StreamEastStreamEastStreamEastkonya escort@samalex34 lan seni sikmezsem görüsürüz :Dkayseri escort samsaksocu sam videosu izlesarım escort @samalex34 anal yapıyor@samalex34 escort calıstırıyorkulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetpulibetrinabetrestbet girişpulibet girişrinabet girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişwinxbetprizmabetbetlikebahiscasinokulisbetmasterbettingrinabetyakabetbetovisbetovismasterbettinggalabetrestbetbahiscasinoyakabetyakabetbetovis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet

betpas

request hit botu

betpas giriş

jojobet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

casibom giriş

milosbet

casibom giriş

casibom

casibom

casibom

casibom giriş

casibom giriş

jojobet

jojobet

bahiscasino

online diyetisyen

milosbet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

yakabet

artemisbet

artemisbet

paşacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet

Restbet giriş

nakitbahis

casibom giriş

padişahbet

Marsbahis

holiganbet

meritking

pusulabet

holiganbet

holiganbet

grandpashabet

yakabet giriş

suratbet

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

casibom güncel giriş

hiltonbet

ultrabet

jojobet

Casibom

jojobet

yakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

enjoybet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

betsmove

betsmove giriş

Meritking

jojobet giriş

casibom

agb99

Agb99

jojobet

casibom giriş

padişahbet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

meritking

meritking giriş

pusulabet giriş

onwin

grandpashabet giriş

imajbet giriş

sekabet

grandpashabet

kralbet

marsbahis giriş

matbet

sekabet giriş

Casibom

Casibom Giriş

matbet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

artemisbet

artemisbet giriş

artemisbet

coinbar

matbet

matbet giriş

ultrabet

padişahbet

padişahbet giriş

padişahbet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

marsbahis

marsbahis

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

holiganbet giriş

casibom giriş

casibom giriş

bets10

casibom

pusulabet

pusulabet

anadoluslot

padişahbet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

casibom

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

imajbet

matbet giriş

jojobet

jojobet giriş

betvakti

wbahis

padişahbet

wbahis

efesbetcasino

betsmove

milanobet

Casibom giriş

Casibom giriş

İstanbul escort

restbet

marsbahis

yakabet

Sweet Bonanza Oyna

betwoon

tlcasino

setrabet

casinolevant

betticket

bahsegel

kavbet

radissonbet

Sweet Bonanza

meritking

meritking

Marsbahis

Sweet Bonanza

marsbahis giriş

kavbet giriş

jojobet

jojobet

jojobet

meritking giriş

meritking

matbet giriş

matbet

padişahbet

kavbet güncel giriş

casibom giriş

kralbet

pusulabet

pusulabet giriş

pusulabet

hilarionbet

berlinbet

jojobet

artemisbet

kingroyal

otobet

madridbet

ultrabet

betturkey

bandar judi

betasus

vdcasino

suratbet

diyarbakırescort

süratbet

vdcasino

bahisfair

betebet

sahabet

onwin

onwin

matadorbet

casivera

meybet

nitrobahis

ultrabet

matbet

jojobet

Madridbet

meritking

kingroyal

kralbet

betnano giriş

meritking

galabet

casinolevant

bahislion

vegabet

vaycasino

İstanbul Escort

vdcasino giriş

galabet

timebet

sekabet giriş

cratosroyalbet giriş

betasus

pusulabet giriş

meritking

meritking

padişahbet

grandpashabet giriş

ultrabet

ultrabet

ultrabet giriş

meritking

kingroyal

meritking giriş

meritking

orisbet

bets10

bets10

madridbet

madridbet

meritking

meritking giriş

cratosroyalbet giriş

kingroyal

meritking

meritking

rinabet

kingroyal

cratosroyalbet giriş

teosbet

royalbet

cratosroyalbet

madridbet

cratosroyalbet giriş

kingroyal

matbet

cratosroyalbet

marsbahis giriş

madridbet

casibom

madridbet

చట్టసభల్లో చర్చలు పెడదారి

వందేమాతరం ఒక పదం. అది ఒక అక్షర సముదాయం మాత్రమే కాదు. అది ఒక నాటి తరాన్ని నిరంతరం నిద్రలేపి ఉద్యమాలలోకి ఉరికించిన అక్షర నినాదం. భారత స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం అనే అక్షరాలు కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచిన ఆయుధాలు. ఆ అక్షరాల అంకురార్పణకు సరిగ్గా 150 ఏళ్లు నిండాయి. ఇది భాతీయులందరికీ ఒక అద్భుతమైన సందర్భం. అప్పటి ఉద్యమాల జ్ఞాపకాలను నెమరువేసుకొని భవిష్యత్ తరాలకు దాని స్ఫూర్తిని అందించే కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.

అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వందేమాతరంపై చర్చసాగింది. సందర్భం సరైనదే కాని పార్లమెంటుకు ప్రత్యేకించి లోక్‌సభ నాయకుడుగా భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉద్దేశం మాత్రం దారితప్పింది. వందేమాతరం సంపూర్ణ సారాంశాన్ని కాకుండా కొందరి ప్రయోజనాలకోసం అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంక్తులను కుదించారని, ఇది దేశ ద్రోహమని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలను గుప్పించారు. ఇది ప్రతి విమర్శలకు, చర్చోపచర్చలకు దారితీసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభ్యులు ఎదురు దాడి చేశారు. భారత స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించింది, వందేమాతరం గీతాన్ని సమర నినాదంగా మార్చింది కాంగ్రెస్ మాత్రమేనని జవాబు విసిరారు. ఇప్పటి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ భారతీయ జనసంఘ్, దాని పితృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేశారని, స్వాతంత్య్ర సమరంలో ఆ శక్తులు ఎప్పుడూ భాగస్వాములు కాలేదని, కాంగ్రెస్ బిజెపిపై ధ్వజమెత్తింది. అయితే ఈ చర్చ పార్లమెంటుకు మాత్రమే పరిమితం కాలేదు. బయటి కూడా దాని ప్రతిస్పందనలు వినవస్తున్నాయి. కొంత కాలం వేరే విషయాలమీద చర్చ ఉండదు. కేవలం ఈ విషయం మీదనే చర్చ సాగుతుంది. ఇది ఏదో యథాలాపంగా నరేంద్ర మోడీ లేవనెత్తలేదు. దీని వల్ల నరేంద్ర మోడీ కొన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు.

