భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత.. ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఏటా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడతాయి. ఏడాది పొడవునా జరిగేు మత్తు పదార్ధాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబర్ జనవరి మధ్య జరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగుతు డ్రగ్ పెడ్లర్లను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండిఎంఎ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు గంజాయి సరఫరా దారులను అరెస్ట్ చేసి 80 గ్రాములు, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎపి, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులుగా గుర్తించారు.