elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomcasibom girişcasibom güncel girişalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbet

మైలార్‌దేవ్‌పల్లిలో కారు భీభత్సం

 కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభు మహరాజ్ తన కుమారులు దీపక్, సత్తునాథ్‌తో కలిసి నగరానికి వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలోని ఫుట్‌పాత్‌పై దుప్పట్లు, బ్లాంకెట్లు విక్రయిస్తున్నారు. రోజు మాదిరిగానే ముగ్గురు ఫుట్‌పాత్‌పై వేసుకున్న గుండారంలో నిద్రిస్తున్నారు. నగరానికి చెందిన ఆరుగురు యువకులు ఇన్నోవా కారులో శంషాబాద్ నుంచి సంతోష్ నగర్‌కు వెళ్తున్నారు. కారును అతివేగంగా డ్రైవ్ చేయడంతో తెల్లవారుజామున 5 గంటలకు అదుపు తప్పి బాధితులు ఉన్న గుడారంపైకి దూసుకుని వెళ్లింది. దీంతో ప్రభుమహరాజ్, దీపక్ మృతిచెందగా, సత్తునాథ్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా కారులో ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. మృతిచెందిన ఇద్దరిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈనెల 20 ,21 తేదీల్లో ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

భారత ఉప రాష్ట్రపతి సిపి రాధ కృష్ణన్ ఈనెల 20 ,21 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. డిసెంబర్ 20 వ తేదీన ఉపరాష్ట్రపతి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్తారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి లోక్ భవన్ లో రాత్రి బస చేస్తారు. 21 వ తేది ఉదయం కన్హా శాంతి వనంలో ఏర్పాటుచేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని న్యూఢిల్లీ తిరిగి వెళ్తారు. కాగా ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సంబంధిత ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బందోబస్తు ఏర్పాట్లు, ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో రహదారుల నిర్వహణ, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. ఉప రాష్ట్ర పతి పర్యటనకు ఏ విధమైన లోటు జరగాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన కాంగ్రెస్: హరీశ్ రావు

ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ తీర్పు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పరిహాసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఢిల్లీలో ఒక మాట..తెలంగాణలో మరోమాట మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగంపై రాహుల్ నినాదం తెలంగాణలో వర్తించదా అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ ద్వంద్వ విధానం బట్టబయలైందని అన్నారు. ఢిల్లీలో రాజ్యాంగం పరిరక్షణపై మాట్లాడే కాంగ్రెస్ రియల్ ఫేస్ తెలంగాణలో స్పీకర్ తీర్పుతో బయటపడిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్నారు. సేవ్ ది కాన్‌స్టిట్యూషన్ నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని ఇది ఎంతో సిగ్గుచేటు అని, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు.

సోనియా, రాహుల్‌పై కేసు సాగుతోంది: బిజెపి

 నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బిజెపి విమర్శించింది. ఢిల్లీలోని ట్రయల్ కోర్టు రూలింగ్‌పై తప్పుడు ప్రచారానికి దిగుతోందని బిజెపి జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా బుధవారం ఇక్కడ చెప్పారు. ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని కోర్టు తెలిపింది. అంతేకానీ కేసును కొట్టివేయలేదని , కేసు ఉండనే ఉందని గౌరవ్ వ్యాఖ్యానించారు. కేసు పెండింగ్‌లో ఉందని , ఇడి దర్యాప్తు కొనసాగించవచ్చునని న్యాయస్థానం తెలిపిందని గుర్తు చేశారు. ఏదో చిన్న సాంకేతిక అంశంతో ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని , ఇదే విషయాన్ని స్పష్టం చేశారని బిజెపి గుర్తు చేసింది. అయితే కోర్టు రూలింగ్‌ను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బిజెపి స్పందించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా నెంబరు 1 , రాహుల్ రెండో ముద్దాయిగా ఉన్నారని , ఈ విషయం అందరికీ తెలిసిందే అని , కేసు నిలిపివేత జరిగిందనే రీతిలో ప్రచారానికి దిగడం పార్టీ దుందుడుకు వైఖరి అని విమర్శించారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మితిమీరి పోయి గ్యాంగ్స్ ఆఫ్ గాంధీనగర్ అని వ్యాఖ్యానాలకు దిగడం గర్హనీయం అని బిజెపి తెలిపింది. ముందు కాంగ్రెస్ నేతలు తాము వాడే భాషను చక్కదిద్దుకోవల్సి ఉందని బిజెపి ప్రతినిధి చురకలకు దిగారు. గాంధీనగర్‌లోని ప్రతి భారతీయుడు ఇటువంటి వ్యాఖ్యలతో కలత చెందుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల మనోభావాలంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తమ భాష మార్చుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ వారిని ఇటలీ బందిపోట్లు అని తిట్టిపోస్తారని అన్నారు.

ఉప ఎన్నికలకు భయపడే ఎమ్మెల్యేలపై వేటు వేయలేదు: కెటిఆర్

హైదరాబాద్: ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టి వేయడంపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలకు భయపడే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోు పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని… పార్టీ మారిన వారిని ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని పేర్కొన్నారు. 

