elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbet

నేటి నుంచి రంజీ సమరం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన దేశవాళీ క్రికె ట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్ 2025-26కి తెరలేవనుంది. బుధవారం ప్రారంభమ య్యే రంజీ ట్రోఫీకి వచ్చే ఏడా ది ఫిబ్రవరి 28తో తెరపడుతోం ది. రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్ల ను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 8 జట్లకు చోటు కల్పించారు. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ టీమ్‌కు ఎలైట్ గ్రూప్‌డిలో స్థానం దక్కింది. ముంబై, ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, పుదుచేరి, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భతో పాటు ఆంధ్రా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బరోడా, ఒడిశా, నాగాలాండ్, తమిళనాడు గ్రూప్‌ఎలో ఉన్నాయి.

కాగా, హైదరాబాద్ తన తొలి మ్యా చ్‌ను ఢిల్లీతో ఆడనుంది. హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, హైదరాబాద్ టీమ్‌కు తిలక్‌వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తన్మయ్ అగర్వాల్, చామ మిలింద్, కార్తీకేయ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు తదితరులతో హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.

ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. తిలక్‌వర్మ, తన్మయ్, త్యాగరాజన్, కార్తీకేయ, మిలిం ద్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అం శంగా చెప్పాలి. ఇక ఢిల్లీ టీమ్‌ను కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. కెప్టెన్ అయుష్ బడోని,అనూజ్ రావత్, నితీశ్ రాణా, ప్రియాన్ష్ ఆర్య, యశ్ ధుల్, నవ్‌దీప్ సైని, హిమ్మత్ సింగ్, సిమర్‌జీత్ సింగ్ తదితరులతో ఢిల్లీ పటిష్టంగా ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు చుక్కెదురు

మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మంగళవారం సు ప్రీం కోర్టులో జస్టిస్ నాగరత్న, జస్టి స్ ఆర్ మహదేవ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యా ఖ్యలు చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కంప్యూటర్ క్లౌడ్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి క ల్పించిన స్పెషల్ రిలీఫ్‌ను న్యాయస్థా నం పొడిగించింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌తో పాటు స్పెషల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాననం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినించారు. మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టుకు తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌లో డేటా ధ్వంసం చేసి, కొత్తగా 50 హార్డ్ డిస్కులు ఆ స్థానంలో ఉంచారని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డిజిటల్ డివైసెస్‌లో డేటా ఫార్మా చేశారని, ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.

ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన్ను ఇప్పటికే 11సార్లు పిలిపించి సుమారు 80 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. డేటాను ప్రభాకర్ రావు డిలీట్ చేయలేదని డిపార్ట్‌మెంట్ డిలీట్ చేసిందని చెప్పారు. విచారణకు సహకరించడంలేదు అనడంలో వాస్తవం లేదని, విచారణ అంతా వీడియో రికార్డుల సమక్షంలోనే జరిగిందని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసులో సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇవ్వాల్సిందేనని తెలిపింది. అదే విధంగా యూజర్, పాస్‌వర్డ్‌ల సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్‌కు సూచించింది. సమాచారం ధ్వంసం చేసినట్లుగా, నిందితుడు ప్రయత్నించనట్లుగా తేలితే తదుపరి చర్యలపై తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18 వతేదీకు వాయిదా వేసింది.

విండీస్ ఓటమి.. భారత్‌దే టెస్ట్ సిరీస్

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ౨-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సిరీస్ కావడం విశేషం. 121 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 63/1 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే సాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ 76 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కిందటి స్కోరుకు సాయి 9 పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో సుదర్శన్ ఔటయ్యాడు.

ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, మరో సిక్సర్‌తో 13 పరుగులు చేసిన గిల్‌ను గ్రీవ్స్ వెనక్కి పంపాడు. ఇక ధ్రువ్ జురెల్ 6 (నాటౌట్) అండతో మిగిలిన లాంఛనాన్ని రాహుల్ పూర్తి చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 108 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 129 (నాటౌట్) శతకాలతో చెలరేగి పోయారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది.

కానీ, రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. షాయ్ హోప్, జాన్ క్యాంప్‌బెల్‌లు శతకాలతో కదం తొక్కారు. గ్రీవ్స్ కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 వికెట్లను పడగొట్టాడు. దీంతో కుల్దీప్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజాకు ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. ఇదిలావుంటే అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తాజాగా ఢిల్లీలోనూ గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేసింది.