ఇప్పటి తరంలో నెహ్రూను దేశద్రోహిగా నిలబెట్టాలనేది, దీని వల్ల కాంగ్రెస్‌ను కూడా దోషిగా చూపించాలనే ఉద్దేశం. రెండోది పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాలి. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందువల్ల ఈ వివాదాన్ని ముందుకు తెస్తే, ఈ సమావేశాలు మొత్తం దీని మీదనే నడిపించొచ్చు. అవసరమైన బిల్లులను గుట్టుచప్పడు కాకుండా ఆమోదింప జేసుకోవచ్చు. ఇది పాలకవర్గాలలో ఉండే లక్షణం. దీనినే నరేంద్ర మోడీ తన ఎత్తుగడగా భావించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని వ్యవహరించాలి. వందేమాతరం మీద చర్చను పక్కనపెట్టి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించాలి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంకా గాంధీ సరిగ్గానే వ్యక్తపరిచారు. వందేమాతరం మీద చర్చను పక్క పెట్టి ప్రజల అత్యవసర సమస్యలైన అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలపై చర్చించాలని సభలో ప్రస్తావించారు.

ఇక్కడే పౌరసమాజం కూడా స్పందించాలి. పార్లమెంటు సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు, దాని ప్రభుత్వ సమాధానాలు, పరిష్కారాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడాలి. అయితే గత కొంత కాలంగా ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తడం, దాని గురించి చాలా తీవ్రంగా మాట్లాడుకోవడం, వాకౌట్‌లు, సస్పెండ్‌లు, సమావేశాలు ముగియడం. ఇది రివాజు. ప్రభుత్వం తన ధోరణిలో తాను పని చేసుకుంటూ వెళ్లడం జరుగుతుందే కాని నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన ఉండడంలేదు. ఇది చాలా శోచనీయం. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు.

ప్రస్తుతం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరూ దీనికి అతీతులు కాదు. ముఖ్యంగా కేంద్రం సంపూర్ణంగా ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను విస్మరించింది.

ముఖ్యంగా దేశంలోని నూటికి 80 శాతం మందికి పైగా ప్రజలు సామాజిక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందులో అందరినీ పట్టిపీడించేది అధిక ధరలు. గత పదేళ్లలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి వీలు లేదు. నేను పేర్కొంటున్న ధరలు జాతీయ స్థాయి గణాంకాల నుంచి తీసుకున్నవి. ఇందులో మన రాష్ట్రానికి కొద్దిగా అటుఇటుగా తేడాలు ఉండవచ్చు. కాని పెరుగుదల మాత్రం సత్యం. నిత్యావసర వస్తువులు అందులో ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలను పరిశీలిస్తే ఎంత తీవ్రంగా పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. 2014 సంవత్సరంలో కంది పప్పు 70 రూపాయలు ఉంటే 2025 వచ్చేసరికి 150 రూపాయలకు పెరిగింది. మినపపప్పు 64 నుంచి 123 రూపాయలు కూడా దాటింది. శెనగ పప్పు 47 రూపాయల నుంచి 88 రూపాయలు చేరుకున్నది. అట్లాగే ఉల్లిగడ్డ, టమాట, బంగాళా దుంపలు 50 శాతం నుంచి 60 శాతం వరకు పెరిగాయి. వంట నూనెల ధరలు 3 రెట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో ప్రత్యక్షంగా మనం రోజూ చూస్తూనే ఉన్నాం.

ఇది ప్రతి భారతీయుడిపై పడుతున్న భారం. అయితే ఇదే స్థాయిలో కార్మికుల, ఉద్యోగుల వేతనాలు పెరగలేదు. ఒక సాధారణ ఉద్యోగి ప్రైవేటు రంగంలో 2014 రూ. 20 వేలు జీతం పొందితే, నేడు ఆ ఉద్యోగి రూ. 30 వేలు మాత్రమే అందుకుంటున్నాడు. అంటే 50 శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తున్నది.ఇది ఉద్యోగ భద్రత కలిగిన కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇందులో 30 నుంచి 40 శాతం ఇంటి అద్దెలకే పోతాయి. ఇద్దరు పిల్లలుంటే ప్రతి నెల మరో 30 శాతం వాళ్ల చదువులకు చెల్లించాలి. మిగిలిన 40 శాతం డబ్బులో తన రోజువారీ ప్రయాణ ఖర్చులు, ఇంట్లో అవసరమైన వైద్యం, మందుల ఖర్చులు. ఇవన్నీ పోను ఇంటి నిత్యావసర వస్తువులను ఎట్లా కొనుగోలు చేస్తాడనేది పెద్ద ప్రశ్న. అందుకే నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రతి రోజు ఒక నరకంలో జీవిస్తున్నారు. డిగ్రీలు, పిజిలు చదివి ప్రైవేటు విద్యాలయాల్లో, కంపెనీల్లో పని చేస్తున్న వందలాది మంది ప్రతి నెల అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. కొంత మంది రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, ఇతర చిన్నచితక ఉపాధిని వెతుకుంటున్నారు. స్విగ్గి, జొమాటో లాంటి సర్వీసులలో కూడా చేస్తున్నారు. రాపిడో ద్వారా బైకులు నడుపుకుంటున్నారు.

ఇవి కదా పార్లమెంటులో చర్చిచాల్సింది. దానికి కదా తమ సమయాన్ని వెచ్చించి పరిష్కారాలను ఆలోచించాల్సింది. దీనితో పాటు మరొక ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. ఈ సమస్యకు పరిష్కారం చాలా అత్యవసరం. దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. మన హేతు విరుద్ధమైన చదువుల వల్ల ఇందులో చాలా మందికి వృత్తి నైపుణ్యం లేదు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక, యాంత్రిక పెరుగుదల వల్ల మనిషి పని నుంచి వేరు పడిపోతున్నాడు. దానితో కొద్ది మంది మాత్రమే వృత్తిలోకి అడుగు పెట్టగలుగుతున్నారు. ఇందులో ఇప్పటికే భూములు, వ్యాపారాలు, ఇతర వనరులు ఉన్న వర్గాలు, కులాలు చాలా సులువుగా ఆర్థికంగా నిలుదొక్కగలుగుతున్నారు.ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా తేడా ఉంది. గ్రామాల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగింది. చిన్న, సన్నకారు రైతులు దివాలా తీస్తున్నారు. ఈ భూములన్నింటిని కంపెనీలు, కార్పొరేట్లు కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ భూములన్నీ కార్పొరేట్ వ్యవసాయానికి మారబోతున్నాయి. దీని వల్ల ఇప్పటికే నూటికి 60 శాతం మంది యువతీ యువకులు గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు చేరుతున్నారు. దాని ఫలితంగా భారత దేశంలో పట్టణీకరణ, నగరీకరణ వేగం పుంజుకుంటున్నది.