ఢాకాలో ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రం మూసివేత

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవిఏసి) ని భారతదేశం మూసివేయాలని బుధవారం నాడు నిర్ణయించింది. తీవ్రవాద శక్తుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధానిలో ప్రధానంగా భారత వీసా సేవలు అందించే కేంద్రం ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ లో ఉంది. దీనిని ఇండియన్ వీసాఅప్లికేషన్ సెంటర్ గా వ్యవహరిస్తారు. భద్రతా పరమైన కారణాలను పేర్కొంటూ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన కార్యకలాపాలను మూసివేసింది. బుధవారం షెడ్యూల్ ప్రకారం అపాయింట్ మెంట్ ఇచ్చిన దరఖాస్తుదారులకు మళ్లీ మరో తేదీన అవకాశం ఇస్తామని ఐవిఏసి ఒక ప్రకటనలో తెలిపింది.

బుధవారం ఉదయం న్యూఢిల్లీ లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భారతదేశంలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఎం. రియాజ్ హమీదుల్లాను పిలిపించి, బంగ్లాదేశ్ లో క్షీణిస్తున్న భద్రతా వాతావరణం, పై భారతదేశపు తీవ్ర ఆందోళనను తెలియజేసింది. ఢాకా లోని భారత హై కమిషన్ చుట్టూ తీవ్రవాద శక్తుల కార్యకలాపాలు, వారు సృష్టిస్తున్న వాతావరణం పై అతడి దృష్టికి తెచ్చినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనపై ఉగ్రవాద శక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతదేశం తిరస్కరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించలేదని, భారతదేశానికి అందుకు సంబంధించిన ఆధారాలను పంచుకోలేదని పేర్కొంది.

బంగ్లాదేశ్ రాజకీయనాయకుడు భారతదేశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు బెదిరింపు లకు పాల్పడడంతో బుధవారం నాడు విదేశాంగ మంత్రిత్వశాఖ బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్ సిపి) నాయకుడు హస్నాత్ అబ్దుల్ సోమవారం ఒక ర్యాలీలో భారత్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, బంగ్లాదేశ్ ను అస్థిరపరిస్తే, తమదేశం సెవెన్ సిస్టర్స్ అని పిలిచే భారత ఈశాన్యరాష్ట్రాలలో చిచ్చుపెడతామని, వేర్పాటు వాదులకు ఆశ్రయం కల్పించే ప్రయత్నంచేస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషనర్ ను పిలిపించి, మాజీ ప్రధాని షేక్ హసీనాను త్వరగా అప్పగించాలని డిమాండ్ చేసింది.

మంచు మనోజ్ లేటెస్ట్ చిత్రం.. గ్లింప్స్ అదిరిపోయింది..

ఈ ఏడాది ‘భైరవం’ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఆ తర్వాత ‘మిరాయ్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ప్రస్తుతం మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న రీసెంట్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో మనోజ్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. గ్లింప్స్ చూస్తే సినిమా ఓ రేంజ్‌లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించారు. ఇంకెందుక ఆలస్యం.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి…

ఎమ్మెల్యేల అనర్హత.. తీర్పు వెలువరించిన స్పీకర్

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బిఆర్ఎస్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి చేసిన సభాపతి.. ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్‌కు సంబంధించి గురువారం తీర్పు వెలువడనుంది.

ఎఐ బారిన పడ్డ శ్రీలీల.. ఎమోషనల్ పోస్ట్

హైదరాబాద్: కృత్రిమ మేధ(ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనుషులకు చాలా పని భారం తగ్గిపోయింది. అయితే దీన్ని కొందరు మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎఐని చెడు మార్గంలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లకి ఎఐని దుర్వినియోగం చేయడం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. తాజాగా నటి శ్రీలీల‌కు ఎఐ ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది.

‘‘నా బిజీ షెడ్యూల్‌ వల్ల ఆన్‌లైన్‌లో జరిగే విషయాలపై నాకు అంతగా అవగాహన ఉండదు. నా శ్రేయోభిలాషులు కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. నేను చాలా విషయాలను పట్టించుకోను.. నా ప్రపంచంలో నేను జీవిస్తుంటాను. కానీ, ఈ విషయం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటి నటీనటులు కూడా ఇలాంటి బాధని అనుభవించారు. అందరి తరఫున నేను స్పందిస్తున్నా. దయ మరియు గౌరవంతో మాకు మద్ధతు ఇవ్వాలని కోరుకుంటున్నా. తదుపరి చర్యలు అధికారులు చూసుకుంటారు’’ అంటూ శ్రీలీల పోస్ట్ పెట్టింది.

శ్రీలీల ఫోటోలను ఎఐ ద్వారా ఎడిట్ చేసి కొందరు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. చాలా మంది నెటిజన్లు అవి నిజమైన ఫోటోలే అని భ్రమపడుతున్నారు. దీంతో శ్రీలీల ఈ విధంగా స్పందించింది. కాగా, ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్‌సింగ్, పరాశక్తి తదితర చిత్రాల్లో నటిస్తోంది.

చంద్రబాబు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారు: గుడివాడ

అమరావతి: ఎపి సిఎం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణం అని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిక్ బ్యాగుల రూపంలో కమీషన్లు దండుకుంటున్నారని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షను రేపు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.