Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

eyüp escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

casibom giriş

esenyurt escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

jojobet güncel giriş

kingroyal

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

తనిఖీ సరే, బోధన ఎలా!

ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు శాశ్వతంగా తనిఖీ బృందాలు నియమించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. సుమారు 24 వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి 299 కమిటీలువేసి వాటిలో పాఠశాలల్లో బోధించి కనీసంగా పదేళ్ళ బోధనానుభవం కలవారిని శాశ్వతంగా తనిఖీ బృందాలుగా నియమిస్తారు.16,474 ప్రాథమిక పాఠశాలల తనిఖీకి 504 మంది ఉపాధ్యాయులతో 168 తనిఖీ బృందాలు, 3,100 మాధ్యమిక పాఠశాలలకు 105 మంది ఉపాధ్యాయులను 35 బృందాలుగా, 4,672 ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు 864 మంది ఉపాధ్యాయులతో 96 పర్యవేక్షణా బృందాలు వెరసి 1473 మంది ఉపాధ్యాయులు శాశ్వతంగా మానెటరింగ్ ప్రక్రియలో వినియోగం చేస్తారు. ఇక ఈ తనిఖీ బృందాలలో నియమితులైన వారెవరూ ఇంకా వారివారి పాఠశాలల కెళ్ళి పాఠాలు చెప్పవలసిన పనిలేదు. అంటే 1473 పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనా సేవలు ఇంకా అందవని అర్థం.

ఇక గత ముప్పైఏళ్ళుగా పాఠశాలల తనిఖీ అధికారులు అయిన మండల విద్యాశాఖ్య అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ పోస్టులు నింపకుండా విద్యాశాఖ చోద్యం చూస్తా ఉంది. అత్యంత కీలకమైన ఈ పాఠశాల తనిఖీ అధికారులు పోస్టులు నింపకపోగా తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌ఛార్జీలను వేసి చేతులు దులుపుకుంటున్నారు. నియమించిన ఈ తనిఖీ అధికారులు ఎప్పటిదాకా ఉంటారో, పోస్టు ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 634 మండల విద్యాశాఖ అధికారులు, 70 మంది జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, 33 మంది జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీకి అధికారికంగా ఉండగా, తాజాగా ఈ నియామకాల వల్ల విద్యాశాఖ సాధించేది ఏమీ ఉండదు? ఇంతకు ముందు అనుభవాలు మనకు ఉండనే ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో ఓ 30 ఏళ్ళ క్రితం మండల విద్యా వనరుల కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులు బృందాలను మండల రీసోర్స్ పర్సన్ లుగా నియమించి ఓ దశాబ్దం పాటు ప్రయోగం చేశారు. ఈ రీసోర్స్ పర్షన్ల నియామకం వలన ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరే లేదని, పైగా ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందని తిరిగి వారందరినీ వారివారి పాఠశాలకు పంపించి వేశారు. తనిఖీ బృందాలలో నియమితులైన వీరు ఉద్యోగ ధర్మం కంటే సొంతపనులపై తిరిగారనే విమర్శలు ఉన్నాయి. కొందరైతే సొంత వ్యాపారాలు ప్రారంభించారు.

మరికొందరు ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సిన సమయంలో సొంత పనులు చక్కబెట్టుకున్నానే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే విద్యాహక్కు చట్టం -2009 వచ్చిన తర్వాత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతృత్వంలో ఒక సబ్జెక్టు నిపుణుల బృందంను వారంలో ఒకరోజు ఇతర పాఠశాలల తనిఖీకి వాడుకున్నారు. అయితే ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధానానికి కూడా మంగళం పాడారు. గత అనుభవాలు ఉండికూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయడం వలన విఫల ప్రయోగం కాదా? తెలంగాణ విద్యా శాఖ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఈ తనిఖీ బృందాలు నియామకం వలన మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ ఉప అధికారులకు ప్రత్యామ్నాయంగా మరో అధికార కేంద్రం అనధికారికంగా పెట్టారనే భావన, పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు తమ తోటి ఉపాధ్యాయులే, సమాన హోదాలో తమను తనిఖీ చేయడం ఏమిటి? అనే ఒక రకమైన ఆత్మనూన్యతకు గురయ్యేఅవకాశం ఉంది.

