంగా లాయర్స్ కి డాక్టర్స్ కి చార్టెడ్ అకౌంట్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు పనికిరావు దాని వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో ట్రాన్స్ఫర్ గురించి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పుడో పెట్టుబడి పెట్టిన వాటికి కూడా మంచి లాభం వస్తుంది. వీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే తిరిగి రాదు కావున అవసరమైతే తప్ప ఎవరికీ ఇవ్వరాదు లేదంటే సేవింగ్స్ రూపంలో వెళ్లడం మంచిది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ వెండి మీద కానీ పెట్టండి కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయటం అలాగే మొగలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమ తో అమ్మవారిని స్వామివారిని ఆరాధించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ పరంగా లేదా సామాజికపరంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే తప్ప కొనకపోవడం మంచిది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా బాగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు దేవదర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా నరాల సంబంధిత మరియు జలుబు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. కన్సల్టెన్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్య వృత్తిలో ఉన్నవారికి మార్కెటింగ్ పరికరాలకు సంబంధించిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్టీలు మరియు ఐరన్ ఈ రంగాల వారికి చాలా బాగా అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు అవార్డులు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఈ రాశి వారు శివుడికి అభిషేకం కానీ ప్రతిరోజు ఓం నమశివాయ జపం 108 సార్లు కానీ చేయటం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతే పెట్టుబడి పెట్టండి. క్రయ విక్రయాలకు సంబంధించిన లాభాలు కూడా బాగున్నాయి. స్థలాన్ని కానీ ఇంటిని గాని కొనుగోలు చేస్తారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదరటం అలాగే చేజారిపోయిన సంబంధాలు కూడా తిరిగి రావటం జరుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మీ వల్ల పదిమందికి ఉపయోగం ఉంటుంది కానీ వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయండి అలాగే ఉదయం సాయంత్రం ఆరావళి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమతో ప్రతిరోజు స్వామివారిని అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే.

తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తివ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గైనిక్ మరియు గ్యాస్టిక్ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు అధికంగా సంపాదిస్తారు. కానీ ధనం వచ్చినట్టే వచ్చి ఖర్చవుతుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది మంచివారు ఎవరో చెడ్డ వారు ఎవరో ముందే గ్రహించండి. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మీకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఈ కార్తీకమాసంలో రుద్రాభిషేకం కానీ శివ నామస్మరణ కాని చేయండి మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయటం మంచిది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు బ్లూ.

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటినుంచో పడుతున్న బాధలకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఆధ్యాత్మికంగానూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దైవ దర్శనాలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. రాదు అనుకునే ధనం చేతికి అందుతుంది దాని ద్వారా శుభకార్యాలు కూడా చేస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఒక ఇల్లు గాని ఫ్లాట్ గాని కొనుగోలు చేస్తారు. పర్సనల్ లోన్స్ కు దూరంగా ఉండటం మంచిది. పదిమందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దక్షిణా మూర్తి రూపును మెడలో ధరించండి మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా ఉన్నా చిన్నచిన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహరాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. చదువు మీద శ్రద్ధ కొనసాగించండి. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ప్రారంభించండి కాలం అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వతులతో దీపరాధన చేయటం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు గ్రే.

ధనస్సు రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. అందరితో కలిసి మెలిసి ఉంటూ మన పని మనం చేసుకోవటం మంచిది. ఎవరు మనవారు ఎవరు పరాయివారు తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు ముందుకు వెనక్కి ఉంటూ అంత ఆశాజనకంగా ఉండవు. వినాయకుడికి దండం పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు సొంత నిర్ణయాలను మాత్రమే పాటించండి. విదేశీ సంబంధిత వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పనులు నిదానంగా సాగిన చివరకు సక్రమంగా పూర్తవుతాయి ఓపిక వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు పెట్టుకుంటే ఒకవేళ ఇంట్లో వారితోనే పెట్టుకోండి కలిసి వస్తాయి బయట వారితో కలిసి రావు. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కాలమని చెప్పవచ్చు. అనుకోని పదవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. సినీ కళా రంగాల వారికి అడ్మినిస్ట్రేషన్ వారికి ఫైనాన్సు సెక్టార్ లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించు కుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యరీత్యా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగి పోతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగం పోతుందేమో అనుకునే వారికి స్థిరత్వం ఉంటుంది . అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా గడిచిన కొంతకాలం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం కూడా కుదురుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్స్, స్టీలు రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి లాయర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెగిటివ్ గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఆర్మీలో ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు అండదండలు బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన కోసం ప్రయత్నం చేసే వారు మంచి శుభవార్తను వింటారు. సంతానయోగం ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా ప్రారంభించ వచ్చు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే.

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్న పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. గో సేవ చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి._విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అవుతుంది. మీ కార్తీకమాసంలో ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నీవే బ్లూ.

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన విషయాలలో వాగ్దానాలు, మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతోనువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్.

