Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

bets10

casinolevant

casinolevant

casinolevant

casinolevant

nesinecasino

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

matbet giriş

jojobet

holiganbet

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

meritking

madridbet

kingroyal

pusulabet giriş

marsbahis

kavbet

pusulabet

ఎసిబి వలలో కారేపల్లి ఆర్‌ఐ

 ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఆర్‌ఐ శుభ కామేశ్వరి దేవి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నివేదికను రాసేందుకు పదివేల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద ఎసిబి సిబ్బందితో వలవేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని చేసేందుకు లంచం అడిగితే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

హెచ్1 బీ దరఖాస్తుదారులు అక్టోబర్ వరకు ఆగాల్సిందే !

అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో హెచ్1 బీ దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి తలెత్తింది. అనేక మంది వీసా దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరు వరకు వాయిదా పడినట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. డిసెంబరు జనవరిలో జరగాల్సిన హెచ్1 బీ ,హెచ్4 వీసా ఇంటర్వూలను వచ్చే ఏడాది ఫిబ్రవరిమార్చికి రీషెడ్యూల్ చేసినట్టు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని , అందువల్లే ఇంటర్వూలను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి, ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరు 15 నుంచి హెచ్1బి, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించింది. దీనికి వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది.

భారత్ ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

 భారత్ ఒమన్ మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) పై సంతకాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటన సందర్భంగా ఇక్కడికి రాగానే గురువారం దేశ సర్వం సహాధికార పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో విస్తృత సాదర చర్చలు జరిపారు. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య హద్దులు లేని ఒప్ంపందం ఖరారు అయింది. ప్రపంచ ఆర్థిక రంగ సంక్షోభం దశలో, అమెరికా నుంచి భారీ స్థాయి సుంకాల నేపథ్యంలో భారత్‌కు ఈ ఒప్పందం కీలక ఉపయుక్త అంశం అవుతుందని అధికార వర్గాలు విశ్లేషించాయి. ఇథియోపియా పర్యటన తరువాత ప్రధాని మోడీ బుధవారం రాత్రి ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లోని అల్ బరాకా ప్యాలెస్ వద్ద ప్రధాని మోడీ సుల్తాన్ సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ప్రగాఢం చేసుకునేందుకు ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70 సంవత్సరాలు అవుతున్న పూర్వ రంగంలోనే సుల్తాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని ఒమన్‌కు వెళ్లారు. ఆయన తలపెట్టిన నాలుగు దేశాల పర్యటనలో ఇది చివరి మజిలీ అయింది. ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో అనేక రంగాలపై దృష్టి సారించారు. రక్షణ, భద్రత, వ్యాపార వాణిజ్య , ప్రత్యేకించి పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, నూతన రూపు దిద్దుకుంటున్న సృజనాత్మక రంగాలపై కూడా నేతలు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు భారత్ ఒమన్ వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, యూసఫ్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరింది. దీనిపై ఇప్పుడు మోడీ, సుల్తాన్ సమీక్షించారు. ఇది కీలక ఒప్పందం అని అబిప్రాయపడ్డారు. గ్లోబల్ ఆర్థిక సరఫరాల వ్యవస్థ పునరేకీకరణల దశలో ఒమన్‌తో కుదిరిన ఎఫ్‌టిఎ చారిత్రకం అయింది. పైగా ఇంతకు ముందు ఒమన్ వేరే ఒక్కదేశంతోనే ఈ ఒప్పందానికి దిగింది.

భారత్‌కు ఈ విషయంలో రెండవ స్థానం దక్కింది. ఇప్పుడు ఇరుదేశాల పౌరులకు మరిన్ని ఉద్యోగాలు, సముచిత మార్కెట్ అనుసంధానం , వ్యాపార వృద్థికి బాటలు వేసేందుకు ఇప్పటి ఒప్పందాలు దోహదం చేస్తాయని జైస్వాల్ తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం క్రమంలో భారత్ నుంచి ఒమన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖనిజ ఇంధనాలు, రసాయనాలు, విలువైన లోహాలు, స్టీల్, తృణధాన్యాలు, షిప్‌లు, బోట్స్ , బాయిలర్స్ , ఎలక్ట్రిక్ యంత్ర సామాగ్రి , టీ కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పగడాలు, పలు ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు వీలేర్పడుతుంది. ఇక విస్తృతమైన భారతీయ మార్కెటను ఒమన్ సద్వినియోగపర్చుకుంటుంది.

49 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ లో హరియాణా, ఝార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హిరియాణా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఝార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 262 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు) సెంచరీ చేశాడు. కుమార్ కుశాగ్రా(81; 38 బంతుల్లో 8 ఫోర్లు,5 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు.రాబిన్ మింజ్(31;14 బంతుల్లో 3 సిక్స్ లు), అనుకుల్ రాయ్(40; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు చేశారు.

  

గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? ; మంత్రి పొంగులేటి

గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? ఉపాధి హామీ పథకం పేరు మార్పు గాంధీజీని అవమానించినట్లేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం ఎత్తారు. గాంధీజీ పేరును తొలగించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపిఏ ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే గడచిన పది సంవత్సరాల నుంచి బిజెపి ప్రభుత్వం ఆ పథకానికి తూట్లుపొడుస్తూ నీరుగారుస్తోందని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. మహాత్మాగాంధీ పేరును తొలగించి, రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని నెట్టడం పేదల పొట్ట కొట్టడమేనని ఆయన దుయ్యబట్టారు.

పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం

పార్లమెంట్‌లో తీసుకొచ్చిన ఈ బిల్లు అభివృద్ధి తిరోగమనమేనని, రాష్ట్రాలపై మోయలేని భారమన్నారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇప్పుడు వికసిత్ భారత్ -గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌గా మార్చడం అన్యాయమన్నారు. లోక్‌సభలో బలవంతంగా గురువారం ఆమోదించిన ఈ కొత్త బిల్లు, పథకం స్వభావాన్ని, నిధుల సమీకరణను పూర్తిగా మార్చి వేసిందని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహానీయుడు,

జాతిపిత మహాత్మాగాంధీ పేరు మీద 20 ఏళ్ల క్రితం యూపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం కనిపి స్తోందని, పేరు మార్చినంత మాత్రాన వారి వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోలేరన్నారు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ, గ్రామీణ భారతానికి వెన్నెముకగా ఉన్న పథకాన్ని అగాధంలోకి నెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, పేదల కడుపు కొడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎం ప్రజాపాలన ఏర్పడి రెండేళ్లు పూర్తైందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను కాంగ్రెస్ ను ఆశీర్విదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచిందని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కూటమికి 33 శాతం సీట్లు వచ్చాయని, 94 నియోజక వర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయని, 87 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించిందని అన్నారు.

బిఆర్ఎస్ 8 నియోజక వర్గాల్లో మాత్రమే మెజార్టీ సాధించిందని, ముథోల్ నియోజక వర్గంలో బిజెపి అధిక స్థానాలు గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 21 నియోజక వర్గాల్లో ఆధిక్యం సాధించామని, రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని అన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని కొనియాడారు. 7,527 గ్రామ పంచాయితీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, 808 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికారిక దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడలేదని అన్నారు. పూర్తిగా స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండి.. ప్రజలకు చేరువగా ఉండి విజయం సాధించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎం ప్రజాపాలన ఏర్పడి రెండేళ్లు పూర్తైందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను కాంగ్రెస్ ను ఆశీర్విదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచిందని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కూటమికి 33 శాతం సీట్లు వచ్చాయని, 94 నియోజక వర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయని, 87 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించిందని అన్నారు. రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు పూర్తి అయ్యాయని తెలిపారు.

బిఆర్ఎస్ 8 నియోజక వర్గాల్లో మాత్రమే మెజార్టీ సాధించిందని, ముథోల్ నియోజక వర్గంలో బిజెపి అధిక స్థానాలు గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 21 నియోజక వర్గాల్లో ఆధిక్యం సాధించామని, రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని అన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని కొనియాడారు. 7,527 గ్రామ పంచాయితీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, 808 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికారిక దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడలేదని అన్నారు. పూర్తిగా స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండి.. ప్రజలకు చేరువగా ఉండి విజయం సాధించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

బిఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుంది: కెటిఆర్

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రావాలనే కోరిక ప్రజల్లో బాగా ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన రెండేళ్లలోనే మళ్లీ ప్రజల ఆదరణ పొందుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కెటిఆర్ పర్యటన చేశారు. భువనగిరి బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో అభినందన కార్యక్రమం జరిగింది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను కెటిఆర్ అభినందించారు. ఈ సందర్భంగా భువనగిరి లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 151 సర్పంచ్ స్థానాలను బిఆర్ఎస్ గెలుచుకోవడం విశేషమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని, ఎంపిగా గెలవటం కంటే సర్పంచ్ గా గెలవటం కష్టం అని అంటారని.. అది నిజం అని పేర్కొన్నారు. గ్రామాల్లో బిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కెటిఆర్ మండిపడ్డారు.   

భార్యను తీవ్రంగా కొట్టి చంపిన భర్త

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు.. సాయిపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి చంపాడు భర్త. తీవ్రంగా కొట్టడంతో భార్య గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య మరణం అనంతరం భర్త పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేస్తుకున్నారు. భర్త పరమేశ్(28), మృతురాలు అనూష(22)గా పోలీసులు గుర్తించారు.   

ఒమన్‌లో మినీ ఇండియాను చూస్తున్నా: ప్రధాని మోడీ

 ఒమన్: ఇరు దేశాల మధ్య మైత్రి బంధం బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్‌ ఆర్థికంగా వేగంగా పురోగమిస్తోందని, గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు ఐదు రెట్లు మెరుగయ్యాయని, రైల్వే లైన్లు, ఫైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌ వేలను శరవేగంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఒమన్‌ ఉప ప్రధానితో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఒమన్‌లో రెండో రోజు భారతీయులతో ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ జరిపారు. స్కూల్‌ విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వికసిత్‌ భారత్‌లో కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీది కీలక భూమిక పోషిస్తుందని, ఒమన్‌లో తాను ఒక మినీ ఇండియాను చూస్తున్నానని ప్రశంసించారు.  గ్రీన్‌ గ్రోత్‌ దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందని కొనియాడారు. తాము భారత్‌లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు నేడు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్‌గా నిలిచిందని మెచ్చుకున్నారు. దేశంలో ఆర్థిక క్రమశిక్షణతో పాటు పారదర్శకతను పెంచామని, దీంతో అంతర్జాతీయ పెట్టుబడుదారుల్లో భారత పట్ల నమ్మకం ఏర్పడిందన్నారు. పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశామని, మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా మహా సముద్రంలో రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారిధి ఏర్పాటు చేశామన్నారు. జిఎస్‌టి అమలు చేయడంతో భారత దేశం ఒకే సమీకృత మార్కెట్ మారిందని ప్రధాని వివరించారు.