ఇక తనిఖీ బృందాలకు టిఎ, డిఎల కోసం లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతచేస్తే చివరకు 60 శాతం విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలలు తనిఖీకి వీరికి అధికారం కల్పిస్తారా? లేదా? కేవలం 40 శాతం పిల్లలున్న ప్రభుత్వ పాఠశాలకే ఈ తనిఖీలను పరిమితం చేస్తారా? ఇలా చేసినట్లైతే అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నియంత్రణ కనీసంగా లేని ప్రైవేటు పాఠశాల మానెటరింగ్‌కు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రైవేటు పాఠశాలల ప్రక్షాళన, నియంత్రణ అవసరం లేదా? అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన, కేవలం గణితం, సైన్స్ తప్ప మరో సబ్జెక్టుపై బోధన కేంద్రీకరించలేని ప్రైవేటు పాఠశాల తనిఖీ బాధ్యత ఎవరు చేపట్టాలి? ఇక విద్యాహక్కు చట్టం -2009 లోని నిబంధన 19 (1)హెచ్ ననుసరించి 2010 ఏప్రిల్ నుండి మన పరీక్షా విధానం సమూలమైన మార్పుకు గురైంది.

సులభతరమైన, ఒత్తిడి లేని నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో తనిఖీ అధికారులు అవసరం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తరగతి గది మధ్య ఎప్పటికప్పుడు అత్యంత సులభతరంగా ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈ పునచ్ఛరణ అనుభవం నుండే అటు ఉపాధ్యాయుడు తన బోధనా అనుభవాలు స్థిరీకరణ జరుగుతుంది. మరోవైపు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొంటారు. ఎందుకో మన తెలంగాణ విద్యాశాఖ ఇసిసిఇ విధానాన్ని జీర్ణించుకున్నట్లు కనిపించడంలేదు. అందుకు తాజా ఉదాహరణ గత దశాబ్ద కాలంగా నడుస్తున్న పదవ తరగతి పరీక్షలలో గ్రేడులకు బదులు తిరిగి మార్కులు ప్రవేశపెట్టడం. తరగతి గది మూల్యాంకనం ప్రక్రియ అయిన నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అవుతుంది. పరీక్షలను చట్టబద్ధ స్థితి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెప్పు కోసం గ్రేడుల నుండి మార్కుల వైపు మోగ్గు చూపిన వైనం స్పష్టంగా కనపడుతుంది. గతంలో మండల రీసోర్స్ పర్షన్ల నియామకాలు వలన తేలింది ఏమంటే చాలా చోట్ల ఎంఆర్‌పిలు తమ విధులు విస్మరించి సొంత పనుల వైపు మొగ్గారు.

విద్యాశాఖ అధికారులకు దళారీ వ్యవస్థగా పని చేశారు. పాఠశాలలు తనిఖీలు చేయాల్సిన వీరు కాగితాలు స్వీకరించి, కాకి లెక్కలు, గణాంకాలు, నివేదికలు స్వీకరించే పరిస్థితి మాత్రమే ఉండేది. ఆ కాగితాలు కంప్యూటర్ కెక్కించడంపై సమీక్షలు తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదు! కనుక తెలంగాణ విద్యాశాఖ పెద్ద సంఖ్యలో శాశ్వతంగా మానెటరింగ్ జట్టును నిర్మించేటప్పుడు గత అనుభవాలను తప్పనిసరిగా సమీక్షించుకోవాలసిన అవసరం ఉంది. తనిఖీ అధికారులు ఏర్పరిచే ముందు నమోదు క్షీణించిపోతున్న ప్రభుత్వ బడుల సంస్కరణ, పునర్వ్యవస్థీకరణ వైపు దృష్టి పెట్టడంతోపాటు, ప్రైవేటు పాఠశాలల వనరులలోపం, నిబంధనలు ఉల్లంఘన, ఫీజుల క్రమబద్ధీకరణ తదితర విషయాలు తనిఖీ చేసి చక్కదిద్దాల్సిన బాధ్యత విద్యాశాఖ పైన ఉంది.

ఎన్. తిర్మల్

94418 64514 

నేడే జూబ్లీ ఫైట్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం మొ త్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పో లింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పో లింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంట ల లోపల కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓట రు.. ఎంత రాత్రి అయినా ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నిక కోసం 2,394 ఇవిఎంలు, 595 వీవీప్యాట్లు, 561 కం ట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇవిఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. ఉప ఎన్నికకు 139 ప్రాంతాలలో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు.

ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయా కేంద్రాలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ని ర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పా టు వికలాంగులు, వృద్ధులకు వీల్ ఛైర్లనూ ఏర్పా టు చేస్తున్నారు. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో పాటు ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టింది.

మొత్తం ఓటర్లు 4,01,365 మంది

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లుండగా.. అందులో 2,08,561 మంది పురుషులు.. 1,92,779 మంది మహిళలు.. ఇతరులు 25 మంది ఉన్నారు.18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్‌లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు.

58 మంది అభ్యర్థులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా 1,761 మంది రాష్ట్ర పోలీసులు, 8 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 4 వీడియో సర్వలెన్స్ టీమ్‌లు, 4 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, రెండు అకౌంటింగ్ బృందాలు పని చేయనున్నాయి.

68 కేంద్రాల వద్ద సిఆర్‌పిఎఫ్‌తో భద్రత : సిఇఒ సుదర్శన్‌రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికలో మొదటిసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 24 గంటలపాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు 1950 నెంబర్ ఫోన్ చేసిన ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ ఎన్నిక కోసం 2060 మంది ఎన్నికల సిబ్బంది, 2000 మంది పోలీసు సిబ్బంది పనిచేయబోతున్నట్లు చెప్పారు. వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నిఘా పెడతామని తెలిపారు.

హై అలర్ట్

మన తెలంగాణ, సిటిబ్యూరో/శంషాబాద్: ఢిల్లీ లో పేలుళ్లు జరగడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రా లను అప్రమత్తం చేసింది. దీంతో నగర పోలీసు లు తనిఖీలు చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో పో లీసులను మోహరించారు, ఎలాంటి సంఘటన లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముం దస్తుగా చర్యలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ని యోజకవర్గానికి ఉప ఎన్నికలు మంగళవారం జ రగనుండడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్న పోలీసులు పేలుళ్ల తో మరింత అప్రమత్తం అయ్యారు. నగరానికి చెందిన వైద్యుడిని పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో గుజరాత్ ఎటిఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన మరుసటి రోజే ఢిల్లీలో పేలుళ్లు జరగడం తో వైద్యుడి అరెస్టుకు దానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీస్ ఉన్నతాధి కారులు ఆరా తీస్తున్నారు. గుజరాత్ ఎటిఎస్ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారించ గా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ వేసినట్లు ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. ప్ర ధానంగా జనరద్దీ ప్రాంతాలైన ప్రధాన బస్టాండ్ లు ఎంజిబిఎస్, కోఠి, ఆబిడ్స్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నగరంలోని అన్ని జోన్లలో పెట్రోలింగ్‌ను పెంచారు. రవాణా మార్గాలు, మార్కెట్లు, మాల్స్, మెట్రో స్టేషన్‌ల వద్ద వాహన తనిఖీలు చేశారు. సైబర్ టీమ్‌లు సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తున్నా యి. ‘ఢిల్లీ ఘటనతో మేము అలర్ట్‌లో ఉన్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాస్పద కార్యక లాపాలు కనిపిస్తే 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సెంట్రల్, సౌత్, ఈస్ట్ జోన్లలో ప్రత్యేక స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. పాతబస్తీ, హైటెక్ సిటీ, హుస్సేన్ సాగర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిసిటివీలు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఢిల్లీ పోలీసు లతో కూడా సమన్వయం చేస్తోంది.

ప్రజలకు జాగ్రత్తలు: పోలీసుల సూచనలు

హైదరాబాద్ పోలీసులు ప్రజలకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద వాహనాలు/వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండని కోరారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, రూమర్లు షేర్ చేయకండి. వెరిఫై చేసి మాత్రమే పోస్ట్ చేయండన్నారు.

మాల్స్, మార్కెట్లు, మెట్రోలో బ్యాగ్‌లు, వాహనాలు తనిఖీలకు సహకరించాలన్నారు. పేలుడు సందేహం ఉంటే ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని, ఫైర్ ఆలారమ్‌లు ఆన్ చేయండని సూచించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముమ్మర తనిఖీలు

డిల్లీలో పేలుడు నేపద్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ముమ్మర తనిఖీలు జరిపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ఎయిర్‌పోర్టు అధికారు లు తనిఖీలు నిర్వహించారు . ఎయిర్ పోర్ట్‌లోకి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతి ఇస్తున్నారు. అను మానం వచ్చిన వాహనాన్ని వాహనంలోని లగేజీ బ్యాగ్‌లను తీసి మరీ తనిఖీలు చేపట్టారు. ఎవరైన అనుమానితులు అనిపిస్తే వారిని ప్రశ్నిస్తున్నా రు. తనిఖీలో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ, ఎయిర్ పోర్ట్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గోన్నాయి. 