పెరుగుతున్న నిరుద్యోగం మరిన్ని సమస్యలకు కారణమవుతున్నది. ముఖ్యంగా మత్తు పదార్థాలకు, గంజాయికి యువలోకం బానిసగా మారిపోతున్నది. గతంలో లాగా తమ శ్రమతో సంపాదించుకొని కలో గంజో తాగి ఆత్మగౌరవంతో బతికే తరం పోతున్నది. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో పరాన్న జీవులుగా మారిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది.

ఇట్లా చాలా సమస్యలున్నాయి. మహిళలు, బాలికల మీద పెరుగుతున్న లైంగిక దాడులు గతంలో కన్న పెచ్చుమీరిపోయాయి. పట్టణాల్లో, నగరాల్లో ఇది అంతు అదుపు లేకుండా పోతున్నది. 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలు తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఒక చెత్త కాగితం లాగా చూస్తున్నయి. తమ వాదనకు పనికి వచ్చే ఆర్టికల్స్‌ను, తమ ప్రయోజనాలను కాపాడే అంశాలను అమలు చేస్తూ ప్రజల్లో మత, ప్రాంత కుల పరమైన విభజనలు తీసుకొచ్చి ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు. పేదల్లో అణగారిన వర్గాల్లో చీలికలను సృష్టించి, ప్రతిఘటన ఆలోచనలను, ఉద్యమాలను బలహీన పరుస్తున్నాయి.

ఇటీవల దళితుల, ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలను పట్టించుకొని వాటిని నిరోధించడానికి చర్యలు లేవు. రిజర్వేషన్ల అంశాన్ని ఆధిపత్య కులాలను రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. అదే విధంగా ప్రతి అంశంలో ఒక కేంద్రీకృత వ్యవస్థలను తయారు చేస్తున్నారు. వ్యాపారాలను, వాణిజ్య అవకాశాలను తమ ప్రయోజనాలను కాపాడే వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారు. దాని ఫలితంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. జరిగే అవకాశాలు పెరిగాయి. ఇటీవల ఇండిగో విమాన కంపెనీ నిర్వాకం మనకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఏ రంగమైనా, ఏ వ్యాపారమైనా గుత్తాధిపత్యంలోకి వెళితే అది ప్రజల ప్రయోజనాలను మింగేస్తుందని తేలిపోయింది. అదే విధంగా మతం, కులం, ప్రాంతం అన్ని కూడా అదే ఫలితాలను అందిస్తాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ప్రకారం, దేశంలోని వనరులు, సంపద అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, ప్రజలకు సమ న్యాయం అందాలని సూచిస్తున్నది. కాని దీనికి భిన్నంగా ఈ రోజు దేశంలో సంపద ఒక దగ్గర కేంద్రీకృతమవుతున్నది. పేదలు లేరు, పేదరికం లేదు అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కాని గ్రామాలు, బస్తీలు పరిశీలన జరిపితే ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో మనకు అర్థం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ఏకరువు పెట్టడం సాధ్యం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించడం కూడా నా ఉద్దేశం కాదు. కాని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వాలదే. దానికి వేదిక పార్లమెంటు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు, శాసన సభలను, పార్లమెంటు వేదికను పరస్పర దూషణలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం వెచ్చిస్తే మంచిది. 

మల్లేపల్లి లక్ష్మయ్య

ఇకపై ఎవరి భద్రత వారిదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సరికొత్త ‘జాతీయ భద్రతా వ్యూహం’ డాక్యుమెంట్‌పై ప్రపంచమంతటా చాలా ఆసక్తిని రేకెత్తించింది. ప్రత్యేకంగా యూరప్‌తో పాటు, అమెరికాకు సంప్రదాయికంగా సన్నిహితమైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా వంటి సుదూర దేశాలలోనైతే పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా మద్దతుపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను భయపెట్టింది. ఈ ప్రభావాలను గమనించి కూడా ట్రంప్ తన డాక్యుమెంట్‌లో చెప్పిన వైఖరిని మార్చుకోకపోగా, ఇతర దేశాల పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా ఉన్నప్పటికీ, తమ భవిష్యత్తు కోసం ఈ కొత్త వైఖరి తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.

ఇంతకూ ఆ డాక్యుమెంట్‌లో ఏమున్నది? దాని ప్రభావాలు ఈ విధంగా ఎందుకున్నాయి? అనే ప్రశ్నలను చర్చించే ముందు కొన్ని మౌలికమైన విషయాలను చెప్పుకోవాలి. అమెరికా, యూరప్, ఇతర దేశాలతో కూడిన పాశ్చాత్య కూటమి, నాటో సైనిక కూటమి పరిస్థితి ఒకప్పటి వలే లేదు. అవి ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా సుమారు 2010 వరకు మొత్తం ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని సాగించాయి. ముఖ్యంగా 1991లో సోవియెట్ యూనియన్, దానితోపాటు వార్సా సైనిక కూటమి పతనంతో వారికి ఎదురు లేకుండా పోయింది. అది, అంతకు ముందటి ద్విధ్రువ (అమెరికా, సోవియెట్ యూనియన్ రెండు ధ్రువాలుగా) ప్రపంచానికి బదులు కేవలం అమెరికా నాయకత్వాన ఏక ధ్రువ ప్రపంచంగా పరిణమించిన కాలం. కాని సుమారు 2010 వచ్చే సరికి ఆ దశ మారటం మొదలైంది. వ్లాదిమిర్ పుతిన్ బలమైన నాయకత్వంతో రష్యా తిరిగి పుంజుకోవటం మొదలైంది. మరొక వైపు చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించింది. ఆ విధంగా మరొక దశాబ్దం గడిచే నాటికి, రష్యా, చైనాలు ఆర్థికంగా, సైనికంగా కూడా అమెరికా కూటమికి సవాలుగా మారసాగాయి. అమెరికాకు గల బలాలలో శాస్త్ర సాంకేతిక రంగం కూడా ముఖ్యమైనది కాగా, రష్యా కాకపోయినా చైనా అత్యాధునికమైన పరిశోధనలు, ఆవిష్కరణలతో అమెరికాకు సాటిగా ఎదగటమే గాక, కొన్ని రంగాలలో అంతకుమించి పోయింది.

