International
వైజాగ్ నేవీ బేస్ లో గన్ ఫైర్…! సెంట్రీ గార్డ్ మృతి
ఒకే ఫ్లైట్ లో బిగ్ ఈవెంట్ కు
హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ’మీసాల పిల్ల’ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడు అనిల్ రవిపూడి, లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ నవ్వులు పంచారు. అలాగే ఉదిత్ నారాయణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లని పరిచయం చేశారు. భీమ్స్ ఇచ్చిన సంగీతం, ఉదిత్ నారాయణన్ గాత్రం, చిరంజీవి తన మార్క్ గ్రేస్తో వేసిన స్టెప్పులతో ఈ పాట ఫ్యాన్స్కి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఇదిలాఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిద్దరు కలిసి చెన్నైలో జరిగే 80s రీయూనియన్ కోసం విమానంలో ప్రయాణించారు. చార్టర్డ్ ఫ్లైట్లో చెన్నై బయలుదేరే ముందు వారిద్దరు కలిసి ఓ ఫొటోకు పోజిచ్చారు. ఈ స్టార్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఈ ఫోటోతో వారి మధ్య మంచి స్నేహం మరోసారి బయటపడింది. ఇక చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మూడో స్థానంలోనే భారత్
దుబాయ్: విండీస్ తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినా టీమిండియా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భారత్కు ఇదిమూడోవిజయం. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో 12 పాయింట్స్ చేరాయి. డబ్ల్యూటిసి 2027 పాయింట్స్ పట్టికలో భారత్ విజయాల శాతం 46.67 నుంచి 55.56 శాతానికి పెరిగింది. అయితే ర్యాంకింగ్స్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటిసి ర్యాంకింగ్స్ను పాయింట్ల ద్వారా కాకుండా విజయాల శాతం ఆధారంగా లెక్కిస్తారు. ఈ సైకిల్ ముగిసే సమయానికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి. ప్రస్తుతం ఆలిస్ట్రేయా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లకు మూడు గెలిచింది. దాంతో 100 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది కంగారూల టీమ్.
అల్లుడితో అర్థరాత్రి పెళ్లి… అడ్డొచ్చిన కూతురుపై రోకలి బండతో తల్లి దాడి
అమరావతి: అర్థరాత్రి అల్లుడిని పెళ్లి చేసుకుంటుండగా కూతురు అడ్డు రావడంతో ఆమెను కన్నతల్లి చంపడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా కెవిబిపురం మండలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో 18 ఏళ్ల బాలుడు, 15 ఏళ్ల బాలిక గాఢంగా ప్రేమించుకున్నారు. ఐదు నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో తన కూతురుతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో అల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. శుక్రవారం రాత్రి భార్య ఎదుట అల్లుడితో అత్త తాళ్లి కట్టించుకుంటుండగా కూతురు ఆపింది. అల్లుడితో కలిసి అత్త తన కూతురుపై దాడికి పాల్పడింది. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. అత్త, అల్లుడుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని చితకబాది చేసి పోలీసులకు అప్పగించారు.