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వే యడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టు లో బిఆర్‌ఎస్ పార్టీ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసింది. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేద ని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేన ని పిటిషన్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. మరోవైపు, ఎంఎల్‌ఎలపై విచారణకు సంబంధించి తమకు మరింత గడు వు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది.

స్పీకర్ అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఈ నెల 14న విచారణ చేపట్టనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తుందని కోర్టు లిస్ట్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ కారు గుర్తుపై గెలుపొందిన ఎంఎల్‌ఏలలో పది మంది కాంగ్రెస్‌లో చేరినందున, వారిపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ ఎంఎల్‌ఏలు స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, తమ పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టించుకోవడం లేదని, ఫిరాయింపు ఎంఎల్‌ఏలకు కనీసం నోటీసులు కూడా పంపించలేదని పిటిషనర్లు (బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు) సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

దీంతో మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు స్పీకర్‌కు సూచించింది. సుప్రీం విధించిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. ఇదిలాఉండగా సుప్రీం విధించిన గడువులోగా విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ పది మంది ఎంఎల్‌ఏలకు నోటీసులు పంపించగా, వారిలో ఎనిమిది మంది కౌంటర్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన స్పీకర్ గడువులోగా నాలుగు పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు విన్నారు. మిగతా నలుగురు ఎంఎల్‌ఏల పిటిషన్ల వాదనలు వినేందుకు తనకు మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి గడువు ముగియడానికి వారం రోజుల ముందుగానే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు, కామన్‌వెల్త్ స్పీకర్ల సదస్సుకు హాజరు కావడం వల్ల సకాలంలో పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని, కాబట్టి మరో రెండు నెలల గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం 14న విచారణ చేపట్టనున్నది.

బంగారం ధర మళ్లీ పెరుగుతోంది..

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలపడడం, పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల అం తర్జాతీయ మార్కెట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం 4 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది, ఇది క్రితం రోజు 1,22,020తో పోలిస్తే రూ.1,200 పెరుగుదలను చూసిం ది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,12,950గా ఉంది, ఇది క్రితం రోజు రూ.1,11,850తో పోలిస్తే రూ.1,100 పెరిగింది.

మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2500 పెరిగి రూ.1,55,000కు చేరుకుంది. క్రితం రోజు ఇది రూ. 1,52,500గా ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) తెలిపింది. వే2వెల్త్ బ్రోకర్స్ రీసెర్చ్ అనలిస్ట్ అభిషేక్ ఎం పెలు ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ ప్రస్తుతం కన్సాలిడేషన్ జోన్‌లో ఉందని, తక్షణ నిరోధకం రూ.1,22,145 వద్ద, మద్దతు రూ.1,19,150 వద్ద ఉంది. బంగారం ధరలు బలహీన ధోరణిలోనే ఉన్నందున ట్రేడర్లు రూ.1,21,630 వద్ద అమ్మకాలు పరిగణించవచ్చు అని ఆయన అన్నారు. ఐసిఐసిఐ డైరెక్ట్ విశ్లేషణ ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,20,000 స్థాయి పైన ఉంటే రూ.1,22,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

అదే విధంగా ఎంసిఎక్స్ సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,46,000 పైన ఉంటే రూ.1,50,000 వరకు జంప్ చేసే అవకాశం ఉంది. నిర్మల్ బాంగ్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక బలహీనత, గవర్నమెంట్ షట్‌డౌన్‌పై అనిశ్చితి వల్ల గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. ఐసిఐసిఐ డైరెక్ట్ రీసెర్చ్ ప్రకారం, స్పాట్ గోల్డ్ 4,080 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక మందగమనం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.