ఒకవైపు ఇది జరుగుతుండగా, మరొక వైపు ప్రపంచ వ్యాప్తంగా మరొక విధమైన పరిణామాలు చోటు చేసుకోసాగాయి. అవి బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు. ఇండియా, ఆసియాన్ కూటమి, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, కొన్ని అరబ్ దేశాల వంటివి స్వయంగా బలపడుతూ, ఏ కూటమితో నిమిత్తం లేకుండా, స్వతంత్రంగా నిలబడి తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిచటం మొదలు పెట్టాయి. అమెరికా కూటమికి ప్రత్యామ్నాయంగా రష్యా, చైనాలు తమకు చేయూత అందిస్తుండటంతో వారి ధైర్యం మరింత పెరగసాగింది. దానితో, అమెరికా ఆదేశాలను గతంలో వలే శిరసావహించే దశ తప్పిపో సాగింది. ఇటువంటి కొత్త పరిస్థితుల మధ్య బహుళ ధ్రువ ప్రపంచం అనే మాట విస్తరించసాగింది. ఈ మార్పుల ఫలితమే బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటివి. అదే పద్ధతిలో ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలను అమెరికా నియంత్రణ నుంచి విముక్తం చేసి ఇతర దేశాలకు సమాన భాగస్వామ్యం, హక్కులు కల్పించాలనే వాదనలు పెరుగుతుండటం.

ఈ నేపథ్యాన్ని అంతా ఇంతగా వివరించటం ఎందుకంటే, ఈ పరిణామాలు సృష్టించుతున్న ఒత్తిడుల ప్రభావం వల్లనే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు తమ జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకోక తప్పటం లేదు. అది ఇపుడీ డాక్యుమెంట్ రూపంలో ముందుకు వచ్చినా, వాస్తవానికి ఇంతకు ముందే అందుకు ఆరంభం ట్రంప్ ఇచ్చిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాద రూపంలో కనిపించింది. అందుకు ఈ డాక్యుమెంట్ కొనసాగింపని స్వయంగా ట్రంప్ బృందం చెప్తున్నదే. వారు బహిరంగంగా ఒప్పుకోని విషయం, పైన పేర్కొన్న పరిణామాల ఒత్తిడి. అసలు ఆ నినాదమే చెప్తున్నదేమిటి? అమెరికా ఒకప్పుడు ‘గొప్పగా ఉండేది. ఆ గొప్పతనాన్ని ఇపుడు కోల్పోయింది. ఆ స్థితిని ‘తిరిగి’ సాధించాలని. ఆ ‘గొప్పతనం’ అంటే ఏమిటి? దానిని కోల్పోవటం ఎందువల్ల జరిగింది? తిరిగి సాధించటం ఏ విధంగా? ఈ విషయాలను మాత్రం వారు దాపరికం లేకుండా వివరించరు. అమెరికా గొప్పతనం పోవటం ట్రంప్ ‘మాగా’ నినాదం ఇచ్చిన 2017 నాటికే మొదలైంది. అందుకు కారణాలు పైన పేర్కొన్నవే. ఆ కారణాలు 2017 కన్న ఇప్పటికి గత ఏడేళ్లలో మరింత తీవ్రమయ్యాయి. వర్తమాన పరిస్థితులను బట్టి చూడగా మునుముందు ఇట్లానే తీవ్రమవుతూ పోగలవని చెప్పటం కష్టం కాదు. ఈ అంచనాలు ఆందోళన కలిగించటం వల్లనే ట్రంప్ బృందం పై డాక్యుమెంట్‌ను రూపొందించిందనాలి.

మరి గొప్పతనాన్ని తిరిగి సాధించటం ఎట్లాగన్నది చివరి ప్రశ్న. ఆ వ్యూహాన్ని అమలు పరచటం ఈ డాక్యుమెంట్‌తో నిమిత్తం లేకుండానే ట్రంప్ ఈ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమలు పరుస్తున్నారు కూడా. ఇక యుద్ధాలు చేయకపోవటం, ఇతరుల యుద్ధాలు కూడా మాన్పించటం, బయటి వారిని పంపివేయటం, కొత్తవారిని రానివ్వకపోవటం, బయటి దేశాల పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించటం, బయటకు పోయిన అమెరికన్ కంపెనీలను తిరిగి రప్పించటం, పేద దేశాలకే గాక అమెరికన్ కూటమి దేశాలకు సైతం ఉచిత సహాయాలు ఆపటం, అక్కర లేదనుకునే ఉద్యోగాల రద్దు, అన్ని దేశాలపై విపరీతంగా సుంకాల పెంపు, తమ ఉత్పత్తులు కొని తీరాలని ఇతరులపై ఒత్తిడి వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇటువంటి చర్యల వల్ల ట్రంప్ లక్షాలు నిజంగా నెరవేరుతాయా అనే దానిపై అమెరికన్ నిపుణులలోనే సందేహాలున్నాయి.

