StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbetlikeyakabetrealbahisprizmabettrendbetlordbahislordbahisprizmabettrendbetyakabetyakabetrinabetatlasbetroketbetbetkolikaresbetbetlikewbahiswbahispashagamingpashagaming

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

casibom giriş

ultrabet

jojobet

matbet

polobet

betpas

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

https://altyazili.porn/

iptv satın al

vaycasino

vaycasino giriş

hiltonbet

pusulabet

betcio giriş

Galabet

galabet

betpas

matbet

deneme bonusu veren siteler 2025

betcio giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

meritking güncel giriş

meritking

meritking güncel

meritking giriş

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

milosbet

betovis

parmabet

mislibet

artemisbet

artemisbet

yakabet

casibom

casivera

online diyetisyen

wbahis

polobet

oslobet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

atlasbet

zirvebet

mavibet

milanobet

Meritking Giriş

Kavbet

Grandpashabet

jojobet

asyabahis

meritking giriş

Restbet

Restbet giriş

Grandpashabet

casibom giriş

galabet

Marsbahis

matbet

holiganbet

holiganbet

grandpashabet

grandpashabet

grandpashabet giriş

oslobet

süratbet

Marsbahis

betturkey giriş

betturkey

meritking güncel

ronabet giriş

piabellacasino

casinolevant

ultrabet

jojobet giriş

marsbahis

marsbahis giriş

betcio

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betasus

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking

yakabet giriş

wbahis

Casibom

wbahis

wbahis

bbo303

Agb99

holiganbet

artemisbet

galabet

ultrabet

beyoğlu escort

betpuan

izle.sex

sekabet

pusulabet

matbet

vdcasino

marsbahis

imajbet

wbahis

matbet güncel giriş

grandpashabet

jojobet

grandpashabet

casibom

meritking

pusulabet

pusulabet giriş

betsmove

Slot Mahjong

betcio

pusulabet güncel giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking Güncel Giriş

piabellacasino

betvole

piabellacasino

mislibet

nitrobahis

nitrobahis

piabellacasino

parmabet

parmabet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

galabet giriş

ultrabet

galabet

padişahbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

holiganbet giriş

holiganbet giriş

mislibet

betturkey giriş

Google Maps Yorum Satın Al

piabellacasino

casibom

casibom giriş

casibom güncel giriş

casinolevant

casinolevant

casinolevant

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

hilarionbet

vdcasino

kralbet

kralbet

All Smo Tools

matadorbet

wbahis

anadoluslot

orisbet

royalbet

marsbahis giriş

vdcasino

oslobet

holiganbet

marsbahis

kralbet

ultrabet

betpas

betebet

artemisbet

casibom giriş

dinamobet

galabet

betturkey

asyabahis

bahiscasino

superbet

berlinbet

matadorbet

suratbet

süratbet

nitrobahis

Casibom giriş

queenbet

padişahbet

betoffice

padişahbet

spinco

Blackjack Oyna

Blackjack Siteleri

casibom giriş

wbahis

Holiganbet giriş

polobet

betnano

betnano

tempobet

bahiscasino

ultrabet

galabet

kingroyal

pusulabet

İnstagram takipçi, Tiktok takipçi

vegabet

casinoroyal

galabet

galabet

bağcılar escort

betbigo

lunabet

lunabet

lunabet

lunabet

ultrabet

padişahbet giriş

galabet

jojobet

padişahbet

padişahbet

pusulabet

izmir escort

tempobet

meritking

enbet

bahislion

padişahbet

padişahbet

sonbahis

marsbahis

marsbahis giriş

Sweet Bonanza

grandpashabet giriş

holiganbet 1182

betnano giriş

galabet

casibom

gaziosmanpaşa escort

jojobet

holiganbet

marsbahis

kralbet

meybet

kavbet

meritking

holiganbet

pusulabet

grandpashabet

pusulabet

pusulabet giriş

casibom

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

అల్వార్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్వార్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ పికప్ వాహనం.. పలు వాహనాలను ఢీకొట్టింది. దీంతో పికప్ వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. మరోక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం రాత్రి రేణి పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుండి జైపూర్‌కు వెళ్తుండగా పికప్ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జైపూర్‌కు తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని హర్యానాలోని బహదూర్‌గఢ్ నివాసి మోహిత్, మధ్యప్రదేశ్‌లోని సాగర్ నివాసి దీపేంద్ర, మధ్యప్రదేశ్‌లోని సాగర్ నివాసి పదమ్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన డ్రైవర్‌ను హర్యానాలోని ఝజ్జర్ నివాసి హన్నీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదం

కాగా, నిన్న మధురలోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నడంతో వాహనాలు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరో 60 మంది గాయపడ్డారు. 

