International
లిక్కర్ కుంభకోణంలో నిందితులను వదిలే ప్రసక్తి లేదు: పంచుమర్తి అనురాధ
అమరావతి: కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట్ మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డే అని టిడిపి ఎమ్మెల్సి పంచుమర్తి అనురాధ తెలిపారు. మహిళల పుస్తెలు తెంచి.. పాపపు సొమ్ము తన ప్యాలెస్ లో దాచారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాటి కుంభకోణాలు, మృతులపై నోరు మెదపలేదని ఆరోపించారు. జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం ఏదో జరిగిపోతుందని సొంత పత్రికలో రాసుకున్నారని, లిక్కర్ కుంభకోణంలో నిందితులను వదిలే ప్రసక్తి లేదని తెలియజేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వారిని జగన్ ఏం చేశారు? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్ లో మద్యం తాగి 6 మంది చనిపోతే ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు కల్తీ మద్యంతో దొరికిన వారంతా వైసిపి మూలాలున్న వారే అని పంచుమర్తి అనురాధ విమర్శించారు.
మహీంద్రా బొలెరో విడుదల: ధర రూ. 7.99 లక్షలు – మారిన 3 ముఖ్య విషయాలు ఇవే
భారత నౌకదళంలోకి మరో యుద్ధనౌక ఆండ్రోత్.. ఇందులో అనేక ప్రత్యేకతలు!
వరుసగా మూడు సెషన్లలో 1,500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్: మార్కెట్ ర్యాలీకి 5 ప్రధాన కారణాలు ఇవే
సిజెఐ గవాయ్పై చెప్పు విసిరబోయిన లాయర్
ఢిల్లీ: సుప్రీంకోర్టులో కలకలం సృష్టించింది. సిజెఐ బిఆర్ గవాయ్పై దాడికి యత్నించారు. సుప్రీంకోర్టు ఆవరణలో సిజెఐ గవాయ్పై లాయర్ కిషోర్ రాకేష్ చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు. కిషోర్ ను తొటి లాయర్లు అడ్డుకున్నారు. ఓ కేసు విచారణ సమయంలో సిజెఐపై లాయర్ కిషోర్ చెప్పు విసిరాడు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ కిషోర్ నినాదాలు చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని సిజెఐ గవాయ్ తెలిపారు.
సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్ గవాయ్పై దాడికి యత్నం!
గ్రోక్ ఇమాజిన్ v0.9 విడుదల.. 15 సెకన్లలో ఫాస్ట్, స్మార్ట్ ఏఐ వీడియోలు
హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా?
హైదరాబాద్: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. బిసి రిజర్వేషన్లపై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు ధర్మాసనం స్వీకరించలేమని తెలిపింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వనందువల్ల సుప్ర్రీం కోర్టుకు పిటిషనర్ వచ్చామన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని ప్రశ్నించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేశారు.
అంబేడ్కర్ విగ్రహం తగలబెట్టి… ఫిర్యాదుదారుడు అరెస్టు… ఇది మీకు న్యాయామా?
అమరావతి: అంబేడ్కర్ విగ్రహం తగలబెట్టారని ఫిర్యాదు ఇచ్చిన మా నాన్ననే అరెస్ట్ చేశారని దేవళంపేట దళిత సర్పంచ్ గోవిందయ్య కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘జరిగిన విషయం ఏంటీ?… పోలీసులు మా నాన్న మీద పెట్టిన కేసు ఏంటీ?.. ఇది మీకు న్యాయమా?’ అని ప్రశ్నించారు. టిడిపి నేత సతీష్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అతడు ప్రశ్నించాడు. మా నాన్న లాకప్ డెత్ అయితే పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు. దేవళంపేట ప్రధాన కూడలిలో మూడు రోజుల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, దళితులు డిమాండ్ చేశారు. టిడిపి నేత సతీష్ నాయుడు, అతని అనుచరులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని దళిత సర్పంచ్ చొక్కా గోవిందయ్య ఆరోపణలు చేసిన విషయం విధితమే.
–