కనుక, చివరకు ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చునో ఇంకా స్పష్టత లేకపోయినా, అదే ‘మాగా’ లో భాగంగా ఇప్పుడు ప్రకటించిన కొత్త డాక్యుమెంట్ నిజానికి స్వభావ రీత్యా కొత్తదేమీ కాదు. కాని అందులోని తీవ్రతలు, స్పష్టతలు కొత్తవి. ఇటువంటి తీవ్రతలే అమెరికా మిత్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఆ డాక్యుమెంట్‌లోని కొన్ని అంశాలను చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఆర్థిక, సైనిక భారాలే తప్ప ప్రయోజనం లేదనుకున్న ట్రంప్ దానిని ఆపే ప్రయత్నాలు మొదటి నుంచి చూస్తూ రాగా, అందుకు కలిసి రాని ఉక్రెయిన్, యూరప్‌లపై ఇప్పుడు తుది హెచ్చరికలనదగ్గవి జారీ చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్ గురించి అయితే, అసలు వారి విధానాల కారణంగా యూరోపియన్ సంస్కృతి, వ్యక్తిత్వం, శక్తి ప్రపత్తులు, స్వాతంత్య్రం అన్నవే క్రమంగా అంతర్ధానమయ్యే పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నారు. అవి నిలిచి ఉండడం కోసమంటూ అక్కడి తమ తరహా మితవాద పార్టీలను బాహాటంగా సమర్థిస్తున్నారు. అనగా తమ వలెనే అందరూ తక్కిన ప్రపంచంతో సంబంధాలను తగ్గించుకుని ఎవరికి వారుగా వ్యవహరించటమన్న మాట. ఇంత కాలం వలె మొత్తం యూరోపియన్ దేశాలన్నీ ఒక యూనియన్‌గా కొనసాగటం కూడా వృథా అన్నది ఈ డాక్యుమెంటు సూచన. దీనితో అక్కడి మితవాద పార్టీలలోనూ కొన్ని ఏకీభవించటం లేదన్నది, యూరప్‌కు సహజ సంప్రదాయమనుకునే ఉదారవాద ప్రజాస్వామిక విలువలను వదులుకోవటం వారికి ఇష్టం లేదన్నది వేరే విషయం. అయినా ఈ ప్రతిపాదనలు చేస్తున్న ట్రంప్ బృందం, ఇందుకు కొనసాగింపుగా, ఇకపై ఆయా దేశాల భద్రతను అవే చూసుకోవాలి తప్ప ఇంత కాలం వలే అమెరికాకు సంబంధం ఉండదని చెప్పటం వారిని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు సూచనప్రాయంగా చెప్తూ వచ్చిన ఈ మాట ఇప్పుడు డాక్యుమెంట్ రూపంలోకి వచ్చింది. ఆ మేరకు ఇంకా విధానాలనైతే రూపొందించలేదు గాని త్వరలో ఆ పని కూడా జరగవచ్చునన్నది అంచనా.

సరిగా ఇదే వైఖరి ఉక్రెయిన్ విషయంలోనూ కనిపిస్తున్నది. అందుకే పలు ప్రతిపాదనలతో ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్‌తోపాటు యూరప్‌పైనా ఒత్తిడిని తీవ్రంగా పెంచారు. ఉక్రెయిన్ తన భూభాగాలను రష్యాకు వదులుకోవటంతోపాటు ఇతరత్రానూ రష్యా షరతులకు తలఒగ్గేట్లు చేయబూనుతున్నారాయన. ఇప్పటికే స్వయంగా ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిన యూరప్‌కు దీనితో పాలుపోని పరిస్థితి ఎదురవుతున్నది. అదే సమయంలో మరొక స్థాయిలో ఆలోచించినప్పుడు, అమెరికాకు సంబంధించి గాని, యూరప్‌కు సంబంధించి గాని, కొంత కాలం నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నీ మౌలికంగా వారి ఉమ్మడి సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడటం వల్ల ఎదురయ్యే ఒత్తిడుల ఫలితమే.

టంకశాల అశోక్

ఓట్లు కొనే అభ్యర్థులు వద్దే వద్దు

ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీ యాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. 

స్వాతంత్య్ర అనంతరం భారత దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కోసం మూడంచెల ‘పంచాయతీ రాజ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. మన దేశంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి కల్పించబడింది. ఇది కుల, జాతి, మత,లింగ, భాష వంటి భేదం లేకుండా కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ‘ఒక ఓటు ఒక విలువ’ అనే సూత్రం ద్వారా ప్రజానిధులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం సామాన్యులకే ఇచ్చింది. ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్య విప్లవానికి పునాది వేసిన వ్యక్తి అంబేద్కర్. అణచివేయబడిన వర్గాల గొంతుకకు ప్రాణం పోసి కుల, మత గోడలను బద్దలుగొట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగాయి. భారతదేశంలో మాత్రం అంబేద్కర్ ఒక్కరే పోరాటం చేశాడు. ముఖ్యంగా ఈ దేశంలో మనుషులుగానే గుర్తించని బిసి, ఎస్‌సి, ఎస్‌టి సమాజాన్ని ఓటుతో విలువ లభించింది. నేడు ఆ ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్ గా మారి ఒక ధనస్వామ్య వ్యవస్థకు దారితీయడం జరుగుతుంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమం ముసుగులో దోపిడీ రాజ్యమేలుతుంది. అంబేద్కర్ ‘నేను నా దేశ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాను. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతోనే పోరాడి రాజవుతారో… అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ చెప్పారు. ప్రజలంతా భవిష్యత్ పునర్నిర్మాణానికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఇది.

ప్రలోభ పెట్టే నాయకుల్ని తిరస్కరిద్దాం

తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండవ, మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యుల నుంచి బాగా చదువుకున్న విద్యావంతుల సైతం ప్రలోభాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. వివిధ కులాల దళారి నాయకులు తమ కులం ఓట్లు మీకేనని అభ్యర్థులకు చెబుతూ డబ్బులు వసూలు చేస్తూ కులాన్ని తాకట్టు పెడుతున్నారు. మరోవైపు దళారుల సహకారంతో అభ్యర్థులు నిత్యం మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి ఐదు, పది వేలు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఓటు ఒక వేలం పాటగా మారిపోయింది. అమాయక దళిత, బహుజనుల్ని ఓటు మార్కెట్‌లో బలి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు.

ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీయాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారా జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తెరగాలి. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ ఐదు సంవత్సరాల కాలానికి అభ్యర్థులిచ్చే డబ్బు, మందు రోజుకు ఒక రూపాయి విలువ కూడా కాదు. కావున ఓటర్లు యాచకులుగా మారవద్దు. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. అసలు ప్రలోభ పెట్టే నాయకుడు ఎప్పటికీ ప్రజానేత కాదు. కావున మందు, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసే నాయకులను తిరస్కరిద్దాం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగమై నిజాయితీగా ఓటేసి గ్రామాభివృద్ధికి పాటుపడదాం.