అన్ని రకాల భావావేశాలున్న ‘దండోరా’

విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో నవదీప్, నందు, రవికృష్ణ, మనీకా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య. అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ “దండోరా చిత్రంలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను.

అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే చిత్రమిది. ‘దండోరా’ తరువాత నా నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉండబోతోంది. ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ‘ఎపిక్’ ఉంటుంది”అని అన్నారు.  

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 7 గ్రామాలు దూరం..

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ప్రజలు తమ సొంతూర్లకు చేరుకుంటున్నారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 7 గ్రామాలు దూరంగా ఉన్నాయి. అమ్రాబాద్‌ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్‌ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్‌ కేటాయించారు. ఈ క్రమంలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఏడు గ్రామాలు ఎన్నికలు జరగడం లేదు.

కాగా, ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మూడో దశ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యా హ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాల లో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు ప్రకటించనున్న స్పీకర్..

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ(బుధవారం, డిసెంబర్ 17) కీలక తీర్పు రానుంది. ఈరోజు మధ్యాహ్నం 3.౩౦ గంటలకు స్పీకర్‌.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీంతో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా, 2023లో బిఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో బిఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీ కోర్టు.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. ఈ క్రమంలో స్పీకర్ వివరణ కోరుతూ.. మొదట ఈ ఐదుగురు ఎమ్యెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దీంతో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారోనని ఉత్కంఠ నెలకొంది.

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం (డిసెంబర్ 17) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత మధ్యా హ్నం 2తర్వాత ఓట్ల లెక్కింపు చేస్తారు. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాలలో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

కాగా, 11 సర్పంచి స్థానాలకు, 116 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 సర్పంచి స్థానాలు, 18 వార్డు స్థానాల ఎన్నికలపై స్టే ఉంది. మిగిలిన 3,752 సర్పంచి స్థానాలకు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడో విడతలో 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఐపిఎల్ మినీ వేలం.. క్రికెటర్లపై కనక వర్షం

గ్రీన్‌కు రూ. 25.25 కోట్లు

పతిరన, లివింగ్‌స్టాన్‌లకు జాక్‌పాట్

ప్రశాంత్, కార్తీక్‌లకు చెరో రూ.14.20 కోట్లు

మినీ వేలంలో క్రికెటర్లపై కనక వర్షం

అబుదాబి: ఐపిఎల్ వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. 2026 సీజన్ కోసం అబుదాబి వేదికగా మంగళవారం క్రికెటర్ల వేలం పాట జరిగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గ్రీన్ నయా చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ రూ.25.20 కోట్లను వెచ్చించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. శ్రీలంక స్టార్ ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరన కూడా మినీ వేలంలో భారీ ధర పలికాడు. రూ.18 కోట్ల రికార్డు ధరకు కోల్‌కతా ఫ్రాంచైజీ పతిరనను దక్కించుకుంది. అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలు నయా చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని వీరిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరికి చెరో రూ.14.20 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. ఇద్దరు కూడా కనీస ధర రూ.30 లక్షలతో వేలం బరిలో దిగారు. కానీ వీరు ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోవడం విశేషం.

లివింగ్‌స్టోన్‌కు రూ.13 కోట్లు

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ కూడా వేలం పాటలో భారీ ధరను పలికాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.13 కోట్లకు సొంతం చేసుకుంది. తొలి రెండు రౌండ్‌లలో అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు చివరి రౌండ్‌లో అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. చివరికి కళ్లు చెదిరే ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రహ్మాన్ కూడా వేలం పాటలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని రూ.9.20 కోట్లకు కోల్‌కతా టీమ్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ ఇంగ్లిస్‌ను రూ.8.6 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. అతన్ని సొంతం చేసుకునేందుకు లక్నో, హైదరాబాద్‌లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి లక్నో అతన్ని సొంతం చేసుకుంది.

జమ్ము కశ్మీర్ అన్‌క్యాప్‌డ్ ఆటగాడు ఆకిబ్ దార్ కూడా జాక్‌పాట్ కొట్టేశాడు. అతన్ని రూ.8.40 కోట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రవి బిష్ణోయ్‌ను రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ.7 కోట్లకు గుజరాత్, భారత ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు బెంగళూర్ జట్లు దక్కించుకున్నాయి. ఈసారి జరిగిన వేలం పాటలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.2415.45 కోట్లను వెచ్చించాయి. వేలంలో 77 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

పని గంటలు మోగుతున్నాయి!