అదరగొట్టిన గిల్

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సిరీస్‌పై తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా గిల్ సారథిగా సత్తా చాటాడు. అయితే ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ను సాధించలేక పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 22తో సమమైంది. కెప్టెన్‌గా గిల్ జట్టును ముందుండి నడిపించినా సిరీస్ మాత్రం అందించలేక పోయాడు. కానీ విండీస్‌పై మాత్రం సక్సెస్ అయ్యాడు. రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియాను ముందుండి నడిపించాడు. సారథిగా గిల్ అద్భుతంగా రాణించాడు. బ్యాట్‌తోనే కాకుండా కీలక సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకుని జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషించాడు. కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఆడిన రెండు సిరీస్‌లలో కూడా శుభ్‌మన్ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు విండీస్‌పై విజయం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో సమన్వయంతో వ్యవహరిస్తూ గిల్ జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే.

ప్రతిభా నైపుణ్యాలే ప్రధానం

ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలో ఉంది. భారతదేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞానశక్తిగా మారుస్తానని కలలు కనిన మహానుభావుడు డా. అబ్దుల్ కలాం. డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాం ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఇస్రో, డిఆర్‌డిఒ సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. భారతదేశానికి స్వదేశీ మిసైళ్ళ తయారీలో మార్గదర్శకుడు కావడంతో ‘మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. 2002 నుండి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన ప్రజలతో మమేకమై పని చేసినందున ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే పేరు పొందారు. భారతరత్న (1997) భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం, అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతి, ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, అంకితభావంతో కూడిన విద్యావేత్త డా. ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం.

ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన అంశంపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిగ్రీ పట్టాలు సరే.. ప్రతిభ, నైపుణ్యాలు ఏవి? బిఎ, బిఎస్‌సి, బిటెక్, ఎంసిఎ ఇవన్నీ విద్యార్హతల గుర్తింపులు మాత్రమే. వాటిని సంపాదించడం ఒక గొప్ప విషయం.కానీ సమాజంలో ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఆ పనిని చేయగల నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు డిగ్రీని కాదు, పనితీరును చూస్తాయి. ఈ సందర్భంగా మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. డిగ్రీ పట్టాలు జీవిత విజయం కోసం ఒక మెట్టు మాత్రమే. కానీ నిజమైన ఎదుగుదల కోసం ప్రతిభ, నైపుణ్యాలు అవసరం.డిగ్రీ అంటే ఏమిటి? డిగ్రీ ఒక విద్యార్థి విద్యా ప్రయాణానికి గుర్తింపు. కానీ ఉద్యోగాలు, పరిశ్రమలు, సమాజం కోరుకునేది అభ్యాసంలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వాటిని ఆచరణలో పెట్టే సామర్థ్యం. అంటే, ప్రతిభ, నైపుణ్యాలు. ప్రాక్టికల్ నాలెడ్జ్. విద్యా ప్రమాణం కన్నా పనితీరు ముఖ్యం. ప్రతిభ అంటే ఏమిటి? ప్రతిభ అంటే పుస్తకాల్లో చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు. ప్రతిభ అంటే ఆలోచించగలగటం, సృజనాత్మకంగా వ్యవహరించడం, కొత్త దారులు వెతకడం, నేర్చుకున్నది జీవితంలో ఉపయోగించగలగడం. ఇటీవల విడుదలైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మన పట్టభద్రుల్లో 51% మంది మాత్రమే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉన్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 8.25% మంది మాత్రమే చదువుకున్న విషయాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వారంతా విద్యార్హతలతో సంబంధంలేని పనుల్లో స్థిరపడుతున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకుంటూ కడుపులోని చల్లకదలకుండా ఉద్యోగాలను నెట్టుకొద్దామనేవారికి ఈనాటి పోటీ ప్రపంచం లో నిలబడలేరు.

