kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxroyalbetroyalbet

పోలింగ్ కేంద్రంలో ఘర్షణ.. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిపై దాడి

కొత్తగూడ మండల కేంద్రంలోనీ పోగుళ్లపల్లి పోలింగ్ కేంద్రంలో బుధవారం ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారాని పోలీస్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నునావత్ ఈర్య నాయక్ చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్న వారిని బయటికి పంపించారు. కానీ అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ బానోత్ మోహన్, వీరస్వామి లు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల తోపులాటలో నునావత్ స్వాతికి ఎముక ప్యాక్చర్ అయింది. సమాచారం తెలుసుకున్న గూడూరు సీఐ జి సూర్య ప్రకాష్ సదర్ వ్యక్తులను పోలింగ్ కేంద్రం నుండి వెళ్లగొట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

The Ashes: ముగిసిన తొలి రోజు ఆట.. స్కోర్ ఎంతంటే..

అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26లో భాగంగా అడిలైడ్ ఓవెల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. ఇక మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్‌కి చావో-రేవో తేల్చుకొనే పరిస్థితి వచ్చింది. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 94 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. ఐపిఎల్‌లో అత్యధికంగా రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామరూన్ గ్రీన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో అలెక్స్ క్యారీ, ఉస్మాన్ ఖవాజాలు కలిసి మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఖవాజా (82) హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగా, క్యారీ మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు సెంచరీ సాధించాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్‌లో క్యారీ(106) ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన జోష్ ఇంగ్లీస్(32) ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(13) విఫలమయ్యాడు. దీంతో 83 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టార్క్(33), లైయన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కార్స్, జాక్స్ చెరి రెండు, టంగ్ 1 వికెట్ తీశారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు.. కానీ

న్యూఢిల్లీ: 2026 ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకుని చరిత్ర సృష్టించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. బుధవారం (డిసెంబర్ 16) ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ పేరు వేలానికి వచ్చే వరకు అతని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, వేలం ప్రారంభమయ్యాక, అతన్ని దక్కించుకోవడానికి ఏకంగా ఐదు జట్లు ఆసక్తి చూపాయి. చివరికి, తీవ్రమైన బిడ్డింగ్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్, వీర్ కోసం భారీగా రూ.14.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా కూడా నయా చరిత్ర సృష్టించాడు. కానీ, ఇండియాలో చాలా మంది క్రికెటర్ల మాదిరిగానే, ప్రశాంత్ కెరీర్‌లో ఇక్కడి దాకా రావడం అంత సులభంగా జరగలేదు.

అతని బాల్య కోచ్ రాజీవ్ గోయల్, 20 ఏళ్ల ప్రశాంత్ 2020లో క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడని వెల్లడించారు. “ఆ సంవత్సరమే అతని తాత మరణించారు. దాంతో ప్రశాంత్ కుటుంబం తమ ఏకైక ఆదాయ వనరును కూడా కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శిక్షా మిత్ర (పారా-టీచర్లు/సబ్-టీచర్లు)గా పనిచేస్తున్న అతని తండ్రి జీతం, కుటుంబ ఖర్చులకు సరిపోకపోయేవి. తన తాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే పెన్షన్ ప్రశాంత్  క్రికెట్ ఆశయాలను నిలబెట్టింది” అని తెలిపారు. అయితే, ప్రశాంత్ ఖర్చులను చూసుకుని, ఈ రోజు అతను ఈ స్థాయి క్రికెటర్‌గా ఎదగడానికి శిక్షణ ఇచ్చింది కోచ్ గోయలే. ఈ విషయాన్ని ప్రశాంత్ వీర్ వెల్లడించారు.

వేలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వీర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తన తాత మరణించినప్పుడు.. కోచ్ రాజీవ్ గోయల్ తనకు ఆర్థికంగా, మానసికంగా సహాయం చేశారని చెప్పాడు. “సవాళ్లు ఉన్నాయి, కానీ నా కుటుంబం ఎప్పుడూ నా క్రికెట్‌కు, కలలకు ప్రాధాన్యత ఇచ్చింది. వారు నన్ను ఎప్పుడూ అసమర్థుడిని అని భావించనివ్వలేదు. నా తాతగారు మరణించిన తర్వాత కూడా, రాజీవ్ గోయల్ సార్ వంటి వారు నాకు ఆర్థికంగా, మానసికంగా మద్దతు ఇచ్చారు. ఈ ప్రయాణంలో అలాంటి మంచి వ్యక్తులను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పాడు.

ఇక, ప్రశాంత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ప్రశాంత్ వీర్ ప్రదర్శన ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్‌లో నోయిడా కింగ్స్‌కు నాయకత్వం వహించిన ప్రశాంత్.. 10 మ్యాచ్‌లలో 155.34 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి, 169.69 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. 6.76 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.

IPL 2026: పేదరికం, ఆర్థిక ఇబ్బందులు.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు..

న్యూఢిల్లీ: 2026 ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకుని చరిత్ర సృష్టించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. బుధవారం (డిసెంబర్ 16) ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ పేరు వేలానికి వచ్చే వరకు అతని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, వేలం ప్రారంభమయ్యాక, అతన్ని దక్కించుకోవడానికి ఏకంగా ఐదు జట్లు ఆసక్తి చూపాయి. చివరికి, తీవ్రమైన బిడ్డింగ్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్, వీర్ కోసం భారీగా రూ.14.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా కూడా నయా చరిత్ర సృష్టించాడు. కానీ, ఇండియాలో చాలా మంది క్రికెటర్ల మాదిరిగానే, ప్రశాంత్ కెరీర్‌లో ఇక్కడి దాకా రావడం అంత సులభంగా జరగలేదు.