వారంలో నాలుగు రోజులు, నెలలో పదహారు దినాలే పనిదినాలైతే ఎలా ఉంటుంది? ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త విధానాన్ని అమలులోకి తేబోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగవర్గాలలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాతకాలంనాటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చింది. ఈ లేబర్ కోడ్లు వారానికి నాలుగు రోజుల పనివిధానానికి అనుమతి ఇస్తున్నాయి. ప్రస్తుతం వారానికి ఐదు రోజులు పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలను మినహాయిస్తే, మిగిలినవాటిలో ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటల చొప్పున, వారంలో ఆరు రోజులపాటు.. అంటే 48 గంటలసేపు పనిచేస్తున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఇదే పనిని నాలుగు రోజుల్లో చేయవలసి ఉంటుంది. అంటే రోజుకు 12గంటలు పనిచేయాలన్నమాట. అంతకుమించి పనిచేస్తే రెట్టింపు వేతనం ఇవ్వాలన్న నిబంధన కూడా ఈ కొత్త చట్టాలలో ఉంది. కొత్త పనిదినాల వల్ల నాలుగు రోజులు పనిచేస్తే, మూడు రోజులు సెలవు దొరుకుతుందన్న అభిప్రాయం మెజారిటీ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ నిబంధనలన్నీ ఆయా కంపెనీలకు, ఉద్యోగులకూ ఐచ్ఛికమేనని ప్రభుత్వం పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. యాజమాన్యం, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి నాలుగురోజుల పనిదినాలకు సరేనంటే ముందుకు వెళ్లవచ్చు. లేదా పాత పద్ధతిలోనే కొనసాగవచ్చు. రోజంతా నిరంతరాయంగా పనిచేయవలసి వచ్చే కార్యాలయాలకు, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండే కార్యాలయాలకు ఈ పనివేళలు పనికిరావనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

వాస్తవానికి కరోనా అనంతరం యాజమాన్యాలు, ఉద్యోగుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కరోనా అనంతరం సాఫ్ట్‌వేర్ కార్యాలయాల యాజమాన్యాలు తమ ఉద్యోగులు వారానికి రెండు లేదా మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తే చాలంటున్నాయి. ఆ మధ్య జీనియస్ కన్సల్టెంట్ అనే సంస్థ మన దేశంలో నాలుగు రోజుల పనివిధానంపై చేపట్టిన అధ్యయనంలో మెజారిటీ ఉద్యోగులు దీనిపట్ల మక్కువ కనబరిచారు. పనివేళలు మన చేతిలో ఉంటే వృత్తిగత జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ న్యాయం చేయవచ్చుననే అభిప్రాయం వారిలో వ్యక్తమయింది. మన దేశానికి కొత్త కావచ్చునేమో గానీ, అమెరికా, జపాన్, స్పెయిన్, ఐస్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లోని అనేక కంపెనీల్లో నాలుగు రోజుల పనివిధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. ఈ కంపెనీలు మరిన్ని వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నాయి. ఒక ఉద్యోగి రోజులో ఎప్పుడైనా వచ్చి పనిచేయవచ్చు. మధ్యలో కావాలంటే బయటకు వెళ్లిరావచ్చు. ఆ రోజు మొత్తంలో 12 గంటలు పనిచేయటం, వారాంతానికి 48 గంటల పని పూర్తి చేయడం ముఖ్యం. ఈ రకమైన విధానంవల్ల ఇంటిపనులు, పిల్లల పోషణ, వారిని పాఠశాలలో దిగబెట్టడం, ఇంటికి తీసుకురావడం వంటి పనులను చేసుకునే వీలు కలుగుతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాట్లు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు, ఈ రకమైన పనివిధానం వాహన కాలుష్యానికీ, ట్రాఫిక్ సమస్యకూ కొంతవరకూ పరిష్కారంగా చెప్పుకోవచ్చు. నిజానికి పని వేళలపై మన దేశంలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా పనిదినాలేనంటూ ఎల్‌అండ్ టి చైర్మన్ సుబ్రమణియన్ అంటే, అంతకంటే ముందు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ప్రతిపాదించారు.