టెక్నాలజీ వేగంగా మారుతున్నది. విద్యార్థులు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నూతన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే, లేనట్లయితే ఉద్యోగ మార్కెట్‌లో వెనుకబడిపోతారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా మారింది. కొందరు యువకులు కేవలం విద్యా పట్టాలు పొందడం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మార్కెట్‌లో నైపుణ్యాల లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పౌరాభివృద్ధి, పరిశ్రమల వృద్ధి పరిమితంగా ఉండటంతో ఉద్యోగాలు సరిపోకపోవడం. యువతకు కావలసిన నైపుణ్యాలు నేర్పించే కార్యాచరణలు తక్కువగా ఉంటాయి.విజయానికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటంటే అవి సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills): కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, డిజైన్, మృదు నైపుణ్యాలు (Soft Skills): కమ్యూనికేషన్ (మాట్లాడటం, వినటం) సమయ పాలన, టీమ్ వర్క్, లీడర్ షిప్ స్కిల్స్, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ: కొత్త ఆలోచనలు, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకగలగటం. అభ్యాస సామర్థ్యం (Adaptability): మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకోవటం. ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ: శ్రమ, క్రమశిక్షణతో ముందుకెళ్లే ధైర్యం. డా. కలాం నోట మాటలు ‘Learning gives creativity, Creativity leadsto thinking, Thinking provides know ledge, Knowledge makes you great’ అని కలాం చెప్పారు. వారు స్పష్టంగా చెప్పారు విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని విలువైనవాడిగా మార్చే మార్గం. ఫ్యాషన్‌తో చదివినప్పుడే ఏ కోర్స్ అయినా వంటపడుతుంది. మన కాళ్ళపై మనం నిలబడడానికి అది తోడ్పడుతుంది, ప్యాకేజీ పైనే దృష్టి పెట్టి కోర్సులో చేరేవారు మనస్ఫూర్తిగా చదవలేరు, మనసుపెట్టి ఉద్యోగాలు చేయలేరు.

ఈ రోజుల్లో అన్నింటికీ డబ్బే మూలమైపోయింది. ఫలితంగా చదువు కెరియర్‌లో కూడా ఆసక్తి ఉన్న రంగాలను వదిలేసి డబ్బు బాగా వస్తుందనుకున్న రంగాల్ని ఎంచుకుంటున్నారు. అకాడమిక్ చదువులతో సంబంధం లేకుండా నిపుణత సృజనాత్మకతలపై దృష్టి పెట్టే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళతారు, అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. నైపుణ్యమున్న వ్యక్తులు అనతి కాలములోనే ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రను వేయగలుగుతారు. ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నేటి యువత అబ్దుల్ కలాం స్ఫూర్తిని, అతని రచనల ప్రేరణ ద్వారా ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే నేను పొందిన డిగ్రీ నా ప్రతిభకు నిదర్శనమా? నేను సమాజానికి ఏమైనా ఇవ్వగలనా? నాకు ఉన్న నైపుణ్యాలు నన్ను జీవితంలో విజయవంతుడిని చేస్తాయా? కలాం మాకు ఇచ్చిన మార్గదర్శనం ఒక గొప్ప ఆస్తి. ఆయన బాటలో నడిచే ప్రతి విద్యార్థి, పటిష్టమైన వ్యక్తిగా ఎదగడం ఖాయం. నేడు మన భారతదేశానికి కావాల్సింది ప్రతిభ, నైపుణ్యాలతో, సృజనాత్మకత, చురుకుదనం కనబరిచే యువతరం.    

కోమల్ల ఇంద్రసేనారెడ్డి

98493 75829

ఎపిని అడ్డుకోండి

మన తెలంగాణ / హైదరాబాద్ : పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లే ఖ రాసింది. పోలవరం -బనకచర్ల లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నపటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచర్ల టెండర్, సర్వే నిలిపివేయాలని వి జ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం – బనకచర్ల లింక్ ప్రా జెక్టును ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్‌కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది. కాగా ఇటీవలే ఈ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సిఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి 

సీఆర్ పాటిల్‌ను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి

దేవాదుల ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడి, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి డి. సీతక్క , ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికైన ప్రతినిధులతో కలిసి జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (జెసిఆర్‌డిఎల్‌ఐఎస్) పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అన్ని విధానపరమైన అడ్డంకులను తొలగించాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, ఉత్తర తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలలోని ప్రతి రైతుకు నీటిపారుదల ప్రయోజనాలు చేరేలా చూడాలని ఆయన నీటిపారుదల శాఖను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గంగారం గ్రామం సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టిఎంసి నీటిని లిఫ్టు చేయడానికి రూపొందించబడిన దేవాదుల పథకం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల ఎగువ, పాక్షిక శుష్క ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడిందని అధికారులు మంత్రికి తెలిపారు.