సంపతి రమేష్ మహారాజ్

79895 79428 

చలి పంజా

మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తరాది నుంచి శీ తల గాలులు వీస్తున్నాయని దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర దిశ నుం చి దూసుకొస్తున్న శీతల గాలులు రాష్ట్ర వాతావారణాన్ని గణనీయంగా చల్లబరుస్తున్నాయి. సాధారణంగా ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3- నుం డి 5 డిగ్రీలు తగ్గడంతో రాత్రి, తెల్లవారుజామున చలికి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రెం డు,- మూడు రోజులు ఇదే స్థాయి చలి కొనసాగే అ వకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్త ర, పశ్చమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభా వం అధికంగా ఉంటుందని పేర్కొంది. రెండు రో జుల పాటు శీతల, అతిశీతల గాలులు వీచే అవకా శం ఉందని చెప్పింది. దీంతో ఉత్తర, పశ్చిమ, ఈ శాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వివరించింది. శని, ఆదివారాల్లో పొగమంచు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

శీతల గాలులతో పాటు పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8.30గంటల వరకు రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డిలో 5.8 డిగ్రీలు నమోదు కాగా, రంగారెడ్డి 6, కొమరంభీం ఆసిఫాబాద్ 6.5, వికారాబాద్ 6.8, మేడ్చల్ మల్కాజ్‌గిరి 7.1, నిజామాబాద్ 7.3, కామారెడ్డి, ఆదిలాబాద్ 7.5, సిద్దిపేట 7.6, నిర్మల్, మెదక్ 7.8, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట 8.4, పెద్దపల్లి 8.5, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల 8.6, జనగాం, ములుగు 8.9, హన్మకొండ, మంచిర్యాల 9, నాగర్ కర్నూల్ 9.3, మహబూబ్‌నగర్ 9.4, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి 9.5, వరంగల్ 9.6, భద్రాద్రి కొత్తగూడెం 9.7, మహబూబాబాద్ 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. చలి తీవ్రతకు సాధారణ జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం, రాత్రిపూట బయటికి వెళ్లి పనులు చేసుకోవాలంటేనే బెంబేలెత్తుతున్నారు. చలి ప్రభావం ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపై తీవ్రంగా ఉంది.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

శనివారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, మంచిర్యాల, నాగర్ కర్నూల్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

రెండో విడత ప్రచారానికి తెర

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తో తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈ నెల 14న జరిగే ఎన్నికలపై గ్రామీణ ప్రాంతం లో ఉత్కంఠ కొనసాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి తరఫున పార్టీల పరంగా వ్యవహారాల ను చక్కదిద్దుతున్న నేతలంతా గ్రామాల్లో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. కాగా రెండో విడత ఎన్నికలో 3,911 సర్పంచ్ స్థానాలకు, 29,903 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇం దుకు అనుగుణంగా ఎన్నికల అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. రెండో విడత జరగాల్సిన పం చాయతీ ఎన్నికల్లో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవమయ్యా యి. రిజర్వేషన్లు, ఇతర కారణాలతో 5 చోట్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 13,128 మంది అభ్యర్థులు పోటీలో నిలిచా రు. అలాగే రెండో విడతలో 38,342 వార్డులకు ఎన్నిక జరగాల్సి ఉండగా, వీటిలో 8,304 వార్డులు ఏకగీవ్రం అయ్యాయి.

107 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూ డా దాఖలు కాలేదు. పోగా మిగిలిన 29,903 వా ర్డులకు ఎన్నిక జరుగుతుండగా ఆయా వార్డులను చేజిక్కించుకునేందుకు 78,158 మంది అభ్యర్థు లు పోటీలో ఉన్నారు. ఈ నెల 14 ఆదివారం ఉద యం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గం ట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నాం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలను ప్రకటించడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం విస్త్రత ఏర్పాట్లు చేసింది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టకుండా కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రత కోసం 50 వేల మంది సివిల్ పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి 60 ప్లాటూన్ల సాయుధ బలగాలు మోహరింప చేస్తున్నారు. సున్నితమై పోలింగ్ బూత్‌లు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు పోలింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలావుంటే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. 

గ్రూపు దందా

మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో రి టైర్డ్ అయిన కొందరు డిస్టిక్ రిజిస్ట్రార్‌లు, మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు గ్రూప్‌గా ఏర్పడి అందినకాడికి దండుకుంటున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్లాట్లు, భూముల నిషేధిత జాబితాలో ఉన్నా, వాటికి అనుమతి లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఈ గ్రూపు సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని వారం రోజుల క్రితం సంబంధిత మంత్రికి, సిఎంకు ఫిర్యాదులు రావడం విశే షం. 18 ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఓ డిస్టిక్ రిజిస్ట్రార్ రిటైర్ అ యిన డిఆర్‌లను, సబ్ రిజిస్ట్రార్‌లను తన గ్రూప్‌లో కలుపుకొని ఈ దందాకు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఎంఓ లో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతో ఈ గ్రూపు సభ్యు లు సబ్ రిజిస్ట్రార్‌లపై రిజిస్ట్రేషన్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి.

వివాదాస్పద ప్లాట్లు, ప్రభుత్వ భూములే లక్షం..

ఈ గ్రూపు సభ్యులకు కొందరు డిఆర్‌లుగా, సబ్ రిజిస్ట్రార్‌లు వత్తాసు పలుకుతుండడం విశేషం. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయడానికి కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు వెనుకడుగు వేస్తుండగా ఈ గ్రూపులోని సభ్యు లు వారిపై ఒత్తిడి తెస్తున్నారని, రిజిస్ట్రేషన్ చేయని సబ్ రిజిస్ట్రార్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి, గండిపేట్, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, సంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్భుల్లాపూర్ ఉప్పల్, శంషాబాద్, యాదగిరిగుట్ట, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, హయత్‌నగర్, ఎల్‌బినగర్, శంకర్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్‌లలోని వివాదాస్పద ప్లాట్లు, ఇళ్లు, ప్రభుత్వ భూములే లక్షంగా వీరి ఆగడాలు అధికమయ్యాయని పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. కొన్నేళ్లుగా వీరి ఆగడాలు అధికం కావడంతో సబ్ రిజిస్ట్రార్‌లు కొందరు సెలవుల్లో వెళ్లిపోతున్నారని, దీంతో తమకు అనుకూలంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్‌లతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటున్నారని సమాచారం.

తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పదోన్నతి పొందారని..

గ్రేటర్ పరిధిలో పనిచేసే ఓ డిస్టిక్ రిజిస్ట్రార్ ఈ మధ్య ఆడిట్ పేరుతో సబ్ రిజిస్ట్రార్‌లను వేధిస్తున్నారని వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ డిఆర్‌కు ఆడిట్‌తో సంబంధం లేకున్నా ఆడిట్ నిర్వహించడం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిధిలో పనిచేసే మరో ఆడిట్ రిజిస్ట్రార్‌కు త్వరలో డిఐజీగా పదోన్నతి రావాల్సి ఉండగా ఆయన పదోన్నతులకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని ఆ శాఖకు సమర్పించారని కొందరు జిఏడికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఆయనకు గతంలో ఇచ్చిన పదోన్నతుల విషయంలోనూ విచారణ జరపాలని, దీంతోపాటు ప్రస్తుతం డిఐజీగా ఆయన పదోన్నతి ఇవ్వొద్దని కొందరు జిఏడికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.