ఈ ఇద్దరు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై చర్చ నడుస్తుండగానే, కొత్త లేబర్ కోడ్లు అమలులోకి వచ్చాయి. నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్లే నాలుగు గంటల పని విధానంలోనూ సమస్యలు లేకపోలేదు. మధ్యలో ఎంత విరామం తీసుకున్నా, ఒక రోజులో పన్నెండు గంటలు పనిచేయడమంటే శారీరిక, మానసికపరమైన సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. రోజుకు గంటల తరబడి పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నిద్రలేమి, మెడ, వెన్నెముక వంటి చోట్ల నొప్పులు, పని ఒత్తిడి వల్ల తలెత్తే మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలిందన్న సంగతి విస్మరించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక సర్వేలో ఉద్యోగులలో డిప్రెషన్, మానసికపరమైన ఆందోళనవంటి సమస్యల కారణంగా ఏటా కొన్ని కోట్ల పనిదినాల నష్టం జరుగుతున్నట్లు తేలింది. కాబట్టి రోజుకు పనివేళలతోపాటు వారంలో ఎన్ని రోజులు పనిచేయాలో ఎంచుకునే వెసులుబాటు కూడా ఉద్యోగులకు ఇవ్వడం సముచితంగా ఉంటుంది. 

తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకరించండి

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ లో పలువురు కేంద్రమంత్రులతో మంగళవారం భేటీ అ య్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శా ఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు భేటీ అయిన సిఎం రే వంత్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాని కి సేకరించే రుణాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మినహాయించాలని కోరారు. దీంతోపాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాలు, నవోద య విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పార్లమెంట్‌లోని ఆమె ఛాంబర్ లో భేటీ అయి విద్యారంగం కోసం తాము తీసుకుంటు న్న చర్యలకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రా ష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందు కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 105 శాసనసభ ని యోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటె డ్ స్కూళ్ల ప్రాధాన్యతను తెలియజేశారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉం డే ఒక్కో యంగ్ ఇం డి యా ఇంటిగ్రేటెడ్ స్కూ ళ్లలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని,

మొత్తంగా 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్ర త్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని సిఎం వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు స మీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్‌లుగా ఉండడంతో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి సిఎం తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు నిర్మలా సీతారామన్‌కు తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పిసి) ఏర్పాటు చేయనున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు.

యంగ్ ఇండియా స్కూళ్ల వివరాలను అందచేయండి

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూపుతున్న చొరవను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల మోడల్ బాగుందని, దీనికి సంబంధించిన డిపిఆర్‌ను అందజేయాలని కేంద్రమంత్రి సిఎం రేవంత్‌కు సూచించారు.

ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించాం..

హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సిఎం తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి మంగళవారం భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామని సిఎం కేంద్ర మంత్రితో తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పనకు తాము సిద్ధంగా ఉన్నట్లు సిఎం తెలిపారు.

9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయండి

దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉందని, అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజేసిన చరిత్ర హైదరాబాద్‌కు ఉందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుందని సిఎం అన్నారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉందని సిఎం అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్,

నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సిఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ కేంద్ర మంత్రితో తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఎంపి సురేశ్ షెట్కార్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, పాల్గొన్నారు.

బాక్సైట్.. బడా కంపెనీలకు వరం

దేశంలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నా, అవసరాల రీత్యా దేశం లోకి దిగుమతి అవు తున్నది. ముఖ్యంగా చైనా, రష్యా, యుఎఇ, ఇతర దేశాల నుంచి బాక్సైట్ లేదా అల్యూమినా దిగుమతి జరుగుతున్నది. ఫలితంగా దేశ పరిశ్రమాధిపతులు తమ లాభాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనలో భాగమే, దేశీయ పరిశ్రమలను కాపాడాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫెమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. 2025- 26 ఆర్థిక సంవత్సరం అల్యూ మినియం డిమాండ్‌లో 55% దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక శాఖకు తెలిపింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమినియం డేన్ స్ట్రీమ్ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు) దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 7.5% నుంచి 15% సుంకం విధించాలని ఆర్థిక శాఖను కోరింది. అల్యూమినియం సెకండరీ మాన్యుఫ్యాక్టర్స్ అసోషియేషన్ (ఎఎస్ ఎంఎ) మాత్రం ప్రైమరీ అల్యూమినాపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరింది.

 