తాజా పురోగతి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం నీటిపారుదల సామర్థ్యం మొత్తం 5.56 లక్షల ఎకరాల్లో 3.17 లక్షల ఎకరాలు. భూగర్భజలాల ద్వారా సాగునీరు అందించే 58,028 ఎకరాలతో కలిపి, మొత్తం ఆయకట్టు సామర్థ్యం పూర్తయిన తర్వాత 6.14 లక్షల ఎకరాలకు చేరుకుంటుందన్నారు. సవరించిన ప్రాజెక్టు వ్యయం రూ. 18,500 కోట్లకు గాను రూ. 14,269.63 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ. 4,230 కోట్లు మిగిలి ఉన్నాయన్నారు. ఖర్చు చేసిన మొత్తం మొత్తంలో సివిల్ పనులకు రూ. 11,667.85 కోట్లు, భూసేకరణకు రూ. 1,343.06 కోట్లు, హైడ్రో-మెకానికల్, ఎలక్ట్రో-మెకానికల్ ఇన్‌స్టాలేషన్‌లకు రూ. 1,170.63 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో సమర్పించిన నివేదిక ప్రకారం ప్రణాళిక ప్రకారం 2,430.82 కిలోమీటర్లలో 1,663.10 కి.మీ. మట్టి తవ్వకం పూర్తయిందని, 702.62 కిలోమీటర్లలో 669.66 కి.మీ. పైపులైన్లు వేయబడ్డాయని తెలిపారు. ప్రణాళిక చేసిన 16,113 నిర్మాణాల్లో 8,510 పూర్తయ్యాయని, 1,202.14 కిలోమీటర్లలో 799.80 కి.మీ కాలువ లైనింగ్ పూర్తయిందన్నారు. 46 ట్యాంకులకుగాను 39, 21 పంప్ హౌస్‌లకు గాను 18 పనిచేస్తున్నాయన్నారు.

సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి : స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ములుగు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. అలాగే గోదావరి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని కోరారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ ల పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు.

మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు : చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని, ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంగళవారం సచివాయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన శాఖ, జిల్లా అభివృధి పనులపై ఫోకస్ పెట్టానని, ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా హక్కులను వదులుకోబోమన్నారు. బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందన్నారు. కేసీఆర్ పదేళ్లలో చేసిందేమి లేదని కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని, త్వరలోనే మహారాష్ట్ర వెళ్లబోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

గ్రూప్-2 విజేతలకు 18న నియామక పత్రాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ స ర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్- 2 అభ్యర్థులకు ఈనెల 18 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిచే నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వెల్లడించారు. 18 తేదీ సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించను న్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లో మంగళవారం సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రూప్-2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందిస్తారని సిఎస్ తెలిపారు.

వారిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు సిఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ కార్యక్ర మానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ అన్నారు. రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు సమన్వయంతో ఈ నియామకాల్లో అధికంగా, సాధారణ పరిపాలన, రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నందున రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల్లో సర్వీస్‌లో ఉంటారని, వారికి ప్రభుత్వ సర్వీస్ పట్ల ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిజిపి శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, రిజ్వీ, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టికె శ్రీదేవి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.

మల్లోజుల లొంగుబాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదా అలి యాస్ వివేక్ ఆయు ధాలు వీడారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో పాటు పెద్ద ఎత్తున ఆయు ధ సామాగ్రితో మంగళవారం గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సాయుధ పోరాటంతో రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదని, ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్య పద్ధ తుల్లో ఉద్యమించాలన్న అభిప్రాయంతో ఉన్న మల్లోజుల 44 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని వీడి ఎట్టకేలకు జన జీవన స్రవంతిలో కలిశారు. 1956 మే 10వ తేదీన జన్మించిన మల్లోజుల వేణుగోపాల్ బీకాం విద్యనభ్యసించారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా తలపై కేంద్ర ప్రభుత్వం రూ. ఆరు కోట్ల రివార్డును ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల వేణు 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిద్నాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో హతమైన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి సొంత తమ్ముడు కావడం గమనా ర్హం. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటును స్వాగతిస్తున్నట్లు ఛత్తీస్ గఢ్ డిప్యూటి సిఎం విజయ్ వర్మ ధృవీకరించారు.

మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నామన్నారు. నక్సలిజాన్ని అంతం చేయాలని బస్తర్ ప్రజలు నిర్ణయించుకున్నారని, ఏడాది క్రితం పొలిట్ బ్యూరోలో మహిళా సభ్యురాలు లొంగిపోయారని, ఇవాళ ఆమె భర్త లొంగి పోయారని తెలిపారు. జనజీవనస్రవంతిలో కలిసేవారందరినీ తాము స్వాగతిస్తామని ఆయనన్నారు. మావోయిస్టు పార్టీని విడిచిపెట్టిరానివారితో తమ భద్రతాబలగాలు సరైన రీతిలో స్పందిస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కనబెడతామని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తరఫున అభయ్ పేరుతో మీడియాకు గత నెలలో ఒక లేఖ విడుదలైంది. అయితే అభయ్ ప్రతిపాదనకు మావోయిస్టు అగ్రనేతలు, క్యాడర్ మద్దతు ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. తాత్కాలికం గా ఆయుధాలు విడిచిపెడతామని, శాంతిచర్చలకు సిద్ధమని పేర్కొంటూ లేఖ విడుదల చేసిన నెలరోజుల్లో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది.

ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ‘మల్లోజుల’ ఉద్యమ ప్రస్థానం

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల మధురమ్మ, వెంకటయ్యల కుమారుడైన మల్లోజుల వేణు 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టి ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్‌ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ పదోన్నతి లభించింది. తన తండ్రి వెంకటయ్య గతంలో మరణించినా ఎన్ కౌంటర్‌లో తన సోదరుడు, మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీకి హతమైనా, గతంలో మాతృమూర్తి మధురమ్మ మరణించినప్పటికీ మల్లోజుల వేణు వారెవరీ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉన్నారు.

44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అడవి బాట పట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఏనాడు ఆయన కన్న ఊరికి కాని, పుట్టిన ఊరికి కాని అడుగు పెట్టలేదు. ప్రస్తుతం ఆయన లొంగిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు పెద్దపల్లి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీలో ఏర్పడ్డ విభే దాలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పకడ్బందీ దాడులు నిర్వహిస్తుండడంతో మల్లోజుల లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకుంది. కాగా, ఆయన సతీమణి విమల చంద్ర సిద్ధం 2025 జనవరి 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. 

ఫ్రెషర్స్‌కే డిసిసి పీఠం

 జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొత్త మెలిక పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారు రెండో సారి పోటీ చేయరాదని, అధ్యక్ష పదవిని ఆశించే వారు పార్టీ లో ఐదేళ్ళ పాటు ఉండాలన్న మొదలైన నిబంధనలు విధించింది. మంగళవారం ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ ముఖ్య నేతలతో, జిల్లా పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా జూమ్‌లో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు ఆశావాహుల జాబితాను సిద్ధం చేసి అధిష్ఠానానికి అందజేసేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన ఇరవై రెండు మంది పరిశీలకులు కూడా ఈ జూమ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్,

మహేష్ కుమార్ గౌడ్ జూమ్‌లో మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జి కెసి వేణుగోపాల్ తాజాగా డిసిసి అధ్యక్షుల ఎన్నికకు కొన్ని నిబంధనలు పెట్టారని చెప్పారు. ఈ నిబంధనల ప్రకారం డిసిసి అధ్యక్ష పదవిని ఆశించే నాయకుడైనా, కార్యకర్త అయినా, ద్వితీయ శ్రేణి నాయకుడైనా ఐదేళ్ళ పాటు పార్టీలో ఉన్న వారే అర్హులని చెప్పారు. అంతేకాకుండా వారు పూర్తిగా క్రమశిక్షణ గల వారై ఉండాలని, ఎటువంటి వివాదాలు, కోర్టు కేసుల్లో ఉండరాదని సూచించారు.ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న వారు రెండో సారి అంటే ఈ దఫా ఆశించరాదని, పోటీకి దిగరాదని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కొత్త వారికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనను పార్టీ అధిష్ఠానం తమకు చెప్పిందని వారు తెలిపారు.

బంధువర్గానికి నో-ఛాన్స్

ఇక పార్టీలో, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వారి బంధువులకూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్హులు కారని మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అటువంటి వారెవ్వరూ డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోరాదని తెలిపారు. బంధువులెవరైనా దరఖాస్తు చేసుకుంటే ఏఐసిసి పరిశీలకులు వారి పేర్లను తిరస్కరిస్తారని, అధిష్ఠానానికి అందజేసే ఆశావాహుల జాబితాలోనూ చేర్చడం జరగదని వారు ఖచ్చితంగా చెప్పారు.

మహిళలకు ప్రాధాన్యం

డిసిసి అధ్యక్షుల ఎన్నికకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సి ఉందని అన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి తమ పార్టీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నదని వారు గుర్తు చేశారు. అదేవిధంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకూ డిసిసి అధ్యక్షుల ఎన్నిక విషయంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తామని వారు వివరించారు.

పైరవీలకు ఛాన్స్ లేదు..

