kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişbetlikebetlikekulisbetkulisbetwbahiswbahiskulisbetkulisbetbetovisbetovisbetkolikbetkolikrealbahis girişyakabet girişelexbet girişkulisbet girişwinxbet girişkulisbetkalebetbetkoliktrendbetwinxbetwinxbetpadişahbetyakabetyakabetrealbahisrealbahisyakabetyakabetelexbetelexbetwinxbetwinxbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetkulisbet girişkulisbet girişvizyonbet girişroyalbetroyalbetbetticketbetticketrealbahisrealbahispadişahbetpadişahbetprizmabetprizmabetikimislibetikimislibetkulisbetkulisbetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbet

‘వరంగల్‌లో మీ పెత్తనం ఏంటి’.. పొంగులేటిపై మురళి ఆగ్రహం

వరంగల్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత కొండ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మురళి ఎఐసిసికి ఫిర్యాదు చేశారు. కొండ సురేఖ శాఖ అయిన దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారని.. మేడారం టెండర్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొంగులేటి సొంత కంపెనీలకు టెండర్ల పనులు ఇప్పించుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కొండ మురళి తెలిపారు.

‘ఇడ్లీ కొట్టు’ కలెక్షన్ల ఎంతంటే.. హిట్ పాట రిలీజ్

చెన్నై: ధనుష్, నిత్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగులో పెద్దగా ఆదరణ లేకపోయినా.. తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాను హిట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ‘ఎన్న సుగమ్’ అనే పాట వీడియోను వదిలింది చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రాన్ని ధనుష్‌ స్వయంగా దర్శకత్వం చేశారు. సినిమా ఇప్పటివరకూ రూ.70 కో్ట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా చిత్రానికి మంచి స్పందన వస్తే.. వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఆకాశ్ బాస్కరన్, ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

సిఐ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకలేం: నాని

అమరావతి: వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడి కోసమే తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మేకల సుబ్బన్నను ఎందుకు తీసుకొచ్చారని సిఐని అడిగానని, ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. మేము ఎవరినైనా తీసుకురావొచ్చు అని సిఐ ఘాటుగా నాకు సమాధానం చెప్పారు’ అని తెలియజేశారు. పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చేస్తే ప్రశ్నిస్తే తప్పేంటి? అని పేర్కొన్నారు. సిఐ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకలేమన్నారు. కృష్ణాజిల్లా ఎస్పి పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని, పోలీస్ స్టేషన్ లో సిసి ఫూటేజీ చూసి మాట్లాడాలన్నారు. మాజీ మంత్రి పేర్నినానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మంది వైసిపి నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్. పేట సిఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం టౌన్ పిఎస్ లో ఈ ఘటన జరిగింది. 

బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారులో కొత్త ఎడిషన్​​- ఎంజీ విండ్సర్​ ఈవీ ఇన్​స్పైర్​కి మిగిలిన వాటికి తేడా ఏంటి?

ఎంజీ విండ్సర్​ ఈవీ ఇన్​స్పైర్​ ఎడిషన్​ని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. ఫలితంగా ఎంజీ విండ్సర్​ ఈవీలో బేస్​, ఇన్​స్పైర్​, ప్రో వేరియంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి కొత్త ఎడిషన్​కి, ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి మధ్య తేడా ఏంటి?

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి: హరీష్ రావు

హైదరాబాద్: నీళ్లు తరలించుకు పోతున్నా… సిఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 423 టిఎంసిల గోదావరి జలాలను ఎపి మళ్లిస్తోందని తెలియజేశారు. సిఎం గా ప్రజా ప్రయోజనాలు కాపాడతావా స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటావా? అని ప్రశ్నించారు. కేంద్రం లేఖపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను ఎపి, మహారాష్ట్ర, కృష్ణా జలాలను కర్ణాటక, మహారాష్ట్రాలు తరలించుకపోతున్నాయని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి మొన్న ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడం గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడని అనుకున్నానని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందనే బుద్ధి కనీసం రేవంత్ రెడ్డికి లేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేయించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదని, తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకోవాలి అని హరీష్ రావు చురకలంటించారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల పిల్లి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

టీం ఇండియా భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్డ్..

న్యూఢిల్లీ: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ స్పష్టమైన అధిపత్యం కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. అతనితో పాటు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్. సాయి సుదర్శన్‌. నితీశ్ కుమార్, ధృవ్‌ జురేల్‌లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత్ 518 పరుగుల భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 318 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభమైన కొద్దిసేపటికే డబుల్ సెంచరీ చేస్తాడని భావించిన జైస్వాల్ (175) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 43 పరుగులు చేసి జేడన్ సీల్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్.. తన బ్యాటింగ్‌లో వేగం పెంచాడు. మరోవైపు ధృవ్ జురేల్ కెప్టెన్‌కు మంచి మద్దతు ఇచ్చాడు. వీరిద్దరు కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో గిల్ తన 10వ శతకాన్ని సాధించాడు. కెప్టెన్‌గా ఇది అతనికి ఐదో శతకం కావడం మరో విశేషం. అయితే 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధృవ్ జురేల్ ఔట్ కావడంతో 518/5 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలింగ్‌లో వారికన్ 3, చేజ్ 1 వికెట్ తీశారు.