భారతదేశంలో బాక్సైట్ అపారంగా ఉంది. 3 వేల మిలియన్ టన్నుల నిల్వలతో, ప్రపంచంలోనే ఎక్కువ నిల్వలు ఉన్న దేశాల్లో 5వ స్థానంలో ఉంది. ఒడిశా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోనే 51% పైగా బాక్సైట్ ఉంది. అల్యూమినియం ఉత్పత్తిలో బాక్సైట్ కీలకం. బాక్సైట్ నుంచి అల్యూమినా ముడి పదార్ధం తయారు అవుతుంది. అల్యూమినా ద్వారా అల్యూమినియం తయారు చేస్తారు. భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తిలో దాదాపు 40% అమెరికాకు ఎగుమతి జరుగుతున్నది. భారతదేశ అల్యూమినియం అమెరికాకు అగ్ర మార్కెట్ ఉంది. 2023లో భారత అల్యూమినియం మార్కెట్ విలువ 11.29 మిలియన్ల అమెరికా డాలర్లు. ఇది భారత జిడిపిలో 2% గా ఉంది. అల్యూమినియంకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. దీన్ని విమానాల తయారీలోనూ, పరిశ్రమలు, ప్యాక్ జింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వాటి తయారీలో వాడతారు. బాక్సైట్‌ను ప్రధానంగా ఆస్ట్రేలియా, చైనా, గినియా, బ్రెజిల్, భారత్ దేశాలతోపాటు ఇండోనేషియా, రష్యా, జమైకా, కజకిస్తాన్, వియత్నాం తదితర దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రపంచంలో ఆల్కొవా, రియో టెంట్, హైడ్రా, ఎస్‌ఎంబి విన్నింగ్ కన్సార్టియం, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, కంపెనీ డెస్ బాక్సైట్ గినియా, భారత్ అల్యూమినియం కంపెనీ, రామిన్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు పెద్ద మైనింగ్ కంపెనీలు. భారతదేశంలో హిందూస్తాన్ అల్యూమినియం కంపెనీ, వేదాంత లిమిటెడ్, ఇండియా ఫాయిల్స్ లిమిటెడ్, సచేటా మెటల్స్, జిందాల్ అల్యూమినియం, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, మద్రాస్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, సెంచరీ ఎక్స్ ట్రూషన్స్ లిమిటెడ్ అల్యూమినియం కంపెనీలు ఉత్పత్తి కంపెనీలుగా ఉన్నాయి. అల్యూమినియం ధరలు బాగా పెరగడంతో ప్రపంచ కంపెనీలతో పాటు, భారత కంపెనీలకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. ఆదిత్య బిర్లాకు చెందిన ప్లాగ్ షిప్ మెటల్ కంపెనీ ప్రపంచం లోనే అతిపెద్ద అల్యూమినియం కంపెనీల్లో ఒకటి. దీని ఆదాయం 28 బిలియన్ డాలర్లుగా ఉంది. కాఫర్, స్పెషాల్టీ అల్యూమినా లో కూడా ఈ కంపెనీ బలంగా ఉంది. పది దేశాల్లో 48 ఫ్యాక్టరీలు కలిగి ఉంది. గత మూడు సంవత్సరాల్లో దీని అమ్మకాలు 69 శాతానికిపెరిగి లాభాలు 4.1% ఉన్నాయి. వేదాంత అనుబంధ సంస్థ అయిన వేదాంత అల్యూమినియం భారత్ అతిపెద్ద, ప్రపంచంలో టాప్ అల్యూమినియం కంపెనీల్లో ఉంది. 2025లో భారత్ మొత్తం అల్యూమినియం ఉత్పత్తిలో సగం ఉత్పత్తి దీని నుంచే ఉంది. ఆ సంవత్సరం 2.42 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. గత మూడు సంవత్సరాల్లో అమ్మకాలు 4.8% పెరిగాయి. నాల్కొ- ఇది నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ కంపెనీ. బాక్సైట్ మైనింగ్, అల్యూమినా, అల్యూమినియంకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీని బాక్సైట్ కెపాసిటీ సామర్థ్యం ఏడాదికి 68 లక్షల టన్నులుగా ఉంది. అల్యూమినా సామర్థ్యం 21 లక్షల టన్నులుగా ఉంది. 2025లో దీని నికర లాభం 158% పెరిగి రూ. 52,679 కోట్లకు చేరిందని, సంపద 1,67,876 కోట్లకు పెరిగింది.

దేశంలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నా, అవసరాల రీత్యా దేశం లోకి దిగుమతి అవుతున్నది. ముఖ్యంగా చైనా, రష్యా, యుఎఇ, ఇతర దేశాల నుంచి బాక్సైట్ లేదా అల్యూమినా దిగుమతి జరుగుతున్నది. ఫలితంగా దేశ పరిశ్రమాధిపతులు తమ లాభాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనలో భాగమే, దేశీయ పరిశ్రమలను కాపాడాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫెమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. 2025- 26 ఆర్థిక సంవత్సరం అల్యూమినియం డిమాండ్‌లో 55% దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక శాఖకు తెలిపింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమినియం డేన్ స్ట్రీమ్ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు) దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 7.5% నుంచి 15% సుంకం విధించాలని ఆర్థిక శాఖను కోరింది. అల్యూమినియం సెకండరీ మాన్యుఫ్యాక్టర్స్ అసోషియేషన్ (ఎఎస్ ఎంఎ) మాత్రం ప్రైమరీ అల్యూమినాపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరింది. దేశంలో అల్యూమినియం ధరల స్థిరీకరించడానికి, అధిక ఇన్‌పుట్ ఖర్చులతో ఇబ్బందిపడుతున్న దిగువ స్థాయి పరిశ్రమలకు అవసరమైన ఉపశమనం అందించడానికి ప్రైమరీ అల్యూమినాపై దిగుమతి సుంకాన్ని తగ్గించమని తెలిపింది. ఇది బడా పరిశ్రమలు, చిన్న పరిశ్రమల మధ్య ఉన్న వైరుధ్యాన్ని తెలియ చేస్తున్నది. బడా పరిశ్రమల వల్ల చిన్న పరిశ్రమలు నష్ట పోతున్న విషయాన్ని ఇది పరోక్షంగా తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో 600 మిలియన్ టన్నుల బాక్సైట్ ఉంది. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం దేశం మొత్తం నిల్వల్లో ఇది 21%. ఇందులో విశాఖపట్నం తూర్పు కనుముల్లోనే ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలోని బాక్సైట్ వనరులను బయటకు తీసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజన ప్రజల భూహక్కులను, షెడ్యూల్డ్ ప్రాంతం లో రాజ్యాంగ రక్షణను నియంత్రించే చట్టాలకు సవరణలు చేయడానికి పూనుకుని, గిరిజనులు, గిరిజన సంఘాల తీవ్ర వ్యతిరేకత వల్ల ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బాక్సైట్‌ను తవ్వే పనిని చేపట్టింది. 2005 లో జెఎస్‌డబ్లు హెచ్‌ఎల్‌తో, తదుపరి 2007లో రస్ ఆల్ కైమాతో ఒప్పందం కుదుర్చుకున్నది. 1997లో సుప్రీం కోర్టు సమతా తీర్పు ప్రకారం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతంలో గనులు లేదా పరిశ్రమలకోసం ఏ ప్రైవేట్ కంపెనీ భూమిని స్వాధీనం చేసుకోకుండా లేదా లీజుకు ఇవ్వకుండా నిరోధించడం వల్ల రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మోస పూరితంగా తవ్వకాలను చేపట్టింది.

ప్రభుత్వ సంస్థ అయిన ఆం.ప్ర ఖనిజాభివృద్ధి (ఎపిఎండిసి) సంస్థ బాక్సైట్ ని తవ్వుతుంది. దాన్ని ప్రభుత్వం రస్ ఆల్ కైమాకి సరఫరా చేస్తుంది. ఆ సంస్థకు 11 వందల ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. ఆ నేపథ్యంలో ఎన్నికలు రావడంతో బాక్సైట్ తవ్వకాలు ఆగిపోయింది. వైసిపి ప్రభుత్వం 2020 డిసెంబర్ లో జిఒ 89 విడుదల చేసి, బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు ప్రయత్నించగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కన్నా చాలా తక్కువ బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బాక్సైట్ అన్వేషణ కొనసాగుతున్నది. నేటి ఎపి కూటమి ప్రభుత్వం కూడా ఖనిజాల తవ్వకాలకు పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇచ్చే ఆలోచన చేస్తున్నది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒడిశా, గుజరాత్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బహుళ జాతి సంస్థలు కూడా బాక్సైట్ తవ్వకాలు చేపట్టగా, స్థానికుల వ్యతిరేకత, పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి చేసిన సవరణలుద్వారా బహుళ జాతి సంస్థలు బాక్సైట్ తవ్వకాలకు అటవీ భూములు పొందే హక్కులు కల్పించింది.

బాక్సైట్ తవ్వకాలు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. వారి సమస్యలు ఏమాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. బాక్సైట్‌ను బడా సంస్థలకు కట్టబెట్టటమే విధానంగా వ్యవహరిస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనుల భూములు, వారి జీవనోపాధి పోతుంది. పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి లోనవుతాయి. మైనింగ్ వల్ల అడవులు నాశనమై నీటి వనరులు దెబ్బతిని పంటలకు నష్టం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలుగా అడవితో పెనవేసుకొన్న గిరిజనుల జీవితం అడవికి దూరమవుతుంది. పెసా, అటవీ హక్కుల చట్టాల వంటి గిరిజనుల రక్షణ చట్టాలను మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టి బాక్సైట్ మైనింగ్ తవ్వకాలు జరపడమే కాకుండా, బడా దేశీయ, విదేశీ సంస్థల తవ్వకాలకు అనుమతిస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలు దేశ అవసరాలకు పరిమితమై, గిరిజనుల జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు హాని కలగకుండా జరగాలి. ప్రభుత్వ రంగ సంస్థలే ఆ పని చేయాలి. బాక్సైట్ తవ్వకాల్లోనూ, అల్యూమినా ఉత్పత్తి లోను బడా కంపెనీల ప్రయోజనాలు కాపాడుతూ, గిరిజనుల జీవితాలను ఛిన్నాభిన్నం చేయ చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా గిరిజనులతో చేయి కలిపి రాష్ట్ర ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు

