సెంటినరీకాలనీలో యువకుడి దారుణ హత్య
ద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, సెంటినరీకాలనీ పరిధిలో యువకుడి దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సిటూ200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్, కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికుల కథనం ప్రకారం.. న్యూమారేడుపాక పోతనకాలనీకి చెందిన చిరంజీవి మీసేవా కేంద్రం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. హత్య జరిగిన సమయంలో సెంటినరీకాలనీలోని ఐకెపి కార్యాలయానికి ఆయన రాగానే అదే సమయంలో ముగ్గురు దుండగులు అతనిపై దాడి చేసి, రాళ్లతో అతిదారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుని భార్య కొంతకాలం క్రితమే మృతి చెందిందని, అనంతరం మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఇదే పరిణామం ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న గోదావరిఖని ఎసిపి మడత రమేష్, మంథని సిఐ రాజు, రామగిరి ఎస్ఐ టి.శ్రీనివాస్ కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలు యువకుడి హత్య మండలంలో సంచలనంగా మారింది.