ముందుకు కదలని పదోన్నతుల ఫైలు

పదోన్నతులకు సంబంధించి ఫైల్ పెట్టాలని మంత్రి ఆదేశించినా ఇప్పటివరకు అతీగతీ లేదని ఆ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక జాయింట్ ఐజి, నాలుగు డిఐజీ పోస్టులు, 7 డిఆర్ పోస్టులు, 7 గ్రేడ్ 1, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు సంబంధించి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు దానికి సంబంధించి సీనియార్టీ జాబితాను ఆ శాఖ ఉన్నతాధికారులు రూపొందించలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంవత్సరం కాలంగా ఈ పదోన్నతులకు సంబంధించి ఫైలు ముందుకెళ్లకుండా కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని, వారికి పదోన్నతి వస్తే రోజువారీ ఆదాయం పోతుందన్న ఉద్ధేశ్యంతోనే ఇలా అడ్డుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు.

కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్‌లే సబ్ రిజిస్ట్రార్‌లుగా..

ప్రస్తుతం కాప్రాలో, గతంలో కూకట్‌పల్లిలో పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో 15 రోజుల నుంచి సెలవులో ఉన్నారు. గతంలోనూ ఈ సబ్ రిజిస్ట్రార్ రెండుసార్లు ఏసిబికి పట్టుబడడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినా ఆ సబ్ రిజిస్ట్రార్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇబ్రహీపట్నం 1 సబ్ రిజిస్ట్రార్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో 15 రోజుల క్రితం రెండురోజులు సెలవుపై వెళ్లి మళ్లీ తిరిగి విధుల్లో చేరలేదు. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన అబ్‌స్కాడింగ్ అంటూ ఉన్నతాధికారులు ఐజికి రిపోర్టు ఇచ్చారు. ఈయన గతంలో రెండుసార్లు ఏసిబి పట్టుబడ్డారు.

ఈయనపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయనకు ఇబ్రహీంపట్నం 1 సబ్ రిజిస్ట్రార్‌గా విధులు కేటాయించినా మళ్లీ అక్కడ భారీగా అవినీతికి పాల్పడడం విశేషం. 10 రోజుల క్రితం తాండూరు ఇన్‌చార్జీ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కడంతో ఆయన స్థానంలో వేరే వాళ్లు ఇన్‌చార్జీగా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే తాండూరు ఆఫీసులో ముగ్గురు ఏసిబికి చిక్కడం విశేషం. ఈ శాఖలో సబ్ రిజిస్ట్రార్‌ల కొరత ఉండడంతో కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్‌లే సబ్ రిజిస్ట్రార్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 1, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 2లు ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 1పై గతంలోనూ అనేక ఫిర్యాదులు రావడం విశేషం.

ఏదో ఒకరోజు సిఎం అవుతా

మన తెలంగాణ/హైదరాబాద్: తనపై ఎక్కువ తక్కువ మాట్లాడితే తోలు తీస్తానని జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కవిత అన్నారు. ఇప్పటి వర కు టాస్ మాత్రమే వేశానని, చిట్టా విప్పుతానం టూ హరీశ్ రావు టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వెనుక ఉన్న గుంట నక్కను వదలబోనని అన్నారు. మాధవరం కృష్ణారావు కుమారుడు చెరువు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన తాము దాడి చే సేంత పెద్దమనిషి కాదన్నారు. బీఆర్‌ఎస్ హ యాంలో ఐదెకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను రెసిడెన్షియల్ భూమిగా మార్చుతూ అనుమతి ఇచ్చా రన్నారు.ఆ ల్యాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని చెప్పారు. దీనిపై మాధవరం కృష్ణారావు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఆ భూమికి సంబంధం ఉన్న ఏవీ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భాగస్వాములు అని, వీళ్లిద్దరూ నవనామీ వెంచర్స్ నడుపుతున్నారని క్లారిటీ ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడని అన్నారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తన భర్త అనిల్ పేరు ఎన్నడూ ఎవరి నోటా వినపడలేదని, ఈ రోజు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. అమరవీరుల కోసం బీఆర్‌ఎస్‌లో ఉండి కొట్లాడలేకపోయానని ప్రజలకు క్షమాపణలు చెప్పానని అన్నారు. తాను బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేయడంలేదని, తన తప్పులేకుండా ఆరోపణలు చేస్తున్నారని , పిచ్చివాగుడు వాగితే ఊరుకునేది లేదని ఒక్కొక్కరి కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. ఐదేళ్లు తనను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని, ఎంపీ టికెట్ అడిగితే ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి పక్కన పెట్టారని, తనను ఎవరైనా కలిసేందుకు వచ్చినా వారిని బెదిరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలను చేసినందుకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు టి న్యూస్ ఛానల్‌కు కూడా వారం రోజుల్లోపు క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులు పంపుతున్నట్లు విలేకర్ల సమావేశంలో కవిత ప్రకటించారు.

హిల్ట్ పాలసీకి కిటీకీలు తెరిచిందే బీఆర్‌ఎస్

హెల్ట్ పాలసీకి కిటికీలు తెరచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దర్వాజాలు తీసిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములకు సంతకాలు పెట్టి ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చారని, బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న దొంగ దారులను రేవంత్ రెడ్డి రహదారులుగా మార్చారని విమర్శించారు. తనకు ఎప్పుడో ఓసారి టైం వస్తుందని, ఖచ్చితంగా ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని అంశాలపై విచారణ చేయిస్తానని వెల్లడించారు. తాను, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని , తాను మంచిదానిని కాదని, తనను ఏమైనా అంటే ఊరుకోబోనన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కు తెలిసి తప్పులు జరిగాయా లేదా…? అనేది కేసీఆరే చెప్పాలని కవిత అన్నారు.