9885983526

యంగ్ ఇండియా స్కూళ్లు.. సమస్యలే సవాళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి విద్యా విజన్ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’. ఆయన ఎక్కడ మాట్లాడినా అదే విషయం చెబుతుండడాన్ని బట్టి ఆయన ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి గత రెండేళ్ళు విద్యామంత్రిగా సైతం ఆయన పోకడలో ఒకింత కన్ఫ్యూజన్ ఒక మేరకు కనిపిస్తోంది. అసలు రేవంత్ చెబుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నేటి ప్రాపంచిక అవసరాల కనుగుణమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన విద్యనందించే లక్ష్యం! మంచిదే. దాని సాధ్యాసాధ్యాలు పరిశీలన చేస్తే రేవంత్ విద్యకు కేటాయిస్తానని చెబుతున్న 15% బడ్జెట్ సరిపోతుందా! అనుమానమే. ఒకవేళ దీర్ఘకాలిక ప్రణాళిక అమలు జరిపినా దాని పర్యావసానాలు ఎటు దారితీస్తాయి? తెలంగాణలో విద్యా సమానత, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఉనికి, పర్యావసానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు ముందు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మాణ స్వరూపం పరిశీలన చేద్దాం. 25 ఎకరాల సువిశాల స్థలం. కోట్లాది రూపాయల విశాలమైన తరగతి గదుల నిర్మాణం, 124 మంది ఆధునిక శిక్షణ పొందిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, 2600 మంది విద్యార్థుల సామర్థ్యం, ఒక్కో పాఠశాల నిర్మాణానికి 200కోట్ల రూపాయల వ్యయం వెరసి ఈ పాఠశాల స్వరూప స్వభావం.

ఇంత భారీ స్థాయి ప్రణాళికతో రూపొందించిన 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపన జరిపారు. ఇప్పటికే ఈ పాఠశాలల నిర్మాణం కోసం రూ. 15,600 కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 200 పాఠశాలలకు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తానంటున్న ఈ పాఠశాలలు కనీసం మండలానికి ఒకటి ఏర్పాటు చేసినా 634 మండలాల్లో యంగ్ ఇండియా పాఠశాలలకు 1,26,800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే మన రాష్ట్ర ఏడాది బడ్జెట్. మొత్తం పాఠశాలలు పూర్తి అయితే 16 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించినట్లు అవుతుంది. ఆలోచన మంచిదే! కానీ, ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు చూద్దాం. 2023 -24 విద్యా గణాంకాలు ప్రకారం రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. లక్షమంది సుశిక్షితులైన బోధనా సిబ్బంది ఉంది. మరో వెయ్యి కెసిఆర్ స్థాపించిన రెసిడెన్షియల్ స్కూల్స్, కేంద్రం స్థాపించిన కెజిబివి, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. వీటి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే అనాలోచితంగా రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపన వలన ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నమోదు తగ్గిపోయింది. ఈ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ విధానం కనీసం మండలానికి ఒకటి నిర్మించినా 16 లక్షల మంది విద్యార్థులు నమోదు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో తగ్గిపోనున్నది.

