kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxroyalbetroyalbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabet

ఢాకాలో ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రం మూసివేత

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవిఏసి) ని భారతదేశం మూసివేయాలని బుధవారం నాడు నిర్ణయించింది. తీవ్రవాద శక్తుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధానిలో ప్రధానంగా భారత వీసా సేవలు అందించే కేంద్రం ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ లో ఉంది. దీనిని ఇండియన్ వీసాఅప్లికేషన్ సెంటర్ గా వ్యవహరిస్తారు. భద్రతా పరమైన కారణాలను పేర్కొంటూ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన కార్యకలాపాలను మూసివేసింది. బుధవారం షెడ్యూల్ ప్రకారం అపాయింట్ మెంట్ ఇచ్చిన దరఖాస్తుదారులకు మళ్లీ మరో తేదీన అవకాశం ఇస్తామని ఐవిఏసి ఒక ప్రకటనలో తెలిపింది.

బుధవారం ఉదయం న్యూఢిల్లీ లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భారతదేశంలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఎం. రియాజ్ హమీదుల్లాను పిలిపించి, బంగ్లాదేశ్ లో క్షీణిస్తున్న భద్రతా వాతావరణం, పై భారతదేశపు తీవ్ర ఆందోళనను తెలియజేసింది. ఢాకా లోని భారత హై కమిషన్ చుట్టూ తీవ్రవాద శక్తుల కార్యకలాపాలు, వారు సృష్టిస్తున్న వాతావరణం పై అతడి దృష్టికి తెచ్చినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనపై ఉగ్రవాద శక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతదేశం తిరస్కరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించలేదని, భారతదేశానికి అందుకు సంబంధించిన ఆధారాలను పంచుకోలేదని పేర్కొంది.

బంగ్లాదేశ్ రాజకీయనాయకుడు భారతదేశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు బెదిరింపు లకు పాల్పడడంతో బుధవారం నాడు విదేశాంగ మంత్రిత్వశాఖ బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్ సిపి) నాయకుడు హస్నాత్ అబ్దుల్ సోమవారం ఒక ర్యాలీలో భారత్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, బంగ్లాదేశ్ ను అస్థిరపరిస్తే, తమదేశం సెవెన్ సిస్టర్స్ అని పిలిచే భారత ఈశాన్యరాష్ట్రాలలో చిచ్చుపెడతామని, వేర్పాటు వాదులకు ఆశ్రయం కల్పించే ప్రయత్నంచేస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషనర్ ను పిలిపించి, మాజీ ప్రధాని షేక్ హసీనాను త్వరగా అప్పగించాలని డిమాండ్ చేసింది.

మంచు మనోజ్ లేటెస్ట్ చిత్రం.. గ్లింప్స్ అదిరిపోయింది..

ఈ ఏడాది ‘భైరవం’ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఆ తర్వాత ‘మిరాయ్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ప్రస్తుతం మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న రీసెంట్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో మనోజ్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. గ్లింప్స్ చూస్తే సినిమా ఓ రేంజ్‌లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించారు. ఇంకెందుక ఆలస్యం.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి…

ఎమ్మెల్యేల అనర్హత.. తీర్పు వెలువరించిన స్పీకర్

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బిఆర్ఎస్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి చేసిన సభాపతి.. ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్‌కు సంబంధించి గురువారం తీర్పు వెలువడనుంది.

ఎఐ బారిన పడ్డ శ్రీలీల.. ఎమోషనల్ పోస్ట్

హైదరాబాద్: కృత్రిమ మేధ(ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనుషులకు చాలా పని భారం తగ్గిపోయింది. అయితే దీన్ని కొందరు మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎఐని చెడు మార్గంలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లకి ఎఐని దుర్వినియోగం చేయడం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. తాజాగా నటి శ్రీలీల‌కు ఎఐ ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది.

‘‘నా బిజీ షెడ్యూల్‌ వల్ల ఆన్‌లైన్‌లో జరిగే విషయాలపై నాకు అంతగా అవగాహన ఉండదు. నా శ్రేయోభిలాషులు కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. నేను చాలా విషయాలను పట్టించుకోను.. నా ప్రపంచంలో నేను జీవిస్తుంటాను. కానీ, ఈ విషయం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటి నటీనటులు కూడా ఇలాంటి బాధని అనుభవించారు. అందరి తరఫున నేను స్పందిస్తున్నా. దయ మరియు గౌరవంతో మాకు మద్ధతు ఇవ్వాలని కోరుకుంటున్నా. తదుపరి చర్యలు అధికారులు చూసుకుంటారు’’ అంటూ శ్రీలీల పోస్ట్ పెట్టింది.