‘పాంచ్ మినార్’ వచ్చేది అప్పుడే

రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సోమవారం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

లోపాలు సరిదిద్దుకోవాల్సిందే: ప్రధాన కోచ్ గంభీర్

ముంబై: రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు సభ్యులు తమ లోపాలను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్‌నకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలివుందని, ఇలాంటి స్థితిలో ప్రతి ఆటగాడు వైఫల్యాలపై దృష్టి సారించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ ఆట తీరు తనను ఆందోళన గురి చేసిందన్నాడు. ఇలాంటి ఆటతో వరల్డ్‌కప్ వంటి మెగా ట్రోఫీని సాధించడం చాలా కష్టమైన అంశమన్నాడు. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారన్నాడు.

అంతేగాక చాలా మంది క్రికెటర్లు పూర్తి ఫిట్‌నెస్‌తో లేరన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ కలవరానికి గురి చేస్తుందన్నాడు. ప్రపంచకప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని, ఫిట్‌నెస్ పరంగా సిద్ధంగా ఉండాలని గంభీర్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ ఆటగాళ్లతో మాట్లాడిన వీడియో క్లిప్‌ను బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో గంభీర్ టీమిండియా సభ్యులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. అంతేగాక కొంత మంది కీలక ఆటగాళ్ల ఆట తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గంభీర్ వీడియో వైరల్‌గా మారింది.

మంగళవారం రాశి ఫలాలు (11-11-2025)

మేషం

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిధునం

ఉద్యోగాలలో అనుకూల వాతావరణంఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి.

కర్కాటకం

స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

సింహం

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

కన్య

స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తుల

కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం

మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం

ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

కుంభం

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మీనం

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

 

అభిషేక్ అద్భుత క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ ప్రశంసలు

లండన్: టీమిండియా యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. టి20 ఫార్మాట్‌లో అభిషేక్‌ను మించి ఓపెనర్ ఎవరూ లేరని పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్‌లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడన్నాడు. ఎంత పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో వన్డేల్లోనూ అతను మెరుగైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదన్నాడు.

అతి చిన్న వయసులోనే అభిషేక్ అగ్రశ్రేణి ఓపెనర్‌గా ఎదగడం టీమిండియాకు అతి పెద్ద ఊరట అని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో అతను టి20 ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ తీరు ఎంతో ఆకట్టుకుంటుందన్నాడు. భారత్‌కు లభించిన అత్యుత్తమ ఓపెనర్లలో అభిషేక్ ఒకడని, అతనికి ఎంతో భవిష్యత్తు ఉందని పీటర్సన్ పేర్కొన్నాడు.

సిద్ధరామయ్యకు హైకమాండ్ ఝలక్.. సిఎం మార్పుపై జోరుగా ప్రచారం

న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైందా? డిప్యూటీ సిఎం డికె శివకుమార్ వరుస హస్తిన పర్యటనలు దేనికి సంకేతం. ఢిల్లీకి వస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకం పోవడం వెనక ఏం దాగుంది. ఇదంతా ఎలాంటి పరిణామాలకు తావివ్వబోతోందన్న చర్చ కర్నాటకలో మళ్లీ జోరందుకుంది. ఇదంతా నాయకత్వ మార్పు దిశగానే వెళ్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య తమను కలిసేందుకు అధిష్టానంలోని ప్రముఖులు మొహం చాటేశారని జాతీయ మీడియా కథనాలు వెలువరించడం, ఈ నెలాఖరులో ఆ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కూడా ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఒక పుస్తకావిష్కరణ కోసం సిద్ధరామయ్య ఢిల్లీ రావాల్సి ఉందని, అదే సమయంలో హై కమాండ్‌లోని కీలక నేతలను కలిసేందుకు అపాయింట్‌టమెంట్ కోరినట్లు తెలిసింది. అయితే దానికి వారు ససేమిరా అనడమే కాకుండా ఇప్పుడు అలాంటివేమీ వద్దని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఓటు చోరీ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తరచూ డికె శివకుమార్ చెబుతున్నప్పటికీ అవి నమ్మశక్యంగా లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య, డికె శివకుమార్ సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే చివరికి సీనియర్ అయిన సిద్ధరామయ్యవైపే అధిష్టానం మొగ్గు చూపింది. డికె శివకుమార్‌ను బుజ్జగిస్తూనే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంపకాలు చేసినట్లు, తదనుగుణంగా ఒప్పందం కుదర్చినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ సమయం రావడంతో మళ్లీ సిఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది.