elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabet

చంద్రబాబు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారు: గుడివాడ

అమరావతి: ఎపి సిఎం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణం అని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిక్ బ్యాగుల రూపంలో కమీషన్లు దండుకుంటున్నారని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షను రేపు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. 

టాలీవుడ్‌లో విషాదం.. నాగార్జునతో చేసిన దర్శకుడు మృతి

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘కెడి’ సినిమాకు దర్శకత్వం వహించిన కిరణ్ కుమార్(కెకె) బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కెజెక్యూ: కింగ్ జాకీ క్వీన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్ర యూనిట్, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కిరణ్ దర్శకత్వం వహించిన ‘కెడి’ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కిరణ్ పని చేశారు. ఆయన్న అందరూ ఆప్యాయంగా కెకె అని పిలుచుకుంటారు. కెకె దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.

కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దాం : సుప్రీం కోర్టు

ఢిల్లీ లో వాయుకాలుష్య సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఎన్ హెచ్ఎఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోకి ప్రవేశించే 9 టోల్ ప్లాజాలను మూసి వేయాలని ఎన్ హెచ్ఎఐ కు సుప్రీం కోర్టు సూచించింది. కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దామని చెప్పింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారు. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇతర పనులు చూపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఢిల్లీలో మొత్తం 2.50 లక్షల మంది కార్మికులు ఉన్నారని, 7 వేల మంది కార్మికుల ఖాతాలే వెరిఫై అయినట్లు తెలిపింది. పాఠశాల మూసివేత విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఢిల్లిలో కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీం కోర్టు తెలిపింది.  

కొనసాగుతున్న కౌంటింగ్.. మళ్లీ కాంగ్రెస్‌దే హవా

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల మూడో ఫేస్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటవరకూ 80.8 శాతం ఓటింగ్ నమోదైంది. 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి అధికార కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. మూడు విడతలు కలిపి 12,727 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 4,930 ఆధిక్యంలో ఉండగా.. 2,453 మంది బిఆర్ఎస్, 479 మంది బిజెపి, 1,249 మంది ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. గత రెండు విడుదల్లో 60 శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. ఇప్పుడు మూడో విడదలోనూ హస్తం పార్టీదే హవా కొనసాగుతోంది. 

తాతగా ప్రమోషన్.. నాగార్జున రియాక్షన్ ఇదే..

హైదరాబాద్: కింగ్ నాగార్జునకు ఎంత వయస్సు పెరిగిన గ్లామర్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకే ఆయన్ని టాలీవుడ్ మన్మధుడు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు నాగార్జున తాత కాబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్‌మీడియాని కుదిపేస్తోంది. తొలుత నాగచైతన్య, శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, శోభిత టీం ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా అఖిల్-జైనబ్ పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందుతున్నారని వార్త వైరల్ అవుతోంది. అఖిల్ కానీ, జైనబ్ కానీ, దీని గురించి మాట్లాడులేదు.

అయితే దీనిపై తాజాగా నాగార్జున స్పందించారు. ఓ హెల్త్ ఈవెంట్‌కి హాజరైన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చిరునవ్వుతో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని సమాధానం ఇచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్‌ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఐపిఎల్‌లో ఎస్ఆర్‌హెచ్‌ జట్టులోకి.. సత్తా చాటిన లైమ్

అబుదాబీ: బుధవారం జరిగిన ఐపిఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ని రూ.13 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోరును అతడు ఇంటర్‌నేషనల్ లీగ్ టి-20లో సత్తా చాటాడు. ఈ లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టుకు ప్రతినిధ్యం వహిస్తున్న లైమ్, డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లో లైమ్ 76, షరఫు 39, హేల్స్ 25 పరుగులు చేశారు. ఇక లక్ష్య చేధనలో డెజర్ట్ వైపర్స్ జట్టుకు అద్భుత ఆరంభం లభించింది. హోల్డర్, జమాన్‌లు తొలి వికెట్‌కి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హోల్డర్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ, ఆ తర్వాత స్వల్ప తేడాలతో వికెట్లు కోల్పోతూ వచ్చారు. చివరి ఓవర్‌లో 13 పరుగులు కాల్సి ఉండగా. అజయ్ కుమార్ ఆ స్కోర్‌ని డిఫెండ్ చేశాడు. దీంతో డెజర్ట్ వైపర్స్ జట్టు 20 ఓవర్లలో6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయడంతో అబుదాబీ నైట్‌రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన లైమ్ లివింగ్‌స్టోన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

చందానగర్ లో దారుణం..9 ఏళ్ల విద్యార్థి మృతి

హైదరాబాద్: చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలోదారుణం చోటు చేసుకుంది. మంగళవారం స్కూల్ నుంచి రాగానే బాత్రూంకు వెళ్లాడు. ముఖం కడుక్కుంటుండగా ఐడీకార్డు ట్యాగ్ కిటికీలో ఇరుక్కుపోవడంతో 9 ఏళ్ల విద్యార్థి ప్రశాంత్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రమాదవశాత్తే.. ప్రశాంత్ చనిపోయాడని పోలీసులు గుర్తించారు.  

పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లోని మూడు పాఠశాలలకు బుధవారం బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. ఈ బెదిరింపులపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ శరద్ సింఘాల్ మాట్లాడుతూ.. బాధిత పాఠశాలలకు వెంటనే పోలీసు బృందాలను మోహరించామని, భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేశామని చెప్పారు. ప్రస్తుతం భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.

సోమవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని 11 ప్రైవేట్ పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. తాజాగా అహ్మదాబాద్ లో కూడా బెదిరింపులు రావడంతో.. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాల భవనాలను వెంటనే ఖాళీ చేయించారు. మొదట మూడు పాఠశాలలకు ఇటువంటి ఈమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వా మరో ఏడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీటిపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.

ముగిసిన మూడో విడత పోలింగ్‌.. పలుచోట్ల ఘర్షణలు

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పలు చోట్ల ఇంకా భారీగా ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. అయితే, ఒంటి గంటలోపు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అవకాశమిచ్చారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్‌ ఓట్లను లెక్కిస్తారు. కాగా, పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

సౌదీ నుంచి వచ్చి ఓటేసిన యువకుడు..

పంచాయతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ యువకుడు సౌదీ అరేబియా నుంచి వచ్చిన తన ఓటు వినియోగించుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామానికి చెందిన బొమ్మ కంటి సంపత్ గౌడ్ ఉపాధి తెరువు కోసం గల్ఫ్ కు వెళ్ళాడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకొన్న అతను ఉపాధి కోసం సౌదీ అరేబియాలో ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా స్వదేశానికి వచ్చాడు సంపత్ గౌడ్.

ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణమని, ఒక్క ఓటుతోనే గ్రామ భవిష్యత్తు మారుతుందని సంతప్ గౌడ్ అన్నాడు. వ్యక్తిగత పనులు, ఖర్చులు పక్కనపెట్టి, దేశ పట్ల బాధ్యతగా ఓటు వేయడం గౌరవంగా భావించిన అతను… యువతకు ఆదర్శంగా నిలుస్తూ, ఓటు విలువను గుర్తు చేసే గొప్ప ఉదాహరణగా నిలిచాడని పలువురు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.