శ్రీలీల ఫోటోలను ఎఐ ద్వారా ఎడిట్ చేసి కొందరు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. చాలా మంది నెటిజన్లు అవి నిజమైన ఫోటోలే అని భ్రమపడుతున్నారు. దీంతో శ్రీలీల ఈ విధంగా స్పందించింది. కాగా, ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్‌సింగ్, పరాశక్తి తదితర చిత్రాల్లో నటిస్తోంది.

చంద్రబాబు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారు: గుడివాడ

అమరావతి: ఎపి సిఎం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణం అని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిక్ బ్యాగుల రూపంలో కమీషన్లు దండుకుంటున్నారని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షను రేపు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. 

టాలీవుడ్‌లో విషాదం.. నాగార్జునతో చేసిన దర్శకుడు మృతి

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘కెడి’ సినిమాకు దర్శకత్వం వహించిన కిరణ్ కుమార్(కెకె) బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కెజెక్యూ: కింగ్ జాకీ క్వీన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్ర యూనిట్, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కిరణ్ దర్శకత్వం వహించిన ‘కెడి’ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కిరణ్ పని చేశారు. ఆయన్న అందరూ ఆప్యాయంగా కెకె అని పిలుచుకుంటారు. కెకె దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.

కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దాం : సుప్రీం కోర్టు

ఢిల్లీ లో వాయుకాలుష్య సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఎన్ హెచ్ఎఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోకి ప్రవేశించే 9 టోల్ ప్లాజాలను మూసి వేయాలని ఎన్ హెచ్ఎఐ కు సుప్రీం కోర్టు సూచించింది. కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దామని చెప్పింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారు. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇతర పనులు చూపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఢిల్లీలో మొత్తం 2.50 లక్షల మంది కార్మికులు ఉన్నారని, 7 వేల మంది కార్మికుల ఖాతాలే వెరిఫై అయినట్లు తెలిపింది. పాఠశాల మూసివేత విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఢిల్లిలో కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీం కోర్టు తెలిపింది.  

కొనసాగుతున్న కౌంటింగ్.. మళ్లీ కాంగ్రెస్‌దే హవా

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల మూడో ఫేస్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటవరకూ 80.8 శాతం ఓటింగ్ నమోదైంది. 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి అధికార కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. మూడు విడతలు కలిపి 12,727 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 4,930 ఆధిక్యంలో ఉండగా.. 2,453 మంది బిఆర్ఎస్, 479 మంది బిజెపి, 1,249 మంది ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. గత రెండు విడుదల్లో 60 శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. ఇప్పుడు మూడో విడదలోనూ హస్తం పార్టీదే హవా కొనసాగుతోంది. 

తాతగా ప్రమోషన్.. నాగార్జున రియాక్షన్ ఇదే..

హైదరాబాద్: కింగ్ నాగార్జునకు ఎంత వయస్సు పెరిగిన గ్లామర్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకే ఆయన్ని టాలీవుడ్ మన్మధుడు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు నాగార్జున తాత కాబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్‌మీడియాని కుదిపేస్తోంది. తొలుత నాగచైతన్య, శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, శోభిత టీం ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా అఖిల్-జైనబ్ పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందుతున్నారని వార్త వైరల్ అవుతోంది. అఖిల్ కానీ, జైనబ్ కానీ, దీని గురించి మాట్లాడులేదు.

అయితే దీనిపై తాజాగా నాగార్జున స్పందించారు. ఓ హెల్త్ ఈవెంట్‌కి హాజరైన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చిరునవ్వుతో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని సమాధానం ఇచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్‌ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఐపిఎల్‌లో ఎస్ఆర్‌హెచ్‌ జట్టులోకి.. సత్తా చాటిన లైమ్

అబుదాబీ: బుధవారం జరిగిన ఐపిఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ని రూ.13 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోరును అతడు ఇంటర్‌నేషనల్ లీగ్ టి-20లో సత్తా చాటాడు. ఈ లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టుకు ప్రతినిధ్యం వహిస్తున్న లైమ్, డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లో లైమ్ 76, షరఫు 39, హేల్స్ 25 పరుగులు చేశారు. ఇక లక్ష్య చేధనలో డెజర్ట్ వైపర్స్ జట్టుకు అద్భుత ఆరంభం లభించింది. హోల్డర్, జమాన్‌లు తొలి వికెట్‌కి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హోల్డర్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ, ఆ తర్వాత స్వల్ప తేడాలతో వికెట్లు కోల్పోతూ వచ్చారు. చివరి ఓవర్‌లో 13 పరుగులు కాల్సి ఉండగా. అజయ్ కుమార్ ఆ స్కోర్‌ని డిఫెండ్ చేశాడు. దీంతో డెజర్ట్ వైపర్స్ జట్టు 20 ఓవర్లలో6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయడంతో అబుదాబీ నైట్‌రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన లైమ్ లివింగ్‌స్టోన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.