ఏఐసిసి పరిశీలకుల వద్ద ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడరాదని, వారిని ప్రభావితం చేసే ప్రయత్నాలేవీ చేయరాదని మీనాక్షి, మహేష్ కుమార్ జిల్లా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు. ఏఐసిసి పరిశీలకులు కూడా ఎవరి ఇళ్ళకు వెళ్ళరాదని, పార్టీ నాయకులతో వ్యక్తిగతంగా సంభాషణలు చేయరాదని జిల్లా పార్టీ కార్యాలయాల్లో లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఎవరితోనైనా మాట్లాడాలని, ఏదైనా పారదర్శకంగా ఉండాలని మీనాక్షి ఆదేశించారు.

వందకు తగ్గకుండా సంతకాలు..

ఓట్ చోరీపై ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ఉ ద్యమాన్ని మహేష్‌కుమార్ ప్రస్తావిస్తూ ఓట్ చోరీపై ప్రతి గ్రామంలో వందకు తగ్గకుండా ప్రజల నుంచి సంతకాలు చేపట్టాలని పునరుద్ఘాటించారు. వారం, పది రోజుల్లో సం తకాల సేకరణ ముగించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పం పిస్తే, తాము ఏఐసిసి కార్యాలయానికి పంపిస్తామని ఆయ న చెప్పారు. అగ్రనేత రాహుల్‌గాంధీకి మద్దతుగా దేశ వ్యా ప్తంగా సంతకాల ఉద్యమాన్ని పార్టీ చేపట్టిందని మహేష్ కుమార్‌గౌడ్ గుర్తు చేశారు. ఈ జూమ్ మీటింగ్‌లో గాం ధీభవన్ కాన్ఫరెన్స్ హాలులో కొంత మంది, జిల్లాల్లో పర్యటిస్తున్న ఏఐసిసి పరిశీలకులు తమకు కేటాయించిన జిల్లాల నుంచి, ఇంకా రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయాల నుంచి పాల్గొన్నారు.

బుధవారం రాశి పలాలు (15-10-2025)

మేషం – ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశములతోటి వివాదాస్పదమైన వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతోనే కార్య సాధన అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం – ఊహలోకాలకు తెరదించి వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు జమ ఖర్చులు ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి.

మిథునం – పనులలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకారంగా ఉంటుంది. చాలా విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనుకడుగు వేయరు.

కర్కాటకం – మీ ప్రతిభకు గుర్తింపుగా సన్మానాలు జరుగుతాయి. వివాహ ఉద్యోగయత్నాల అనుకూలిస్తాయి. మీ పట్ల ఈర్ష్య ద్వేషాలు అధికమవుతాయి. వివాదాస్పద అంశాలను వదిలివేయడం మంచిది.

సింహం – నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతొ ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

కన్య – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నైపుణ్యంగా సమయస్ఫూర్తితో కట్టుదిట్టమైన కార్య ప్రణాళిక రూపొందించుకుంటారు. తద్వారా లాభపడతారు.

తుల – సంస్థను విస్తరింప చేయడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ప్రయాణాలను సాగిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం – నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూల సమయమని భావిస్తారు. మధ్యవర్తిత్వాలు రాయబారాలు మేలు చేకూరుస్తాయి. వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను వృత్తికి ఇవ్వరు.

ధనుస్సు – మాటమీద నిలబడే వ్యక్తిగా మంచి పేరును సంపాదిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందనే ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.

మకరం – కొన్ని సందర్భాలలో దైవానుగ్రహం మీకు తోడు ఉందని రుజువు చేసే సంఘటనలు జరుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు.

కుంభం – అమ్మకాలు కొనుగోలు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో మీరు చేసిన శ్రమ ఇప్పుడు అక్కరకు వస్తుంది.

మీనం – కొంత లౌక్యాన్ని కనపరచగలిగితే ప్రయోజనాలను మరింతగా పొందగలుగుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అంతరంగిక వ్యవహారాలలో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

 

20 మంది సజీవ దహనం

 రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జోథ్‌పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు.  పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను స్థానిక జవహర్‌ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశా యి. జైసల్మేర్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ బస్సు జోథ్‌పూర్ బయలుదేరింది. జైసల్మేర్‌కు 20కిమీ దూరంలో థాయత్ గ్రామ సమీపంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బందికి తెలియజేశారు.

బాధితులకు సహాయ చ ర్యలు చేపట్టారు. బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నారు. మృ తుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఉన్నారని జైసల్మేర్ మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ క్రిష్ణపాల్ సింగ్ రథోర్ వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో కొందరు కిటికీలు పగుల గొట్టి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ లేదా వైరింగ్ షార్టు సర్కూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజస్థాన్ సిఎం భజన్‌లాల్ శర్మ మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.