ఇక్కడ పందికొక్కుల్లా దోచుకున్నారు

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తాను నిజామాబాద్ కు మాత్రమే పరిమితం అయ్యానని, ఎంపీగా పార్లమెంట్‌లో ఉంటే ఇక్కడ వీళ్లు ఏసీ రూముల్లో కూర్చుని పందికొక్కుల్లా దోచుకున్నారని ధ్వజమెత్తారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, ఎవరైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా..? అని కవిత ప్రశ్నించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు డెవలప్ మెంట్ పేరుమీద అనేక భూములను మింగేశారని కవిత ఆరోపించారు. ఉస్మాన్ కుంట నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. బీఆర్‌ఎస్ ఫేవరేట్ బిల్డర్ వాసవికి భూమి ఇచ్చారని అన్నారు. అందులో ఒక గుంట నక్క, ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందని, ఆ ఐఏఎస్ ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. దీనిపై విజిలెన్స్, ఈడీకి స్వయంగా తానే ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్

ఇది ఆరంభం మాత్రమే అని, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం అని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు అన్నారు. సాక్షాత్తూ సిఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ, రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్‌ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు.

అతిగా అనిపించినా… ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ‘అఖండ 2’

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. ఇప్పుడు ఈ జోడీ ‘అఖండ’ సీక్వెల్.. ‘అఖండ: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో చూద్దాం.

కథ: మురళీకృష్ణ (బాలకృష్ణ) రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే. అతడి కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీవోలో సైంటిస్ట్. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులు ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలా ఆమె బయో సూట్ తయారు చేస్తుంది. దాని మీద ట్రయల్స్ నడుస్తుండగానే.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర పన్ని ఒక వైరస్‌ను గంగా నదిలో కలిసేలా చేస్తాడు. కుంభమేళాకు వచ్చిన లక్షలాది మందికి వైరస్ అంటి దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యత కూడా జననినే తీసుకుంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ స్థితిలో అఘోరా అయిన మురళీకృష్ణ సోదరుడు అఖండ (బాలకృష్ణ) రంగప్రవేశం చేస్తాడు. మరి శత్రువులతో అతనెలాంటి పోరాటం చేశాడు? దేశానికి ఎదురైన ముప్పును తప్పించడానికి ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలను మిళితం చేసి దర్శకుడు బోయపాటి రాసుకున్న ఈ కథ బాలకృష్ణ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో దేశంలో వీస్తున్న హిందుత్వ భావాలను బలపరిచే విధంగా సనాతన ధర్మ బోధ చేయడం కూడా కలిసొచ్చే అంశమే. ఇక టాలీవుడ్‌లో మాస్ పేరుతో కొంచెం అతి చేసినా చెల్లే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దర్శకుల్లో బోయపాటి శ్రీనుకు కూడా ఇలాంటి ఇమేజే ఉంది. వీళ్లిద్దరూ కలిసి చేసిన మాస్ విధ్వంసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య, బోయపాటి అంటేనే అన్నీ కొంచెం అతిగా ఉంటాయనే అంచనాతోనే థియేటర్లలోకి వెళ్లినా సరే.. ‘అఖండ-2’లోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అతి హద్దులనూ దాటేస్తుంది. మనిషి తిరగేసి తలను పట్టుకుని హారతి ఇవ్వడమేంటి.. హెలికాఫ్టర్ రెక్కలను త్రిశూలం మీద పెట్టి తిప్పడమేంటి.. అదే త్రిశూలంతో మెషీన్ గన్నును ఆపరేట్ చేయడమేంటి.. ఇండియన్ ఆర్మీ వల్ల కానిది హీరో ఒక్కడే చేయడమేంటి.. ఒక్కడే చైనా మీదికి యుద్ధానికి వెళ్లి ఆ దేశ ఆర్మీ జనరల్ ను చంపడమేంటి.. అబ్బో మామూలు విన్యాసాలా అవి? మాస్ అంటే ఇంతే మరి.. వీటినే ఎంజాయ్ చేస్తాం అంటే సినిమా నిండా ఇలాంటి విన్యాసాలకు.. విధ్వంసాలకు లోటే లేదు. బాలయ్యతో చేసిన తొలి రెండు చిత్రాల్లో సగటు మాస్ కమర్షియల్ ఫార్ములాలే ప్రయత్నించాడు బోయపాటి శ్రీను. మూడో ప్రయత్నంలో మాత్రం ఆ ఫార్ములాకే కొంచెం ఆధ్యాత్మిక టచ్ ఇచ్చాడు. బోయపాటి ఈసారి ‘అఖండ 2’లో రెండో బాలయ్యను పరమ శివభక్తుడైన అఘోరాగా మార్చి సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చాడు.

మన సంస్కృతి, ఆధ్యాత్మికత అంశాలు ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్న ట్రెండులో ‘అఖండ’ అద్భుత విజయాన్నందుకుంది. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనేసరికి బోయపాటి అన్నీ డబుల్ డోస్ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది కాస్తా సినిమాలో కొన్నిసార్లు అతిగా అనిపించినా… కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇక ‘అఖండ 2’లో బాలకృష్ణ రెండు పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశాడు. ఎమ్మెల్యే మురళీకృష్ణ గా ఆకట్టుకున్న బాలకృష్ణ, అఖండ రుద్రగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ రెండు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్… ఆడియెన్స్‌తో క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి.ఇందులో ’బజరంగీ భాయీజాన్’ ఫేమ్ హర్షాలి… కీలకమైన జనని పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర ద్వితీయార్థంలోనే ఎంట్రీ ఇస్తుంది. అతనిపై చిత్రీకరించిన రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో మొదటిది బాగుంది, రెండోది పూర్తిగా గ్రాఫిక్స్‌తో పర్వాలేదనిపించింది.

మెయిన్ విలన్స్‌గా సాంగ్య, కబీర్ దుహాన్ సింగ్, ’కల్కి’ ఫేమ్ శాశ్వత్ ఛటర్జీ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను పూర్ణ, మురళీమోహన్, ఝాన్సీ, అనీశ్ కురువిల్లా, సర్వదమన్ బెనర్జీ, రవివర్మ, విజీ చంద్రశేఖర్, వైజి మహేంద్ర, శరత్ లోహితస్య తదితరులు పోషించారు. వీరంతా తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. బోయపాటి శ్రీను చిన్న కొడుకు వర్షిత్ ఇందులో భక్త ప్రహ్లాదుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి బోయపాటి రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. తమన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను నిలబెట్టేలా ఉంది. పాటలు ప్రేక్షకులను అలరించాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ కు, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి ’అఖండ -2’ నచ్చుతుంది. అలానే ద్వితీయార్థంతో అందరూ కనెక్ట్ అయితే… ’అఖండ’ తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోగలదు.

శనివారం రాశి ఫలాలు (13-12-2025)

మేషం

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం

సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

మిధునం

నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం

సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సింహం

ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

తుల

ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మకరం

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం

బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మీనం

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.