అతని బాల్య కోచ్ రాజీవ్ గోయల్, 20 ఏళ్ల ప్రశాంత్ 2020లో క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడని వెల్లడించారు. “ఆ సంవత్సరమే అతని తాత మరణించారు. దాంతో ప్రశాంత్ కుటుంబం తమ ఏకైక ఆదాయ వనరును కూడా కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శిక్షా మిత్ర (పారా-టీచర్లు/సబ్-టీచర్లు)గా పనిచేస్తున్న అతని తండ్రి జీతం, కుటుంబ ఖర్చులకు సరిపోకపోయేవి. తన తాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే పెన్షన్ ప్రశాంత్  క్రికెట్ ఆశయాలను నిలబెట్టింది” అని తెలిపారు. అయితే, ప్రశాంత్ ఖర్చులను చూసుకుని, ఈ రోజు అతను ఈ స్థాయి క్రికెటర్‌గా ఎదగడానికి శిక్షణ ఇచ్చింది కోచ్ గోయలే. ఈ విషయాన్ని ప్రశాంత్ వీర్ వెల్లడించారు.

వేలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వీర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తన తాత మరణించినప్పుడు.. కోచ్ రాజీవ్ గోయల్ తనకు ఆర్థికంగా, మానసికంగా సహాయం చేశారని చెప్పాడు. “సవాళ్లు ఉన్నాయి, కానీ నా కుటుంబం ఎప్పుడూ నా క్రికెట్‌కు, కలలకు ప్రాధాన్యత ఇచ్చింది. వారు నన్ను ఎప్పుడూ అసమర్థుడిని అని భావించనివ్వలేదు. నా తాతగారు మరణించిన తర్వాత కూడా, రాజీవ్ గోయల్ సార్ వంటి వారు నాకు ఆర్థికంగా, మానసికంగా మద్దతు ఇచ్చారు. ఈ ప్రయాణంలో అలాంటి మంచి వ్యక్తులను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పాడు.

ఇక, ప్రశాంత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ప్రశాంత్ వీర్ ప్రదర్శన ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్‌లో నోయిడా కింగ్స్‌కు నాయకత్వం వహించిన ప్రశాంత్.. 10 మ్యాచ్‌లలో 155.34 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి, 169.69 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. 6.76 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.

అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు : చంద్రబాబు

అమరావతి: మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మనం చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని అన్నారు. సచివాలయంలో సిఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. జిఎస్ డిపి, కెపిఐ, పర్ సెప్షన్, ఈ-ఆఫీస్ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలు వచ్చే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామని అనేది ముఖ్యమని తెలియజేశారు. మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా గమనించాలని, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కోర్టు కేసులను దాటుకొని కానిస్టేబుళ్ల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. అంతకుముందు డిఎస్సి పెట్టామని.. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని విమర్శించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వంమంటే.. అధికారులు దుర్వినియోగం కాదు..సద్వినియోగం కావాలని అన్నారు. అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. అన్ని సమస్యల వివరాలు ఉంటాయని, పరిష్కారం చేయాలని కలెక్టర్లకు సూచించారు. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలని, కేంద్రప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలని అన్నారు.

సూపర్ సిక్స్ పథకాలతో ముందుకెళ్తున్నామని, పేదల సేవలో భాగంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలని, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ రెండో విడత కూడా ఇచ్చామని, దీపం, స్త్రీశక్తితో పాటు ఇతర కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పారు. మెగా డిఎస్సి, కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేశామని, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని, అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారు. పెట్టుబడులకు ముందుకొస్తున్న వారికి ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులివ్వాలని, ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు వస్తున్నాయంటే మన విధానమే కారణమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పి-4ఒక వినూత్న కార్యక్రమని, పి-4 విధానంలో భాగస్వాములయ్యేలా చూడాలని, ఆర్థిక సంస్కరణలు వచ్చాక ఆలోచనల విధానం మారిందని అన్నారు. విలువలు వేరు.. సిద్దాంతాలు వేరు అని..ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కావాలని కోరారు. మనం ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని, అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

మూడో విడత పంచాయతి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య పోటా పోటీగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మూడో విడతలోనూ బిఆర్ఎస్, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. అయితే, వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వాగ్వాదం నెలకొంది. మాటా మాట పెరగడంతో తోపులాట జరిగి ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. వెంటనే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బిఆర్ఎస్ అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

ఎపిలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు మండలం నాగిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. చాకెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిన్నారిని వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మూడో విడత పోలింగ్.. సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో ఇవాళ మూడో విడత పంచాయతి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే, కొమురంభీం జిల్లాలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాస్‌పెల్లిలో సర్పంచ్‌ అభ్యర్థి రాజయ్య ఓటమి భయంతో పురుగులమందు తాగాడు. తన దగ్గర డబ్బులు లేవని.. దీంతో తనకు ఓటు వేస్తారో వేయరోనని రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ… ఓడిపోతాననే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే రాజయ్యను గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి ప్రజలు.. ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతోంది.

విభిన్న కథతో కొత్త తరహా చిత్రం

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి‘. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం కష్టపడ్డాం అని అన్నారు. ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ “బ్రహ్మానందం ప్రతి సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించాడు. ఫరియా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది”అని తెలిపారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి సినిమాలో నేను ముఖ్యమైన పాత్ర చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, నిరంజన్, కృష్ణ సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. 

అందరినీ అలరించే హారర్ థ్రిల్లర్

హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, హీరో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పాత్రల్లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన-, దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది ఈ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయి కిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించారని నిర్మాత బాలకృష్ణ మహారాణా తెలిపారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ప్రేమ, పగ, తప్పు -ఒప్పు, మంచి- చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం అని అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ “డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశాను. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్ కామెడీ చేశాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది”అని పేర్కొన్నారు.