ముఖ్యమంత్రి నియమించిన విద్యా కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం 19 వేల ప్రాథమిక పాఠశాలల్లో 13 వేల పాఠశాలల్లో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 5 వేల పైచిలుకు ఉన్నత, 4 వేల పైచిలుకు ప్రాథమికోన్నత పాఠశాలలది అదే పరిస్థితి. అంటే బోధనా సిబ్బంది ఉండి, పిల్లలు లేని మూడొంతులు పాఠశాలల్లో ప్రజాధనం కొన్నెండ్లుగా పాలకులు వేతనాలు రూపంలో వృథా చేస్తున్నారు. తెలంగాణకు కేటాయించిన 23 వేలకోట్ల రూపాయలు విద్యా బడ్జెట్‌లో సుమారు 18 వేల కోట్లు వేతనాలకే ఖర్చు అవుతుంది. అంటే యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభం అయితే, ప్రభుత్వ పాఠశాలలన్నీ, రెసిడెన్షియల్ పాఠశాలలు అన్ని దాదాపు మూతపడతాయి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా వసతులు, నాణ్యమైన విద్య అందే పాఠశాలలనే ఎంపిక చేసుకుంటారు. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల చొప్పున 15 వేల 800 ఎకరాల పంట భూములు సేకరించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఎకరం భూమి వేసుకున్నా 30 వేల ఎకరాల విలువైన పాఠశాలల స్థలాలు నిరుపయోగంగా మిగులుతాయి. గత 3 దశాబ్దాలుగా కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన సర్వశిక్షా అభియాన్ తరగతి గదులు పడావు పడతాయి? వీటన్నింటికీ మించి సర్వశిక్షా అభియాన్ నిర్ణయించిన ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల, మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల, కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ‘అందుబాటు’ అనే సమస్య తలెత్తుతుంది.

ఒకవేళ రవాణా సౌకర్యం కల్పించినా తలకు మించిన భారమే. ఇంత చేసి 16 లక్షల మంది విద్యార్థులకు ‘యంగ్ ఇండియా స్కూల్స్’ లో ప్రవేశం కల్పిస్తే ప్రస్తుత గణాంకాలు ప్రకారం ప్రభుత్వ పాఠశాల ల్లో ఉన్న 24 లక్షల మందిలో 8 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం ఏమిటి? వారికి మన విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం విద్యా సమానత, పిల్లవాడు తాను నచ్చిన పాఠశాలలో విద్యా నేర్చుకునే హక్కును నిరాకరించినట్లే కదా? అప్పుచేసి పప్పుకూడులా లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఉన్న భూములు వినియోగం చేసుకోకుండా మరో 15 వేల ఎకరాల పంట భూములు సేకరించి, లక్ష కోట్లకుపైగా నూతన నిర్మాణాలు చేయడంలో పారదర్శకత ఎంత? యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం, భూసేకరణలో కమీషన్ల దందాను, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకోబోతుంది? ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించాల్సిన సమయం ఇది. కనుక ప్రపంచ విద్యా స్థాయి అందుకోవాలనే రేవంత్ రెడ్డి ఆలోచనలు స్వాగతిస్తూనే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ పర్యావసానాలు, సంస్కరణ గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఆకునూరి మురళి, కె. కేశవరావు లతో రెండు కమిషన్లు వేసిన ప్రభుత్వం వాటి సిఫార్సులు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ సంస్కరణలో పరిగణనలోనికి తీసుకొన్న దాఖలాలు కనిపించడం లేదు? వీటన్నింటికీ మించి గత కొన్ని దశాబ్దాలుగా పాలకులే విద్యా బాధ్యతల నుండి వైదొలిగేందుకు, లేక ప్రజల అవసరాలకు తగ్గ పాఠశాల వ్యవస్థ మార్పులు అందించలేకపోయిన పర్యావసానంగా కుప్పలుతెప్పలుగా పెరిగిన ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో చూస్తుంది.

37 లక్షల విద్యార్థుల నమోదు ఉన్న 12 వేల పైచిలుకు ప్రైవేటు పాఠశాల వ్యవస్థలోనూ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థుల నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య గురించి, వాటిలో పని చేస్తున్న వేలాది నిరుద్యోగులు గురించి ప్రభుత్వానికి పట్టకపోతే ఎలా? ఇత్యాది విశాలమైన సమస్యలు చర్చించి చేపట్టే విద్యా పథకం మాత్రమే దీర్ఘకాలిక లక్ష్యంతో సఫలమవుతుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్’ కలను పై సమస్యలన్నింటితో అనుసంధానించి పథక రచన చేసినప్పుడు మాత్రమే, పథకం సత్ఫలితాలు ఇస్తాయి. ఆలోచనలు ఎన్నైనా రావచ్చును గాని, నిర్దిష్టమైన ఆచరణ, సరైన ప్రణాళికతో మాత్రమే నూతన విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయగలుగుతాము. సిఎం రేవంత్ రెడ్డి అన్ని కోణాల్లో ఆలోచించి నూతన సవాళ్ళను ఎదుర్కోగలిగిన విద్యా వ్యవస్థ రూపకల్పనలో విద్యారంగ మేధావులు, ప్రజల సలహాలు స్వీకరించడం, అనుసరించడం ప్రజాస్వామిక ఆలోచన అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులను వేయాలని కోరుకుందాం. విద్యా వ్యవస్థ ఆధునీకరణను స్వాగతిద్దాం.

ఎన్.తిర్మల్

94418 64514