బిసి రిజర్వేషన్లను బిజెపి అడ్డుకుంది: మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్:  బనక చర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జిఒలు వెలువడ్డాయన్నారు. బనకచర్ల, బిసి రిజర్వేషన్లు, బిజెపి – బిఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది, బనకచర్ల జిఓలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది మాజీ సిఎం కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో కెసిఆర్ చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని, అప్పుడు ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని దుయ్యబట్టారు. బనక చర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామని, హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని, బిసిల రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బిజెపి అని ధ్వజమెత్తారు. తెలంగాణలో కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని, పారదర్శకంగా నిర్వహించామని, బిజెపి – బిఆర్ఎస్ కలిసి బిసి రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, బిసిల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం బిజెపి, బిఆర్ఎస్ చేస్తున్నాయని, ఢిల్లీ బిసి రిజర్వేషన్ ధర్నాకు బిజెపి నేతలు ఎందుకు ముఖం చాటేశారని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. 

కాంగ్రెస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టే బిసి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, సిఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బిజెపి, బిఆర్ ఎస్ నేతలకు లేదని మహేష్ కుమార్ గౌడ్ చురకలంటించారు. హైదరాబాద్ నుంచి ముంబయి వయా నిజామాబాద్ రైల్వే లైన్ తో విషయమై సిఎం చర్చించానని, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని, కామారెడ్డి బిసి సభ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. 

రోహిత్ భారీ సిక్స్.. సొంత లంబొర్గిని అద్దం బద్దలు

టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను మైదానంలో చూడక చాలాకాలమే అయింది. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో అతను పాల్గొని.. జట్టును విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం సిద్ధమవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను బిసిసిఐ ఫిట్‌నెస్ టెస్ట్‌ని కూడా పాస్ అయ్యాడు. ఈ సిరీస్‌లో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్‌మాన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసందే. కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో పాత హిట్‌మ్యాన్‌ను చూపించాలని అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లే రోహిత్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

తాజాగా ముంబై మాజీ సహచరుడు అభిషేక్ నాయర్‌ అధ్వర్యంలో రోహిత్ సుమారు రెండు గంటల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ ప్రాక్టీస్‌లో అతడు భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. ఇందులో భాగంగా రోహిత్ కొట్టిన ఓ భారీ సిక్స్ దెబ్బకు బంతి వెళ్లి పార్కింగ్‌లో ఉన్న తన 4.57 కోట్ల విలువైన లంబొర్గిని కారు అద్దం బద్దలుకొట్టింది. శివాజీ పార్క్‌లో జరిగిన ఈ ప్రాక్టీస్‌లో రోహిత్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాక్టీస్ ముగించుకొని వెళ్లిపోతున్న రోహిత్‌ను కలిసేందుకు ఓ చిన్నారి అభిమాని వచ్చాడు. అతడిని రోహిత్ సెక్యూరిటీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా.. రోహిత్ వారిపై మండిపడ్డాడు. చివరికి ఆ చిన్నారితో రోహిత్ ముచ్చడించాడు. ఈ నెల 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది.

రైతులు బాగుంటేనే దేశం సుభిక్షం : మోడీ

ఢిల్లీ: రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనకాడేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యవసాయం, రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని అన్నారు. ధనధాన్య కృషి యోచన పథకాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్డియే ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని తెలియజేశారు. వ్యవసాయ రంగంలో నేడు రెండు పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని అన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే తమ మొదటి ప్రాధాన్యత అని, రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 

ఖమ్మంలో రాజకీయ నాయకుడి అనుచరుడి వీరంగం

ఖమ్మం: తనకు పోటీగా షాపు పెడతావా? చంపేస్తా అని బూతులు తిడుతూ ఓ రాజకీయ నాయకుడి అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఖమ్మంలో రాజకీయ నాయకుడి అండదండలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రౌడీ అవతారమెత్తాడు. ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ దాడికి దిగాడు. పాల్వంచ నుండి వచ్చి ఖమ్మంలో షాపు పెడుతావా? అని బండబూతులు తింటాడు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామ పాఠశాలలో లక్ష్మణ్ అనే వ్యక్తి స్కూల్ అసిస్టెంట్‌గా పని చేయడంతో పాటు ఖమ్మంలో క్రాకర్స్ బిజినెస్‌ నిర్వహిస్తున్నాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, షాపు తొలగించకపోతే మనుషులను పంపించి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఎసిపికి ఫోన్ చేసి, బూతులు తిడుతూ షాపు తొలగించాలని డిమాండ్ చేశాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ, రౌడీలా వ్యవహరిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారస్థుల డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని కొందరు రౌడీల్లా ప్రవర్తించడం మంచిది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లీ లీడర్లు ప్రజలకు సేవ చేయాలని కానీ సామాన్యులపై పెత్తనం చెలాయిస్తే ఎలా అని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తారని కొందరు వార్డు కౌనిలర్లు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లను ఎన్నుకుంటే వాళ్లే ప్రజలపై పెత్తనం చెలాయించడంతో పాటు రౌడీయిజం చేస్తున్నారని నెటిజన్లు దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయాలని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ప్రజలను హింసిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.