 

 

“డిఎన్‌ఎ” ఆవిష్కరణ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత

 డిఎన్‌ఎలో డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించి విశ్వవిఖ్యాత కీర్తి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ (97) గురువారం నార్త్‌పోర్ట్‌లో కన్నుమూశారు. ఆయన కుమారుడు డంకన్ వాట్రస్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు. డిఎన్‌ఎ ఆవిష్కరణకు గాను ఫ్రాన్సిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్‌తో కలిసి నోబెల్ బహుమతిని 1962 లో అందుకున్నారు. 1928 ఏప్రిల్ 6 న చికాగోలో జన్మించిన వాట్సన్ 19 ఏళ్లకే చికాగో యూనివర్శిటీ నుంచి జువాలజీ, ఆ తరువాత మూడేళ్లకే ఇండియానా యూనివర్శిటీ నుండి పిహెచ్‌డి పొందారు. 1953 లో డీఎన్‌ఏ డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించారు. ఇది వంశపారంపర్య సమాచారాన్ని తరాల బదిలీ చేయడానికి

అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది. ఈ ఆవిష్కరణకు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రేరణగా నిలిచింది. జన్యుశ్రేణి, ఫోరెన్సిక్ విశ్లేషణ, వారసత్వ వ్యాధుల అధ్యయనానికి ద్వారాలు తెరిచింది. జన్యుపరీక్ష అభివృద్ధి నుంచి బయోటెక్నాలజీ, ఆధునిక వైద్యం వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. జాతుల మధ్య మేధస్సు తేడాలు ఉన్నాయని, స్త్రీలపై , లింగ భేదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2014లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన నోబెల్ బహుమతిని వేలం వేయగా రష్యా బిలియనీర్ 4.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి వాట్సన్‌కు సాయం అందించారు. 

చంద్రయాన్ 2 అధునాతన డేటా ఇస్రో సేకరణ

చంద్రుని ధ్రువ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి చంద్రయాన్2 లూనార్ ఆర్బిటర్ నుంచి అత్యంత ఆధునిక డేటాను సేకరించినట్టు ఇస్రో శనివారం వెల్లడించింది. చంద్రుని ధ్రువ ప్రాంతాల ఉపరితలంపైని భౌతిక, విద్యుద్వాహక ప్రమాణాల లక్షణాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి వీలవుతుందని పేర్కొంది. చంద్రునిపై భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలకు ఈ డేటా ఉపయోగపడుతుందని వివరించింది. 2019 నుంచి చంద్రుని కక్షలో చంద్రయాన్ 2 ఆర్బిటర్ పరిభ్రమిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరించిందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 2 ప్రయోగించిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 1400 రాడార్ డేటా సెట్ల సమాచారం గ్రహించడమైందని, ఉత్తర, దక్షిణ ధ్రువాల 8ం నుంచి 90 డిగ్రీల అక్షాంశాల్లో ధ్రువ మాపక నమూనా సృష్టించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఇస్రో వివరించింది. 

బెంగాల్ కుగ్రామంలో యువతుల పెళ్లి

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతంలో గ్రామ దేవత ఆలయం ఎదుట నిలబడి ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి నదులకు రక్షణగా ఉన్నట్లున్న దట్టమైన అడవులు. మామిడి తోటల మధ్యలో ప్రశాంతంగా ఉండే జలబేరియా తండాలో ఈ వింత వివాహ తంతు జరిగింది. శాస్త్రీయ నృత్య కళాకారిణులు యువతులు రియా సర్దార్, రాఖీ నస్కార్‌లు మనువాడారు. ఈ నెల 4వ తేదీన స్థానిక పలేరు చాక్ దేవాలయం ఆవరణలో వందలాదిగా జనం తరలిరాగా, కొందరు ఉత్సాహంగా శంఖాలు పూరిస్తూ ఉండగా, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ ఉండగా , ఇంకా 20 సంవత్సరాలు కూడా రాని ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. మాంగల్యధారణ జరిగింది. రియా వధువు వేషధారణతో, రాఖీ వరుడిగా తలపాగాతో కన్పించారు.

స్థానిక పూజారి ఈ పెళ్లి తంతును మంత్రాల నడుమ సంపూర్తి చేశారు. తండావారిలో అనేకలు విస్మయం చెందారు. మౌనంగా ఈ విచిత్ర వివాహాన్ని ఆమోదించారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడ మగ భేధ భావన అనుచితం, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఒక్కటి కావాలనుకున్నామని, అదే చేశామని వారు ప్రకటించారు. తాము యుక్త వయస్కులం, మేజర్లమని, తమ జీవితాన్ని తాము ఎంచుకున్నామని ఇరువురు సవినయంగా తెలిపారు. ఈ పెళ్లి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని, అయినా స్థానికులు దగ్గరుండి చేయించిన పెళ్లి, ఇది ఎటువంటిది అయినా తాము చేసేది ఏమీ లేదని, పిలిస్తే తాము కూడా వెళ్లి , విందు భోజనం ఆరగించి వచ్చేవారమని స్థానిక పోలీసులు తెలిపారు

జాతీయ రహదారిపై కారు దగ్ధం

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైoది. ఎస్‌ఐ రవికుమార్ తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వినోద్ పటేల్ తన కారులో కుటుంబ సభ్యులతో ఏడుగురుతో కలిసి విజయవాడకు వెళుతుండగా గుండ్రంపల్లి శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో ఉన్న యూటర్న్ వద్ద కారు డివైడర్‌కు ఢీకొట్టింది. దీంతో వేగంగా ఉన్న కారు రివర్స్‌లో పల్టీ కొట్టింది. వెంటనే అందులో ఉన్న వారంతా అప్రమత్తమై నుంచి బయటికి వచ్చారు. అయితే, కారుకు అగ్గి రాజుకుని కాసేపట్లోనే మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న వినోద్ పాటేల్‌కు రెండు మోచేతులకు గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమవుతున్న కారును ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.